09/04/2025.
శీర్షిక : నా దేశం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహరాష్ట్ర .
భారతీయ కావ్యమా , భాషా సౌందర్యమా
భరత దేశ కావ్యమా దివ్యమైన తేజమా !!
కోటి ద్యుతుల కలయికలా, కొల్లలైన. జాతులు
కట్టు బొట్టు తీరులు కనగ వలయు భాషలు
ధర్మ , కర్మ బాటలు సాంప్రదాయ కోటలు
గుండె లయల పాటకు, పల్లవైన చరితలు !!
గర్వించే హిమాలయాల మెరయు మేటి శిఖరాలు ,
గంగా యమునా, సరస్వతీ , పవిత్రత, సింధు ఘోషలు
పచ్చని చేలిడు నవ్వులు, బంగారు పంటల మెరుపులు
ఎడారి శ్శబ్ద గానాలు , గుబురు నిండు యడవులు !!
నెమలి చేయు నాట్యాలు, కోయిలమ్మ పాటలు ,
ప్రకృతి ఒడిని సౌందర్యం, ప్రతి దృశ్యమొక కావ్యం.
వేద జ్ఞాన వెలుగులు, ఉపనిషత్తు బోధలు
శాంతి నిండు వచనాలు, అహింస శాంతి మార్గాలు !!
శిల్ప కళల శోభలు యనంత వేల నిధులు
సంగీత నాట్య స్వర జతులు, సాహితీ సుగంధాలు
వీర సుతుల త్యాగాలు, స్వాతంత్ర్య భరత గాథలు
భిన్నత్వంలో ఏకత్వం , నీ సహనానికి సాక్ష్యాలు !!
ప్రతి శ్వాసలో సంస్కృతి. మట్టి రేణువున ప్రగతి
తరతరాల వారసత్వమేలు తరగని విఖ్యాతి
మా తల్లివి నీవు, మా నేలవు నీవు,
మా భవితవు నీవే మా జీవము నీవే ...!!
నీ చల్లని చూపులే, ధైర్య మిడెడు ప్రతి గెలుపు
నీ చల్లని ఒడిలో సమత మమతలే నిలుపు
నేడు మరచిపో నీయకు నిన్నటి నీ వైభవం ,
నీ కీర్తిని నిలుపుటకై. అహర్నిశలాత్మార్పణం!!
------------------------------------
No comments:
Post a Comment