Tuesday, November 24, 2020

నా నిర్ణయం.

రచన: శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక .
 నా నిర్ణయం.
-------------

నాలుగు నెలలుగా సాగుతున్న పోరు
భార్యా భర్తల అనుబంధపు తేరు
నిదుర లేని రాత్రులు పెంచిన ఆలోచనల జోరు.
అంతరాత్మ ఘర్షణలో జ్ఞాపకాల హోరు ॥

మళ్ళీ పెళ్ళంటుా బంధువులు పోరుతున్నా 
సవతి తల్లి నా బిడ్డకు వద్దంటుా, నా పెంపకానికై
అన్నీ వదులు కొని అల్లారు ముద్దుగా పెంచి
 ఒంటరి పోరాటంలో అలసి వడలిన నాన్న ॥

తనను మంచి స్కుాలులో చదివించేందుకు 
పగలు రాత్రి రెక్కలు ముక్కలు చేసుకుంటుా
మైళ్ళ కొలదీ దురం నడవ వలసి వస్తున్నా,  
తనకు మురిపెంగా కొత్త స్కుాటీ కొనిచ్చిన నాన్న॥

నా పెళ్ళితో నా భార్యకు , బరువైన నాన్న.
నాన్నా , నేనా అంటున్న సవాలుకు జవాబు
 చెప్పలేని నేను, నాన్నను వృద్ధాశ్రమంలో చేర్చమన్న ఆమె నిర్ణయానికి మౌనంగా కుంగిపోతున్న నాన్న.

రాత్రంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయం.
నాన్న తరువాతే ఆమె అన్న నిజమన్న సత్యం.
నాలోని అంతరాత్మను చంపుకోలేని  నేను
పెట్టె తీసుకొని ఆమెను బైటకు నడవమన్నాను॥
--------------------------------------------------------------





  .

నాన్న కవిత.

వారం వారం కవిత కోసం

రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
---------------------
అంశం : నాన్న. (వచన కవిత)

శీర్షిక .
అంతర్మధనం.
------------------

అమ్మ పొత్తిళ్ళ లో ఉన్న నా బుగ్గలను
సున్నితంగా తాకుతుా, కొడకు పుట్తేడన్న
సంతోషంతో మెరిసే కళ్ళతో నన్ను చుాస్తుా నాన్న.॥

ఉత్తమ కళాశాలలో నన్నుచేర్పించాలన్న తపనతో
ఎడ్మిషన్ల బారెడు లైనులో,చమటలు కక్కుతుా నాన్న॥

శక్తిని మించి పడే శ్రమ ఫలితాన్ని నా "ప్రోగ్రస్ కార్డ్"
రిపోర్టులో చుసుకొని సంత్రుప్తిగా తలుాపుతుా నాన్న ॥

సాంప్రదాయానికి విరుద్ధంగా చేసుకున్న పెళ్ళితో
కోడలు చేసే అవమానాలకు తట్టుకోలేక కన్నుముాసిన
జీవిత సహచరిని చితి మంటల్లో నైరాస్యంగా చుాస్తుా నాన్న ॥

ఆకలైనా ,అనారోగ్యమైనా, చెప్పుకోడానికెవరుాలేక
ఒంటరిపోరాటంలో జవసత్వాలుడిగిన నాన్న ॥

ముసలితనం లోతనకు చేదోడు-వాదోడుగా ఉండవలసిన కొడుకును అందుకోలేక చేతికర్రను
ఆధారంగా చేసుకొని , రాని మృత్యువును రమ్మని కోరుతుా , గమ్యమెరుగని చోటుకు తరలిపోతుా నాన్న.॥

"నాన్న "లో నేను "నాలో" నాన్న...
"కేర్" మన్న కన్నా ఏడుపుకు ఉలిక్కి పడి కళ్ళు తెరిచేను.
నాకు వచ్చినది కలా ..లేక, రాబోయే నా భవిష్యత్తుకు
నిదర్శనమా...
తెలీని భయంతో "కన్నా" ని దగ్గరగా హత్తుకున్నాను.
నాలుగు నెల లుగా కనుపించని నాన్నని తలుచుకుంటుా.....
--------------------------------------

ఎర్రన కవిపై రచన

24/11/2020.
ప్రతి రోజుా కవితా పండగే కొరకు.
అంశం : ఎర్రన రచన శైలి.
శీర్షిక .: "యుగకర్త ఎర్రన"
రచన, శ్రీమతి ,పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  మహారాష్ట్ర 
-----------------------------------
కవిత్రయంలో ముాడవ వాడైన ఎర్రన , ప్రోలయ వేమారెడ్డి  రాజు ఆస్థాన ప్రౌఢ  కవి.
నన్నయ అసంపుార్ణంగా వదలిన మహాభారతాన్ని 
పుార్తి చేసిన ఘనుడు .
ఎల్లా ప్రగడ, ఎర్రయ్య , ఎర్రన అనే పేర్లతో
పిలవబడే ఈయన " ప్రబంధ పరమేశ్వర " బిరుదాంకితుడు.
ప్రోలయ వేముని కోరికపై ఎర్రన తొలుతగా
రచించిన గ్రంధం " రామాయణము ". ఇది
వాల్మీకి రామాయణానికి ఆంధ్రీకరణం చేయబడిన
ఉద్గ్రంధ ప్రబంధముగా , ఎర్రన వంశస్థులైన
చలవాడ మల్లన గారిచే చెప్పబడినది.
వేటుారి ప్రభాకర శాస్త్రి గారిచే 
భాస్కర రామాయణం లో
కొన్ని ఘట్టాలను పద్యాలుగా అలరించిన ఎర్రన 
పద్యాలను " ఎర్రాప్రగడ రామాయణం " గా 
ప్రకటింపబడినది. ఎర్రన రచించి-
ప్రోలయ వేమునికి అంకితమిచ్చిన " హరివంశము "-
అహోబల నరసింహ స్వామికి అంకితమిచ్చిన
"నృసింహపురాణము" బహుళ ప్రాచుర్యం పొందినవి.
ఎర్రన రచనలు అధిక భాగం స్వాతంత్ర్య  రచనలు.
ఈయన రచనల లో తెలుగు నుడికారపు సొగసులు,
కుార్పులు , వర్ణనలు ఎంతో హృద్యంగా ఉండి
జనులను ఆకట్టుకున్నాయి.
నన్నయ శబ్దగతిని , తిక్కన భావగతిని మేళవించి, 
తనదైన శైలిని  తన రచనల లో సమకుార్చిన 
మహా కవి ఎర్రన.
శ్రీనాధ కవుల వంటి వారు కుాడా , ఈయన శైలిని
అలవర్చుకొని రచనలు  చేసినందున ఈయనను
కవులు  రచనాద్భుత "యుగకర్త " గా సంభోధిస్తుా ఉండేవారు.
-------------------------------------------
 

,




అంశం: స్త్రీ పోలీసైతే...శీర్షిక : స్త్రీ శక్తి .అక్షరయాన్ కొరకు

అంశం: స్త్రీ పోలీసైతే...
శీర్షిక : స్త్రీ  శక్తి.
.రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
----------------------

మారుతున్న సమాజం తో పాటు మారుతున్న మనస్తత్వాలు.మాయమౌతున్న
మన సంస్కృతి , సాంప్రదాయాలు.
మాతృ సమాన గౌరవమందవలసిన స్త్రీలు
మానభంగాలకు లోనౌతున్న దుస్థితి .
రాను రాను పెరుగుతున్న రాక్షసత్వానికి
సాముాహిక బలాత్కారాలకు ...బలౌతుా
అపస్మారకస్థితిలో,  బతికుండగానే చితి
మంటల్లో కాలుతున్న అబలల ఆత్మ ఘోషలు.॥
నెలల పసికందుల దగ్గరి నుండి
పండు ముసలి వరకు కాముకుల కోరల్లో
చిక్కి దగ్ధమౌతున్న మాన-ప్రాణాలు ॥
ఎన్ని చట్టాలు వచ్చినా , ఎంతమంది బలౌతున్నా
శిక్షాలోపాలతో , కాలయాపన తీర్పులతో..
విజృంభిస్తున్న కృుార విలయతాండవ కృత్యాలు.॥
అంతే...
పురుషాహంకారాన్ని అణచి వేయడానికి " స్త్రీ శక్తి"
"ఆది శక్తై "అడుగు ముందుకేసింది.
" మా ప్రతీ పదం, ప్రగతి రధం " అంటుా..
అకృత్యాలను అణచి వేసేందుకు" అస్త్రం " పట్టిన స్త్రీ --
"పోలీసు శక్తి" రుాపంలో పోరుకు సిద్ధమై తన
విశ్వ రుాపాన్ని చుాపించింది.
మహిళా పోలీసులు పురుష పోలీసులకు తీసి పోరన్న రీతిలో, సమాజంలో ఉన్న స్త్రీ పురుష అసమానతలను
అతఃపాతాళానికి అణచివేసి , పురుషులతో సమానమై, విధినర్వాహణలలో విజయం సాధించింది.
నిస్సహాయ స్త్రీ లకు ధైర్యాన్నిచ్చే "భరోసా" అయ్యింది.
నవ తెలంగాణలో మహిళా భద్రతలకై "షీ టీమ్స్"
స్థాపనతో  "మహిళా ఆరక్షణకు" శ్రీకారం చుట్టింది.
నగరంలో "ఈవ్ టీసింగ్" ను నియంత్రించడానికి నియమించిన ఈ “షి టీమ్స్”  లో అంతా
"మహిళా పోలీసు"లే ఉండటం గమనార్హం.
" హితైషి" పేరుతో ఉమెన్ సేఫ్టీ వింగ్స్ ను స్థాపించి
వేల మంది మహిళలకు ధైర్య- మద్దతులనిచ్చింది.
అక్షరయాన్ వ్యవస్థాపకులు " శ్రీ ఐనంపుాడి లక్ష్మి "
గారి ఆధ్వర్యంలో "అక్షర శరాలు" సంధంచి కవితోద్యమాలతో మహిళల సాధికారత , ఔన్నత్యాల
విలువను చాటి చెప్పింది.
ప్రస్తుత సమాజపు దుస్థితిని రుాపుమాపి స్త్రీ  స్వాతంత్ర్యం తో నిర్భయంగా చరించాలని కోరుతుా
నిర్భయ చట్టం నుండి దిశా చట్టం వరకు గల న్యాయ పరిశీలనలకై పోరుతుా స్త్రీ ల ప్రగతి పధానికి సోపానాలు వేస్తోంది.
తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 1162 మంది  ఎస్.ఐ లు పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు.వీరిలో 256 మంది మహిళా ఎస్.ఐలు.
పాల్గొనడం మహిళలకు గర్వకారణం .పోలీసు
శాఖలో స్త్రీ లకు 30% కేటాయిఃపుకు అర్హతను సాధించింది.
శక్తి టీమ్స్‌ ,  ప్రస్తుతం.. వివిధ పోలీసు స్టేష‌న్లకు అనుసంధానంగా ప‌నిచేస్తుా ప్రగతి పథానికి తమ పదం కలుపుతుా ముందడుగు వేస్తున్నాయి.
-----------------------------------------------------------------







Monday, November 23, 2020

నా నిర్ణయం.

23 /11/2020 .
రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక .
నా నిర్ణయం.
-------------

నాలుగు నెలలుగా సాగుతున్న పోరు
భార్యా భర్తల అనుబంధపు తేరు
నిదుర లేని రాత్రులు పెంచిన ఆలోచనల జోరు.
అంతరాత్మ ఘర్షణలో జ్ఞాపకాల హోరు ॥

మళ్ళీ పెళ్ళంటుా బంధువులు పోరుతున్నా
సవతి తల్లి నా బిడ్డకు వద్దంటుా, నా పెంపకానికై
అన్నీ వదులు కొని అల్లారు ముద్దుగా పెంచి
ఒంటరి పోరాటంలో అలసి వడలిన నాన్న ॥

తనను మంచి స్కుాలులో చదివించేందుకు
పగలు రాత్రి రెక్కలు ముక్కలు చేసుకుంటుా
మైళ్ళ కొలదీ దుారం నడవ వలసి వస్తున్నా, 
తనకు మురిపెంగా కొత్త స్కుాటీ కొనిచ్చిన నాన్న॥

నా పెళ్ళితో నా భార్యకు , బరువైన నాన్న.
నాన్నా , నేనా అంటున్న సవాలుకు ,జవాబు
చెప్పలేని నేను, నాన్నను వృద్ధాశ్రమంలో చేర్చమన్న ఆమె నిర్ణయానికి మౌనంగా కుంగిపోతున్న నాన్న.

రాత్రంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయం.
నాన్న తరువాతే ఆమె అన్న నిజమైన సత్యం.
నాలోని అంతరాత్మను చంపుకోలేని  నేను
పెట్టె తీసుకొని ఆమెను బైటకు నడవమన్నాను॥
--------------------------------------------------------------


పిల్లలను ఎంతో మమకారంతో పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు ప్రతీ చోట ,

పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తరువాత ఎదురౌతున్న సమస్య...

కష్టమైనా ఇష్టంగా తీసుకొనే మీ నిర్ణయం.

పెద్దలపాలిటి వరమౌతుంది.

పెరిగిపోతున్న   వృుద్ధాశ్రమాల  ఉధృతాన్ని తగ్గించండి...🙏🙏

  .