29/12/2024.
శీర్షిక : గెలిచామా..? ఓడామా..?
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
---------------------
కూలిపోతున్న అశా సౌధాల హోరు,
బుల్డోజర్ పాలై నలిగిపోతున్న తీరు.
జీవితంలో సాధించిన గెలుపు ,ఓటమిని తీరు,
రగులుతున్న జీవితాలు చేసే కన్నీటి సవాలు.!!
జీవితంతో రాజీపడి నడిచే ప్రయాత్నాలు ,
విడలేని న్యాయానికి వేస్తున్న పగ్గాలు.
బాధ్యతలు నిండిన బంధానుబంధాలకై ,
మనసు చంపుకు చేస్తున్న పాపాలకు సాక్ష్యాలు..!!
కన్నీటి బాధలను ప్రక్షాళన చేస్తున్న వైద్యం-
జీవిత ఆనందాలను కబళించి వేస్తున్న మద్యం .
పెరుగుతున్న అమానవీయతల సారం.
ఓటును ,నోటుకు అమ్ముకుంటున్న దైన్యం!!
కడుపుకు ఆకలిని తీర్చే అన్న ప్రసాదం -
మెతుకు మెతుకుగా పంచుకుని తినే నిజం.
ఆరని జఠరాగ్నిని అర్పలేని అసహనం-
ఆత్మహత్యలకు ధార తీస్తున్న వైనం..!!
అబద్ధపు వాగ్దానాలతో , జనుల ఆశా-
సౌధాలను. కూల్చి వేస్తున్న కేంద్రం -
ధూళి నిండిన కళ్ళను, కన్నీటి దారాలతో -
కడిగి ,ఉపశమనం పొందుతున్న జనం.!!
పోరాడే ధైర్యం లేని జనుల పరిస్థితి దైన్యం .
పోరాడి, ఓడిపోయిన జనులో నిస్సహాయత్వం.
పోరాటాల బాటలో కటకటాల జీవితాన్ని-
ఊహించుకోలేని , సర్దుబాటుతనం.!!
వారి కన్నీటిని తుడిచే ప్రయత్నంలో ,
అక్షర సమూహాల ఓదార్పు పదాలతో,
అమాయకంగా చేసే కవితా ప్రయాణం .
కవిగా గెలిచామో,.ఓడేమో, తెలియని అహం.!!.
కవి అసమర్థతకు జనం స్పందించే విధానం-
కంచికి చేరిన కథలకు వేసే తాపడం.!!
అయినా ఆగని జీవిత యానం ..
నీ ,నా ,శాంతి నినాదాల నిష్పల ప్రయాణం!!
---------------------------------
No comments:
Post a Comment