శీర్షిక : ఝండా కు వందనం..
ఆంగ్లేయుల పరిపాలనలో
భారత ప్రజల అవమానాలు
బానిసత్వపుబాటలో
ఎదుగు బొదుగు లేని జీవితాలు॥
బ్రిటిష్ వారి ఆధిపత్యానికి
తల వంచిన భారతీయులు.
భారత స్వాతంత్ర్య పోరాటానికై
ఉద్యమ బాటలో దేశ భక్తులు ॥
కోల్పోయినారెందరో ప్రాణాలు
కొల్లగొట్టబడిన స్త్రీల మానాలు.
పట్టుబడిన వారికి సంకెళ్ళు
ఎదురు తిరిగినవారి
తిరిగిరాని ప్రాణాలు.॥
పట్టుబట్టిన గాంధీజీ నడచిన
బాటలో, ఉప్పు సత్యాగ్రహాలు.
దాండీమార్చ్ తో చేసిన
శాంతియుత పోరాటాలు ॥
"పింగళి వెంకయ్య" చేసిన
స్వాతంత్ర్య ముక్తి "ఝండా సృష్టి".
"బంకిం చంద్ర చటర్జీ "రాసిన
దేశభక్తి నిండిన"జన గణ మణ"
గీతి, నిండిన ఉద్యమ స్ఫుార్తి.॥
కులమత వివక్షతల నిరసనలు
ముాడురంగుల జండాలో
సత్యం,ధర్మం శాంతి నిండిన
సమానత్వపు జీవిత సారాలు॥
వెరసి,లభించిన దేశ స్వాతంత్ర్యం
గాంధీ, నెహ్రూల పోరాటాల ఫలితంం
బానిసత్వ ముక్తి పొందన దినం
ఆగష్ట్ 15ను, మరువలేదు జనం.॥
నేటికీ జనం జరుపుకుంటున్న
భారత స్వాతంత్ర్య దినోత్సవం .
ఎగురుతున్న ఝండాకు చేద్ధాం
వందనం,కలసి మనమందరం ॥
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
No comments:
Post a Comment