[8/2, 13:15] p3860749: శీర్షిక : బంగారు బోనాలు.
వచన కవిత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
ఆషాడ మాసాన అమరేటి పండగ
ఇంటింట గౌరమ్మ వెలసేను నిండుగా
మమ్ము గాచేతల్లి మాంకాళి ఉండెగా
పసుపు పోలేరమ్మ కాచేను చల్లగా॥
నిమ్మహారాలతో అమ్మొారి తల్లిగా
పసుపు -కుంకాల తల్లి పడతి పెద్దమ్మగా
బోనాల భగవతిగ కట్టమైసమ్మగా
పుాల హారాల నిండు రమణి మాయమ్మగా.॥
భయమేల నోయమ్మ బతుకంత పండెగా
పొలది కుందన బొమ్మ పోచమ్మ ఉండెగా
దుష్ట జనులను దునుమ మారెమ్మ మంచిగా
ఎల్లమ్మ గ్రామల గాచేను ధీటుగా ॥
వేప కొమ్మల చలువ ఘటమందు నిండుగా
అమ్మ తల్లుల కొలువు బోనాల పండగా
కోరి మొాక్కేమమ్మ కోర్కెలే తీరగా
పాయసాన్నము తల్లి వేద్యాల ముడుపుగా--॥
మత్తైదులము చేరి మురిసేము విందుగా
పుాలహారాలనిడి మాయమ్మ నిలిచెగా
పట్టు చీరను కట్టి పెద్దముత్తైదుగా
పసుపు రాసిన పెద్ద బొట్టున్న బొమ్మగా॥
గ్రామ దేవతలెల్ల కొలువుండ రక్షగా
తీరంగ కష్టాలు తిరునాళ్ళ కలిమిగా
పాడి పంటలు నిండ పసిడి గౌరమ్మగా
కలిసి చేసితి మేము బోనాల పండగా ॥
హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచన.
[8/2, 23:05] నెల్లుట్ల సునీత ( ప్రక్రియ సున్నితం. ): *Women writers తెలంగాణా బోనాలు అంశంపై విజేతలు* *
*1..పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు ప్రథమ*
*2.జూలూరి శైలజ గారు ద్వితీయ*
*3.ఎడ్ల లక్ష్మి గారు తృతీయ*
*4.వలిపే సత్య నీలిమ గారు ప్రశంస*
No comments:
Post a Comment