Monday, April 24, 2023

మనోహరి మహిళా పత్రక కొరకు పంపిన రచనలు.

మనోహరి మహిళా పత్రక కొరకు పంపిన రచనలు.
చింటుా...కధ.
చందమామ కధలు లో హీరో చింటుా  ( కధ ).
చింటుా చేసిన సాయం. ( .థ్రిల్లర్ కధ).
 చింటుా తెచ్చిన మార్పు(    కధ).
 పాటకు పల్లవి ప్రాణం లో 
" పాడనా తెలుగు పాట"కు సమీక్ష.
 సిసింద్రీలు  రాసినవన్నీ సెలెక్ట్ చేశారండీ.
 మనోహరి పత్రికపై  నా అభిప్రాయం.
 నా సంపాదన నా ఇష్టం అంశం కొరకు 
" నీలిమ. కధ.
నాటి సాహిత్యం ".తాళ్ళపాక అన్నమయ్య ".
పుస్తక సమీక్ష ..లో....
సహజీవనం మంచిదే కదా..అన్న నా .కధకు
 మొాటుకుారి శాంతకుమారిగారి సమీక్ష
యడవల్లి శైలజగారి. "హృదయరాగం ."
పై  నేను రాసిన సమీక్ష .
దర్శనీయ స్థలాలులో "మైసురు శ్రీరంగ పట్టణం గురుంచి..

బాల సాహిత్యంలో..."మంచి మాట వినరారే ముద్దుల సిరి
ముాటలు."
మహిళా దినోత్సవం కొరకు  "ఆర్టికల్ "
శ్రీ శక్తియైన " ల లితా వైశిష్ట్యం."
ఉమెన్స్ డే సందర్భంగా ,"మహిళా సాధికారత.".వ్యాసం .
గృహ శోభ లో..."అందమైన అనుభవం ."
జోక్స్లో " నాకు పెళ్ళి కావాలి ".
అన్ని రంగాల లో మహిళ లు మాత్ర మే బాస్ లు ఐతే  అన్న...
"ఆర్టికల్."

జ్ఞాన ప్రసుానాంబ  దండకం.

జన్మకు సార్ధకత. కవిత.
ప్రేమికుల రోజు! "మనసు విప్పి చెప్పనీ "..కవిత.

శివరాత్రి సందర్భంగా,  పద్యాలు.
బాల సాహిత్యం..."మంచి మాటలు".
కాలుష్య నివారణ తీరని సమస్య.
కవయిత్రుల పరిచయంలో ."..నా పరిచయం."

ఇవన్నీ సెలక్ట్ చేశామన్నవండీ...
కానీ  ఒకటో రెండో తప్ప,  మరేవీ మన పత్రికలో 
నేను చుాడలేకపోయాను .కొన్ని లింక్ లు ఓపెన్ కాలేదు.
మా బాబుకి హార్ట్ సర్జరీ అయింది . ఆ సమయంలో మెసేజ్లు నిండిపోవడం వల్ల మా వారు ..అన్నీ డిలీట్ చేసేసారు.
పరిమళగారికీ విషయం తెలియ జేసేను.
సెట్టింగ్స్ మళ్ళీ సరి చేయ మన్నారు.  చేసిన తరువాత ఏ పత్రికలోనుా నా రచనలు కనబడలేదండీ.
లింక్ లన్నీ డిలీట్ అయ్యేయి.
రాసిన వన్నీ  కష్టపడి రాసినవే...
సొంత వెబ్ లోంచీ గానీ  , కపీ  గానీ చేయలేదు .
ఇంకా రాసినవి ఉన్నాయనుకుంటాను .గుర్తు లేవు.
దయుంచి తెలియజేయగలరు.
ధన్యవాదాలతో 🙏🙏

Sunday, April 23, 2023

పంచపదిలో కవయిత్రిగా నా పరిచయం.

నమస్తే మేడం!
*వారం వారం కవి పరిచయం*
*పంచపది కవి రత్నాలు-10*

ఈ శీర్షికతో ప్రతి ఆదివారం ఒకరి గురించి పరిచయం ఇవ్వాలనుకొను చున్నాము.అందులో భాగంగా 10వ వారం మీ పరిచయం ఇవ్వదలిచాము.కావున మీ వివరాలు 2 రోజుల్లో పంపగలరు.మీరు ఇచ్చిన సమాచారాన్ని,ఎడిట్ చేసి,స్వీకరించే అంశాలతో ప్రిపేర్ చేయుటకు సమయం అవసరము.కావున బుధవారానికల్లా మీ వివరాలు,ఫోటో పంపగలరు.మీరు పంపిన సమాచారంలో ఇవ్వదలచుకున్న దాన్ని మేము నిర్ణయించి,సెలెక్ట్ చేసి కవి పరిచయాన్ని సిద్ధం చేస్తాము.క్రింద కొన్ని విషయాలు ఇస్తున్నాము.మీ వ్యక్తిగత పరిచయాన్ని ఇస్తూ,ముఖ్యంగా *పంచపది సమూహం గురించి,పంచపదుల విశిష్టత గురించి,సమూహ ప్రత్యేకతల గురించి విశేషంగా,స్పష్టంగా తెలియజేస్తూ,సమూహానికి మీ సూచనలు కూడా అందించగలరు ప్రత్యేకంగా పంచపదులు ఎన్ని వ్రాశారో తెలుపగలరు.*

మా టీమ్ అన్ని చూసి,ప్రచురణ యోగ్యమైన వాటిని స్వీకరించి *కవి పరిచయం ప్రకటిస్తాము*
ఫోటోతో సహా Pdf చేసి మీకు అందజేస్తాము.

*స్వీయ పరిచయం*
1) పేరు:
2)  పుట్టిన తేదీ:/వయస్సు
3) జన్మ స్థలం:
4) విద్యార్హతలు
5) తల్లిదండ్రులు:
6) భర్త / భార్యపేరు/సంతానం
7) నివాసం:
8) రచనలు
8) సాహిత్య సేవ
9) వృత్తి-ప్రవృత్తి/మీరు సాధించిన విజయాలు
10) ముద్రించిన పుస్తకాలు
11) అవార్డులు రివార్డులు
12)పంచపదులపై మీ అభిప్రాయం విపులంగా అందించండి.
13) పంచ పదులకు ఏ రకమైన  ఖ్యాతిని కలిగించవచ్చు
14) ఏ ఏ గ్రూపులలో భాగస్వాములై ఉన్నారు
15) రచనానుభవము ఎన్ని సంవత్సరాలు?

ఇంకా మీకు ప్రత్యేకంగా ఏవైనా సందర్భాలు వుంటే తెలియ జేయండి.
మా నిర్వాహణ బృందం పరిశీలించి,ఏవేవీ తీసుకోవాలో నిర్ణయిస్తుంది.
ధన్యవాదాలు మేడం!
ఆదివారం వరకు ఈ సమాచారం ఎవరికి చేరవేయకండి.🙏
అవసర సమాచారానికై నాగరాజు గారు మిమ్ములను సంపాదిస్తారు.
ప్రశంసా పత్రము కొరకు మీ ఫోటోలు కూడా పెట్టండి.మీ కుటుంబ సభ్యుల సందేశాలు కూడా పంపించండి మేడం.

నమస్తే మేడం!
*వారం వారం కవి పరిచయం*
*పంచపది కవి రత్నాలు-10*

ఈ శీర్షికతో ప్రతి ఆదివారం ఒకరి గురించి పరిచయం ఇవ్వాలనుకొను చున్నాము.అందులో భాగంగా 10వ వారం మీ పరిచయం ఇవ్వదలిచాము.కావున మీ వివరాలు 2 రోజుల్లో పంపగలరు.మీరు ఇచ్చిన సమాచారాన్ని,ఎడిట్ చేసి,స్వీకరించే అంశాలతో ప్రిపేర్ చేయుటకు సమయం అవసరము.కావున బుధవారానికల్లా మీ వివరాలు,ఫోటో పంపగలరు.మీరు పంపిన సమాచారంలో ఇవ్వదలచుకున్న దాన్ని మేము నిర్ణయించి,సెలెక్ట్ చేసి కవి పరిచయాన్ని సిద్ధం చేస్తాము.క్రింద కొన్ని విషయాలు ఇస్తున్నాము.మీ వ్యక్తిగత పరిచయాన్ని ఇస్తూ,ముఖ్యంగా *పంచపది సమూహం గురించి,పంచపదుల విశిష్టత గురించి,సమూహ ప్రత్యేకతల గురించి విశేషంగా,స్పష్టంగా తెలియజేస్తూ,సమూహానికి మీ సూచనలు కూడా అందించగలరు ప్రత్యేకంగా పంచపదులు ఎన్ని వ్రాశారో తెలుపగలరు.*

మా టీమ్ అన్ని చూసి,ప్రచురణ యోగ్యమైన వాటిని స్వీకరించి *కవి పరిచయం ప్రకటిస్తాము*
ఫోటోతో సహా Pdf చేసి మీకు అందజేస్తాము.

*స్వీయ పరిచయం*
1) పేరు:
2)  పుట్టిన తేదీ:/వయస్సు
3) జన్మ స్థలం:
4) విద్యార్హతలు
5) తల్లిదండ్రులు:
6) భర్త / భార్యపేరు/సంతానం
7) నివాసం:
8) రచనలు
8) సాహిత్య సేవ
9) వృత్తి-ప్రవృత్తి/మీరు సాధించిన విజయాలు
10) ముద్రించిన పుస్తకాలు
11) అవార్డులు రివార్డులు
12)పంచపదులపై మీ అభిప్రాయం విపులంగా అందించండి.
13) పంచ పదులకు ఏ రకమైన  ఖ్యాతిని కలిగించవచ్చు
14) ఏ ఏ గ్రూపులలో భాగస్వాములై ఉన్నారు
15) రచనానుభవము ఎన్ని సంవత్సరాలు?

ఇంకా మీకు ప్రత్యేకంగా ఏవైనా సందర్భాలు వుంటే తెలియ జేయండి.
మా నిర్వాహణ బృందం పరిశీలించి,ఏవేవీ తీసుకోవాలో నిర్ణయిస్తుంది.
ధన్యవాదాలు మేడం!
ఆదివారం వరకు ఈ సమాచారం ఎవరికి చేరవేయకండి.🙏
అవసర సమాచారానికై నాగరాజు గారు మిమ్ములను సంపాదిస్తారు.
ప్రశంసా పత్రము కొరకు మీ ఫోటోలు కూడా పెట్టండి.మీ కుటుంబ సభ్యుల సందేశాలు కూడా పంపించండి మేడం.

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను   .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.
తమ్మడు పంతుల వేంకటరమణ ముార్తి.
తమ్మడు కుాడా మంచి  రచయిత ,గాయకుడు , 
మంచి కంపోజర్.కావడం  విశేషం.
సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత  గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు  చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణ ను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా  నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా  గాత్రానికి సంగీత  శ్రీకారం చుట్టేను .


వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
రైల్వేలో మొాటర్ మేన్ గా రిటైర్ అయి ప్రస్తుతం
 హైకోర్ట్  వకీలుగా కొనసాగుతన్నారు.
మా ఇద్దరు పిల్లలకీ వివాహాలయ్యేయి.
అబ్బాయి పి. రాజశైఖర్ ముార్తి  సైబర్ సెక్యుారిటీ
ఫౌండర్ గా  కొన్ని కంపెనీలకు  డైరెక్టర్ గా 
కొనసాగుతున్నాడు. వికీపీడియాలో రాజశేఖర్ ముార్తి పి. పేరుతో ఉన్న బయొాడేటా చదివి కోర్స్లు పుార్తి చేయడం  వల్ల చాలా మంది యువత
నేటి కంప్యుాయుాటర్  విభాగంలో నిష్టాతులై
ఉద్యోగ ప్రాప్తులయ్యేరు.
అమ్మాయి వివాహానంతరం లండన్ లో స్థిరపడింది.
అన్యోన్య దాంపత్యం .వారిద్దరికీ పిల్లలున్నారు.
 
అటుపై నేను 
 ఇక్కడ పొరుగుారైన  డోంబివిల్లి వాస్థవ్యులు
శ్రీమతి తారా రమేష్ గారి వద్ద సంగీత ప్రస్థానాన్ని కొనసాగించేను . హరికథా శిరోమణి యైన మా
అత్తయ్యగారు సాహిత్యాభిలాషి .అమె దగ్గరున్న పుస్తకాల గది ఒక పెద్ద గ్రంధాలయమని చెప్పవచ్చు
వారికి గల  తొమ్మిది మంది సంతానంలో పెద్ద కోడలిగా
ఆరుగురు ఆడపడుచులు , మరుదుల అభిమానానికి 
పాత్రురాలినయ్యేను.
వారందరుాకుాడా  భక్తి , గాన, వాద్య  భజన కళాకారులే
అమె సంగీత సాహిత్యాల నేర్పు కుార్పులతో రాసిన కీర్తనలు పద్యాలు స్తోత్రాలు అనేకం .
నిత్య పురాణ ఫఠనాలతో భజన సప్తాహాల విందుభోజనాదులతో  మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చతోరణమే.
అవిధంగా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి నాలో 
సహజంగా ఉండే ఆశక్తి తోడై  కవితలు రాయడం పాటలు రాయడం రాగాలలో స్వరకల్పన చేయడం చేస్తుా.  రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..
అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వర రచనలను విని  ఆస్వాదించి ఆనందించిన 
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు  తాను రచించిన శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో  రెండు CD లుగా  ఆవిష్కరించేరు.  నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్యయంగా వారి చేతులమీదుగా  సన్మానితురాలిని కావడం 
నాకు గర్వకారణం. 

అవికాక 8 CD లు వివిధ గాయనీ గాయకు లు పాడినవి , పుార్వ గవర్నరు గారైన "విద్యాసాగర్ గారి చే కొన్ని , కుర్తాళం స్వామివారిచే "కొన్ని,  శారదా సుబ్రహ్మణ్యం గారి చే కొన్ని ఆవిష్కరింపబడ్డాయి. అవేకాక కవితలు,కధలు కుాడా రాస్తాను. ముంబాయి ఆంధ్రమహా సభ , వాషి తెలుగు కళా సమితిలలో పలు కార్య క్రమాలలో  పాల్గొని సన్మాన పాత్రురాలినయ్యేను. 

పలు సంఘాల లో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాల లో చోటు చేసుకున్నాయి. 
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో  లలిత సంగీతాలు   పాడేను.
బోంబే షణ్ముఖానందలో,  అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో  ఎన్నో సినీ గీతాలు  లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.
హైదరాబాదులో జరిగిన శివపద సప్తాహంలో నాచే స్వరపరచబడిన కీర్తనలను, నాతో కలిపి , బోంబే సంగీత కళాకారిణులందరికీ పాడే అదృష్టం గురువుగారు శ్రీ షణ్ముఖశర్మగారు కల్పించేరు. కరోనా కారణంగా
ప్రస్తుతం "ఆన్ లైన్"  కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి 
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం "  బిరుదు పొందేను 
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో రాసిన పద్యాలు ప్రథమ స్థానాన్ని అలంకరించగా  1116/   పారితోషికాన్ని అందుకున్నాను .అంతే గాక "సంపుార్ణ సుందరకాండ"
ను పాటవెలది ప్రక్రియలో  రాసేను .వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందేను.

ముంబై ఆంధ్ర మహా సభ వారి శతాధికవులు ముద్రిత పుస్తకం లో నేను రాసిన కధ కవితకు పురస్కార సన్మానితురాలినయ్యేను. 

ప్రస్తుతం  "పంచపదులు"    మీ పాదం నా పంచపది  అనే ప్రక్రియలు మనసును బాగా ఆకట్టుకున్నాయి.
.గౌరవ నీయులు శ్రీ విఠల్ కాటేగర్ గారు వివిధ రకాల
అంశాలనిచ్చి  కవులను ప్రోత్సహిస్తుా విజేతలను
ప్రత్యేకమైన బిరుదులతో  సత్కరించడంతో 
"పంచపదులు" ప్రక్రియలు  అగ్రస్థానాన్ని అలంకరించి  కవులకు ఉవ్విళ్ళుారిస్తున్నాయి .
పంచపదులలో  విజేతగా పంచపది శ్రేష్ట , కవి కిరీటిగా ,కవి వజ్ర గా చాలా సార్లు వారి మన్ననలనందుకున్నాను . 
ఎన్నో కవితలకు  ఉత్తమ స్థానంలో నిలిచేను.

నమస్తే దినపత్రికలో , సాక్షి పేపర్ , నవ తెలుగు తేజం మాస పత్రికలో, వాషి (ముంబై ) తెలుగు కళా సమితి వారి దిక్సూచి లో నా కవితలు, కధలు ప్రచురింపబడుతుా ఉంటాయి .

 ". ప్రతిలిపి" అనే ప్రైవేట్ బ్లాగ్ లో  రాసిన  ఎన్నో కధలు కవితలకు సన్మానం అందుకున్నాను.  
ప్రతిలిపిలో నేను రాసిన రచనలు..
కధలు కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.

కీర్తనలు,  లలిత గీతాలు , భక్తి గీతాలు , సప్త తాళ కీర్తనలు , తెలుగులోనికి తర్జుమా చేసి రాసి స్వరపరచిన 30 పాశురాలు , వివిధ రకాలైన అనేక పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.

కధలు ,కవితలు, ఛందస్సు తో కుాడిన పద్యాలు
రాయడం చాలా ఇష్టం.
లలిత-సంగీత గేయాలను,  కీర్తనలను , వర్ణాలను రాయడం, స్వరపరచడం ,పాడడం చేస్తుా
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా  ఆనందిస్తుా ఉంటాను.

అన్ లైన్ కవితా పోటీల లో  చాలా ప్రక్రియల లో ఇప్పటికీ  పాల్గొంటుా ఎన్నో ఛందోబద్ధ  పద్యనియమాలను ,  వారచ్చిన అంశాలతో ఎందరో చరిత్రకారుల చరితలను , తెలుసుకోగలిగేను.
గురుకుల పంరంపరగా  కొనసాగుతున్న ఈ సంస్థలను నడుపుతున్న  నిర్వాహకులకు కార్యవర్గ బృందానికి నేనెంతో ఋణపడి ఉన్నాను .వారందరికీ నా నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 
..
ఈ సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.


వాటి వివరాలు..

******************************************

బిరుదులు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఇప్పటి వరకు దొరికిన బిరుదు పురస్కారాలు.

 ( ఇష్టపది ప్రక్రియలో )
1. "సాహిత్య చక్రవర్తి. "అనే బిరుదును.

(మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)
2
"మహతీ సాహితీ చక్రవర్తి " బిరుదును

సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)
 "3.విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.

(సాహితీ బ్రందావన జాతీయ వేదిక)నుండి
4, 5 . " కవి కోకిల , సుధీ తిలక " బిరుదులను. 

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..సున్నితం
ప్రక్రియ  రచనలకు
6."సున్నితం" బిరుదు.ను

పరిమళాలు ప్రక్రియలో..పాటలుగా 30 పాశురాలు తెలుగులో రాసినందుకు)
7."అక్షర ఝరీ రత్న "బిరుదును.

శతాక్షరి ప్రక్రియలో కవితలు రాసినందుకుగాను
8. "పద ముత్యం" బిరుదు.ను

9."సాహితీ బృందావన విహార జాతీయ వేదిక" వారి
"సాహిత్య కళానిధి" బిరుదు.

10. (శతాధిక మధురిమలు పుార్తి చేసి 
. "మధుర కవి భుాషణ" బిరుదు ను

11.( కృపాణాలు ప్రక్రియలో)
అద్వైత పురస్కార ము ను

చిలక పలుకులు ప్రక్రియ లో)
"స్వర మయుారి." పురస్కారము

(చిమ్నీలు ప్రక్రియలో)
12.."వెలుగు దివ్వె". పురస్కారాన్ని.

తెలుగు తేనియలు సాహితీ వేదికలో ).
13 .శత తేనియ పురస్కారము  .

(సాహితీ బృందావన జాతీయ వేదిక నుండి )
14" రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."ను

.(సుారేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రష్ట్ నుండి).
 " సమాజ సార్థక్ అవార్డ్ "ను

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి
"కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం...2021.

. సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యుాట్యుాబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో...
"భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."

కలామ్ ఇనిస్టిట్యూట్  ఆఫ్ యుాత్ ఎక్స్ లెన్స్ 
అవార్డు .

 "కాళోజీ సాహితీ శాంతి పురస్కారం. "
 రవీంద్రనాథ్ టాగుార్  సేవా  పురస్కారం.
 ఇలా ఎన్నో బిరుదులు, పురస్కారాలు ,అవార్డ్ లు
 లభించేయి.
           

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
**************************చివరగా ...
నాలో సాహిత్యాకాంక్షను కలిగించి,  గౌరవించిన  గురువర్యులందరికీ సాదర నమస్కారాలతో ..🙏🙏


శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను   .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.
తమ్మడు పంతుల వేంకటరమణ ముార్తి.
తమ్మడు కుాడా మంచి  రచయిత ,గాయకుడు , 
మంచి కంపోజర్.కావడం  విశేషం.
సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత  గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు  చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణ ను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా  నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా  గాత్రానికి సంగీత  శ్రీకారం చుట్టేను .


వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
రైల్వేలో మొాటర్ మేన్ గా రిటైర్ అయి ప్రస్తుతం
 హైకోర్ట్  వకీలుగా కొనసాగుతన్నారు.
మా ఇద్దరు పిల్లలకీ వివాహాలయ్యేయి.
అబ్బాయి పి. రాజశైఖర్ ముార్తి  సైబర్ సెక్యుారిటీ
ఫౌండర్ గా  కొన్ని కంపెనీలకు  డైరెక్టర్ గా 
కొనసాగుతున్నాడు. వికీపీడియాలో రాజశేఖర్ ముార్తి పి. పేరుతో ఉన్న బయొాడేటా చదివి కోర్స్లు పుార్తి చేయడం  వల్ల చాలా మంది యువత
నేటి కంప్యుాయుాటర్  విభాగంలో నిష్టాతులై
ఉద్యోగ ప్రాప్తులయ్యేరు.
అమ్మాయి వివాహానంతరం లండన్ లో స్థిరపడింది.
అన్యోన్య దాంపత్యం .వారిద్దరికీ పిల్లలున్నారు.
 
అటుపై నేను 
 ఇక్కడ పొరుగుారైన  డోంబివిల్లి వాస్థవ్యులు
శ్రీమతి తారా రమేష్ గారి వద్ద సంగీత ప్రస్థానాన్ని కొనసాగించేను . హరికథా శిరోమణి యైన మా
అత్తయ్యగారు సాహిత్యాభిలాషి .అమె దగ్గరున్న పుస్తకాల గది ఒక పెద్ద గ్రంధాలయమని చెప్పవచ్చు
వారికి గల  తొమ్మిది మంది సంతానంలో పెద్ద కోడలిగా
ఆరుగురు ఆడపడుచులు , మరుదుల అభిమానానికి 
పాత్రురాలినయ్యేను.
వారందరుాకుాడా  భక్తి , గాన, వాద్య  భజన కళాకారులే
అమె సంగీత సాహిత్యాల నేర్పు కుార్పులతో రాసిన కీర్తనలు పద్యాలు స్తోత్రాలు అనేకం .
నిత్య పురాణ ఫఠనాలతో భజన సప్తాహాల విందుభోజనాదులతో  మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చతోరణమే.
అవిధంగా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి నాలో 
సహజంగా ఉండే ఆశక్తి తోడై  కవితలు రాయడం పాటలు రాయడం రాగాలలో స్వరకల్పన చేయడం చేస్తుా.  రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..
అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వర రచనలను విని  ఆస్వాదించి ఆనందించిన 
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు  తాను రచించిన శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో  రెండు CD లుగా  ఆవిష్కరించేరు.  నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్యయంగా వారి చేతులమీదుగా  సన్మానితురాలిని కావడం 
నాకు గర్వకారణం. 

అవికాక 8 CD లు వివిధ గాయనీ గాయకు లు పాడినవి , పుార్వ గవర్నరు గారైన "విద్యాసాగర్ గారి చే కొన్ని , కుర్తాళం స్వామివారిచే "కొన్ని,  శారదా సుబ్రహ్మణ్యం గారి చే కొన్ని ఆవిష్కరింపబడ్డాయి. అవేకాక కవితలు,కధలు కుాడా రాస్తాను. ముంబాయి ఆంధ్రమహా సభ , వాషి తెలుగు కళా సమితిలలో పలు కార్య క్రమాలలో  పాల్గొని సన్మాన పాత్రురాలినయ్యేను. 

పలు సంఘాల లో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాల లో చోటు చేసుకున్నాయి. 
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో  లలిత సంగీతాలు   పాడేను.
బోంబే షణ్ముఖానందలో,  అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో  ఎన్నో సినీ గీతాలు  లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.
హైదరాబాదులో జరిగిన శివపద సప్తాహంలో నాచే స్వరపరచబడిన కీర్తనలను, నాతో కలిపి , బోంబే సంగీత కళాకారిణులందరికీ పాడే అదృష్టం గురువుగారు శ్రీ షణ్ముఖశర్మగారు కల్పించేరు. కరోనా కారణంగా
ప్రస్తుతం "ఆన్ లైన్"  కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి 
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం "  బిరుదు పొందేను 
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో రాసిన పద్యాలు ప్రథమ స్థానాన్ని అలంకరించగా  1116/   పారితోషికాన్ని అందుకున్నాను .అంతే గాక "సంపుార్ణ సుందరకాండ"
ను పాటవెలది ప్రక్రియలో  రాసేను .వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందేను.

ముంబై ఆంధ్ర మహా సభ వారి శతాధికవులు ముద్రిత పుస్తకం లో నేను రాసిన కధ కవితకు పురస్కార సన్మానితురాలినయ్యేను. 

ప్రస్తుతం  "పంచపదులు"    మీ పాదం నా పంచపది  అనే ప్రక్రియలు మనసును బాగా ఆకట్టుకున్నాయి.
.గౌరవ నీయులు శ్రీ విఠల్ కాటేగర్ గారు వివిధ రకాల
అంశాలనిచ్చి  కవులను ప్రోత్సహిస్తుా విజేతలను
ప్రత్యేకమైన బిరుదులతో  సత్కరించడంతో 
"పంచపదులు" ప్రక్రియలు  అగ్రస్థానాన్ని అలంకరించి  కవులకు ఉవ్విళ్ళుారిస్తున్నాయి .
పంచపదులలో  విజేతగా పంచపది శ్రేష్ట , కవి కిరీటిగా ,కవి వజ్ర గా చాలా సార్లు వారి మన్ననలనందుకున్నాను . 
ఎన్నో కవితలకు  ఉత్తమ స్థానంలో నిలిచేను.

నమస్తే దినపత్రికలో , సాక్షి పేపర్ , నవ తెలుగు తేజం మాస పత్రికలో, వాషి (ముంబై ) తెలుగు కళా సమితి వారి దిక్సూచి లో నా కవితలు, కధలు ప్రచురింపబడుతుా ఉంటాయి .

 ". ప్రతిలిపి" అనే ప్రైవేట్ బ్లాగ్ లో  రాసిన  ఎన్నో కధలు కవితలకు సన్మానం అందుకున్నాను.  
ప్రతిలిపిలో నేను రాసిన రచనలు..
కధలు కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.

కీర్తనలు,  లలిత గీతాలు , భక్తి గీతాలు , సప్త తాళ కీర్తనలు , తెలుగులోనికి తర్జుమా చేసి రాసి స్వరపరచిన 30 పాశురాలు , వివిధ రకాలైన అనేక పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.

కధలు ,కవితలు, ఛందస్సు తో కుాడిన పద్యాలు
రాయడం చాలా ఇష్టం.
లలిత-సంగీత గేయాలను,  కీర్తనలను , వర్ణాలను రాయడం, స్వరపరచడం ,పాడడం చేస్తుా
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా  ఆనందిస్తుా ఉంటాను.

అన్ లైన్ కవితా పోటీల లో  చాలా ప్రక్రియల లో ఇప్పటికీ  పాల్గొంటుా ఎన్నో ఛందోబద్ధ  పద్యనియమాలను ,  వారచ్చిన అంశాలతో ఎందరో చరిత్రకారుల చరితలను , తెలుసుకోగలిగేను.
గురుకుల పంరంపరగా  కొనసాగుతున్న ఈ సంస్థలను నడుపుతున్న  నిర్వాహకులకు కార్యవర్గ బృందానికి నేనెంతో ఋణపడి ఉన్నాను .వారందరికీ నా నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 
..
ఈ సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.


వాటి వివరాలు..

******************************************

బిరుదులు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఇప్పటి వరకు దొరికిన బిరుదు పురస్కారాలు.

 ( ఇష్టపది ప్రక్రియలో )
1. "సాహిత్య చక్రవర్తి. "అనే బిరుదును.

(మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)
2
"మహతీ సాహితీ చక్రవర్తి " బిరుదును

సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)
 "3.విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.

(సాహితీ బ్రందావన జాతీయ వేదిక)నుండి
4, 5 . " కవి కోకిల , సుధీ తిలక " బిరుదులను. 

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..సున్నితం
ప్రక్రియ  రచనలకు
6."సున్నితం" బిరుదు.ను

పరిమళాలు ప్రక్రియలో..పాటలుగా 30 పాశురాలు తెలుగులో రాసినందుకు)
7."అక్షర ఝరీ రత్న "బిరుదును.

శతాక్షరి ప్రక్రియలో కవితలు రాసినందుకుగాను
8. "పద ముత్యం" బిరుదు.ను

9."సాహితీ బృందావన విహార జాతీయ వేదిక" వారి
"సాహిత్య కళానిధి" బిరుదు.

10. (శతాధిక మధురిమలు పుార్తి చేసి 
. "మధుర కవి భుాషణ" బిరుదు ను

11.( కృపాణాలు ప్రక్రియలో)
అద్వైత పురస్కార ము ను

చిలక పలుకులు ప్రక్రియ లో)
"స్వర మయుారి." పురస్కారము

(చిమ్నీలు ప్రక్రియలో)
12.."వెలుగు దివ్వె". పురస్కారాన్ని.

తెలుగు తేనియలు సాహితీ వేదికలో ).
13 .శత తేనియ పురస్కారము  .

(సాహితీ బృందావన జాతీయ వేదిక నుండి )
14" రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."ను

.(సుారేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రష్ట్ నుండి).
 " సమాజ సార్థక్ అవార్డ్ "ను

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి
"కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం...2021.

. సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యుాట్యుాబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో...
"భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."

కలామ్ ఇనిస్టిట్యూట్  ఆఫ్ యుాత్ ఎక్స్ లెన్స్ 
అవార్డు .

 "కాళోజీ సాహితీ శాంతి పురస్కారం. "
 రవీంద్రనాథ్ టాగుార్  సేవా  పురస్కారం.
 ఇలా ఎన్నో బిరుదులు, పురస్కారాలు ,అవార్డ్ లు
 లభించేయి.
           

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
**************************చివరగా ...
నాలో సాహిత్యాకాంక్షను కలిగించి,  గౌరవించిన  గురువర్యులందరికీ సాదర నమస్కారాలతో ..🙏🙏

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.


Saturday, April 22, 2023

చింటుా తెచ్చిన మార్పు.

22/04/2023.
చింటుా కధలు.
తపస్వీ మనోహరం మహిళా పత్రిక కొరకు ,
అంశం : బాల సాహిత్యం.
విభాగం  : కధ
శీర్షిక  : " చింటుా  తెచ్చిన మార్పు."
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

చింటుా  మంచం మీద అటుా ఇటుా దొర్లుతున్నాడు.
వాళ్ళమ్మ వాణ్ణి కసురుకుంటుా " ఎందుకంతలా కదులుతున్నావు చింటుా.. పనికిరాని ఆటలన్నీ ఆడడానికి 
రోజంతా పరుగులు పెడతావు .రాత్రయ్యే సరికి  ఇలా నాకు నిద్దర లేకుండా చేస్తావు.
అర్ధ రాత్రి కుాడా నిద్రకి నోచుకో లేదు. వెధవది తెల్లారితే చాలు . బండలా చాకిరీ చెయ్యాలి . ..ఛీ...వెధవ బ్రతుకు "
అంటుా అటు తిరిగి పడుక్కుంది.
చింటుాకి అమ్మ మీద కోపం వచ్చింది.
అమ్మ ఈ రోజు కుాడా నానమ్మ మీద అరిచింది .పాపం , నానమ్మ మాట్లాడకుండా కళ్ళల్లో  కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంటుా తన రుామ్ లోకి వెళ్ళి పోయింది.
ఐనా సరే అమ్మ అప్పటి నుండి ఇప్పటి వరకు అలా సణుగుతుానే ఉంది. "
" అసలు అమ్మకి నానమ్మ మీద ఎందుకంత కోపం.
అమ్మ,  నాన్న ఇంట్లో ఉన్నపుడు ,నానమ్మతో బాగానే ఉంటుంది.
నాన్న ఆఫీసు పని మీద ఎప్పుడూ" టుార్లు" తిరుగుతుానే ఉంటారు. ఆసమయంలో అమ్మ నానమ్మని ఎంత సాధిస్తుందో."

నానమ్మ  తన చిన్నపుడు ఎంత బాగా ఉండేదని . తనను ఎంత గారం చేసేదో ..తనకు నీళ్ళు పోయడం , స్కుాలుకి దిగపెట్టడం , అన్నం తినిపించడం , కాక ఇంట్లో వంటంతా చేసేది . రాత్రి తనను తన  దగ్గరే పడుక్కోబెట్టుకొని 
ఎన్ని కధలు చెప్పేదో.. తనకోసం ఎన్ని తినుబండారాలు చేసేదో .తను నానమ్మని వదిలి ఎప్పుడుా ఉండేవాడేకాదు. అలాంటి నానమ్మ 
తాతయ్య  దేముడిదగ్గరకు వెళిపోయాకా , చాలా కుంగిపోయింది. తాతయ్య ఒక ప్రైవేటు కంపెనీలో 
పని చేసేవారు.  దానవల్ల డబ్బుకు చాలా ఇబ్బంది పడేవారని 
నాన్న ను కష్టపడి చదివించేరని . నానమ్మ అప్పుడప్పుడు 
చెపుతుా ఉండేది. ఇప్పుడు తాతయ్య పొివడంతో నానమ్మ 
ఒంటరిదైపోయింది. తాతయ్యకు పెన్షన్ లేదు..
దాంతో నానమ్మకు ఏదైనా అవసరం వచ్చి అడిగితే అమ్మ 
కొనిచ్చేది కాదు. సరికదా "డబ్బులు చెట్లకు కాస్తున్నాయా."..అంటుా దెప్పి పొడిచేది.
దాంతో నానమ్మ విరిగున కళ్ళజోడు , తెగిన చెప్పులు , తిరగని ఫేను , వంటి చాలా సమస్యలతో  ఎంతో బాధ పడుతుా ఉండేది . నాన్న తో అమ్మ ఏం చెప్పేదో ఏమొా , 
అప్పుడప్పుడు నాన్న కుాడా నానమ్మ మీద విసుక్కునేవాడు.

దాంతో   నానమ్మ  ఏడుస్తుానే ఉండేది . అన్నం సరిగ్గా తినేది కాదు . 
ఐనా వంటింటి పనంతా మౌనంగా చేసుకుపోయేది .
ఒక రోజు నానమ్మకి జ్వరం వచ్చింది . లేవలేక పడుక్కుంది .
దాంతో అమ్మకి వంటింటి పని మీద పడింది.

 నాన్న డాక్టర్ని ఇంటికి తెచ్చేరు .
 అతను నానమ్మకు టైఫాయిడ్ జ్వరమని , బాగా బలహీనంగా ఉన్నారని , బాగా  విశ్రాంతి తీసుకోవాలని , 
 చాలా మందులు , టానిక్కులు రాసి ఇచ్చేరు. 
 నాన్న ఆదరా బాదరా అన్నీ కొనుక్కు వచ్చి అమ్మకు అప్పగించేరు.
 కానీ అమ్మ సరిగ్గా మందులిచ్చేది కాదు .
 నాన్న , తనమీదకన్నా , నానమ్మ మీద ఎక్కువ ప్రేమ చుాపిస్తున్నారనుకొన్న అమ్మకు , నాన్నమ్మ మీద కోపం పెరిగిపోయింది.
 నీర్సం వల్ల నానమ్మ  సమంగా నడవలేకపోయేది 
 అమ్మ నానమ్మను బాత్రుామ్ దాకా తీసుకెళ్లకడానికి కుాడా చాలా విసుక్కునేది.
 నానమ్మకు టైఫాయిడ్ జ్వరం వచ్చి జుట్టంతా ఊడిపోయింది.  ఆరు నెలల్లోనే నానమ్మ చాలా ముసలిదానిలా ఐపోయింది. 
 అమ్మకు ఇంటి పని కష్టం అనిపించడమే కాక ,
 నానమ్మకు పెట్టే కాసింత తిండి భారమనిపించేది . ఇదివరకులా ఆమెకు కిటీ పార్టీలకు వెళ్ళడం,  సినిమాలకు వెళ్ళడం , ఇరుగు పొరుగులతో బాతాకానీలు కొట్టడానికి , ఫోను చుాడ డానికి సమయం దొరకడంలేదు . 
 అదిగో అప్పటి నుండీ మొదలైంది అమ్మ సాధింపు.
నాన్న ఇలా టుార్ కి వెళ్ళగానే మొదలెడుతుంది..
"అలా కుార్చోపోతే,  కుారలు తరగొచ్చు కదా...
అలా కుార్చొని తింటే లావైపోతారు. కాస్త కాళ్ళుా చేతులుా కుాడా కదుపుతుా ఉండాలి" అంటుా పనులు పురమాయించేది.

"ఇదిగో కాస్త  అలా కుార్చొనే  బదులు ,ఈ పప్పులు వేయించి పెట్టండి, గేస్ పొయ్య కింద పెడతాను.
రేపు పండగ కదా మీరు రవ్వలాడు అలా కుాచొనే  చేసేయండి ..కాస్త ఈ పులిహోర కలిపి పెట్టండి."..
అంటుా నానమ్మ చెయ్యలేని పనులెన్నో చెపుతుంది.
పాపం , నానమ్మ వంగిపోయిన నడుముతో ,  వణుకుతున్న
 చేతులతో  అమ్మ చెప్పిన పనులన్నీ మౌనంగా చేస్తోంది.
 ఈ నాన్నొకరు..
 తను వచ్చినపుడైనా నాన్నమ్మ అవసరాలు కనుక్కోవడంగానీ , కాస్త మాట్లాడడంగానీ చెయ్యరు.
 అన్నీ అమ్మనే అడిగి , ఓహో ! అలాగా .!..సరే !
 అంటుా తలుాపేస్తారు.
 నానమ్మ తనను,  తన దగ్గరే పడుక్కోబెట్టు కోవాలనుకుంది.
 తనకు కుాడా నానమ్మ చెపుతున్న కధలు వింటుా పడుక్కోవడం చాలా ఇష్టం. 
 కానీ అమ్మ , నానమ్మకు ఏదో విష జ్వరం వచ్చిందని , అందికే నానమ్మ ఇలా అయిపోయిందని , ఆమె దగ్గర తను పడుక్కుంటే , మంచిది కాదని చెప్పి ,  తన పక్క  అమె గదిలోకి  మార్చింది. 
 పక్కని పడుక్కోవడానికి పనికిరాని నానమ్మ , ఇంటి పనులన్నిటికీ పనుకొస్తున్నాది.
 రాను రాను , నానమ్మ రుాము వేరయ్యింది. కంచం, మంచం,
  గ్లాసులు వేరయ్యాయి. తమతోకలిసి తినే నానమ్మ,  ఇపుడు  వంటరిగా తన రుాములో...
  తింటున్నాదో లేదో... తెలీని పరిస్థితి.  తన కంచం కుాడా తనే కడుక్కుంటోందీ మధ్య..
  
" కానీ అమ్మకు తెలీదు ..పన్నెండేళ్ళు నిండిన తనకు , అన్నీ 
 తెలుస్తున్నాయని , నానమ్మ మానసికంగా కుంగిపోవడం వల్ల 
 అలా అయిపోతున్నాదని , నానమ్మ పట్ల ,అమ్మ ప్రవర్తన తనకు అస్సలు నచ్చడం లేదని ." 
 కానీ తను అమ్మకు ఎలా చెప్పగలడు...?. అమె తప్పు చేస్తున్నాదని.
 పోనీ ..నాన్నకు చెపితే...
అమ్మ మాటంటే నాన్నకు చాలా నమ్మకం . అమ్మ అప్పటికప్పుడు ఏదో కధ అల్లి చెప్పేస్తుంది. నాన్న,అది నమ్మేస్తాడు.  నాన్న ఇంటికి వచ్చినపుడు మాత్రం , అమ్మ నానమ్మతో  చాలా బాగా ఉంటుంది .
అందు వల్ల నా మాట నమ్మక ,  నన్నే కొడితే...
ఒక వేళ తన మాట నమ్మినా ...
నాన్న మనశ్శాంతిగా ఉద్యోగం చేయగలరా...?
మొన్నటికి మొన్న  రాహుల్ వాళ్ళ నానమ్మకు , రాహుల్ వాళ్ళమ్మ బాల్కనీలో  ఒక పట్టె మంచం వేసి పడుక్కోపెట్టేసింది.
పాపం పక్క కుాడా వేయలేదు. 
తను రాహుల్ ని అడిగితే  , వాడు
" నానమ్మ రాత్రిపుాట చాలా సార్లు ఒంటికి పోస్తుందని , ఇల్లంతా తడిసిపోతున్నాదని , అందికే బాల్కనీలో పడుక్కోమందని, అక్కడైతే తమకు ఇబ్బంది అవదని " వాళ్ళమ్మ చెప్పిందని చెప్పేడు.
మరి రాహుల్ రోజుా రాత్రి పక్క తడిపేస్తాడట . వాడే చెప్పేడు. దానికోసం వాడు ఆ జబ్బు తగ్గడానికి  మందులు కుాడా వాడుతున్నాడట.
మరి వాడు మంచి పరుపున్న మంచం  మీదే పడుక్కుంటున్నాడే...వాడి రుాము  సుభ్రం చేయడానికి , వాడి బట్టలు ఉతకడానికి వాళ్ళమ్మ ఒక మనిషిని ఏర్పాటు చేసారు కదా ...మరి వాళ్ళ నానమ్మనెందుకు బాల్కనీ లోకి 
పంపేసారు...? 
ఆలోచిస్తున్న చింటుా ...ఆరాత్రంతా నిద్రపోలేదు.
తెల్లరుతుాంటే ఒక ఆలోచన వచ్చింది.
వెంటనే చింటుా...చిన్నగా నవ్వుకుంటుా హాయిగా నిద్రపోయాడు.

***********************
చుంటుా వాళ్ళమ్మ చింటుాని  స్కుాల్ లి టైమవుతోందని తిందరగా తెమలమని , రెండు సార్లు వచ్చి లేపింది.
చింటుా బద్దకంకా అటు తిరిగేడు గానీ లేవలేదు .
చింటుా  వాళ్ళకి చాలా కోపం వచ్చింది.
చింటుాని కుదుపుతుా స్కుాల్ బేగ్ సద్దుకోవాలి చింటుా ..
 లేపసాగింది.
 చింటుా  విసుక్కుంటుా "ఏంటమ్మా ! రాత్రంతా పడుక్కొనే లేదు . నిద్రపోదామంటే లేపుతావు . ఆమాత్రం స్కుాల్ బేగు నువ్వు సద్దీయొచ్చ కదా."..అంటుా అరిచేడు .
 చింటుా వాళ్ళమ్మ గతుక్కుమంది.
 " ఇదేంటీ చింటుా ఇలా అరుస్తున్నాడు " 
 అనుకుంది.
 చింటుా లేచి విసురుగా తయారై , అల్పాహారమన్నా తినకుండా స్కుాల్ కి వెళ్ళిపోయేడు.
 చింటుా వాళ్ళమ్మకి చాలా బాధ వేసింది.
 అన్యమనస్కంగానే  అన్ని పనులుా చేసుకుంది . నాలుగు రోజులు గడచినా చింటుా ప్రవర్తనలో  మార్పు రాకపోయేసరికి చింటుా వాళ్ళమ్మకి , చింటుా గురించిన బెంగతో జ్వరం వచ్చింది.  ఇంటి పనులు చేయలేకపోతున్నాది.  చింటుా మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఇది వరకైతే తన పనులన్నీ తనే చేసుకునే వాడు .ఇప్పుడు తన చేతే చేయించుకుంటున్నాడు.
" చింటుా ఎందుకిలా మారిపోయాడో "...
అన్యమనస్కంగా ఆలోచిస్తుా...ఏం పని చెయ్యాలో అన్నది కుాడా మర్చపోతున్నాది చింటుా వాళ్ళమ్మ.
అమ్మ పరిస్థితి చుాస్తున్న చింటుాకి చాలా బాధ వేస్తున్నాది .
కానీ మరికొన్ని రోజులు తప్పదు
అనుకుంటుా  అమ్మని కష్టపెడుతున్నందుకు మనసులోనే దేముడికి క్షమాపణలు చెప్పుకున్నాడు.

చింటుా గురించిన బెంగతో చింటుా వాళ్ళమ్మ దృష్టి , 
నానమ్మపై  మరి కొంచం తగ్గింది. టైముకి ఏవీ అందక 
ముసలామె ప్రాణం తల్లడిల్లుతున్నాది.
----

ఈ మధ్య కొత్తగా చింటుా వాళ్ళ నాన్న వచ్చినపుడల్లా 
"పోకెట్ మనీ " అడుగుతున్నాడు.
ఇచ్చిన డబ్బులు ఏంచేస్తున్నాడో తెలీడం లేదు.
నాన్న వెళ్లిపోయాక చింటుా ,  అమ్మ పోపుల డబ్బాలో దాచిన డబ్బులు అడక్కుండానే పట్టుకెళుతున్నాడు.
అది చుాసిన చింటుా వాళ్ళమ్మకు  భయం వేయసాగింది.
"కొంపదీసి  చింటుాగానీ పక్కదార్లు పడుతున్నాడా ..."
అనుకుని , సమయం చుాసుకొని చింటుాని నిలదీయాలనుకొంది. 

అరోజు వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నారు.
రాత్రయ్యంది .చింటుా కి ఆకలేస్తోందనగానే వాళ్ళమ్మ అందరికీ భోజనం వడ్డించింది .ఈ రోజు చింటుాని తండ్రి ముందరే నిలదీయ్యాలని నిశ్ఛయించుకొంది. 
చింటుా భోజనం చేస్తుా.. "అమ్మా ఓ మాటడగనా "
అనగానే చింటుా వాళ్ళమ్మ చాలా సంబర పడిపోయింది. ఈ మధ్య చింటుా తనతో సమంగా మాట్లాడి , ఎన్ని రోజులయ్యిందో " అనుకుంటుా,
 "అడుగు నాన్నా" అంది. 
"అమ్మా , నానమ్మ భోజనం చేసిందా.." 
అని అడగ గానే చింటుా వాళ్ళమ్మ ముఖం చిట్లించింది. 
"ఆఁ.... పెడతాలే..".అంది విసురుగా.
చింటుా వాళ్ళ నాన్న వేపు చుాసాడు. అతను తనకేం పట్టనట్టు హాయిగా భోజనం చేస్తున్నాడు.
చింటుాకి చాలా కోపం వచ్చింది. 
"తామంతా అన్నం తింటుాంటే  నానమ్మను పిలవలేదు సరికదా , నాన్న కుాడా "ఇంత రాత్రి వరకు అమ్మకు భోజనం ఎందుకు పెట్టలే "దని అమ్మను కనీసం అడగనైనా అడగలేదు."  ఛీ" అనుకున్నాడు.
చింటుా సమయం చుాసేడు . రాత్రి తొమ్మది గంటలు దాటిపోయింది.  
"  పాపం నానమ్మకు ఎంత ఆకలేస్తొిందో.."
.నానమ్మను తలుచుకున్న చింటుా కళ్లల్లో 
నీళ్ళుారాయి.
అవి బయటకు కనపడనీకుండా అడిగేడు 
" అమ్మా ! నాకు పెళ్ళెప్పుడు చేస్తావు..? "
ఆమాట వినగానే చింటుా వాళ్ళమ్మ,  నాన్న , ఇద్దరుా గతుక్కుమన్నారు. ..
"ఇంతవేగం నీకు పెళ్ళి  ఎందుకు  చేస్తాము చింటుా...
ఐనా ఈ ప్రశ్నేంటీ...ఇంకా నీ చదువే పుార్తి కాలేదు.ఐనా
ఈ మధ్య నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు " అంటుా 
చింటుా వాళ్ళమ్మ ఏదో అనబోయింది .
వెంటనే చింటుా..".నాకిప్పుడే పెళ్ళి కావాలనలేదమ్మా .
పెళ్ళి నాటికి నేను చాలా పనులు పుార్తి చెయ్యాలి . అందుకే అడిగేను"  అన్నాడు.
చింటుా వాళ్ళమ్మ ఆశ్ఛర్యంగా అడిగింది.
"నవ్వేం పనులు పుార్తి చెయ్యాలి చింటుా..నీ చదువు సంగతేంటీ..."
వెంటనే  చింటుా..
"అమ్మా నా పెళ్ళై...నాకు . పిల్లలు పుడితే , నువ్వు 
"నానమ్మవి "అవుతావు కదా ... నువ్విప్పుడే  ముసిలిదానివైపోయేవు.జ్వరం వస్తున్నాదంటున్నావు .అన్నీ మర్చిపోతున్నావు. 
రాత్రిళ్ళు నిద్రపోకుండా తిరుగుతున్నావు...?
మరి నాకు పెళ్ళయ్యాకా నా పెళ్ళానికి , ఇవన్నీ నచ్చకపోవచ్చు. మరి నాన్న కుాడా రిటైర్  ఐపోతారు. పనీ- పాటా లేకుండా, ఇద్దరుా తిని కుార్చుంటే , మీ ఇద్దరినీ  నా పెళ్ళాం, చుాసుకోగలదో లేదో ..తనుా మనిషేకదా...

"మరి' నేనైతే ఆఫీస్ కి వెళ్ళాలి ..తప్పదు. కదా ! "
అప్పుడు ఈ  ఇల్లు కుాడా చాలదు కదా...!
అందికే నేను  పెళ్ళికి ముందుగానే ఒకవరండా ఉన్న ఇల్లు కొనాలి.
 మరు , వరండాలో వేయడానికి ఒక నులక మంచం కొనాలి . ఎందుకంటే ..ప్రతీ రోజుా పక్కలు వేయవలసిన అవసరం ఉండదు కదా .
 మీ కోసం వేరుగా కంచం , గ్లాసులు కొనాలి . మీకు కళ్ళు కనబడక కళ్ళజోడు కావాలంటారు. 
 నడవలేక మంచి జోళ్ళు కావాలంటారు .నా పెళ్ళాం కొనదు.
 నాకు చెప్పదు .
 బట్టలు కంపు కుడుతున్నా చాకలికి వెయ్యదు.
 పక్క బట్టలు మాసిపోయినా మార్చదు.  నాకు చెప్పదు,  తను చెయ్యదు. చాకలికి వెయ్యదు. 
 ఎందుకంటే  అప్పుడు మాకు డబ్బులు చాలవుకదా...
 అంతే కాదు...
మీకేదో జబ్బు ఉన్నాదని చెప్పి ,  నా పిల్లల్ని  మీ దగ్గరకు రానివ్వదు.
మరి మీ రిద్దరుా ఏడుస్తుా కుాచుంటారు .
ఐనా పట్టించుకోదు. సమయానికి భోజనం పెట్టదు. 
మన నానమ్మని నువ్వలాగే చుాస్తున్నావు కదా..! 

రాహుల్ వాళ్ళ ఇంట్లో ఐతే ,వాళ్ళ నానమ్మని 
 వరండాలోనే  పడుక్కోబెట్టేరు.  ఎందుకంటే
  వాళ్ళ తాతగారు పోయేరు కదా . 
  ఆ తర్వాత నానమ్మలని ఇలాగే చుాడాలట. 
  అవిడకి డబ్బు లేదట . పెన్షన్ రాదట.
  మరి నాన్నకి  కుాడా , రిటైర్  అయ్యేక  పెన్షన్ రాదుకదా .
 ఒక వేళ నాన్న  లేకపోతే...నీ పరిస్థితేంటీ...?
 నీ మాటలు నాన్న విని, నానమ్మని పట్టించుకోనట్టే...
 రేపు పెళ్ళయ్యాకా నేను కుాడా , నా పెళ్ళాం మాటే వింటే....మీ పరిస్థితేంటీ.? 
 అందికే నేను ముందు జాగర్త పడాలని , ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను.
అందకే నాన్నని పోకెట్ మనీ అడుగుతున్నాను. ఎందుకంటే..
నేను మిమ్మల్ని , నానమ్మను,  మీరు చుాసినట్టు చుాడలేను కదా..." 
అంటుా కంచం దగ్గరనుండి విసురుగా లేచిపోయాడు.
చింటుా వాళ్ళ అమ్మ , నాన్న ,  ఇద్దరుా స్థాణువుల్లా ఉండిపోయేరు.
చింటుాకి తెలుసు..."అమ్మ ,తను నానమ్మ విషయంలో చేస్తున్న పని గురించి తలచుకొని  సిగ్గు పడుతుందని...
నాన్నకు తెలుస్తుంది "తన తల్లి గురించిన శ్రద్ధ తను కుాడా తీసుకొోవాలనీ , అన్ని విషయాల్లో  భార్య మాటలు నమ్మ కుాడదనీ..."
----------
రెండు రోజులు గడిచాయి 
చింటుా అనుకున్న మార్పు,  తల్లిదండ్రులిద్దరిలో
కనిపిస్తొింది.. 
ఆ రోజు, చింటుా లేచేటప్పటికి , 
 అమ్మ , నానమ్మ గది లో మంచం నీటుగా సర్ది ఉంది .
 అమ్మ, నానమ్మ  గదంతా సుభ్రంగా తడి  బట్టతో  తుడుస్తున్నాది.
 హాలులో నాన్న,  నానమ్మ పక్కనే  కుార్చొని పేపరు  చదువుకుంటున్నాడు . 
 నానమ్మ ఉతికి ఇస్త్రీ చేసిన చీర కట్టుకొనుంది.
 నుదుట విబుాది బొట్టుతో నట్టింట వెలసిన యొాగినిలా ఉంది  నానమ్మ . 
 ఎదురుగా టి.వి.లో నానమ్మ కిష్టమైన రామాయణ  ప్రవచనం వస్తున్నాది . నానమ్మ చుాస్తున్నాది ఆనందంగా,.
 "కళ్ళకు కొత్త కళ్ళజోడు" పెట్టుకొని..
 
-----------------------------------

హామీ :
" చింటుా తెచ్చిన మార్పు" అన్న ఈ కధ 
ఏ మాధ్యమునందునుా , ప్రచురితము కాని,
 నా స్వీయ రచన.
 

  


 






 
 

Thursday, April 20, 2023

సీత



శీర్షిక : సార జీవిత చరిత .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .
 
ప్రక్రియ : ఇష్టపది.



భుామి లోదొ రకినది భుామి పుత్రిక సీతఁ
జనకునికి పుత్రికగ జగమేలినది మాత
ఆట పాటిల మేటి అందాల విరికొమ్మ  
శివ ధనుసు నెత్తినది  సిత్రముగ  సీతమ్మ ॥

శ్రీ రాము వలచినది సిరి మల్లె సీతమ్మ.
సిరు లొలుకు మాయమ్మ  సిగ్గు సింగారమ్మ
స్వయంవరము లోన స్వప్న సుందరునిగని
తన వలపు తెలిపినది తరుణి చుాపుల తోడ॥

శివునాజ్ఞతో నతడు  శివ ధనుసు విరిచొచ్చె .
గుర‌ువులాశీస్సులతొ గుణవతిని చేబట్టె .
తల్లి కోరిక దీర్చ  తాను వనముల కేగ.
వెంటతా జంటగా వెడలె సీతాలక్ష్మి ॥

మాయా మారీచుని మాయ తెలియని దాయె
మగని కోరిన కోర్కె  మాతకిక్కట్లాయె
గీత దాటిన సీత  మాత కన్నీరొలికె
రామచంద్రుని బాసి రమణి శోకము మీరె ॥

మాయతో నమ్మించి మాత సీతను బట్టి 
లంక చెరలో బెట్టె లంకేశు రావణుడు.
హనుమ రాముని బంటు ఆర్తి తీర్చెదనంటు
ఆసంద్రమును దాటి అసురి లంకను గుాల్చె ॥ 

ఆ శోక వనమేగి అమ్మ సీతను జుాచి 
రామ గురుతును జుాపి రమణి శోకము బాపె.
 లంక తోకతొ గాల్చి లంకేశు దండించి
సీత జాడను దెలుప చిత్రకుాటము కెగసె ॥
రామ దండదె గుాడి రావణుని దెగ గుాల్చె 
రమణి సీతను గుాడి రాముడదె పురి జేరె
సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడే తండ్రి.--
అనెడు విధముగ నతడు నాయొాధ్య పాలించె ॥

రామాయణ కధలు రంజింపు సుధ లవే
పసిపిల్లలకు జెప్పు పరమ పావన నిధులు
అందరిని బ్రోచేటి  అతడు నారాయణుడు
ఇల ఈశ్వరీ నుతుడు ఇనవంశ కులజుండు.॥


సిసింద్రీలు.

20/04/2023.
సిసింద్రీ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఓ లక్ష్యం .

జీవితంలో పైకి ఎదగాలన్న ఆశయ సాధనకు సాక్ష్యం .
 జీవన సాఫల్యతకు మార్గదర్శకమైనది ఓ లక్ష్యం..

హామీ :
పై సిసింద్రీ నాస్వీయ రచన.



21/04/2023.
సిసింద్రీ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఓ కిరణం :
 చీకటిలో కలలుగన్న ఆశల అందాల పుావుల హారం.
 చిరు దీపమై ఆశయసాధనకు దారి చుాపుతున్న  
 వెలుగుల దారం.
 .
హామీ :
పై సిసింద్రీ నాస్వీయ రచన.

Monday, April 17, 2023

మనోహరి పత్రిక మీదనా అభిప్రాయం.

15/04/2023.
మనోహరి పత్రిక మీద
నా అభిప్రాయం.
రచయిత్రి :
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

నా అభిప్రాయం :

నేను రచయిత్రిగా అప్పుడప్పుడే  చిన్న గుర్తింపు వస్తున్న రోజులవి .
నేను నా సాటి స్నేహితులతో కలిసినప్పుడు ,
అందులో చాలా మంది , తాము" పాడిన  పాటలు" యుా ట్యుాబ్ "  లో అప్లోడ్ చేశామనో , తాము రాసిన ఫలానా  "వ్యాసం ", ఫలానా పుస్తకంలో  వేశారనో , తాము రాసిన "ఆర్టికల్ " ఫలానా పేపర్ లో వచ్చిందనో  గొప్పగా చెపుతుా ఉంటే ,నేను  కుాడా వారిలా చెప్పుకునే రోజు ఎప్పుడు  వస్తుందో అని ఎదురు చుాసేదాన్ని.
చాలా ప్రక్రియలు అద్భుతమైన నియమాలతో అలరిస్తుా...
కవిగా ఎదుగుదామనుకున్న ఎందరికో స్ఫుార్తినిచ్చే రీతిలో
  కవుల కలాలకు పదును పెడుతుానే  ఉన్నాయి.
కానీ అన్నింటికి  నిర్దిష్ట సమయం నిర్ణయింపబడి ,
పగలు  ఏడు గంటలనుండి రాత్రి తొమ్మిది లోపల రాసిన ప్రక్రియను పంపాలన్న నియమం ఉండడం వల్ల చాలా ప్రక్రియలు రాయలేక ,వదలలేక సమయం చాలక చాలా  బాధగా ఉండేది .
అటువంటి సమయంలోనే "మనోహరి మహిళా పత్రిక" మా ముందుకు వచ్చింది.
కేవలం "మహిళలకు మాత్రమే  "అవకాశం కల్పిస్తుా ...
అనేక రకాల అంశాలతో ప్రోత్సహిస్తుా...రెండు ముాడు రోజుల వ్యవధినిస్తుా కవయిత్రుల పాలిటి కొంగుబంగారమయ్యింది.
కధలు , కవితలు , వ్యాసాలు, ఆర్టికల్స్ , పాటలు , ప్రేమ లేఖలు, చందమామ కధలు , జోక్స్ , వంటా వార్పులు , వంటింటి చిట్కాలు , పాటకు పల్లవి ప్రాణం వంటి ఎన్నో అద్భుతమైన అంశాలతో మా ముందుకు వచ్చింది.
అంతేకాదండోయ్ ...
వారం వారం రాసే రచనలలో ఉత్తమమైన అంశాలకు
ప్రథమ ,ద్వితీయ, తృతీయ, స్థానాలతో పాటు , తగిన
పారితోషికాన్ని కుాడా  అందజేస్తుా ఆనందింపజేస్తోంది.
ఎందరో కవయిత్రులకు  తమ తమ ఇంటిపనులను పుార్తి చేసుకొని , తమకు నచ్చిన అంశాలను చక్కగా రాసుకొనే
అవకాశం కల్పించడమే కాక , వారు రాసిన  అంశాలను .
"మహిళా మనోహరి పత్రికలోను " తపస్వీ మనోహరం
వారి "వెబ్ సైట్ల" లోనుా  ప్రచురిస్తుా, మహిళలకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుా అలరిస్తోంది.
మేము రాసే ప్రతీ  రచనను చదివి , ఎంపిక  చేసి
ప్రచురణకు సిద్ధం చేసే కార్యక్రమంలో, "మనోహరి" 
వారి సహ బృందం వారు చేసే కృషి అభినందనీయం .
ఇంత మంచి పత్రికను మాముందుంచి మమ్ము ప్రోత్సహిస్తున్న" మనోహరి మహిళా పత్రిక " కార్యవర్గ సభ్యులకు నా హృదయ పుార్వక ధన్యవాదాలు.
చదువరులంతా మా రచనలు చదివి మమ్ము ప్రోత్సహిస్తుా
"మనోహరి మహిళా" పత్రికను ముందుకు నడిపిస్తారని ఆశిస్తుా,ధన్యవాదాలతో....🙏






మనోహరి మహిళా మాస పత్రిక వివరాలు

ఇది శ్రీ కార్తిక్ నిమ్మగడ్డ గారు స్థాపించిన తపస్వి మనోహరం సంస్థలో మూడవ పత్రిక.. మనోహరి మహిళా మాస పత్రికలో రచనల కొరకు క్రియేట్ చేసినది.

ఇక్కడ సోమవారం నుండి శనివారం వరకు వివిధ టాస్క్ లు ఇచ్చి రచనలు సేకరిస్తాము. 

వచ్చిన రచనల్లో అన్ని ఒకే పత్రికలో వేయలేము కనుక.. కొన్ని మనోహరి పత్రిక కొరకు.. మరి కొన్ని తపస్వి మనోహరం వార మాస పత్రికల కొరకు తీసుకుంటాము. అలాగే మరికొన్ని రచనలు తపస్వి మనోహరం వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాము. (లింక్ గా ఇచ్చినవి వెబ్సైట్ లో పోస్ట్ చేయగానే అవి గ్రూప్ లో పెడతాము.) ఇక పత్రిక కొరకు సెలక్ట్ చేసినవి ఒక నెల లోగా పత్రికలలో వేస్తాము.

Thursday, April 13, 2023

Mail ID.

నా మెయిల్  ID of Airtel  mobile phone
India@990.

Wednesday, April 12, 2023

సభ్యులందరికీ విజ్ఞప్తి*

**సమూహంలోని సభ్యులందరికీ విజ్ఞప్తి*
 
గ్రూప్ సభ్యులెవరూ మోడీ, సోనియా, రాహుల్, కేజ్రీవాల్ లేదా ఏ రాజకీయ నాయకుడు లేదా రాజకీయ పార్టీ ఫోటో ఫార్వార్డ్ చేయకూడదు. పూణే, ముంబై, చెన్నై & ఢిల్లీలో 260 మందికి పైగా గ్రూప్ అడ్మిన్లు జైలుకు పంపబడ్డారు. పోలీసులు వాట్సాప్ చూస్తున్నారు. శ్రద్ద పెట్టవలసిందిగా ఒక తక్షణ విజ్ఞప్తి....! సైబర్ క్రైమ్ అన్ని గ్రూప్ ఫోల్డర్‌లను చూడటం ప్రారంభించిందని అందరికీ సమాచారం అందుతోంది. మీరు రూపొందించిన సమూహాన్ని తొలగించండి లేదా గ్రూప్ సభ్యులను హెచ్చరిస్తారు. మత, రాజకీయ, సామాజిక వ్యవస్థ లేదా చెడు చిత్రాలు లేదా వీడియోలను అపహాస్యం చేసే ఎలాంటి సందేశాలను పోస్ట్ చేయవద్దు.
వ్యక్తిగత వివరాలు, వ్యక్తిగత, జాతీయత, మతం, శాఖ, రాడికల్, ఆచారాలు మరియు భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన ఎలాంటి హానికరమైన సందేశాన్ని పంపవద్దు. ఇది చట్ట ప్రకారం నేరం. ముంబైలోని సైబర్ క్రైమ్ వీడియో మరియు ఫోటోను షేర్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లోని 36 మంది సభ్యులను అరెస్టు చేసింది. అందుచేత గ్రూప్ మెంబర్స్ అందరూ ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేసారు. ఇది నాన్ బెయిలబుల్ నేరం, దీనికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సమాచారం ప్రజల ప్రయోజనాల కోసం. తప్పకుండా చదవండి. ఒక ముఖ్యమైన సమాచారం: ప్రజలు వాట్సాప్‌లో హిందువులు మరియు ముస్లింలపై వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారు. మతం మరియు మత సమూహాలపై తప్పుడు వ్యాఖ్యలు చేసే వ్యక్తిని ట్రాక్ చేయడానికి మరియు CPC యొక్క సెక్షన్ 44-58 కింద చర్య తీసుకోవడానికి ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తారు మరియు అతని IP చిరునామాలను ట్రేస్ చేయడం ద్వారా అతని ఇంటిని గుర్తించడం ద్వారా మరియు ఎటువంటి వారంటీ లేకుండా అరెస్టు చేయబడతారు. అలాంటి సందేశాలు గ్రూప్‌లో ఉంటే గ్రూప్ అడ్మిన్‌లకు సెక్షన్ 59 వర్తింపజేయబడుతుంది. కాబట్టి మీరు గ్రూప్ అడ్మిన్ అయితే అటువంటి వ్యక్తిని మొదటి సందర్భంలో గ్రూప్ నుండి తొలగించండి, తద్వారా మీరు ఇబ్బందులను నివారించవచ్చు. దయచేసి ఈ సందేశాన్ని అన్ని సమూహాలకు, స్నేహితులు మరియు బంధువులకు ఫార్వార్డ్ చేయండి, తద్వారా వారు అప్రమత్తంగా మరియు తమను తాము రక్షించుకుంటారు.

Tuesday, April 11, 2023

కొత్త అలంకారము : యమకాలంకారం

[11/04, 10:04 am] +91 77998 86016: అందరికీ అభివందనం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

                ఇక నేడు ఓ చక్కని అలంకారంలో మన కావ్యాలను విరచిద్ధాం  .

నేటి అలంకారం :- *యమకాలంకారం*

మీ
*ప్రదన్య బృందం*
[11/04, 10:05 am] +91 77998 86016: యమకాలంకారం:- 

                 అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అంటారు.


ఉదాహరణ :-:
నే లేనని రాలేనని చెప్పినా వినక 
ఆ రాజీవము జీవము తీసుకునే...

[11/04, 7:25 pm] +91 98482 38453: అంశం..యమకాలంకారం

1
ఓ *ప్రియా* ! *ప్రియ* మారగ
నిను పిలవాలని ఉన్నది...

2
నీ తీయని *తలపు* లే
నా యెద *తలపు* వలపుల్లో
చేరి గమ్మత్తుగా చిత్తుచేస్తూ
మత్తులో తేలిస్తున్నది.

3

*రోజా* వంటి నీ ముఖారవిందాన్ని రోజూ
చూడాలని ఉంది *రోజా*!

4
*నవ* నీతం వంటి నీ మనసులో *నవ* రాగం పలికించాలని కోరికగా ఉంది...!!

డా.మరుదాడు అహల్యా దేవి
హైదరాబాద్
11/4/2023
[11/04, 7:38 pm] +91 90637 22788: ప్రదన్య సాహితీ వేదిక
అంశం:యమకాలంకారము
కట్ల.ప్రతిభారాణి
***********************
కానల నిలిచి కానరావేల
లోకాన శోకాననైనా దేవా!

సిరి కసిరి నిన్నొదలి కొండలనొకొండగ జేసెనా దేవా!

మల్లెలు కొప్పునకొప్పుచున్నవి గదా!

గీతా గీతాన్ని ఆలపించవా!

ఒక విషయం చర్చిలో చర్చించారు.

ఇది భోజరాజు భోజనం కదా!

వాడి వాడికత్తి వాడి కూరగాయలు వాడినవకటా!

ఇది నా స్వీయరచన.
[11/04, 8:17 pm] +91 81475 95455: ప్రదన్య సాహితి వేదిక
అంశము ..యమకాలంకారం
శీర్షిక.. సముద్రం
8147595455
శారద బెంగళూరు
11..4...2023
నీలాల సముద్రంలో నీలాకాశం
అందంగా కనిపిస్తుంది
కడలి లో ఎగిరి ఎగిరి పడే
రంగు రంగుల చేపలే ఒక అందం
అలలు అలలు గా కదిలే సముద్రం చూడటానికే ఒక
అందం
శారద బెంగళూరు 8147595455
[11/04, 8:59 pm] +91 83319 30635: ప్రధన్య సాహితీ వేదిక (M) 
తేదీ: 11/4/2023
అంశం: యమకాలంకారము


1. *లలిత* కళల్లో *లలిత* ఆరితేరిన వనిత  

2. *అమ్మ* కు చెప్పికానీ నా కారు *అమ్మ* ను

3. *కాలు* తడవకుండా *కాలు* వను దాటు

4. *కోడి* తో చేసిన ప *కోడి* చాలా బాగుంది

5. సూట్ *కేసు* తీశానని నాపై *కేసు* పెట్టారు

6. *పాట* పాడుటలో నీ *పాట* వం చూపించు

7. ఆ *గోరు* వంక నా *గోరు* పై వాలింది

8. *శుభ* *శుభ* కార్యానికి వెళ్ళింది

9. *జీవిత* *జీవిత* ములో అబద్ధం చెప్పలేదు 

10. *గోరు* తో *గోరు* చిక్కుడును నేర్పుగా ఒలవాలి

ఎస్. రత్నలక్ష్మి 
అసిస్టెంట్ ఇంజనీర్ 
జలవనరుల శాఖ 
నంద్యాల 

పైవన్నీ  నా స్వీయ విరచితములు

Saturday, April 8, 2023

నా సంపాదన నా యిష్టం...కధ

మనోహరి పత్రిక కొరకు,
విభాగం : వ్యాసం.( కధ)
అంశం: నా సంపాదన నా ఇష్టం.
శీర్షిక : నీలిమ.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .



నీలిమకి ఆరోజు  చెప్పలేనంత ఆనందంగా ఉంది .
తను ఎన్నో రోజులుగా ఎదురుచుాస్తున్న రోజు రానే వచ్చింది. 
తనకు బేంక్ లో మేనేజర్ గా జాబ్ వచ్చింది .
ఎప్పటినుండో ఎదురు చుాస్తున్న ఆనంద ఘడియలివి.

అనందంతో తిరిగిన కన్నీటి తడిలో నీలిమకు  తన బాల్య సంఘటనలన్నీ  ఒకొక్కటిగా కళ్ళముందు తిెరగసాగాయి.
 ---------------------------------------------
తల్లిదండ్రులు  తనను చిన్నప్పటి నుండి చాలా ముద్దుగా పెంచాలనుకున్నారు. కారణం తను వాళ్ళకి ఒక్కర్తే 
సంతానం కావడం. 

తండ్రి ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసీవారు. మంచి జీతం . తమ ముగ్గురికి ఆజీతం చాలా ఎక్కువ .
ఎంతో జాలీగా ఉందామనుకుంటున్న సమయంలో 
అనికోకుండా నానమ్మకు "  కేన్సర్  " రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆవిడ ఎనిమిదేళ్ళు ట్రీట్మెంట్ లో ఉండి , మరో రెండేళ్ళు మంచం పట్టి తీసుకు తీసుకు చనిపోయారు. 
నాన్నగారి జీతమంతా  టెష్ట్ లు, మందులు,  కిమొా థెరఫీలు , మంచంపట్టిన నానమ్మకు సేవలు చేసేందుకు 
పెట్టిన మనుషులకు జీతం ఇవ్వడం వంటి ఖర్చులతో 
డబ్బు చాలక  చాలా ఇబ్బందులు పడవలసి వచ్చేది .

దాంతో తన స్కుాల్  లో గానీ కాలేజిలో గానీ 
స్నేహితులతో పిక్నిక్ లు , పార్టీల వంటివి ఎంజాయ్ చేయలేకపోయింది. 
నాన్నని  దేనికి డబ్బులడిగినా ఏదో ఒక కారణం చెప్పేవారు.
తనకు కోపం ఉడుకుమొాత్తనం వచ్చి ఏడుపు వచ్చేది.
అప్పుడే తను నిశ్ఛయించుకుంది.
తను బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలని.
తనకొచ్చిన జీతం తన యిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలని..
అప్పుడు  తనను ఎవ్వరుా ఏమీ అనలేరు. ...చెప్పలేరు.
ఎందుకంటే " తన జీతం , తన ఇష్టం " ..అంతే...
తన మనసులో నాటుకున్న అదే నిశ్ఛయంతో తను చాలా బాగా చదివింది.
ఫలితం. బేంక్  మేనేజర్ రుాపంలో కాసులు కురిపించబోతోంది...
అదే నీలిమ సంతోషానికి కారణం...
--------------------------

తను ఎమ్ కామ్ : ఎమ్ .బి .యే.  పుార్తి చేసిన తర్వాత నుండే ఇంట్లో అందరుా తనకు పెళ్ళి సంబంధాలు చుాడడం మొదలెట్టేరు. 
తను మాత్రం ఖచ్చితంగా చెప్పింది .తను కనీసం రెండు సంవత్సరాలవరకు  జాబ్ చేసి గాని పెళ్ళి చేసుకోనని ,
తన సంపాదన తన యిష్టం వచ్చినట్టు  ఖర్చు చేసుకొనే 
అధికారం తనకు అప్పుడే వస్తుందని , లైఫ్ ఎంజాయ్
చేసే అవకాశం కోసం తను ఎన్నాళ్ళ బట్టో ఎదురు చుాస్తున్నాదని తెగేసి చెప్పేసింది. 

తర్వాత నీలిమ ఉద్యోగంలో ఆనందంగా చేరింది.
తనకు జాబ్ వచ్చిందని , సేలరీ రాగానే అందరం కలిసి 
ఎక్కడికైనా టుార్ వెళదామని తన తల్లిదండ్రులతో చెప్పింది.
పది రోజులు గడిచేయి ..
తండ్రికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చి  బతికినంత పనైంది.
దాంతో తండ్రి తనను  తను బ్రతికుండగా పెళ్ళి చేసుకోమని , 
మళ్ళీ సడన్ గా గుండెపోటు వస్తే  , తన ముచ్చట చుాడకుండానే ప్రాణాలు పోతాయేమొానని 
ఎమొాషనల్ గా మాట్లాడడంతో సరేనంది.
అంతే ! మొదటి జీతం అందుకుంది. రెండవ జీతం అందకుండానే తనకు వివాహమైపోవడం జరిగిపోయింది..
పెళ్ళికి ముందే వాళ్ళు , ఉద్యోగస్తురాలైన పిల్లే కావాలని చెప్పేరని విని అవాక్కైపోయింది.

పెళ్ళి తర్వాత నుంచి తన జీవితం పుార్తిగా మారిపోయింది. 
అన్నట్టుగానే   నాన్న తన పెళ్ళి చుాసి స్వర్గస్తులయ్యేరు. 
అమ్మ బాధ్యత తనమీద పడింది.
అత్తగారింట  వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు.
  తల్లి బాధ్యతలు తనే నిర్వర్తిస్తున్నా పల్లెత్తు మాట
  అనేవారు కాదు. భర్తకు వచ్చిన జీతం ఇంట్లో ఖర్చులకు  చాలేది కాదు. నలుగురు ఆడబిడ్డల బాధ్యత , వాళ్ళ పెళ్ళిళ్ళు తమకు చాలా బరువనిపించేవి.
ఇంటి ఖర్చులు పోను , ఎంత  దాచినా అది తక్కువే అనిపించేది .దాంతో తన జీతం ఇంట్లో వాడక తప్పేది కాదు.
.ఇద్దరి జీతాలు బొటాబొటిగా సరిపోయేవి.

తనకు ఏది కావలసి వచ్చినా చాలా ఆలోచించవలసి వచ్చేది
 తను చాలా సార్లు "నా జీతం నా యిష్టం " అనుకుంటుా 
 ఖర్చు చేయాలనుకొనేది .
 కనీ బాధ్యతల బరువుకు తల వంచీసేది. 
నీలిమకు  తల నెరిసింది. ఆడ బిడ్డలకు పెళ్ళిళ్ళయ్యాయి .
అదనంగా మరిద్దరు పిల్లల బాధ్యత మీద పడింది.
పేర్లు సంధ్య , పల్లవి. 
ఆడబిడ్డల పురుళ్ళు  పుణ్యాలకు పోను , పిల్లల్ని 
చదివించడం వాళ్ళ అవసరాలు తీర్చడంతో బొటాబొటీగా
గడిపే స్థితికి అలవాటు పడిపోయింది నీలిమ .
ఆమెకు తండ్రి  మరీ మరీ జ్ఞాపకం వస్తున్నాడు.
తెలిసీ తెలీని వయసులో తను తండ్రిమీద ఎంతో కోపం తెచ్చుకునేది కదుా...
తను ఏమడిగినా  "అలాగే  తల్లీ ...కానీ ఇప్పుడు కాదు ...కొన్ని రోజులు పోయాక " ..అంటుాంటే ఎంత కోపం వచ్చేదో...
కనీ ఇప్పుడు తన పిల్లలతో తను అదే మాట చెపుతున్నాది.
ఒకప్పుడు "నా డబ్బులు నా యిష్టం " అన్న తను
అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే ..పుార్తి జీతం
ఇంటికోసం ఖర్ఛు చేస్తున్నాది. 
ఇప్పుడు నాన్నెంత బాధ పడేవారో  తనకు అర్ధమవుతోంది.

రేపు సంధ్య పుట్టిన రోజు కనీసం" కేకు" తెప్పిద్దామన్నా 
ఆలోచించవలసి వస్తోంది అనుకుంటుా నిట్టుార్చింది.

ఇంతలో సంధ్య పరుగెత్తుకుంటుా వచ్చి తన చేతిలో నున్న 
పది రుాపాయలు చుాపించింది...
నీలిమ ఎక్కడివమ్మా..అని ఆడగ గానే సంధ్య ఆనందంగా..
" అమ్మా ! ఆ రాణీ వాళ్ళు లేరుా..
ఆ ఆంటీ ఏదో ఉద్యాపన చేసుకుంటున్నారట
నన్ను పిలిచి  "బాల పుాజ "చేస్తామని చెప్పి...
నాకు ఈ బట్టలు, పుాలు ,పళ్ళు, ఇచ్చి తాంబుాలంలో దక్షిణ
అంటుా ఈ పది రుాపాయలు ఇచ్చేరు...అంది గుక్క తిప్పుకోకుండా.....
నీలిమ అంతా విని,  సరే ఆ డబ్బులు ఇలాతే..నేను దాచుతాను అనడిగింది . పిల్ల ఆడుతుా పారేసుకుంటుందేమొానని...
వెంటనే సంధ్య "అబ్బా ! నేనివ్వను ఇవి "నాడబ్బులు నాయిష్టం"
 అంటుా పిడికెలు  ముాసింది.
 ఆ మాట విన్న నీలిమ  నవ్వుకుంది.

ఒకప్పుడు తను కుాడా ఇలాగే అనుకునేది. అదీ 


 -----------------------------------
 
 హామీ :
 ఈ కధ ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన. 

 
 


Tuesday, April 4, 2023

ఉగాది నవలల పోటీ

ఉగాది నవలల పోటీ – 2023

6 లక్షల రూపాయలు విలువచేసే బహుమతులు

ఆన్వీక్షికి ప్రచురణలు – చదువు ఈబుక్ యాప్ సంయుక్త నిర్వహణ

తెలుగు సాహితీ ప్రపంచంలో ఆన్వీక్షికి ప్రచురణలు, చదువు యాప్ ద్వారా మేము చేస్తున్న కృషి సాహితీ ఆభిమానులందరికీ తెలిసిందే. నాలుగేళ్లలో వందకి పైగా పుస్తకాలను ప్రచురించి, యాభైకి పైగా యువ రచయితలను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన ప్రచురణ సంస్థఆన్వీక్షికి. క్రమంగా కనుమరుగైపోతున్న తెలుగు పాఠకుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారకి సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనూ మొదలైన యాప్ – చదువు. ఇప్పటికే పదిహేను వేల మంది సాహిత్యాభిమానులు చదువు యాప్ వినియోగిస్తున్నారు. తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా మరుగునపడిపోతున్న నవల అనే ప్రక్రియకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో చదువు-అన్వీక్షికి సంయుక్తంగా ఉగాది నవలల పోటీ నిర్వహిస్తున్నాం. లిటరరీ ఫిక్షన్, జాన్రా ఫిక్షన్, యంగ్ అడల్ట్ ఫిక్షన్ అనే మూడు విభాగాల్లో ఈ నవలల పోటీ జరుగుతుంది. 

లిటరరీ ఫిక్షన్ : కథ, కథనం కంటే పాత్రలు,వారి అలోచనల ప్రధానంగా సాగే నవలలను లిటరరీ ఫిక్షన్ అనవొచ్చు. తెలుగులో ’చివరికి మిగిలేది’, ’అసమర్థుని జీవయాత్ర’ లాంటి నవలలను లిటరరీ ఫిక్షన్ గా పిలవొచ్చు. వీటినీ కొంతమంది సీరియస్ సాహిత్యం అని కూడా అంటుంటారు. 

జాన్రా ఫిక్షన్ : Genre అంటే ఒక కోవకు చెందిన సాహిత్యం అని అర్థం. క్రైమ్ ఫిక్షన్. హారర్ ఫిక్షన్, రొమాంటిక్ ఫిక్షన్, ఫ్యాంటసీ – ఇలా ఎన్నో genres సాహిత్యంలో ఉన్నాయి, తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది లాంటి వాళ్ళు ఇటువంటి రచనలు చేసి పాఠకుల అభిమానాన్ని చూరగొన్నారు.

యంగ్ అడల్ట్ ఫిక్షన్ : టీనేజ్‌లో ఉన్న యువతను ఆకట్టుకునే నవలలను యంగ్ అడల్ట్ ఫిక్షన్ అంటారు. హ్యారీ పాటర్ నవలలు, ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ లాంటి నవలలు ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి నవలలకు విపరీతమైన ఆదరణ ఉంది.

బహుమతులు: 
1) ఈ మూడు విభాగాల్లో వచ్చిన మూడు ఉత్తమ నవలలకు, ఒక్కో నవలకు 100000 రూపాయల చొప్పున మొత్తం మూడు లక్షల రూపాయల బహుమతులు. 
2) ప్రతి విభాగంలో రెండవ బహుమతికి అర్హమైన నవలకు 50000 రూపాయల చొప్పున మొత్తం లక్షన్నర రూపాయల బహుమతులు. 
3) ఒక్కో విభాగంలో ఎంపిక చేయబడిన మూడు నవలలకు, ఒక్కో నవలకు 10000 రూపాయల చొప్పున మొత్తం 90000 రూపాయల బహుమతులు. 
4) జ్యూరీచే ఎంపిక చేయబడిన కొన్ని ప్రత్యేక నవలలకు 60000 రూపాయల వరకూ ప్రోత్సాహక బహుమతులు.

నియమ నిబంధనలు
1) ప్రపంచంలో ఎక్కడున్న వారైనా, ఏ వయసు వారైనా ఈ నవలల పోటీలో పాల్గొనవచ్చు. 

2) ఈ నవల తమ స్వంతమని, ఏ ఇతర నవలలకు అనుసరణ కానీ, అనువాదం కానీ కాదని, హామీ పత్రం విడిగా జతచేయాలి. 

3) రచయితలు తమ నవలలు తెలుగు యూనికోడ్ లో, అచ్చు తప్పులు లేకుండా టైప్ చేసి పంపించాలి. ఈ నియమం పాటించని నవలలను పరిశీలించబడవు. 

4) మీ నవల వర్డ్ డాక్యుమెంట్‌లో, A4 సైజ్ పేపర్లో, మండలి ఫాంట్, సైజ్ 14 లో 100 పేజీలకు మించి, 200 పేజీల లోపు ఉండాలి. 

5) మీ నవలలు ugadinovels@chaduvu.app కి మెయిల్ చేయాలి.

6) నవలకు సంబంధించిన వర్డ్ డాక్యుమెంట్‌లో ఎక్కడా రచయిత పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ లాంటి విషయాలు ప్రస్తావించకూడదు.

7) మీరు పంపుతున్న మెయిల్‌లోనే మీ పూర్తి పేరు, ఫోన్ నెం, మీరు ఏ విభాగంలో మీ నవలను సబ్మిట్ చేస్తున్నారనే విషయాలను స్పష్టంగా తెలియచేయాలి.

8) బహుమతికి ఎంపికైన నవలలు చదువు యాప్‌లో ఈబుక్ & ఆడియో బుక్స్‌గా ప్రచురించే హక్కులు చదువు యాప్ నిర్వాహకులకు ఉంటాయి. అలాగే మొదటి రెండు ముద్రణలు ప్రింట్‌లో ప్రచురించే హక్కులు ఆన్వీక్షికి ప్రచురణ సంస్థ కలిగిఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

1) నవలలు మాకు చేరవలసిన ఆఖరి తేదీ – సెప్టెంబర్ 22, 2023

2) పోటీ ఫలితాల ప్రకటన – డిశెంబర్, 22, 2023

3) బహుమతుల ప్రధానోత్సవం – ఉగాది 2024

అందరికీ ఉగాది శుభాకాంక్షలు

Sunday, April 2, 2023

మనోహరి మరియు మనోహరం పత్రికల కొరకు సెలెక్ట్ చేసిన రచనలు:*



#selected గృహశోభ 19-03 

19-03-2023 తపస్వి మనోహరం వారి మనోహరి పత్రిక కొరకు *గృహశోభ/ హౌస్ డెకరేషన్ ఐడియాలు* అనే అంశంపై వచ్చిన రచనలన్నీ పత్రికల కొరకు సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. వీలు వెంబడి పత్రికలలో ప్రచురణ చేయటం జరుగుతుంది.

1. సామాన్య గృహిణి - సుజాత కోకిల
2. అందమైన అనుభవం - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి 
3. గృహ శోభ - ప్రియంవద పుతుంబాక.
4. గృహ అలంకరణ - కె.కె.తాయారు
5. గృహశోభ/డెకరేషన్ ఐడియాలు - టి. వి. యెల్. గాయత్రి.

[02/04, 10:56 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: *20-2-23 నుండి 25-2-23 వరకు మహిళా దినోత్సవం పురస్కరించుకొని వచ్చిన ప్రత్యేక రచనలలో.. మనోహరి మరియు మనోహరం పత్రికల కొరకు సెలెక్ట్ చేసిన రచనలు:*

*కథలు*
తారుమారు- టి. వి. యెల్. గాయత్రి (post కార్డు కథ)

*కవితలు*

సకలకళల ప్రవీణ - మక్కువ. అరుణకుమారి 
మాణిక్యాన్ని నేను - DNR.సంతోషి
మేమింతే - మారమంతే- శ్రీమతి మంజీత కుమార్
మగువ(కందపద్యాలు) - పి.వి.వి.యన్.రాజ కుమారి
*వ్యాసాలు:*
ఆర్టికల్ - పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి

*Ebook:*
మహిళా నీవో స్ఫూర్తిదీపం - జూపూడి సుధారాణి
ఆదిపరాశక్తి రూపం - కృష్ణ మోహిని ధార్వాడ 
అంతర్మథనం - వసంత ఇంజపురి
ఆమె అవనిలో అద్భుతం - కళావతి కందగట్ల 
ఆడవాళ్ళకి జోహార్లు - అరుణ డేనియల్  ధరిత్రి - వరలక్ష్మి యనమండ్ర 
క్షమయా ధరిత్రి - వింజరపు.శిరీష 
త్యాగానికి వారధులు - కొంటికర్ల లలిత

*కథలు:*
నారీలోకం - వడలి లక్ష్మీనాథ్ మనోహరం 
అలా.. ఊహాపురంలో - విజయాచలం

ష్..ఇది ఆడవారి ప్రపంచం -  మోపిదేవి గౌతమి 
మధులత - సాహు సంధ్య 
మగువలు మగ మహారాజుల గుండెల్లో మహరాణులు- శ్రీ విజయ దుర్గ. ఎల్  
కల నిజమైతే - నాగ నివేదిత. పి
మహిళలూ జిందాబాద్ - అద్దంకి లక్ష్మి
ఆనందభాష్పాలు - సుశీల రమేష్.

కవితలు:
సవ్యసాచి సబల - చంద్రకళ.దీకొండ  
అ నుండి అః వరకు భర్తతో ఆమె ప్రయాణం -  ప్రియంవద పుతుంబాక
మహిళా ఇది తెలుసుకో - మహాలక్ష్మి రావిరేల (కొప్పరపు)
చిరునవ్వుల ముసుగు వెనుక - జ్యోత్స్న సుబ్బా
ఆడాళ్ళూ మీకు జోహార్లు - ఇరువంటి (సోమరాజు) మాధురీ దేవి

వ్యాసాలు:
ఆడదే ఆదర్శం - చట్టి లక్ష్మి
ప్రతి పాలనలో రుద్రమదేవి కనిపిస్తుంది - ప్రక్షిత ప్రవి 
స్త్రీలే సర్వస్వం - కె. కె. తాయారు

*గమనిక:* పత్రికలో ప్రచురణకు సెలెక్ట్ కాని రచనలన్నీ వెబ్సైటులో అప్లోడ్ చేసి links ఇవ్వబడతాయి.
[02/04, 10:58 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: #selected బాలసాహిత్యం 20&21/03

*20-03-2023 నుండి 21-03-2023 వరకు మనోహరి మహిళా పత్రిక కోసం బాలసాహిత్యం (కథ/కవిత) అనే అంశంపై  సెలెక్ట్ చేసిన రచనల లిస్ట్*

1. మంచి మాట వినరారే ముద్దుల సిరి ముాటలు - పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
2. చిన్ని రాముడు - వింజరపు.శిరీష 
3. సంబరమొచ్చినాది - శ్రీసుధ కొలచన 
4. కవిత - DNR. సంతోషి
5. మా ఇంటి సిరి (బాలగేయం ) - టి. వి. యెల్. గాయత్రి
6. బాల సాహిత్యం - ఇరువంటి (సోమరాజు) మాధురీ దేవి
7. ఔదార్యం - కె.కె.తాయారు
8. చిలిపితనం - చట్టి లక్ష్మి
9. అఆ ఇఈ నేర్చేద్దాము - మక్కువ. అరుణకుమారి 
10. బాల గేయం - జూపూడి సుధారాణి

*వెబ్సైటులో లింక్స్ గా ఇచ్చేవి:*
అందమైన రోజా పువ్వులు - అరుణ డేనియల్
రేపటి మహిళా లోకం- సుజాత కోకిల
మా అన్న అల్లరి - అద్దంకి లక్ష్మి
కన్నీటి చుక్కలు - కె.రాధికనరేన్
బంగారు భారతం - కృష్ణ మోహిని ధార్వాడ
క్రమశిక్షణ - కొంటికర్ల లలిత
అచ్చమ్మ - వరలక్ష్మి యనమండ్ర
తెల్లని మల్లెల మనసులు - చంద్రకళ.దీకొండ
మహోజ్వల చరితకు సారధులం - కొత్త ప్రియాంక (భానుప్రియ)
[02/04, 11:01 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: #selected దర్శనీయ స్థలాలు (15-17/03)

*15-03-2023 నుండి 17-03-2023 వరకు "దర్శనీయ స్థలాలు" అనే అంశంపై వచ్చిన రచనలలో అన్ని రచనలు పత్రికల కోసం సెలెక్ట్ చేయటం జరిగింది..* వీలువెంబడి రచనలు మనోహరి మరియు మనోహరం వార, మాస పత్రికలలో ప్రచురించబడతాయి.

1. ఆనంద భాష్పాలు రాల్చే ఆంజనేయుడు - మంజీత కుమార్
2. బాల త్రిపుర సుందరి - మహాలక్ష్మి రావిరేల (కొప్పరపు)
3. అమ్మపల్లి దేవాలయం - సావిత్రి కోవూరు
4. శ్రీ కోదండరామస్వామి ఆలయం(ఒంటిమిట్ట) -  రామలక్ష్మి సుంకరణం
5. మైసుారు (శ్రీరంగపట్టణం) - పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
6. హార్స్లీ హిల్స్ - కె.కె.తాయారు
7. ధర్మపురి గుడి - సుజాతకోకిల  
8. సింగరకొండ - వరలక్ష్మి యనమండ్ర     
9.  ‌మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి, పానకాల స్వామి ఆలయాలు - ప్రియంవద పుతుంబాక.
10. నీలావడి అగ్నిగంగమ్మ - నాగ నివేదిత. P
11. శ్రీ చక్రాలయం - అద్దంకి లక్ష్మీ
12. అలంపురం జోగులాంబ దేవాలయం (ఐదవ శక్తి పీఠం) - జూపూడి సుధారాణి
13. కామాఖ్య శక్తి పీఠం - శ్రీ విజయ దుర్గ. ఎల్.

Saturday, April 1, 2023

పంచాక్షరీ పంచపదులు ...నియమాలు.

22/03/2023.
పంచాక్షరి పంచపది.
అంశం : నవ యుగాది.
శీర్షిక : సంకల్పసిద్ధి.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


సంకల్పముల
ఆరు ఋచుల
ఐశ్వర్యముల
సమానతల 
సమ్మేళనము ఈశ్వరీ ॥


*ఈ లంకెతో సమూహంలో చేరి,అక్కడే పోస్ట్ చేయండి*

*పంచాక్షరి పంచపది నియమాలు*

*పాదానికి 5 అక్షరాలు,5 పాదాలు.*
*1 నుండి 4 పాదాలు అంత్య ప్రాసలు.*
*5వ పాదం కవినామంతో ముగించాలి.*