Sunday, May 25, 2025

శీర్షిక : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

శీర్షిక  : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. ( 38).


--------------------


అక్షరాల వేదికపై, ఆలోచనల స్ఫూర్తితో,

సత్య దీపాలు వెలిగించేవాడే కవి.

లోకానికి అద్దం పట్టే, నిజాలను

 నిర్భయంగా చాటి చెప్పేవాడే కవి.!!


కాగిత రణరంగంపై, కలాన్ని ఖడ్గంగా మార్చి,

అన్యాయంపై పోరాడే  అక్షర వీరుడే కవి.

కష్టాల కడలిలో, కన్నీటి అలలపై,

ఆశల తీరం చూపే నావికుడు కవి.!!


భయమన్నది లేక, పక్షపాతమన్నది ఎరుగక,

పలుకుబడికి తలొగ్గని ప్రవక్తే కవి.

మానవత్వం మంటగలిసినప్పుడు,

మనసున్న మనిషిలా మేల్కొనేవాడే కవి.!!


అంధకారం ఆవరించిన వేళ,

వెలుగు కిరణం చూపించే ధైర్యమే కవి.

నిజాన్ని నిగ్గదీసి, నిర్భయంగా నిలదీసి,

నిత్య సత్యాన్ని నిలబెట్టేవాడే కవి.!!


అక్షరాల ఆయుధాన్ని  ఝళిపిస్తూ

విభేధాలను సృష్టించే వారిని ప్రశ్నిస్తూ

మానవత్వానికి  మన్నననిస్తూ

మనుగడని ప్రశ్నించేవాడే కవి. !!.


నోళ్ళు మూగబోయిన చోట,

వారధిగా నిలిచే వాగ్ధాటి కవి.

అణగారిన గొంతులకి స్వరమై,

 పోరాడే అక్షర నినాదమే కవి.!!


భయం తెలియని

 భావనా సాగరం కవిత్వం,

పలుకుబడికి తలవంచని 

ప్రళయ ఘోష కవిత్వం.!!


నివురు గప్పిన నిజాలకు ,

అతని కవిత్వం ఒక కరదీపిక,

అది సమాజానికి  అవ్వాలి

దారి చూపే సరికొత్త మార్గదర్శిక.!!

-----------------------




Wednesday, May 21, 2025

శీర్షిక : ముల్లోక సంచారుడు.

19/05/2025.

(సోమవారం)

మహతీ సాహితీ కవి సంగమం

అంశం :  (చిత్ర కవిత. 105.)

వచన కవిత .

శీర్షిక : ముల్లోక సంచారుడు.


రచన , శ్రీమతి , పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి . 

కళ్యాణ్ :  మహారాష్ట్ర.



ముల్లోక సంచారి ముని నారదుండు,

మదిని నిరంతర నారాయణ ధ్యానముండు.

లోక కళ్యాణమే అతని నిత్య జీవితము,

అందరిలో వెలుగు నింపు దివ్య తేజము.!!


ముల్లోకముల దారి ముని దివ్య తేజము,

పరికించ లోకముల పయనించు నిత్యము.

కలహ ప్రియుడంచు లోకులు వచియించిన

అంతరంగమున లోక  విలువలవనంతము !!


కయ్యాలు రేపేట్టు కనిపించు క్షణములో,

లోతైన అర్థమే   దాగియుండు నందులో

ఘర్షణలు  ఎన్నైన  శాంతి నిడు భువిలో

లోక కల్యాణమే,  లక్ష్య మాతని మదిలో.!!


అపార్థపు నీడలు కమ్మేటి మనసులకు,

కొత్త  ప్రణాళికల కోరు శాంతిని గూర్చు.

 మహతి మీటుచు నతడు మంచి చేసెడు వాడు

సందేహ చీకట్లు తొలగించు వాడు !!


కలహప్రియుడను పేర కలిగించు న్యాయము !!

నారదుని  చర్యలో నుండు పరమార్థము,

ముల్లోకముల మేలు కోరు మునిశ్రేష్ఠులు.

కేలుమోడ్చీ జేతు నే కోటి వందనములు


Tuesday, May 20, 2025

' పెళ్లి " గేయం.

20/05/2025.


తపస్వీ మనోహరం "e" book పత్రిక కొరకు ,

అంశం : పంచమ వేదం.

శీర్షిక : అమృత నాదం.

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర.




అనాదిగా ప్రవహించే సనాతన ధర్మం,

వేదాల దివ్యనాదం, ఋషుల తపో ఫలం.

శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాల మౌన గంభీరత,

మానవాళికి మోక్ష మార్గం చూపిన దివ్య తేజం.!!


ధర్మం, అర్థం, కామం, మోక్షం - నాలుగు తీరాల నది,

వేద నాదం ప్రతి తీరాన అమృత బిందువై ఒదిగింది.

 కాల గమనంలో మరుగున పడిన సత్యం .

పునరుద్ధరించగ వచ్చింది "పంచమ వేదం "!!


వ్యాసుని లేఖినిలో మహా భారతం పురుడు పోసుకోగా,

"భగవద్గీత సారం" విశ్వానికి వెలుగు పంచింది.

రామాయణ,భారత, భాగవతాది, పురాణాల పవిత్ర గానం,

"పంచమ వేదమై", లోకానికి నవ చైతన్యం తెచ్చింది.!!


పంచము వేదం , కేవలం శ్లోకాల సంపుటి కాదు,

ప్రతి హృదయంలో జ్వలించే జ్ఞాన దీపం.

కుల, మత, వర్గ భేదాలు లేని విశ్వ ప్రేమ స్వరూపం.

మానవత్వమే మహోన్నతమని చాటే శాంతి సందేశం.!!


భక్తి, జ్ఞానం, కర్మల - త్రివేణి సంగమం .

పురనేతిహాసాలిడు ఆత్మ సాక్షాత్కారాలకు గమ్యం.

ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని దర్శించే దివ్య దృష్టి,

పంచమ వేదం నేర్పే నిత్య జీవన సత్యం.!!


అందుకే ఈ ధర్మం సనాతనం, సజీవం,

యుగయుగాలకూ మార్గదర్శనం.

అంధకారాన్ని చీల్చే జ్ఞాన భాస్కరం,

మానవాళికి నిత్య వసంతం, "పంచమ వేదం".!!



పంచమ వేదం

20/05/2025.


తపస్వీ మనోహరం "e" book పత్రిక కొరకు ,

అంశం : పంచమ వేదం.

శీర్షిక : అమృత నాదం.

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర.




అనాదిగా ప్రవహించే సనాతన ధర్మం,

వేదాల దివ్యనాదం, ఋషుల తపో ఫలం.

శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాల మౌన గంభీరత,

మానవాళికి మోక్ష మార్గం చూపిన దివ్య తేజం.!!


ధర్మం, అర్థం, కామం, మోక్షం - నాలుగు తీరాల నది,

వేద నాదం ప్రతి తీరాన అమృత బిందువై ఒదిగింది.

 కాల గమనంలో మరుగున పడిన సత్యం .

పునరుద్ధరించగ వచ్చింది "పంచమ వేదం "!!


వ్యాసుని లేఖినిలో మహా భారతం పురుడు పోసుకోగా,

"భగవద్గీత సారం" విశ్వానికి వెలుగు పంచింది.

రామాయణ,భారత, భాగవతాది, పురాణాల పవిత్ర గానం,

"పంచమ వేదమై", లోకానికి నవ చైతన్యం తెచ్చింది.!!


పంచము వేదం , కేవలం శ్లోకాల సంపుటి కాదు,

ప్రతి హృదయంలో జ్వలించే జ్ఞాన దీపం.

కుల, మత, వర్గ భేదాలు లేని విశ్వ ప్రేమ స్వరూపం.

మానవత్వమే మహోన్నతమని చాటే శాంతి సందేశం.!!


భక్తి, జ్ఞానం, కర్మల - త్రివేణి సంగమం .

పురనేతిహాసాలిడు ఆత్మ సాక్షాత్కారాలకు గమ్యం.

ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని దర్శించే దివ్య దృష్టి,

పంచమ వేదం నేర్పే నిత్య జీవన సత్యం.!!


అందుకే ఈ ధర్మం సనాతనం, సజీవం,

యుగయుగాలకూ మార్గదర్శనం.

అంధకారాన్ని చీల్చే జ్ఞాన భాస్కరం,

మానవాళికి నిత్య వసంతం, "పంచమ వేదం".!!



Saturday, May 17, 2025

ప్రముఖ కళాకారిణి ( శాంత కుమారి) గురించి.

నేడు ప్రముఖ కళాకారిణి ( శాంత కుమారి). పాత సినిమాల హీరోయిన్... అసలు పేరు.
*వెల్లాల సుబ్బమ్మ* జయంతి 

ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి అయిన శాంతకుమారి 1936లో 'శశిరేఖాపరిణయం' సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటిం చారు. 'కృష్ణప్రేమ, మాయాలోకం, ధర్మదేవత, తల్లా?పెళ్లామా?, 'అర్ధాంగి, జయభేరి, రాముడుభీముడు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, ప్రేమనగర్‌' తదితర చిత్రాల్లోని పాత్రల పోషణ ద్వారా నటిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శాంతకుమారి అసలు పేరు : వెల్లాల సుబ్బమ్మ.
స్క్రీన్ నేమ్ : శాంతకుమారి - దర్శక-నిర్మాత పి.వి.దాసు గారు సుబ్బమ్మ కొంచెం 
పాతగా ఉందని పేరునుశాంతకుమారిగా మార్చారు.
పుట్టిన ఊరు : కడప జిల్లా ప్రొద్దుటూరు
పుట్టిన తేది : మే- 17, 1920 సంవత్సరంలో,
మరణించిన తేది : జనవరి -17 - 2006,
తండ్రీ పేరు : వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు.
భర్త పేరు : ఫి.పుల్లయ్య - సినిమా దర్శక నిర్మాత ,
పిల్లలు : రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్ర్రాసులో ఉన్న ప్రొ.పి.సాంబమూర్తి గారి వద్దకు కర్ణాటక సంగీతం మరియు వయొలిన్ నేర్చుకోవటానికి దరఖాస్తు చేయించారు. డి.కె.పట్టమాళ్ సుబ్బమ్మ యొక్క సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతంలోఉత్తీర్ణురాలయ్యిందిపదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. తరువాత గురువుగారితో కలసి దక్షిణబారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతంనేర్పించేది.

సుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పి.వి.దాసు మాయాబజార్ (1936) లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖపాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ నిరాకరించడంతో, పి.వి.దాసు మరియు అతని మేకప్ మనిషైన మంగయ్య వప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. దాసుగారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు. శాంతకుమారిగా మారిన నట-గాయక సంచలనం తరువాత సినిమా సారంగధర (1937). ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రను ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్యగారిని ఇష్టపడి పెళ్ళిచేసుకొంది. పెళ్ళిచేసుకొన్న తరువాతకూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది.శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోదగా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ "చిరు చిరు నగవులు చిందే తండ్రి" అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు. శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని. అందులో అక్కినేని నాగేశ్వరరావు విధ్యార్థిగా నటించారు. అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా చిన్న తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు. మాయలోకం సినిమాలో అక్కినేనికి ప్రక్క కథానాయికగా నటించిన శాంతకుమారి, జయభేరి సినిమాలో వదినగా నటించారు, అర్థాంగి సినిమాలోనైతే సవతి తల్లిగా నటించారు. ఎన్.టీ.ఆర్ కు కూడా తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్గాప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారిసొంతం.