Sunday, May 25, 2025

శీర్షిక :- బంధాను బంధాలు.

16/05/2025.

మహతీ సాహితీ కవి సంగమం

అంశం , ఐచ్ఛికం 

శీర్షిక  :- బంధాను బంధాలు.

రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర. (43).

కవిత సంఖ్య = 1.



ఒక్కరు తోడుంటే ,

ఒంటరివైన వేదన దూరమౌతుంది

మనసు పడే బాధను , 

మనసునన్న స్నేహం మరిపిస్తుంది

ప్రేమను పంచే హృదయముంటే, 

బంధం ఎంతో మధురమోతుంది !!


నమ్మకమనే పునాది ఉంటే, 

అనుబంధం శాశ్వతమౌతుంది.

కష్టంలో చేయూత నిచ్చే బంధం 

బంధుత్వాన్ని బలపరుస్తుంది !!


సంతోషం పాలు పంచుకోవాలంటే , 

స్నేహితులు తోడవ్వాలి.

అపార్థాల మేఘాలు కమ్మిన చోట

" క్షమ" అనే వెలుగు నింపాలి.


తెగిన బంధం తిరిగి కలవాలంటే, 

వీడని ప్రయత్నం చేయాలి .

గుండెకు గుండె తోడై నిలిస్తే, 

జీవితమే  స్వర్గమౌతుంది !!


మాటలు లేని మూగ  సంభాషణ, 

ప్రేమ బంధాలకు  మౌన సంకేతమవుతుంది

కాలం గడిచే కొద్దీ బంధాలు బలపడాలంటే 

ప్రేమానురాగాలు నిండే హృదయముండాలి !!


మానవత్వం మంట కలిసిపోకుండా ఉండాలంటే

మాటల్లో మంచితనం , చేతల్లో చేరువతనం ఉండాలి.

మానవ బంధాలెంతో గొప్పగా ఎదగాలంటే, 

మనిషికి మనిషి మీద నమ్మకం ఉండాలి.!!


మనుషిలా బతుకుతూనే మనీషి గా ఎదగాలి.

ఎదగాలంటే  ఒదగాలి.

ఒదిగి ఉండాలంటే  మానవ సంబంధాలకు 

నిజమైన అర్థం తెలుసుకోవాలి !!


-----------------------------

ఈ కవిత నా స్వీయ రచన.




No comments:

Post a Comment