Friday, September 12, 2025

ఛందస్సులోని 10 రకాలైన దోషాలు

ఛందస్సులోని 10 రకాలైన దోషాలు


1. ఛందో భంగము (గణ భంగము):  
గురువు బదులు లఘువు వేసినా, లఘువు బదులు గురువు వేసినా ఈ రకమైన దోషం వస్తుంది.

2. యతి భంగము
యతి స్థలమునందు యత్యక్షరం లేకపొయినా, మైత్రి లేకున్నా యతి స్థలం మారినా యతి, మైత్రి గల అక్షరాలు గమనించక పొయినా.. అది యతిభంగమనబడును. 

3. విసంధి
సంధి చేయవలసిన చోట సంధి చేయకపోతే అది విసంధి దోషమని అంటారు.

4. పునరుక్తము
ఒక శబ్దాన్ని మరల మరల ప్రయోగించడం, ఒకే అర్ధం వచ్చేట్టు ప్రయోగించడం.

ఉదా:  హిమాద్రి పర్వతము పైన అంటే... హిమాద్రిలో పర్వతం ఉంది మళ్ళీ పర్వతం అని వాడకూడదు.  

అలా అని శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే అది పునరుక్తి దోషం కానేరదు ఎందుకంటే..అటువంటి నాలుకే నాలుక అని అర్థం వచ్చేట్టు చెప్పడం దోషం కాదు.

5. సంశయము
పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా, అర్ధంలో సంశయమున్నా సంశయ దోషము అంటారు.

6. అపక్రమము
వరుస తప్పడమే అపక్రమము.
ఉదా:  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అనరాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీదేవి అని అనాలి.

7. వ్యర్ధము
అనుగుణముగా లేని కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.

8. అపార్థము
సరి అయిన అర్ధము లేకుండా ప్రాస కోసమో, యతి కోసమో సూన్య పదాలు వాడితే అపార్థ దోషమంటారు. 

9. అపశబ్దము
వ్యాకరణంతో సంభందము లేకుండా కుసంధి, దుస్సంధి వైరి సమాసాలు ఆగతికములగు సంస్కృత శబ్ద ప్రయోగాలు మొదలగు అపశబ్దములు కావ్యములందు ఉపయోగించరాదు.

10. విరోధము 
ఉచితము కాని పద్ధతిలో ప్రకృతికి విరుద్ధంగా వర్ణించరాదు. 
ఉదా:  హైదరాబాదు నగరంలో సముద్ర తీరాన విహరిస్తున్నారు అని అనరాదు.

ఇవి కాక...

నిషిద్ధ గణము: 
పద్యములలో ఉదాహరణకు కంద పద్యంలో జగణం బేసి గణముగా వాడరాదు. 

పదచ్చేద భంగము
ద్విపద, మంజరీ ద్విపదలలో పద పదములకు తెగ వలెను. అట్లు తెగని యడల పదచ్చేద భంగము వస్తుంది.

No comments:

Post a Comment