Thursday, January 10, 2013

శ్లోకం.

శ్లోకం :
-------
న  గురోరధికమ్ తత్త్వం , న  గురోరధికో తప:
న  గురోరధికం  జ్ఞానం   తస్మై  శ్రీ గురవే నమ:



శ్లోకం :
--------
వాణీ  గుణానుకథనే శ్రవణౌ కథాయాం
హస్తౌచ  కర్మ సుమనస్తవ పాదయోర్న:|
స్మృత్యాం  శిరస్తవనివాస  జగత్ప్రణామే
దృష్తి: సతాందర్శనేస్తు   భావత్తనూనాం || 

Sunday, December 30, 2012

Sree Sai Harathi. (.namminavaarikade )

Sree Sai Haarati.(Namminavaarikade..)
శ్రీ సాయి హారతి .
-------------------------------------
నమ్మినవారికదే భవుడవు శ్రీ సాయీ , మా సాయీ
నమ్మకమిదె మా సమ్మతి మంగళ హారతి గొనుమోయీ ||

భోగములన్నియును విడచి యోగముతో శ్రీ సాయీ
యాగములెన్నొ చేసి యోగిగ భువి నిలచితివోయీ
నమ్మినవారికదే భవుడవు .....................(పూర్తిగా )

ద్వారక చావడిలో తపమును చేసితివీ శ్రీ సాయీ
ధర వరమందీ ,ధన్యత నొంది దీనుల బ్రోచితివీ
నమ్మినవారికదే భవుడవు .......................(పూర్తిగా)

సాధు మహా సంతా సద్గురు శ్రీ సాయీ వినుమోయీ
లేరిక భువిలో వేరే దైవము మాకిక గురు సాయీ
నమ్మినవారికదే భవుడవు ......................(పూర్తిగా )

పాపము పరిమార్చే దైవం సాయి హరే , శ్రీ సాయి పరే
పావనపాలకు-డీతని చరితము మా కిల వేదమదే
నమ్మినవారికదే భవుడవు ....................(పూర్తిగా)

షిరిడీ ధామమదే సాయీ వాసమదే నివాసమదే
కలదీ భూమికి పుణ్యపు చరితము, సమాధి వెలసెనదే
నమ్మినవారికదే భవుడవు ........................(పూర్తిగా)

సత్యము తాననుచూ దీనుల బ్రోతుననీ , పాలింతుననీ
సమాధినుండీ పలికిన సాయిని సన్నుతి చేయరదే

నమ్మినవారికదే భవుడవు శ్రీ సాయీ మా సాయీ
నమ్మకమిదె మా సమ్మతి మంగళ హారతి గోనుమోయీ....
|| మూడు సార్లు ||

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక
రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు
శ్రీ సాయినాధ మహారాజ్ కీ జై ||

ఓం శాంతి , శాంతి , శాంతి:
----------------------------




Wednesday, December 26, 2012

Amdinanta dooramlo

    అందినంత దూరంలో  అగుపిస్తావు .
_______________________________


అందినంత  దూరం లో  అగుపిస్తావు - సాయి
కొంత దరికి రానిచ్చి మురిపిస్తావు
మేలమింక  చాలు చాలు మము దయ నేలు
ప్రేమతోడ వినుమా మా వేడికోలు       || అందినంత ||

బంధ మేమొ తెలియదు నిను వీడలేమూ
ఇంపు మాకు వీనులకిదే నీదు నామమూ
మనసులోని మసలు  దేవ  దేవుని ఆన
రూపు నీదు కాన వచ్చె ప్రతి గుడిలోన || అందినంత ||

అలసినాను అడుగడుగున బ్రతుకు బరువుగా
సేదతీర్చి లాలించే సాయి నీవేగా ......
వలసినంత వరములనిడు మంచి దాతగా- సాయి
వెలసినావు షిరిడీ లో మాడు  వేల్పుగా ||అందినంత||
_____________________________________
_____________________________________








Friday, December 21, 2012

నమస్కారమిదె నీకు సాయీ

Namaskaaramideneeku saayee mammelu 

నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు. (  ఈ పాట అందరు కలిసి గ్రూప్ గా పాడాలి   ఆరతి  పాట కాబట్టి , దానికి  సరిపోయిన  మ్యూజిక్  చేయాలి . షిరిడి లో హారతికి వాయించినట్టు 
--------------------------------------------
తలపైని  తలపాగ  చుట్టేవు  నీవు
కఫ్నీని   నిండార   ధరియించినావు
మమ్మేలు మా మంచి  గురువైతివీవు
నమస్కారమిదె  నీకు సాయీ మమ్మేలు ||

మెడలోని హారాలు మా ప్రేమ పూలు
నీ  చేతి  అభయమ్ము  మా భాగ్యమేలు
నీ  పాద పద్మాలు మమ్మేలు  జేలు
నమస్కారమిదె  నీకు సాయీ మమ్మేలు ||

తత్త్వప్రకాశమ్ముతో  సాయి నీవు
నిత్యాగ్ని  ధునిలోన  ద్యుతివై  వెలిగేవు
సత్యాన్ని బోధించు  సారమ్ము నీవు
నమస్కారమిదె  నీకు  సాయీ  మమ్మేలు ||

నీ చేతి  ఓషధులు  తినిపించినావు
మా  ఒంటి  బాధలను  తొలగించినావు
మాలోని  లోపాలు  మన్నించినావు
నమస్కారమిదె  నీకు  సాయీ మమ్మేలు ||

మనమంత  ఒకటంటు  బోధించినావు
ఇల  తారతమ్యాలు  తొలగించినావు
నీ  ప్రేమ- పాశాన   బంధించినావు
నమస్కారమిదె నీకు  సాయా మమ్మేలు ||

నిరాకార  సాకార సత్యమ్ము నీవు
పరాకేల  పరబ్రహ్మ పరమాత్మ  నీవు
పరే  సాయి  సంపూర్ణ  భగవంత  నీవు
నమస్కారమిదె నీకు  సాయీ మమ్మేలు ||
నమస్కారమిదె నీకు సాయీ  మమ్మేలు
నమస్కారమిదె  నీకు  సాయీ మమ్మేలు ||

               

Tuesday, December 18, 2012

Nivedana

                            
                            Nivedana 
                              నివేదన .
                             ----------
                          " స్తోత్రం కస్యన తుష్టయే " అని  మహాకవి కాళిదాసు అన్నారు . అంటే
 ఈ ప్రపంచంలో స్థుతిచే  ప్రసన్నులు  కానివారేవ్వరూ  ఉండరు  అని అర్ధం .
                           అందికే వేదాలు , పురాణాలు,  కావ్యాలు , మొదలైనవి స్తోత్ర  పఠనానికి
 అనువుగా అభివర్ణిoపబడి  ఉన్నాయి  .
                              నవవిధ  భక్తులలో ఏ  విధమైన భక్తితో  భగవంతుని ఆరాధించినా ,ఆతని
అనుగ్రహానికి  పాత్రులమే అవుతాము .అందులో ఒకటైనది ,సామవేదం  నుండి పుట్టినది
శాస్త్రీయ సంగీతం . సంగీతారాధనతో ఆ దేవదేవుని ప్రసన్నం చెసుకొని ,ముక్తిని  , మొక్షాన్నీ
పొందవచ్చుననే  సత్యాన్ని , తమ సంగీత పాండిత్యంతో  నిరూపించిన  ఎందరో వాగ్గేయకారులు
మనకు మార్గ దర్శకులు .
                              సప్త స్వరాలతో కూడుకొని ఉన్న ఈ సంగీతం 72 మేళకర్తలలలో
నిబిడీకృతమై ,  సంపూర్ణ రాగాలు , జన్యరాగాలు, ఉప రాగాలు  గా విభజించబడి
అన్య స్వర ప్రయోగాలతో  , లలిత సంగీతం  , సినీ సంగీతం ,జానపదాలు ,పల్లెపాటలు
ఇలా ఎన్నో విధాలైన  సంగీత  రూపాలకు  ప్రాణం పోసింది .
                             పలురూపాలుగా అవతారమెత్తిన పరమాత్ముడు కలియుగంలో  శ్రీ -
సాయినాధునిగా అవతరించి , అడిగినంతనే  ఆపదలు బాపే అంతర్యామిగా  గణుతికెక్కిన
 యోగపురుషుడు .
                              భక్తికి , భావుకతకి  ప్రాముఖ్యతనిచ్చి , కొన్ని రాగాలను, సినీ సంగీతాన్ని
   ఆధారంగా తీసుకొని అన్య స్వర ప్రయోగాలతో  స్వరపరఛి  సద్గురువులు , దైవాంశసంభూతులు , అవతారపురుషులు అయిన  శ్రీ సాయి నాధుని , నా భావనాదృష్థి తో  దర్శించి  కీర్తించిన  కీర్తనలే  ఈ
                                      " సాయి  భక్తి  గీతామృతాలు  ".
                     ఎన్నో జన్మల పుణ్య విశేష  ఫలంగా  నాచే రచింపబడిన  ఈ కీర్తనా సుమాలను
  నా మొదటి  సంగీత గురువు  . ప్రేమమూర్తి  అయిన  నా తల్లిగారు , స్వర్గీయులు
                                    శ్రీ   " పంతుల  కామేశ్వరీ దేవి  " గారికి  అంకితమిస్తూ ..
 పెద్దలు , సద్గురువుల  అశీర్వచనాలతొ  ఈ  కీర్తనలు  వెలుగులోకి  రావాలని   ఆశిస్తూ
, పరమాత్ముడైన  " శ్రీ   సాయి నాధుని  " చరణారవిందాలకు అంకిత భావంతో  అర్పిస్తున్నాను.
                                   
                                 నా ఈ గీతరచనకు  తోడ్పడి  సహకరించిన  నా కుటుంబ సభ్యులందరికీ
ఆ దేవ  దేవుడైన  శ్రీ  సాయినాధుని  కృపా , కటాక్షాలు  ఎల్లప్పుడూ ఉండాలని  ప్రార్ధిస్తూ ...
                                               శ్రీ  భాగవత్పాదారవిందాశ్రితురాలు ,
                                                              రచయిత్రి
                                           శ్రీమతి   పుల్లాభట్ల  జగదీశ్వరీ మూర్తి .