Tuesday, April 1, 2025

శీర్షిక: కళ్యాణ రాముడు.

మహతీ సాహితీ కవిసంగమం.

*ప్రతిరోజూ కవితా పండుగే*

అంశం:చిత్రకవిత

కవితాసంఖ్య: 1

31/ 03/ 2025 .  ( సోమవారం)

శీర్షిక: కళ్యాణ రాముడు.

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర . 43.

ప్రక్రియ: వచన కవిత. 

------------------


నింగి నిండా భానుడి ప్రతాపం,

నేలంతా సీతారాముల కళ్యాణ మేళం..

వేద మంత్రాల ధ్వనులతో నిండిన ఆకాశం,

దేవతలు చల్లే పుష్పాలతో భువి నిండిన సుగంధం !!

 

సీతా , రాముల నుదుట మెరిసే బాసికం .

అగ్ని సాక్షిగా ఏకమైన వారికి తోడైన తారాబలం.

భక్తుల హృదయాలలో వెలిగించిన ఆనంద దీపం.

సూర్యుని వేడిమి కూడా కరిగి ,

 చల్లని అనుభూతిగా  మారిన  క్షణం.!!,


 కళ్యాణ ఘట్టంలో నిండిన మన  దివ్య సంస్కృతి.

చరిత కెక్కిన సీతారాముల ఘనమైన దివ్య కీర్తి .

మంగళ వాయిద్యాల మధ్య  నాదలోలుల ఆనంద గీతి.

మన సభ్యత , సంస్కరాలకు పట్టిన నిండైన ఆరతి.!!.


సీతారాముల కళ్యాణ గాధ, సుగంధ పరిమళ పూదోట.

కుటుంబ విలువలు పెంచే బంధాలకు బాట.

తల్లి,తండ్రుల మాటలకు విలువిచ్చిన పుత్రుని కధ.

రామరాజ్యాన్ని భువిలో నిలిపిన వేద-వేద్యుడతడట.!!


అన్నదమ్ముల ఆదర్శానికి ప్రతీక అన్నది నిజం.

ఆలు,మగల అన్యోన్యానికి ఆతడే నిదర్శనం.

గుణగణాలకు తగిన అందమైన రూపం. 

ఆతని తలపే భక్తుల మదిలో ఆనంద దీపం. !!

-----------------------------------

ఈ కవిత నా స్వీయ  రచన.






No comments:

Post a Comment