27/2/2025.
మహతీ సాహితీ కవి సంగమం ,
మరియు ఆర్ట్ పౌండేషన్ వారు -
సంయుక్తంగా నిర్వహించే సంకలనం కొరకు ,
అంశం : ఐచ్ఛికం.
శీర్షిక: అందమైన అనుభవం.
------------------------
తూర్పు దిక్కున ఎర్రని కిరణాలు,
మెల్లగా చీకటిని తరిమికొడుతూ,
కొండలు నిండిన బంగారు కాంతి భరణాలు
ప్రకృతి మాతకు స్వాగతం పలుకుతూ.
పక్షులు చేసే రెక్కల చప్పుడు కళలు
గుండె లయలను పూరించే నిండు నినాదాలు
పురి విప్పిన నెమలి భంగిమలు
నాట్య వినోదపు నయనానందాలు
చెట్ల ఆకుల నుండి , జారే మంచు బిందువులు.
మనసు కలతలను మరపించే మధువులు
పచ్చని చెట్ల కదలికల నీడలో...
గాలి అల్లరి కి రాలే పండుటాకుల గలగలలు
సీతాకోక చిలుకలు ఎగిరే దారుల్లో,
ఇంద్రధనస్సుల రంగుల తళుకులు
విరిసిన పువ్వుల వెచ్చని పుప్పడిలో
ఎగిరే మధుపాల సవ్వడి కులుకులు
మధురమైన గాలి వీచిలో
విరిసిన పూవుల గంధపు మలుపులు.
పక్షుల కిలకిలారావాల లో
స రి గ మ సందడుల సరాగాలాపనలు
తడి మట్టి ఒడిలో పరిచిన పచ్చతివాచీలు
మనసును మరిపించే ప్రకృతి ఆహ్వానాలు.
నల్లని ఆకాశంలో వెలిగే నక్షత్రాలు,
రాత్రి నిశ్శబ్దంలో , మధురానుభూతుల
చెలి వలపుల తీయని తలపులు .
ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం,
ప్రతి క్షణం ఒక అందమైన అనుభవం.!!
------------------------------
హామీ :
ఇది నా స్వీయ కవిత.
గతం లో ఎక్కడా ప్రచురించబడలేదు
రచన: శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ : మహారాష్ట్ర
ఫోన్ నెంబర్ : 8096722021.
-----------------------------
No comments:
Post a Comment