Thursday, August 5, 2021

స్వాతంత్రోద్యమం


సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రతి రోజు కవితా పండగే కార్యక్రమంలో భాగంగా భారత స్వాతంత్ర చరిత్ర కవిత పోటీల్లో పాల్గొని విజేతలైన వారి పేర్ల జాబితా విడుదల

1.గీతారాణి అవధానుల  ప్రథమ 
🤝🤝🌹🌹🎊🎊🥇🏆
2.పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి  ద్వితీయ 
🤝🌹💐🏆🥇🎊🎊
3. రాసపాక   వెంకటాచలం తృతీయ 
🎊🎊🙏🏆🥇
4.డా.రామక కృష్ణమూర్తి ప్రోత్సాహక
🎊🎊🥇🏆🙏

న్యాయ పరిశీలకులు శ్రీమతి బలివాడ తేజస్విని గారు

5/08/2021
సాహితీ బృందావన జాతీయ వేదికలో,

అంశం:భారత ఘనత స్వాతంత్ర్య చరిత.

శీర్షిక : నాదేశం త్యాగనిరతికి నిదర్శనం .

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

ఆంగ్లేయుల పాలనలో అసమానతలు
అస్వతంత్ర్యత , అవమానాలతో 
భారత ప్రజలకు బానిసత్వపు సంకెళ్ళు.
వెరసి  జరిగిన స్వాతంత్రోద్యమాలు ॥

గాంధీజీ బాటలో శాంతియుత సత్యాగ్రగాలు
దాండీమార్చ్ తో మొదలైన  ఆమరణ దీక్షలు.
ఆందోళనల పోరాటాల్లో అసువులు బాసి -
కీర్తి కెక్కిన స్వాతంత్ర్య యొాధుల చరితలు ॥

 ఉద్యమాల శాంతియుత పోరాటాలలో.
 కోల్పోయిన స్వాతంత్ర్య యొాధుల ప్రాణాలు.
 కన్న పేగు కడతేరిన తల్లుల కన్నీటి ధారలు.
 మాంగళ్యాన్ని బాసిన పడతుల జీవితాలు ॥
 
కోల్పోయినారెందరెందరో తమ ప్రాణాలు 
కొల్లగొట్టబడినాయి స్త్రీల గౌరవ మానాలు-
పట్టుబడిన వారికి ఆజీవిత సంకెళ్ళు 
ఎదురు తిరిగినవారి తిరిగిరాని  ప్రాణాలు.॥

పుార్తి స్వాతంత్ర్యానికి కృషిచేసిన గాందీజీ శక్తి
ఆగష్ట్ 15 నాడు  బానిసత్వానికి ముక్తి.
ఎగిరే ఝండా పింగళి వెంకయ్య సృష్టి
సత్యం ధర్మం సాంతి అహింసలకు ప్రతీతి.

ముాడు రంగుల ఝండాలో సర్వ మతసామరస్యం
సత్య అహింసలకు ప్రతీకగా మధ్యన ధర్మచక్రం ..
 భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యానికి చిహ్నం.
ఎగరేద్ధా ఐకమత్యంతో ఆగష్ట్15 న మనమందరం॥

హామీ:
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.

No comments:

Post a Comment