Wednesday, October 15, 2025

పోటీలో ఎంపికైన కవుల జాబితా:

మహతీ సాహితీ కవిసంగమం 
దీపావళి కవితా సంకలనం 
(14-10-2025)

ఎంపికైన కవుల జాబితా:
శ్రీ/శ్రీమతి 
1.తెలికిచెర్ల రాజకృష్ణ కామేశ్వరరావు 
2.కాటేగారు పాండురంగ విఠల్ 
3.యలమర్తి మంజుల
4.మండికారి బాలాజీ 
5.ఎం వి చంద్రశేఖర రావు
6.ఉమాశేషారావు వైద్య
7.రాధా సురేష్ యర్జల్
8.డా. భరద్వాజ రావినూతల
9.తాతపూడి సోమశేఖర శర్మ
10.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
11.అద్దంకి లక్ష్మి
12.మల్లారెడ్డి రామకృష్ణ
13.జెవి కుమార్ చేపూరి
14.ముత్యం వెంకటేశ్వరరావు



అడ్మిన్ బృందం 
〰️〰️〰️〰️〰️〰️〰️
శీర్షిక: శాంతి దీపాల తోరణం. 
రచన, శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
కళ్యాణ్ : మహారాష్ట్ర.


ప్రమిదల్లో వెలిగే దీపాలు అశాంతి నిండిన
మానవ హృదయాలలో  ఆకాంక్షలు పండించిన 
ఆశా నిలయాలు.

దీపాలు  ఆత్మశుద్ధికి  సమాజ శుద్ధికి సంకేతమై
దురాలోచనలను కాల్చి  మానవత్వాన్ని పెంచి
కొత్త ఆరంభాలకు  ఆత్మీయ  బంధాలకు 
మేలైన బాటను చూపించే  వెలుగు తోరణాలు.

దీపావళి ,
దుష్టశక్తిపై ధర్మం సాధించిన విజయం.
రావణ సంహారానంతరం , శ్రీరాముడు
 సీతతో అయోధ్యకు చేరిన దినం
వామనుడి మూడు అడుగులతో
అసుర బాధ అంతమైన క్షణం
బలిచక్రవర్తి దాన గుణానికి పాతాళంలో 
పట్టాభిషేకం , వంటి  ఉత్సవ కలయికల తోరణం.
రాజ్యమంతా వెలిగిన  స్వాగతాల సంబరం.

వేగవంతమైన కాలంలో అంతర్గత యుద్ధాలకు -
ద్వేషం, స్వార్థమనే నరకాసురులు దాగిఉన్న కారణాలు.
ద్వేషాన్ని ప్రేమతో, నిరాశను ఆశతో పారద్రోలు.

పల్లెలు, పట్టణాలలో లోపించిన  పచ్చదనాన్ని 
కాలుష్యం  నిండిన ప్రకృతిని  కాపాడ ప్రయత్నించు.
టపాసుల శబ్దం తగ్గించి శాంతి నినాదాలు వినిపించు.
ఆడంబరం తగ్గించి, అన్యోన్యత పెంచు.!
విజయ స్ఫూర్తితో అడుగేస్తే వెలుగులు నింపే
శక్తి మన చేతుల్లోనే ఉందని నిరూపించు.




హామీ:
"శాంతి దీపాల తోరణం"  కవిత నా స్వీయ రచన.


No comments:

Post a Comment