శీర్షిక :: గెలుపు, ఓటమి ల నాంది సూత్రం..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
కౌరవులు ఎవరో పాండవులు ఎవరో
తెలీని వెర్రిమాలోకం .
కరకు కర్రల అదిలింపుకు ..
కాపు గొర్రెల్లా మారడం , ప్రజల అజ్ఞానం.
.సారం లేని సాధింపు నాయకత్వం-
వికటాట్టహాసంతో చేసే పైశాచిక నృత్యం..!!
అడ్డదారుల్లో శకుని వేసే పాచికల మంత్రం.
అదే బలంతో నాయకులు నడిపే కుతంత్రం.!!
జూదపు ఆటలో ఓడిన ధర్మం
వనవాసం చేస్తూ ఏళ్ళు దాటేస్తున్న శాపం..
ఐదుగురు భర్తల అవమానిత,
విధి వంచితల మధ్య తలవంచే శోకం.
సారధి లేని రథాన్ని కుతంత్రపు టెత్తులతో
దోచుకొన్న, వాడి , బలవంతపు అధికారం-.-
చెప్పిందే శాసనంగా పాటించే ప్రజల అజ్ఞానం .
పరిపక్వత లేని రాజ్యంలో, రాణీతి నిండిన
రాక్షసత్వపు ఎత్తుగడలే,
గెలుపు, ఓటమి ల ప్రణాళికలకు నాంది సూత్రం.
ఇదే మన ఓటమి రహస్యం.
---------------------------