Wednesday, June 30, 2021

దోబుాచులాడబోకు

దోబుాచులాడబోకు ముద్దుల కన్నా
నిను చుాడకుండ ఉండలేను నమ్మర కన్నా...॥

చిలికి వెన్న , పాలు , పెరుగు నైవేద్యముగా..నీకు
కలిపి తెచ్చినాను , కల్ల కాదుర కన్నా....॥ 2 ॥

చిత్తములో నీ రుాపు చిన్మయానందమౌ...
జ్యోతిగా నిలిపితిని చుాడర కన్నా...॥
ఆ జ్యోతి వెలుగు తోటలో , భక్తి  నిండు పుాలు తెచ్చి
పుాజ సేయ వచ్చినాను చుాడర కన్నా..॥

మనసు నిండు వసంతమై, గొంతుపాడె కోయిలై
భక్తి గీతి భావ భరిత సంగీతమై...॥  నా
నోట పలుకు భావ గీతి నీదు మురళి పాట రీతి
వినిపించర వేడుకగా వరదా కన్నా...॥

నీ పదములె నా పలుకై, నా జీవము నీకొరకౌ
నిండు నుారు వసంతాల వరమిడు కన్నా..॥..నీ..
పదముల చిరు అడుగుల సడి , 
మురిపాల మువ్వల సిరి...
నా ఊపిరి లయగా నువు నిలుపర కన్నా...॥ 


దోబుాచులాడబోకు ముద్దుల కన్నా
నిను చుాడకుండ ఉండలేను నమ్మర కన్నా...॥
----------------------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల.. జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------

కవికులం యుా ట్యుాబ్ ఛానల్

[6/30, 09:19] +91 99088 30477: *కవికులం సాహిత్య వేదిక యూటూబ్ చానెల్*

https://youtube.com/channel/UCGhoME3Lv9TsAdQ8wtpUnJA
[6/30, 09:20] Dokka Seetamma: 👏👏👏
[6/30, 09:30] +91 99088 30477: మన కవికులం యూటూబ్ ఛానెల్ ఓపెన్ ఐయ్యింది. మీరు చేయవలసింది ఒక్కటే... మీ కవితను స్పష్టంగా చదువుతూ వీడియో తీసి నా 9908830477 కు వాట్సప్ చేయండి మీ వీడియోలను మన కవికులం యూటూబ్ ఛానెల్  లో పెట్టడం జరుగుతుంది. అలా మీరు మీ వీడియో ఎంతో మంది వీక్షకులకు చేరువవుతుంది. ఏమో ఎవరి కవిత ఎలా వైరల్ అవుతుందో....? ఇంకెందుకు ఆలస్యం.

Monday, June 28, 2021

ఈరోజు జీకే ప్రశ్నలు

ఫిబ్ర, 2021సాహితీ బృందావనం జాతీయ వేదిక  
**********"******"********
తేదీ;28/6/2021 సోమవారం జీకే పోటీ ప్రశ్నలు
 సునీత మేడం గారు యొక్క సౌజన్యం లో 
ఈరోజు జీకే ప్రశ్నలు


1 ప్రశ్న: వచన కవితా పితామహుడు ఎవరు?

జవాబు; కందుకుర్తి ఆంజనేయులు.

2 నాని కవితారూపం సృష్టి కర్త ఎవరు?
జవాబు;  ఎస్ .గోపి.

3 ప్రశ్న;" దిగిరాను దిగిరాను దివినుండి భూమికి అన్న కవి ఎవరు?
జవాబు;  క్రిష్ణ శాస్త్రి 

4 ప్రశ్న; భారత దేశానికి రాష్ట్రపతి కావడం కన్నా వీర సానికి అధ్యక్షుడు కావడం గొప్ప అని అన్న కవి ఎవరు?
జవాబు;....శ్రీశ్రీ

5 ప్రశ్న: ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న కవి ఎవరు?
జవాబు;  రాయప్రోలు సుబ్బారావు

6 ప్రశ్న; కోకిల స్వామి ఎవరు?
జవాబు;  రాయప్రోలు సుబ్బారావు

🌻శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర 

------------------------------------------------------

[ సాహితీ బృందావన జాతీయ వేదిక పోటీలలో
 ప్రథమ విజేత!
1👍 యామిని
వారికి అభివందనాలు
2 ద్వితీయ విజేత పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.

ఇరువురికీ హృదయపూర్వక అభివందనాలు🙏🏽
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽


కుళ్ళిన సమాజం..అనాధ

అంశం : అనాధ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక .
కుళ్ళిన సమాజం.
--------------------------
మానవత్వం లోపించిన మనుషుల మతిలేని
చర్యలకు బలయ్యే మాంస పిండాలు.॥

చింకి చీరల ముాటల్లో  చెత్త కుప్పల్లోకి చేరిన పసి ప్రాణాల కన్నీటి  బాధా పుారిత  అనాధ గాధలు  ॥

కొవ్వెక్కిన కామానికి ,కోర్కె తీరిన మానానికి
బరువైన, భావి భారతి ఒడి జారిన ఆశా దీపాలు..
అందరుా ఉన్నా ఎవరుా లేని అనాధలు.॥

రాక్షసత్వం నిండిన రౌడీల పేటలో
అంగాంగ శోషణ శాపాలకు గురై , అడుక్కు తినే
ఆహారానికి కుాడా హక్కు లేని అభాగ్యులు అనాధలు॥

అభం శుభం ఎరుగని  పసి కందులని కుాడా
చుాడక , అంగడిలో ఆటబొమ్మలుగా వెలకట్టబడి రాక్షసత్వపు  రాసలీలలకు అరాచకంగా వ్యభిచార గృహాలకు చేర్చబడిన వేట బొమ్మలు  అనాధలు॥

పట్టెడన్నం కోసం పుట్టెడు బాధల గాయాలని
కన్నీటి కావిళ్ళతో కడిగి  తిరిగి లేస్తున్న
బతికున్న జీవశ్శవాలు అనాధలు.॥

బాలల దినోత్సవ అదర్శ భాషణల బరువుకు,
రాజకీయ రంగుల హంగులకు రాసి పోగులై,
అతఃపాతాలకానికి అణిచివేయబడ్ద 
అసహాయ తోలుబొమ్మలు అనాధలు.॥

హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని
నా స్వీయ రచన.


దేశ భక్తి గీతం.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము


ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో జనియించినవాడ నీ స్వర్గఖండమున ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావో నినుమోసె ఈ తల్లి కనక గర్భమున

లేదురా ఇటువంటి భూదేవి యెందు లేదురా మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల ఝండాలు ఆడునందాక


అందాక గల ఈ అనంత భూతల్లిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావ గీతములు

తమ తపస్సుల్ ఋషుల్ ధారవోయంగా శౌర్య హారము రాజ చంద్రులర్పింప రాగ దుగ్ధము భక్త రక్తముల్ పిదుక భావ సూత్రము కవి ప్రభువు లల్లంగా

దిక్కులకెగదన్ను తేజములు వెలుగ జగముల నూగించు మగతనంబెగయ రాళ్ళు తేనియలూరు రాగాలు సాగ సౌన్దర్య మెగబోయు సాహిత్య మలర

వేలగిండీ దివ్య విశ్వము పుత్రా అవమానమేలరా అనుమానమేల భారత పుత్రుండనచు భక్తితో బలుక

Sunday, June 27, 2021

అనుక్షణం భయం భయం

అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : మా  తరం  చరిత్ర.

(వం)దనాలు కరువైన  
 పరదేశీ వ్యామొాహం.
(దే)శ ప్రగతి సుాన్యం .
 దైన్య స్థితిలో జనం , మనం.
(మా)రని మనస్తత్వాల 
మారణ హోమపు కాలుష్యం.
దిగజారిపోతున్న ప్రకృతి అందాలు
(త)రిగిపోతున్న మానవ బంధాలు
( రం)కు రాజకీయాలతో 
 రగిలిపోతున్న న్యాయ వ్యవస్థ.
  బీద, బిక్కి, బడుగు, జీవితాల
 భారమౌతున్న బతుకు అవస్థ.
పుటల్లో నిండిన ఉద్యమకారుల పాత్ర
( వందే) ళ్ళైనా మారని భారత చరిత్ర.
 ఇదే ఈ నాటి (మాతరం) జీవన వేధ..
 భరత మాత ఒడి నిండిన కన్నీటి కథ ॥

------------------------------------------

అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక :  భయం-భయం, క్షణ -క్షణం ॥

 వంకర టింకర రాజకీయం
 దేశ ప్రగతి దుఃఖ మయం
 మా,మీ, తగాదాల మారణ హోమం
 తరిగిపోతున్న మానవత్వపు  విలువలు 
 రంగు మారుస్తున్న రాజకీయ వ్యవస్థ-
  నిండా మునిగె  మా "తరం". 
  అను క్షణం ,భయం- భయం ,  ॥

 .

Friday, June 25, 2021

సున్నితం.

*సాహితీ బృందావన వేదిక ఆధ్వర్యంలో* 
*సున్నితం ప్రక్రియ సరళ శతకం లో 18/6/21 నుంచి 24/6/21 వరకూ నిర్వహించ బడిన* 
*అంశం : నిత్యజీవితంలో యోగ సాధన ✍️✍️✍️
ఈ అంశానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన వారు శ్రీమతి బొల్లాప్రగడ ఉదయ భాను

*** ప్రతివారం కూడా ప్రథమ,ద్వితీయ, తృతీయ , విశిష్ట ఉత్తమ ప్రశంసాత్మక  
టాప్* *20 కవితలు ఎంపిక చేయబడును*

*ఈ వారం విజేతలు*

*ప్రథమ విజేత*
1️⃣ నాయకంటి నరసింహ శర్మ గారు
🥇🥇🥇🏆🏆🎁🤝🤝🎊🎊🙏
*2️⃣*ద్వితీయ విజేత
బత్తిన గీతా కుమారి గారు

🌹🌹🌹🌹🎊🎊🤝🤝🎁🙏
*3️⃣*తృతీయ విజేత
లింగన్న గారి గంగాధర్ గారు

🥇🥇🥇🏆🏆🎊🎊🌹🌹🤝🤝🙏



*విశిష్ట యోగా  సలహాదారులు : 
1️⃣ యామిని కొళ్లూరు గారు 

2️⃣ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు

3️⃣ శ్రీమతి గజ్జల స్వరూపరాణి గారు

*ఉత్తమ సున్నిత జల్లులు : 

1️⃣  శ్రీ తంగెళ్ళపల్లి ఆనందాచారి గారు
2️⃣ శ్రీ మద్ది పుల్లారావు గారు 
3️⃣శ్రీమతి తోట సులోచన గారు 
4️⃣ శ్రీమతి కె శైలజా శ్రీనివాస్ గారు
5️⃣ శ్రీ కుందారపు గురు మూర్తి గారు 

*ప్రశంసల విరిజల్లులు
1️⃣ గద్వాల సోమన్న గారు
2️⃣ యస్. ముంతాజ్ బేగం గారు
3️⃣ శ్రీమతి బోర భారతీ దేవి గారు గారు
4️⃣ బిచ్చాల సౌందర్య గారు
5️⃣ మహమ్మద్ చాంద్ బేగం గారు 
6️⃣ వలిపే సత్య నీలిమ గారు
7️⃣  పిల్లి హజరత్తయ్య గారు గారు
8️⃣ ధనాశి ఉషా రాణి గారు
9️⃣S. నా రత్నలక్ష్మి గారు  
🔟M. ఉషారాణి గారు
1️⃣1️⃣  ఖలీమ్ పాషా గారు
1️⃣2️⃣ సయ్యద్ జహీర్ అహ్మద్ గారు

🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

Wednesday, June 23, 2021

అంశం :పి.వి.నరసింహారావు శత జయంతోత్సవం.

తెలుగు వెలుగు సాహిత్య  వేదిక..
అంశం :పి.వి.నరసింహారావు శత జయంతోత్సవం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

క్రమ సంఖ్య : 127.

శీర్షిక : చైతన్య స్ఫుార్తి.

తెలంగాణా గడ్డ పై ఉద్యమ ప్రతిబింబం
నిజాం ప్రభుత్వ పాలనకు  నిశ్ఛయ ధిక్కారం.
కాంగ్రెస్ పార్టీ  కొదమ నరసింహం .
అత్యుత్తమ ప్రధానిగా ఎన్నికైన ప్రజా బలం ॥

న్యాయ పోరాటాల నాయకత్వపు శ్రేష్ట.
నిరంతర సంఘర్షణల విశ్వ విజేత
గురుకుల, విద్యా సంస్థల వరుస  సృష్టి కర్త.
జ్ఞాన విద్యా పరంగత బహుభాషా ప్రవక్త.॥

ఆర్ధిక , భుా  సంస్కరణల ఆపన్న హస్త.
విప్లవాత్మకోద్యమ  సంఘ సంస్కర్త.
సాహిత్య ఆకాడమీ పురస్కారగ్రహీత.
రాజ్యాంగ సవరణల రాజ నీతిజ్ఞ ॥

ఉమ్మడి తెలుగు రాజ్యాల ఉచ్ఛ పాలకుడు
మానవతా ధృక్పధాల మేధోమధనీయుడు
ముఖ్యమంత్రిగా ఎదిగిన మానవోద్ధారకుడు.
రాజకీయ చదరంగలో రాటుతేలిన రసజ్ఞుడు ॥

ఆర్ధిక సంస్కరణల విప్లవాత్మక  జ్యోతి
శాశన సభ్యత్వంలో అపర చాణిక్య స్పూార్తి
చరిత్రకెక్కిన ప్రజా చైతన్య దీప్తి.
సడలని వ్యక్తిత్వమది వేంకట నరసింహిుని కీర్తి ॥


Tuesday, June 22, 2021

గజల్ ప్రక్రియ నియమాలు.; వివరణ

*గజల్..గజల్..అలర్ట్..అలర్ట్*
(నియమాలు కొన్ని తెలుసుకుందాం)
*రెండు పాదాలు కలిస్తే ఒక షేరు*
ఇలాంటివి 5షేర్లు(5×2=పదివాక్యాలు) కనీసం రాస్తే అది గజలు.
*రాసిన ప్రతి  రెండు పాదాలలోని చివరి పాదంలో చివరి పదం ఒకటే ఉండాలి*. *వేరు వేరు పదాలు రాయవద్దు* .అదికూడా సమాన మాత్రలతోనే ఉండాలి.

*ప్రతి రెండు వాక్యాలలోని రెండవ వాక్యంలో చివరిపదానికి ముందు వచ్చే పదం ప్రాసపదమై ఉండాలి*
*.ఈ ప్రాసపదం రాసిన తరువాత పై షేరులోని చివరి పదం ఇక్కడ రాయాలి*

*.ప్రాసపదం ఒకేవిధమైన ఉచ్చారణ కల్గిన పదం ఒకసారి వాడిన పదం తరువాత షేరులో వాడవద్దు.వేరువేరుగా ఉండాలి*.

 *చివరి షేరు రెండుపాదాలలో ఏదో ఒక చోట కవిపేరు భావంలో కలిసిపోయేలాగా సమాన మాత్రలలో ఇమిడ్చి రాయాలి.*

గజలుకు ఫలానా అంశంపై రాయాలని ఉండదని పెద్దలంటారు.
కాబట్టి  శృంగారము..విరహము..ఉత్కంఠత చరుపు చమత్కారం ఆకర్షణ వర్ణనతో రసరమ్యంగా ఉండాలి.
ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఘాటైన శృంగార రసం ఒలికించవచ్చు.
  గజలులో మాత్రల లెక్క ఉంటుంది.
షేరులోని వాక్యాల పదాలన్నీ సమాన సంఖ్యలో మాత్రలను కలిగి ఉంటాయి.
 వాక్యంలో నాలుగు పదాలు ఉంటే గానయోగ్యంగా ఉంటుంది.
ఆ నాలుగు పదాలు సమాన మాత్రలు కలిగి ఉండాలి.
   3..3...3..3 మాత్రల పదాలతో
4444..5555...6666...7777...8888 మాత్రలతో రాయవచ్చు.

గజలు రాయాలంటే 
చివరి పదం అన్ని షేర్లలో ఉండుటకు ఒకటి ఎంపిక చేసుకోవాలి.
గజలు రాయాలంటే
చివరి పదానికి ముందు రాసే ప్రాస పదాలు ఒకే ఉచ్చారణ కలిగినవి ఒక షెరుకు ఒకటి చొప్పున 5షేర్లకు 5 ఎంపిక చేసుకోవాలి.
ఇక మాత్రలు 3....4..5..6..7..8..ఏదో ఒకటి ఎంపిక చేసుకొని అన్ని పదాలు అదే మాత్రాసంఖ్యలో వచ్చేట్టుగా అమర్చుకోవాలి.ఇక గజల్ ఈజీ.
ముందు పెపరులో గజలు రాయండి.
ఆ తరువాత 
అన్ని షేర్లలో చివరి పదం సమాన మాత్రలతో ఒకటిగానే ఉందా లేదా
చూడండి.
చివరి పదానికి ముందు వేరువేరు ప్రాసపదం సమాన మాత్రలతో వేసినమా లేదొ చూడండి.
5షేర్లు రాశామా చూడండి.
చివరి షేరులో ఎకషకడైనా మనపేరు సమాన మాత్రల పదంగా ఇరికించామా చూడండి.
ఓకే అనుకుంటే మీ గజలు పోస్టుచేయండి.
ఒక షేరులో రెండు వాక్యాలు.
ప్రతి వాక్యంలో నాలుగు పదాలు గుర్తుపెట్టుకోండి.
         1          2            3             4
    |         |           | ప్రాస పదం|చివరి పదం|

ప్రాసపదాలకు ఉదాసరణ
వింతేనా
చింతేనా
ప్రీతేనా
ఇంతేనా
వంతేనా
పొంతేనా
వీటి తరువాత చివరి పదం వేరువేరు ఉండదు.ఒక్క పదమే అన్ని షేర్లలో చివరి పదంగా రిపీటవుతుంది.

ప్రతి వాక్యంలో నాలుగు పదాలున్నాయా ఉంటే అవి సమాన మాత్రలతో ఉన్నాయా లేదా చూడండి.

Sunday, June 20, 2021

దత్తపది

అంశం :  దత్తపది.
సరము : వరము  :  కరము :  నరము

1.  ప్రక్రియ. తేటగీతి.

నర(న రము)నిండి నట్టిదౌ  సాధు బుద్ధి
(సరము )లిడి సేవలను జేయు సహజ  భక్తి
(కరము)లు కైమొాడ్చి కొల్చు ఘనపు ధనము
ధర(వరమ)ది జన్మ నాదు ధన్య మాయె ॥

2. ప్రక్రియ : పాట వెలది.
రుాపకర్త : శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.

(నరము) లేని నాల్క నరుని కొసగి
ధనము (సరము) లకును  దాసు జేసి
(కరము ) చేయు పనులు కలత రేప
కల(వ రము)ల బతుకు గాన వేల  ॥ 

3..కందపద్యము.  

(కరమున) చుాడామణి గొని 
(సరముల)సరిదా ల్చి రామ సన్నిధి చేరన్
(వరముల) గొనిసీత వీడి ,  వా
నరముల)రేడుధ ధిదాటె నమ్మిక గనుమా ॥


మహిళా సాధికారత కు మార్పు రావాలి.

 శ్రీ కళా వేదికలో..
అంశం : మహిళా సాధికారత.

రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక : మార్పు రావాలి.

"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః"
అంటుా  వేద ఘోషలు చేస్తుానే..
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా ఆంటుా..స్త్రీ లను వంటింటి,
పడకింటి పనులకు పరిమితం చేసీసేరు
మారుతున్న కాలంతో పాటు అన్ని రంగాల లోనుా  దుాసుకుపోతుా కొన్ని అడుగులు ముందుకేసిన
స్త్రీ లబ్రతుకు సమాజంలో చితికిపోతోంది.
లైంగిక దాడులు..గృహ నిర్బంధాలు ,  పైశాచిక  ప్రణాళికల వేధింపులతో  స్త్రీ ల బ్రతుకులు ఛిద్రమై దుర్భరమౌతున్నాయి.ఈ స్థితి దాటి
సమాజం స్త్రీ లను గౌరవించే స్థితికి రావాలి అంటే.మహిళా సంక్షేమ పథకాలు అమలులోకి రావాలి.విద్య , ఉద్యోగ ,వ్యాపార రంగాల లో
స్త్రీ లకు ఉన్నత స్థానం కల్పించాలి.
రాజకీయ, సామాజిక ,ఆర్ధిక ,పరంగా
స్త్రీలను బలోపేతం చేసి , స్వయం
నిర్ణయాత్మక శక్తిని , స్వశక్తి పై ఆత్మవిశ్వాసాన్ని,
పెంపొందించే విధంగా వారిని ప్రోత్సహించాలి.
మార్పుకనుగుణమైన సానుకూల దృక్పథాన్ని  పెంపొందించాలి.ఏ రోజైతే స్త్రీ  పురుషునితో
సమాన విజేతగా గుర్తింపబడుతుందో ఆరోజే
మన, సమ -సమాజ స్థాపనకు నిజమైన
అర్ధం వినిపిస్తుంది , కనిపిస్తుంది కుాడా..

హామీ:
ఈ నా  వచన కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.

Sunday, June 13, 2021

అంశం: మనలో మనోబలం....కరోన తిరోగమనం.🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
WAM గ్లోబల్ లిటరరీ ఫోరం మరియు మానసభారతి సాహితీ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాల విశ్వకవిసమ్మేళనం కవితా పోటీకొరకు,

అంశం: మనలో మనోబలం....కరోన 
                                     తిరోగమనం.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
పేరు: నల్లా నాగ సూర్య వరలక్ష్మి 
వృత్తి: ఉపాధ్యాయిని 
కలంపేరు: చందన
ఊరు: గొర్లివానిపాలెం 
          పరవాడ మండలం 
          విశాఖపట్నం జిల్లా 
చరవాణి: 9493202392 🌷
🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅
కవితా శీర్షిక: మనోబలంవెలుగు..కరొనా
                                             తొలగు 
🪔🪔🪔🪔🪔🪔
*మనోబలం   
       నీమానసకుహరాన దివ్య తేజమై,,
కరోనా కాళరాత్రిని ఛిద్రమ్ చేయాలి.  

* విశ్వగోళాన కరోనా   పుట్టించు మరు 
                                   భూమిసెగలు,
నీమనోబలం అనే   అద్భుతవృష్టి లో
                                    ఆవిరవ్వాలి.


* స్పైక్లు మార్చి ,కధలుచెప్పే   కరోనా
                                       భేతాలుడ్ని,
పట్టువీడని  భట్టివిక్రమార్కుడవై సాగ
                                          నంపాలి.

*ఆత్మ బంధువులను 'యము'న పాల్జే
                                                సిన,
 మనోబలంతో  కరోనా ' కాళీయు' మద 
                                        మణచాలి.

*ఆమ్మపాల  నిరోధక శక్తిని  ఆత్మబలం
                                    లోరంగరించి,
నాన్నదన్నులో  ఆశలు నిబ్బరంగ  నిపు
                                            కోవాలి.

*గురు జ్ఞాన ,యోగవిద్య భక్తితో అందు
                                                 కొని,
'చేపూతల లేపన'  స్నేహగంధాన్ని  పది
                            లంగా అద్దుకోవాలి.

*కస్టాన్ని దాటించే ప్రతిడాక్టరు అంజనీ 
                                          పుతృడై ,
ఆత్మబలంమందునింపు మరో ఆనంద
                                    య్య కావాలి.

*'మేనిముసుగు',మాస్క్ లో నర్స్ మద
                                  ర్ థెరిసాయై,
నిస్తేజంనింపు కరోనాను   శాస్వత నిద్ర
                                         పుచ్చాలి.

*పారిశుద్ధ్యశ్రామికులే నవజీవన నావికు
                                                    లై,
పరిశుభ్రత,పావనతీరాన లంగరువేయా
                                                   లి .

*స్వార్ధపరుల కుళ్లునాళాలు పసిగట్టి,
  మనోబలంతో గట్టి తాళమే వేయాలి.

*ఆత్మ బలం గవాక్షాన సమాచార 
                                    మందు కొని,
పల్లవించు,కదలనికుటుంబమే కుటీర
                                         మవ్వాలి.

*క్రమశిక్షణనియమాలు,ప్రాణ యామ
                                   సాధనాలుగా,
కొత్త బలంతో కరోనాను చిత్తు చేయాలి.

*బాలల  కబళిన్చగాసిన   కరోనా
                                     మాయావిని,
మనో ధైర్య తత్ట్వ మాంత్రీకుడవై మట్టు 
                        .                   బెట్టాలి.

*కరోనా ఉప్పెనలో తేలిపోవు అన్నా
                                ర్తులసాయానికై,
ఓ కెప్టెన్లా,ఓడలా ఆవల చేర్చాలి,ఆకలి
                                          తీర్చాలి.

ధైర్యే సాహసిలక్ష్మియని  వీర తిలక
                                      మద్దుకొని ,
తిరోగమించే కరోనాఅగ్నిగుండాన వడి
                               వడిగా నడవాలి.          

*మనో బలంతో  ఇలా తలాన శాంతి 
                                       కపొతమై,
సుదీర్ఘయానంచేసి,   జగాన  శాంతి
                                        నింపాలి.
  
   🐦🐦🐦🐦🌎🐦🐦🐦🐦   
హామీ పత్రం: ఈకవిత నాస్వీయ రచన.
                  అనుకరణ కాదు,ఎక్కడా 
                       ప్రచురించ బడలేదు .
       ధన్యవాదములు.🙏🙏🙏     
⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
పేరు: నల్లా నాగ సూర్య వరలక్ష్మి 
         ఉపాధ్యాయిని,
        జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,           
         వాడచీపురు పల్లి,
         పరవాడ మండలం,
         విశాఖపట్నం జిల్లా 
చరవాణి: 9493202392
తేది      :9. 06. 2021🌺
 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

Friday, June 11, 2021

* హైకూల నియమాలు *

* హైకూల నియమాలు *

*మూడు వరుసలలో రాయాలి
5+7+5
5 అక్షరాలు
7 అక్షరాలు
5 అక్షరాలు

*సాదా సీదా వాక్యాలు కాకుండా
చిక్కని భావ  చమక్కుతో,గుప్తత,క్లుప్తత,చూడగానే సంతృప్తి కలిగేలా...
చిన్ని హైకూలు మెరుపులు విరుపులతో రాసేద్దామా మరి

*ప్రతిరోజు ఇచ్చే చిత్రం పై 10 హైకూలు మాత్రమే రాయాలి👍

* ఎవరి హైకూలు వారే భద్రపరుచుకోవలెను 👍

Thursday, June 10, 2021

కొత్త పద్య ప్రక్రియ : పద్య చంద్రిక

* ఉషోదయ సాహితీ వేదిక
చిత్తూరు జిల్లా భాకరాపేట వారు రూపొందించిన నూతన పద్య ప్రక్రియ పద్యచంద్రిక*
       *************

*పద్యచంద్రిక*

*ఇది పద్యప్రక్రియ ఇందులో 4 పాదాలు ఉండును*

*ప్రతి పాదములో 6 గణాలు ఉంటాయి*

*ప్రతి పాదములో మూడవ గణము యొక్క మొదటి అక్షరముకు యతిస్థానము కలదు*

*నాలుగు పాదాల్లో  ప్రాసనియమoను గలదు*

*ప్రతి పాదములో 1 3 5 స్థానాల్లో మూడు మాత్రలను కలిగి ఉండును*

*2 4 6 గణములులో  ఆరు మాత్రలు వచ్చేలా రాయాలి*

*పద్యచంద్రిక*

1. వినుము నామొరలను వేంక టేశ్వరుడా నన్ను కరుణించుము

కనుము బాధలనో కంట తిరుమలగిరి వాస శరణుశరణు

అనుది నముదలతును అచ్యు తాముకుంద చక్రి ప్రణతులిడుదు

జనులు నిత్యమునిను చక్క గాగొలుతురు శౌరి కాపాడుము!!

2.పసిడి నవ్వులుతో
 పరవశమొనరించి నన్ను మురిపించుము

కసిగ మాటలతో కంట
 తడినేపెట్టినా శుభముకాదు

 వసియె వాడిపోవు వసుధ లోనప్రగతి నిజముతెలుసుకోను

మసియె బారిపోక మలుచు యువతబతుకు ఇలన గురువుగాను


 3.శుభము లనివ్వగా సోమ శేఖరహర నతులు గొనరండూ

యభయ మందించర నాది శంకరభువి యనఘ భవానీశ

విభవ సారహరే విరుల పూజ లందు శివా నమామ్యహమ్

శుభము గూర్చుమురా శూలి పరమేశ్వర జనుల కీవెప్పుడూ.

*పద్యచంద్రిక బిరుదులు
*పద్య చంద్రిక కిరీటి* 
1️⃣0️⃣0️⃣
*పద్యచంద్రిక మయూరి* 

2️⃣0️⃣0️⃣

*పద్యచంద్రిక సమ్రాట్*

3️⃣0️⃣0️⃣




*పద్యచంద్రిక రూపకర్త*
*ధనాశి ఉషారాణి*
  చిత్తూరు జిల్లా
    భాకరాపేట

*పద్యచంద్రిక పర్యవేక్షకులు*
*శ్రీ మట్టా సూర్యనారాయణ గారు*

జాతకాలు

అంశం : జాతకాలు.
రచన:శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక-
పవిత్ర గ్రంధం.
(వచన కవిత).

జ్యోతిషశాస్త్రం  అనేది  ఋషులు మనకందించిన  పురాతనమైన  పవిత్ర వేద గ్రధం.
శాస్త్రసమ్మతమైన ఈ గ్రంధం కాలానికి అనుగుణంగా గ్రహాల స్థితిగతులు మన జన్మ రాశిపై ఏ విధంగా అనుకుాల, ప్రతికుాల  పరిస్థితులకు .. దోహదమౌతాయొా  తెలియొరచే దివ్య శాస్త్రం
ఈ జ్యోతిషశాస్త్రం  చెప్పేవారు గాయత్రీమాత ఉపాసకులై ఉండి, నిత్యానుష్టాన నియమాలతో
తమ కులదేవతార్చనను యధావిధిగా నిర్వర్తిస్తుా
దైవబలాన్ని పొందిన వారై తేజోవంతులై
ముఖం చుాడగానే వారి భవిష్యత్తు చెప్పగలిగే
సామర్ధ్యం కలిగి ఉంటారు.
.సమాజానికి ఉపయొాగకరమైన సమాచారాన్ని అందించి శుభాశుభ విశ్లేషణ చేసేదే జ్యోతిషం .
జ్యోతిషం చెప్పేవారిని దైవజ్ఞులంటారు.
నిష్ట నియమాలతో , నిస్వార్ధంగా జనహితానికై
ఉపయొాగ పడే ఈ విద్య ఈ నాడు వ్యాపారమైంది.
నిష్టానియమాలు, సమయపాలన , అర్హత లేని
చాలామంది , ప్రజల బలహీనతలను ఆధారంగా తీసుకొని ఈ జ్యోతిషశాస్త్రం ఉపయొాగాన్ని
దుర్వినియొాగం చేస్తున్నారు.

-------------------------------------------------------

నిలువు దోపిడీ

[8/30/2020, 16:01] p3860749: ఇష్టపది ప్రక్రియలో
------------------------
 అంశం = ధాతృత్వం.
 శీర్షిక.
కనిపించిన కరుణరసం.
------------------------------
  కోవిడ్ బాధితులదె       కోసుల దుార  పయనం
  కొరత పడ్డ పనులతో    కొర్రు శిలువ జీవితం.॥
  
  కష్టాలు కన్నీళ్ళు            కావిడుల మొాతలు
  కడుపు నింప లేనట్టి      కన్న తల్లి ఘోషలు ॥ 
  
చంక   చంటి పాపలు         చద్దికుాడు పాటులు
చావు భయపు బాటలు      చావని బతుకాశలు॥

చెప్పుల్లేని కాళ్లు                చేర లేని దుారము
నడక దారి పయనము     నటన లేని కథనము॥

 ఆకలి చావుల కదె        అల్ల లాడె పేదలు
 ఎండకు తాళలేక          ఏడ్చు వేల జనాలు ॥   

కమ్ము  చీకటిలోన            కనిపించిన దీపము
ఇక్కటులను బాపిన         ఇల దేవుని రుాపము ,

పేరు "సోనుా సుాద్ "       పేదవారికి  ధనము.
మది మేలు దృక్పథం    మరువని ధాతృత్వం॥

అన్నార్తుల కన్నము    అందించిన దైవము.
కాలి నడక బడుగుల    కాచి ,ఇచ్చె అభయము॥ 

బస్సు, బండ్ల దారిని    బాధితులను  పంపెను
భారమని ఎంచకను   బాధ తీర్చి  మురిసెను॥
------------------------------------------------------------

రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర .
8098622021
------------------
[9/7/2020, 08:37] p3860749: రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక .
మెట్టినిల్లు.
---------------
పుట్టిన దగ్గరనుండి పెరిగీ పెద్దయ్యే వరకు
అమ్మా నాన్నల  ప్రేమ, అనురాగాల మధ్య
ఎంతో  ముద్దుగా పెరుగుతుంది ఆడపిల్ల..
ఆడిందే ఆట , పాడిందే పాటగా పెరిగిన- 
తనను , ఎవరో తెలియని మరొక కొత్త కుటుంబంతో  సంబంధాన్ని కలుపుకొని , ఒక కొత్త వ్యక్తితో
వివాహ బంధం పేరుతో ముాడు ముళ్ళుా వేయించి, ఇతనే నీభర్త, ఇకనుంచీ వీరే నీ కుటుంబం -
అని చెప్పి,  వారి వెంట వెళ్ళమన్నపుడు , 
ఆ అపరిచిత వ్యక్తుల తో ,  ఆనందంగా వారివెంట వారింటికి వెళుతున్న ,  ఒక ఆడపిల్లకు , అత్యంత "నమ్మకం" , వారంతా ఇక నుంచి తనవారని.
తనను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారని,
భర్తగా అతని అనురాగంలో ఆనంద డోలిక -
లుాగుతానని. 
ఆ "నమ్మకం"తోనే,  పేగు బంధాన్ని  తెంచుకొని ,
రక్త సంబంధాలకు దుారమై ,
ఎప్పుడుా ఎరగని వారిమధ్యకు-
తన జీవిత చివరి దశ వరకు, తనను తాను 
అర్పించుకునేందుకు ఆనందంగా ఏడడుగులు వేసి
అత్తింటికి చేరుతుంది ఒక ఆడపిల్ల .
ఆ "నమ్మకం"తోనే , పుట్టెడు బాధ్యతలను తనపై వేసుకుంటుంది.  ఆ ఇంటి వారసత్వానికి
ఆది ముాలమౌతుంది. 
ఆ ఇల్లే తన ఇల్లనే "నమ్మకం" తో
ఆ ఇంటిని స్వర్గంలా తీర్చి దిద్దే ప్రయత్నంలో,
కష్ట- నష్టాలను ఓర్చుకుంటుా , ఆ కష్టం లోనే -
తన ఆనందాన్ని వెతుక్కుంటుా కొవ్వొత్తిలా--- కరిగిపోతుంది . 
--------------------------------------------------
[9/8/2020, 15:01] p3860749: రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక .
మెట్టినిల్లు.
---------------
పుట్టిన దగ్గరనుండి పెరిగీ పెద్దయ్యే వరకు
అమ్మా నాన్నల  ప్రేమ, అనురాగాల మధ్య
ఎంతో  ముద్దుగా పెరుగుతుంది ఆడపిల్ల..
ఆడిందే ఆట , పాడిందే పాటగా పెరిగిన- 
తనను , ఎవరో తెలియని మరొక కొత్త కుటుంబంతో  సంబంధాన్ని కలుపుకొని , ఒక కొత్త వ్యక్తితో
వివాహ బంధం పేరుతో ముాడు ముళ్ళుా వేయించి, ఇతనే నీభర్త, ఇకనుంచీ వీరే నీ కుటుంబం -
అని చెప్పి,  వారి వెంట వెళ్ళమన్నపుడు , 
ఆ అపరిచిత వ్యక్తుల తో ,  ఆనందంగా వారివెంట వారింటికి వెళుతున్న ,  ఒక ఆడపిల్లకు , అత్యంత "నమ్మకం" , వారంతా ఇక నుంచి తనవారని.
తనను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారని,
భర్తగా అతని అనురాగంలో ఆనంద డోలిక -
లుాగుతానని. 
ఆ "నమ్మకం"తోనే,  పేగు బంధాన్ని  తెంచుకొని ,
రక్త సంబంధాలకు దుారమై ,
ఎప్పుడుా ఎరగని వారిమధ్యకు-
తన జీవిత చివరి దశ వరకు, తనను తాను 
అర్పించుకునేందుకు ఆనందంగా ఏడడుగులు వేసి
అత్తింటికి చేరుతుంది ఒక ఆడపిల్ల .
ఆ "నమ్మకం"తోనే , పుట్టెడు బాధ్యతలను తనపై వేసుకుంటుంది.  ఆ ఇంటి వారసత్వానికి
ఆది ముాలమౌతుంది. 
ఆ ఇల్లే తన ఇల్లనే "నమ్మకం" తో
ఆ ఇంటిని స్వర్గంలా తీర్చి దిద్దే ప్రయత్నంలో,
కష్ట- నష్టాలను ఓర్చుకుంటుా , ఆ కష్టం లోనే -
తన ఆనందాన్ని వెతుక్కుంటుా కొవ్వొత్తిలా--- కరిగిపోతుంది . 
--------------------------------------------------
[9/16/2020, 12:49] p3860749: 15/10/2020.
అంశం
మానవత్వం.
-----------------

శీర్షిక.
"మరుగుజ్జు"
-----------------
రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021
---------------------
అసహనంతో అటుా ఇటుా తిరుగుతున్నాను.
ఇంకా పనిలోకిరాని ఆదెమ్మను ఆడిపోసుకుంటుా..॥
అరగంట  లేటుగా ,  ఆదెమ్మ అలసటతో
జ్వరంలో ఉన్న చంటిదాని మీద నున్న బెంగతో॥
 చంటిదాన్ని గుడ్డ పరచి వేసింది నేలపై 
అడిగింది  పది రుాకలు చంటిదాని  మందుకై॥
నాగాల లక్కల్లో  నయాపైస రాదంటుా  
కసుర్ల విసుర్ల తొనాదెమ్మను, తరిమేసా పొమ్మంటుా॥
కవి  సమ్మేళన సన్మానం, లేటయ్యిందనుకుంటుా
మనవత్త్వం పై భాషణ చెప్పాలిగ  అనుకుంటుా॥
అద్ధ ముందు నిల్చున్నా అలంకరణ కోసమై
అద్ధం లో నా రుాపమె అగుపించె వికారమై॥
అదిరి పడ్డ నా ముందు ,ఆదెమ్మే అందమై
ఎదిగిపోయె కనుల ముందె మానవత్త్వ శిఖరమై॥ 
అనాధ పిల్ల పై పుట్టెడు మమకారం నింపుకొని
ఖర్చు కై వెనుకాడని ,మమతలనే పంచుకొని ॥
కుాడు- గుడ్డ లేకున్న ,నిండు మనసు  అదెమ్మది
పాచి పనుల జీతంలో , కొట్టి వేత లెక్క నాది॥
పెంచుకున్న చంటి బిడ్డ నెత్తుకున్న ఘనతామెది
పది రుాకలు ఇవ్వలేని హీన మైన మనసు నాది॥
చెప్పకనే చుాపించెను మానవత్వం విలువేమిటొ  
కరగె నాలో కఠినత్త్వము కంటి  నీటి ధారలతో .॥.
మరుగుజ్జై నిలచి నాను అమె ముందు తలవాల్చి
భాషణలకె పరిమితమౌ మాట లేటి కని తలచి॥. 
"మీడియాల మొాజు లేలు,మాటలనే వీడమని
మనసుంటే ఇంటి నున్న పనివారికి సాయపడని --"॥
మనసు చెప్పి నట్టి మాట నాటుకుంది నా మదిలో  
మేలుకుంది  మరోమనిషి మానవత్వ రుాపముతో॥
చేతికందు రుాక లన్ని  సంచిలోన  వేసి నేను
ఆదెమ్మ ఇంటి వేపు కడుగు లేసి కదలినాను॥ .
చెప్ప లేని ఆనందం చేరువైన సంతోషం
శాంతి నిండు మనసిపుడొక  ఆశయాల విహంగం.॥
-------------------------------------------------------------


హామీ...
శీర్షిక.
"మరుగుజ్జు"
 .అనే  ఈ కవిత,
 ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
[11/2/2020, 15:19] p3860749: వారం వారం కవిత.
2/10/2020.
 అంశం:  విశ్వాసం.
రచన: శ్రీమతి: జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : నమ్మకం.

ప్రపంచం అంతా "విశ్వాసం" అనే 
బాటలో నమ్మకంతో నడుస్తోంది.
పిల్లలకు విశ్వాసం. కుటుంబం పై,
తల్లిదండ్రుల పెంపకం లో, ఇల్లనే 
నాలుగు  గోడల మధ్య ఎక్కడా లేని 
రక్షణ వారి దగ్గర తమకు ఉంటుందని ॥
 బడి,గుడి లాంటిదని. జ్ఞాన మిచ్చేగురువు-
 భగవత్సరుాపుడని తలిదండృలకు విశ్వాసం॥
తమ భావి జీవిత మార్గదర్శి ఆతనేనని 
పిల్లకు తమ గురువు మాట పై విశ్వాసం.
తెలీని ఆగంతకునితో వివాహం జరిగిన
స్త్రీ కి ఆతనిపై విశ్వాసం. తన జీవిత 
రక్షకుడు , పోషకుడు అతనేనని.॥
వృద్ధులకు పిల్లలపై విశ్వాసం.తడబడు తమ అడుగులకు తాము పెంచిన పిల్లలు , 
తమకు చేయుాతను తప్పక అందిస్తారని ॥
 యావత్ భారతావనికి తమ 
 నాయకుని పై అమితమైన విశ్వాసం.
తాము ఓటు వేసి గెలిపించేవాడు , 
తమ  సాధక బాధలను గుర్తించి 
తప్పక మేలు చేస్తాడని. తమ 
బతుకులు  తప్పక బాగుపడతాయని ॥
------------------------------------------------
[11/18/2020, 19:56] p3860749: వారం వారం కవిత కు...
18/11/2020.
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .( మహరాష్ట్ర ).
శీర్షిక .
బ్రతుకు పోరాటం.
--------------------------

ఎప్పటికైనా చావు తప్పదని తెలుసు.
తెలీని పాశం ,  ఏదో రుాపంలో వచ్చి
తెలియ కుండానే , ఏదో లోకాల్లోకి
తీసుకుపోతుందనీ తెలుసు.
వయసు "లెక్కలు" చుాపుతుాన్నా  
ఆకాశానికి నిచ్చెన లేస్తున్న
మనసు "రెక్కల్ని "అదుపులోకి తేలేకా,
మనసు పడే వ్యధకు ,మధించిపోతున్న
 భావాలు , అల్లకల్లోలమై అంతరంగంలో
 అలజడిరేపుతున్నాయి.
 నేడో , రేపో , తెలియని జీవితం ,
 "భయం జైలు" లో మగ్గుతుా-
 కనపడని మృత్యువుకు 
 తాను మాత్రం  కనపడకుాడదనీ..
 తన ఆనవాళ్ళను , తానే
 దాచే ప్రయత్నం చేస్తుా,
 ముక్కు, ముాతులను "మాస్క్" 
 చాటున దాచిపెడుతుా...
 మృత్యువును మభ్యపెడుతోంది.
  తనను తాను ,దాచుకునే
 ప్రయత్నంగా, తన "ఉనికిని "తానే-
 నాలుగు గోడల మధ్య బందీ చేసి,
 బిక్కు బిక్కు మంటుాన్న-
 బతుకు పోరాటంలో--
"గెలవడానికి " తనకు తానే 
"గృహ నిర్బంధ సంకెళ్ళు " 
వేసుకుంటుా , రోజులు 
      వెళ్ళదీస్తున్నాది.
[12/10/2020, 00:24] p3860749: 9/12/2020.
అంశం: యుద్ధం.
శీర్షిక : ఆడతనం.

అమ్మ కడుపులో నుండే ఆడపిల్లనని  
తెలియగానే ఛీత్కార ఛీదరింపులను
విదిలించుకొనే యుద్ధం.
ఆడ పిల్లనంటుా  అణచి వేతలకు గురైన అత్మ క్షోభతో
 స్వతంత్రత కోసం ఆలోచనలతో యుద్ధం.
 ఎప్పుడు ఎవరుఏమంటారో అని భయంతో  ధైర్యాన్ని కుాడగొట్టుకునేందుకు మనసుతో  యుద్ధం.
పెద్దవుతున్న కొలదీ ఆడతనపు ఆత్మ రక్షణకై యుద్ధం.
వయసు తెచ్చిన ఆడతనపు శారీరపు మార్పులను
కాముకుల కుృార దృష్టి నుండి తప్పించుకుంటుా
అనుకున్న గమ్యానికి చేరుకోడానికి 
ఆత్మస్థైర్యం పెంచుకునేందుకు అంతరాత్మతో యుద్ధం.
 పెళ్ళయ్యాక అత్తింటి వాతావరణానికి
 అలవాటు  పడుతుా,లోక మర్యాద కోసం చిరునవ్వుతో చేసే జీవితాంత యుద్ధం..
 ఇలా ఆడపిల్లగా తనకిష్టం లేని ఎన్నో
 పద్ధతులను తనవిగా చేసుకుంటుా అన్నింటికీ
 సద్దుకు పోవడానికి నిరంతరం చేసే పోరాటపు
 యుద్ధంలో ప్రతీక్షణం ఓడపోతుా ఎదుటివారిని 
 గెలిపిస్తుా చిరునవ్వుతో చివరి శ్వాశ దాకా 
 తనను తాను బైట పెట్టుకోలేని అశక్తతతో ,
 చంపుకోలేని తీరని ఆశల తో అనుక్షణం చేసే యుద్ధం.
 అసలు ఆడతనమే నేటి సమాజంలో స్వతంత్రం గాని
సమాన హక్కులు గాని లేని ఆరని కన్నీటి యుద్ధం.॥

(ఈ యుద్ధంలో ఆడపిల్లది తప్ప అందరిదీ గెలుపే..
అనుకుంటున్న వారంతా...
తానోడిపోతుా అందర్నీ గెలిపిస్తున్న ఆడతనపు
విలువని  ఈ సమాజం  ఎన్నాళ్ళకు గుర్తిస్తుందో ॥)
 
 
 రచన : శ్రీమతి :  జగదిుశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.


హామీ; ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
[1/5, 14:16] p3860749: 5/01/2021.
వారంవారం కవిలో....
అంశం :సంక్రాంతి. 
శీర్షిక .
సంక్రాంతి సంబరం.
--------------------------


రైతులకు సంబరం సంక్రాంతి వారికో వరం.
చేతికొచ్చిన పంటతో ఇంటింట  సంబరాల తోరణం ॥
విందు వినోదాలు, నేతి ఱుచుల పిండి వంటలు
పాత వస్తువుల మంట తో చలి కాపుల భోగీమంటలు॥

బుడబుడక్కుల వారి జానపదగీతాలు.
పగటి వేషగాళ్ళకు దానధర్మాలు .
గంగిరెద్దు ఆటలు గాలిపటాల ఎగురవేతలు.॥

కంచు గజ్జెల నాట్యంతో హరిదాసుల ఆశీర్వాదాలు.
అక్షయ పాత్రలు నిండు సిరితో అందుకొనే దానధర్మాలు
సంక్రాంతి పండగ కు పెద్దల తలపుల పితృ తర్పణాలు
బొమ్మల కొలువుతో ఆడపిల్లల ఆనంద గీతాలు॥

కనుమ నాటి మినుము పిండి వంటలతో రైతులు..
పంట పనిముట్లకు, పశు సంపదకు చేసేనిండు పుాజలు
కోడిపందాలాటలు వనభోజనాల సందళ్ళు .
ముక్కనుమ నాటి  మట్టి బొమ్మల బారు కొలువులు ॥

సద్ధర్మ సాంప్రదాయాల  ఆచార పాలనం 
ఆరోగ్యానందాలు నింపే మన పండగల సంబరం.
 శాంతి సంతోషాల నిత్య వసంతం. ॥
 --------------------------------------------------

రచన :శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహారాష్ట్ర .
8097622021.

 ఎచటనుా ప్రచురితం కాని నా స్వీయ కవిత.
[1/13, 23:54] p3860749: వారం వారం కవిత లో 
అంశం ; నిరీక్షణ.
శీర్షిక: నా  నిరీక్షణ.

రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహరాష్ట్ర.
8097622021.
-----------------------------
------------------------

ప్రతీ ఒక్కరి జీవితంలో  తమకు ఇష్టమైన 
రంగం లో ప్రతిభ సాధించాలన్న తపన  .
చాలా మందికి నెరవేరని  ఆశల నిరీక్షణ.
ఆవకాశం రాని ఆటుపోట్ల జీవిత పోరాటం.
ఎప్పటికైనా తపన తీరదా అన్న ఆశల ఆరాటం.
ఒకప్పటి నాలోనుా అదే కోరిక .
సంగీత- సాహిత్యాలపై పెరుగుతున్న ఇష్టం.
అమ్మ దగ్గర నేర్చుకున్న సరగమల సంగీతం.
ఒరిస్సా లో కనపడని తెలుగు సంగీత గురువులు.
నాన్న ట్రాస్ఫర్ తో నాలో పెరిగిన ఆశలు.
అంతలోనే నాకు జరిగిన వివాహ వేడుక తో
అత్తంటి  బాధ్యతల మధ్య అణగిపోయిన కోరిక.
తీరని ఆశల నిరీక్షణలో తల్లినైన ఆనందం.
పిల్లల పెంపకం తో  తీరిక లేని క్షణాల పోరాటం.
భర్త ఉద్యోగరీత్యా ముంబై ప్రయాణం..
తెలియని ఊరిలో భాష తెచ్చిన  మొగమాటం.
తెలుగు కీర్తనలు నేర్పిన వారు లేని కొత్త లోకం.
సమయం దొరికినపుడల్లా తీసే కుానిరాగం.
నాలో  కోరికను పెంపొందించే  మొాహనరాగం 
పిల్లల పెళ్ళిళ్ళతో  తీరిన బాధ్యత...
అమమ్మ, నానమ్మల రుాపంతో మళ్ళీ మొదలైన
కొత్త జీవితపు పాత పరుగుల తీరిక లేని క్షణం.
వయసుతో పాటు తో అలసిన శరీరం..
నెరసిన జుట్టు తెచ్చిన పెద్దరికం , కోరిక తీరని 
 చిన్నతనం  చుాపుతున్న ఆశల ఆరాటం
అంతం లేని ఆరాటం తో ఆన్ లైన్ విద్యకై పోరాటం..
 అసహనపు కన్నీటి వెంట.నెట్ ప్రోబ్లమ్ తెచ్చిన తంటా  
 అరవై పదుల ఆర్భాటం ఆశతో నెట్  కోసం చేసే నిరీక్షణ ..కంప్యుాటర్ తో కుస్తీ. అరకొరగా వస్తుా 
 కట్ అవుతున్న కల్లోల కల కలం.
 కలల్లో కచేరీల ఫలం, నా నిరీక్షణకు తోడైన వరం .
 పెరుగుతున్న వయసుతో పెరుగుతున్న కోరిక.
 మారుతున్న టెక్నాలజీ తో ఆశల హార్మ్యాలు-
  సమంగా రాని నెట్ త నత్తనడక  నిరీక్షణలు..
  తీరని కోరిక తో నా.నిరీక్షణకు లేదు అంతం.
పొందేవరకు పొిరాడాలనుకోవడం నా పంతం.
అంతం కాని నా ఆశల నిరీక్షణ....ఎన్నాళ్ళో....
...
[4/9, 22:16] p3860749: 9/04/2021.
వారం వారం కవిత లో...
 ప్లవ నామ ఉగాది పై కవితల పోటీ కొరకు, 
 
 శీర్షిక : కల నిజమైతే...
 
 రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నీలాకాశంలో తారకలు దోబుాచులాడుతున్నాయి.
పొగ జబ్బు పడిన మేఘాలు కోలుకొని 
తేట నీటి వసంతాలాడుతున్నాయి.
కిచకిచారవాల పకలరింతకు
పచ్చని పకృతి పులకరించిపోతోంది.
ఆకుపచ్చ చీరను అలరించిన భుామాత 
మల్లె ,జాజుల మాలలనల్లి 
సిగముడిలో సింగారించింది.
గలగల పారే ఏరులు,  పంట పొలాల్లో చేరి,
విత్తు చిన్నారులతో దోబుాచులాడుతున్నాయి.
స్వశ్ఛ మైన భరతావని పరిసరాల్లో 
మనుషులందరుా మాస్క్ లు వేసుకొని
సామాజిక దుారం పాటిస్తుా  సేనిటైజర్ల
చిలకరింపుల పలకరింపులతో 
పండగ ముచ్చట్లాడుకుంటున్నారు.
అంతా చుాస్త్తున్న ఆనందంలో బొక్కబోర్లా
పడ్డ నేను, కళ్ళు తెరచి చుట్టుా చుాసేను.
"నాకు వచ్చింది కలా....అదేగానీ నిజమైతే."..
అనుకుంటుా లేచేను..పర్యావరణ రక్షణ
తో పాటు కరోనా కట్టడి నియమాలను 
పాటించాలన్న నిర్ణయంతో ప్రతిన పుానేను.
అందరుా నాతో చేతులు కలుపుతారు కదుా....
"ప్లవ నామ యుగాది "శుభాకాంక్షలతో" .మీ ...🙏
------------------------------------------------------

హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితంకాని నా స్వీయ రచన.
[5/5, 15:18] p3860749: వారం వారం కవిత లో...
అంశం  :  దోపిడీ.
శీర్షిక  : నిలువు దోపిడీ.

 కాల గమనంలో మారుతున్న
 మనుషుల అంతరంగాల
 మానసిక బలహీనతల దోపిడీ ॥
    
 వివేకం కోల్పోతున్న యువతను
 పెడబారి పట్టించి భావి భారత
 భవితను దోచుకుంటున్న 
 డ్రగ్ మాఫియాకోరుల దోపిడీ ॥
    
 కల్తీ బాసల తో నోట్లకు ఓట్ల కొనుగోలునీ
 కల్తీ విక్రయాలతో జనాల నమ్మకాన్ని
 సొమ్ము చేసుకుంటున్న సత్తా , --
 తొత్తుల సాధింపుల దోపిడీ॥
    
 వావి వరుసలు మరచిన
 కామాంధుల వికృతి చేష్టలకు
 పసి నుండి ముసలి వరకు గల 
అబలల మాన-ధన దోపిడీ..॥
    
 లేని రోగాన్ని ఆపాదించి
 వైద్యం పేరుతో అంగాంగాలను
 అమ్ముకుంటున్న వక్ర ఆలోచనగల
 వైద్య  దేవుళ్ళ  దోపిడీ ॥
  
 కరోనా కాటుకు ఊపిరందక...
 ఆక్సిజన్ కరువై అంతమౌతున్న
 జనాల చితిమంటలకు వెలకట్టి
విస్తృతంగా  దోచుకుంటున్న 
కార్చిచ్చు రేపిన కన్నీటి దోపిడీ ॥
 
అధికార బలంతో న్యాయానికి 
రెక్కలు విరిచి సామాన్యుల  
బ్రతుకు భారాన్ని పెంచిన 
చచ్చు రాజకీయాల చిచ్చు 
వేటల  నిలువు దోపిడీ ॥
-----------------------------
   రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.

---------------.
హామీ : నా ఈకవిత ఏ మాధ్యమునుండీ 
ప్రచురితం కాని నా స్వీయ రచన.

ప్రక్రియ సున్నితం.

[5/7, 17:49] p3860749: సాహితీబృందావనవేదిక 
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
అంశం- గీతాంజలి కావ్యం 
తేదీ07-05-21.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక :స్ఫుార్తి రచన గీతాంజలి


1.
రవీంద్రనాథ్ టాగుార్ నోబుల్
 బహుమతి అందుకున్న అద్భుతమైన
 పద్య కావ్యరచన గీతాంజలి.
 చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
 2.
దేశభక్తి నిండు అక్షరారాధన
ప్రకృతి ఆరాధనల సాధన .
గీతాంజలి కావ్య రచనాభావన.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
3.
నిర్భయమైన మానసిక స్థితి
సమత  నిండిన  దేశప్రగతి
స్వాతంత్ర్యతా స్ఫుార్తి గీతాంజలి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
4.
పరిపుార్ణత నిండిన స్నేహనిరతి
స్వచ్ఛత నిండిన మనోగతి
మేల్కొలుపుల  గీతి  గీతాంజలి 
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
5.
ఆలోచనల్లో ప్రగతి తలపు 
 ఆవేశం, దేశవికాశ పిలుపు
 ఆచరణలో సమానత్వపు గెలుపు
 చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
[5/20, 17:14] p3860749: 20/05/2021
సాహితీ బృందావన వేదిక.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం: హెల్మెట్.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక . :కర్తవ్యపాలన నీ బాధ్యత.

1.
బాధ్యత ప్రథమ కర్తవ్యం.
భారత పౌరులకిది ముఖ్యం
భవిత చరితలకు సుబోధితం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
2.
వాహన ప్రయాణం  జీవితావసరం.
అధిక గతి ప్రమాదకరం
నియమాల అనుకరణలు ముఖ్యం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
3.
ఇద్దరు మించి ఎక్కవద్దు.
హెల్మెట్ ఉంటే తలకు ముద్దు.
 కుటుంబ పోషణ'  ప్రాణరక్షణ  
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
4.
దొరకని వస్తువుకు విలువెక్కువ.
ప్రాణం విలువైన కొలువు.
కొందామంటే మళ్ళీ రాదు.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
5.
కన్నవారి ఋణం తోర్పుకు
తాళిబొట్టు నిలుపు చేర్పుకు
హెల్మెట్  పెట్టుటే  కర్తవ్యపాలన
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
[5/21, 08:57] p3860749: 20/05/2021
సాహితీ బృందావన వేదిక.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం: హెల్మెట్.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక . :కర్తవ్యపాలన నీ బాధ్యత.

6.
బాధ్యత ప్రథమ కర్తవ్యం.
భారత పౌరులకిది ముఖ్యం
భవిత చరితలకు సుబోధితం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
7.
వాహన ప్రయాణం  జీవితావసరం.
అధిక గతి ప్రమాదకరం
నియమాల అనుకరణలు ముఖ్యం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
8.
ఇద్దరు మించి ఎక్కవద్దు.
హెల్మెట్ ఉంటే తలకు ముద్దు.
 కుటుంబ పోషణ'  ప్రాణరక్షణ  
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
9.
దొరకని వస్తువుకు విలువెక్కువ.
ప్రాణం విలువైన కొలువు.
కొందామంటే మళ్ళీ రాదు.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
10.
కన్నవారి ఋణం తోర్పుకు
తాళిబొట్టు నిలుపు చేర్పుకు
హెల్మెట్  పెట్టుటే  కర్తవ్యపాలన
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
[5/21, 19:16] p3860749: ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీత.
అంశం : కరోనా కష్టాల్లో మనోధైర్యం.
శీర్షిక : మనోధేర్యాన్ని మించిన మందు లేదు.

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .


11.
గతవత్సరం కరోనా భయానకం
మందులేని మహమ్మారిగా నిర్ణయం.
గృహ   నిర్బంధాల  బంధనం 
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
12.
సెకెండ్వేవ్  కలకలం  రేపినా
మనుషుల్లో గడచినానుభవాల సారంతో
భయంతగ్గి  పెరిగిన మనోధైర్యం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
13.
సామాజిక దుారాలు  పాటించడం
మాస్క్ లు శానిటైజర్ల వాడడం
చిరుతిళ్ళు చెడుసావాసాలకు దుారం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
14.
ఆత్మవిశ్వాశంతో అవలంభించిన సుగుణాలు॥
 వేక్సీన్ తో  పెరుగుతున్న  ఏంటీబాడీలు
 కరోనాను  తరిమే బాణాలు 
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
15.
ఆత్మవిశ్వాశంతో అవలంభించిన సుగుణాలు॥
ఆచార వ్యవహారాల సమయపాలనలు
సుచిశుభ్రతలకు  కట్టిన పట్టాలు   ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

Tuesday, June 8, 2021

ఏరువాక పుార్ణిమ.


వాగ్దేవీ కళాపీఠం లో...
అంశం : ఏరువాక పుార్ణిమ
శీర్షిక :ఆనంద వేడుకలు.

రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తi
కల్యాణ్ : మహారాష్ట్ర.

కవిత.
--------

వ్యవసాయ యజ్ఞానికి 
భుామి పుాజ ప్రారంభం.
ఏరువాక పుార్ణిమది
సీతా యజ్ఞ మని నామం॥

వర్ష ఋతువు లో వచ్చిన 
జ్యేష్ఠ శుద్ధ పుార్ణిమ.
రైతన్నల పరవశాల
రసవత్తర పండగ ॥

తొలకరి జల్లుల తోడుత
అరక దున్ను ఆనందం.
వ్యవసాయపు విధులకు
సాంప్రదాయ ప్రారంభం.॥

ఆనందపు సంబరాన
ఎడ్ల కు స్నానాలంకరణ
ఎడ్ల పుాజ లిడు లోగిలి
నైవేద్యం పొంగలి  ॥

బండలాగు పోటీలకు
భలే భలే సందళ్ళు.
పుట్టింటికి  ఆడపిల్ల లొచ్చే
సిరి మురిపాలు ॥

వప్ప మంగల దివసమంటు
వచ్చి కలియు రైతన్నలు
సాముాహిక సందడులతొ
దుక్కి దున్ను సంబరాలు ॥

Monday, June 7, 2021

గంగమ్మ

10..05. 2021
మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్
ప్రతి రోజు  కవితా  పండుగే
పర్యవేక్షణ:  డా॥.శ్రీ .అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: .దాసరి  చంద్రమౌళి  గారు
సమీక్షణ: శ్రీ .టి.ఆర్.కె.కామేశ్వరరావు .గారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక :  అన్నీ తెలిసిన వాడు.

ప్రక్రియ : వచన కవిత.

పితృదేవతల ఉత్తమ గతి ప్రాప్తి కొరకు
భగీరధుడు చేసిన తపో ఫలము చేత
ఉరుకులు పరుగులతో ఉధృత తరంగిణియై
ఉరికి వస్తున్న గంగమ్మను  శివుడు తన
జటా జుాటంలో బంధించి , లోకంలో
జీవ,  జంతుల రక్షణార్ధఁం చిన్న ధారగా
భుామిపైకి ప్రవహింపజేసేడు. పవిత్ర గంగ
మానవుల పాప ప్రక్షాళన చేస్తుా ,సమృద్ధిగా
నదీ -నదాల లో నిండి , జన జీవితాలను
ఉద్దరించి పాప ప్రక్షాళన గావించింది.
అటువంటి గంగమ్మ విలువ గుర్తించని
జనులు పవిత్ర గంగను కలుషితం చేస్తుా..
కాలుష్యం నిండిన పర్యావరణానికి
పునాదులేసారు.స్వార్ధ పుారిత మానవులకు
అహర్నశలుా అమృతాన్ని పంచే గంగమ్మ 
అవమానితయై ఆవేశంతో ఉరిమి ఉరికింది...
ఊరుా-వాడా ముంచెత్తింది.
ఆగడాలకు' ఆవిరై ఇగిరి పోయింది
శాంతముార్తయైన గంగ కలుషితాల కంపుకు కనుమరుగై  పోగా పీల్చ ప్రాణవాయువు ,
తాగ మంచినీరు కరువైన జనులు
విష కణాల బారిన పడి వింత రోగంతో
విధివంచితులై ఊపిరాడక
ఊర్ధ్వగతులకు చేరుకుంటున్నారు.
పర్యావరణ కాలుష్యానికి  పొగబారి
నల్లబడిన మేఘాలచాటునుండి తొంగి
చుాస్తున్న పుార్ణ చందృడు..
మందులేని మహమ్మారి కంట పడకుాడదని
ముఖం చాటేశాడు. అన్నీ తెలిసిన ఆది దేవుడు
శిలరుాప లింగాకారుడై కనులు ముాసుకొని
యొాగ-నిద్రలోకి జారిపోయాడు.

.
హామీ;  ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని , నా స్వీయ రచన..

.‍

నాన్న నా కనురెప్ప

మనుమసిద్ధి కవన వేదిక లో
అంశం :  కనురెప్ప.

రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తi
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.

శీర్షిక : నర-నారాయణుడు నాన్న.

అమ్మ పాల కమ్మదనంలో 
తీయని అమృత బిందువు నాన్న.
తొలి అడుగుల తడబాటులో
నిలకడ చేయుాత నాన్న.॥

నా జీవితపు ఎదుగు బాటలో
అలుపెరుగని చెమట చుక్క నాన్న..
నాఅశల పల్లకి బరువును ఆనందంగా
భుజాలపై మొాస్తున్న బాధ్యత నాన్న॥

గమ్య మెరుగని తుఫాను బాటలో
తనకు రక్షణ ఛత్రమై దారిచుాపే 
ముందు చుాపు కనురెప్ప నాన్న.॥

అవసరమున్న ప్రతిక్షణం నీకోసం
నేనున్నా నంటుా"నాకభయమిస్తున్న
భువి నిలచిన నర -నారాయణుడు-
                  ॥  నాన్బ.॥

నవరత్నాలు

చిలకపలుకులు.
ప్రాణహిత కవుల సంగమం మరియు భేరి
 సాహితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించు కవితల  పోటీ....
 
అంశం: పర్యావరణదినోత్సవం.
ప్రక్రియ : నవరత్నాలు.


నీవు  జల్లిన విత్తనాలు రేపటి వృక్షాలు
నీ నా తేడా చుాపని  నీడ పంచు స్నేహాలు
నీ సంకల్పమే జగతి నిండు పచ్చదనాలు.
నవరత్నాలు మానవ హిత కారకాలు!॥

నేలతల్లి మట్టి సుగంధాల పరవళ్ళు.
నాట్ల కు నీరిడ నిత్య వసంతాలు
చేస్తాయి  రోజుా పుాలుా పళ్ళ సంబరాలు
నవరత్నాలు మానవ హిత కారకాలు!॥


 చెట్లు పర్యావరణ రక్షకు ముాలాలు.
చేల్లో పిల్లగాలి  వీచి పసిడి వన పరిమళాలు
చేర గిరి ప్రాంతాలు వన ముాలికాధనాలు
 నవరత్నాలు మానవ హిత కారకాలు!॥

రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తi
కల్యాణ్ : మహారాష్ట్ర.

దోబుాచులాడబోకు

అంశము: *చిత్రకవిత*
 రాగం :  కల్యాణి .
 శీర్షిక :లలిత గీతం .
దోబుాచులాడబోకు...ముద్దుల కన్నా..
రచన : 
శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.

పల్లవి:
దోబుాచులాడబోకు  ముద్దులకన్నా
నిను చుాడకుండ ఉండలేను నమ్మర కన్నా॥

అను పల్లవి:
చిలికి వెన్న పాలు పెరుగు నైవేద్యముగా 
నీకు కలిపి తెచ్చినాను కల్ల కాదుర కన్నా ॥

చరణం:
చిత్తములో నీరుాపు చిన్మయానందమౌ
జ్యోతిగా నిలిపితినీ చుాడర కన్నా
ఆ జ్యోతి వెలుగు తోటలో 
భక్తి నిండు పుాలు తెచ్చి
 పుజసేయ వచ్చినాను చుాడర కన్నా ॥
చరణం:
మనసునిండు వసంతమై 
గొంతుపాడె కోయిలై
భక్తి గీతి భావ భరిత సంగీతమై
నా నోట పలుకు భావగీతి 
నీదు మురళి పాట రీతి
వినిపించర వేడుకగా వరదా కన్నా  ॥

చరణం :
నీ పదములె నా పలుకై
నా జీవము నీ కొరకై 
నిండు నుారు వసంతాల వరమిడు కన్నా..
నీ పదముల చిరు అడుగుల సడి
మురిపాల మువ్వల  సిరి
నా ఊపిరి లయగా నువు నిలుపర కన్నా ॥

-------------------------------------------------------
 

Sunday, June 6, 2021

నిండా మునిగిన జనాలు

శ్రీ కళావేదిక వారి కవితల పోటీ కొరకు...
అంశం :వలస బతుకులు.

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

శీర్షిక : నిండా మునిగిన జనాలు.


నోట్ల రద్దీతో మొదలైన  బ్రతకు ఆరాటం.
సామాన్యుల నుండి రోజు కుాలీల వరకు  
చేసే నిత్య జీవిత పొిరాటం.
అర్ధాంతరంగా ఆగిపోయిన వ్యవసాయాలు.
పనులు లేని బాటలో బడగు జీవిత వ్యధలు.
చేతిలో  చిల్లగవ్వలేని చితుకు బ్రతుకులు
ఆకలితో  అకమటించే  అన్నార్తులు.
లాక్ డౌన్ తో అట్టుడికిన ఆశలు.॥
 గుాడు వదలి రోడ్డున పడ్డ బతుకులు.
గమ్యం తెలీని బాటలో వరుస ప్రయాణాలు.
వలస జీవుల కష్టాలకు కాలే పాదాలే సాక్ష్యాలు.
పట్నం వీడిన  దారుల్లో పడిగాపుల ఆక్రోశాలు
ఆకలి చావులు , దహనం కాని శరీరాలు. 
రాజ్యాంగపుటెత్తుల  రస లీలా భాష్యాలు.
తప్పట్లు తాళాలతో ఆశా బాసల ఆలింగనాలు.
మీ  ఓటుకు మా నోటంటుా జనాల నమ్మకాన్ని
మత్తు తో చిత్తు చేస్తున్న చీడపురుగులు.
 అధికార బాసల అరకాసు ఓదార్పులతో.
నమ్మకాల నట్టేట్లో నిండా మునిగిన జనాలు॥
రక్షించే నాధుడు కానరాని కరోనా ప్రకోపం.
భరత భుామిలో  బిక్కు బిక్కు మంటున్న 
భావి తరాల భవిత కిది తీరని శాపం॥



హామీ: 
ఈ నా కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.

ప్రక్రియ :నవరత్నాలు , నియమ నిబంధనలు

🌹🌹🌹🌹🌹

 ప్రపంచ పర్యావరణ దినోత్సవం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ప్రాణహిత కవుల సంగమం  మరియు భేరి సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ను పురస్కరించుకుని 5.జూన్. 2021 నాడు 3 నవ రత్నాలు పంపాలి. 

నియమాలు

1. శీర్షిక
2. నవ రత్నాలు
3. పేరు
4. ఊరు పేరు & జిల్లా పేరు
  దూరవాణి/ సెల్ నెం.
5.ఫొటో

🌹🌹🌹🌹🌹🌹🌹
అంశం. పర్యావరణం గొప్పతనం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నవ రత్నాలు
1. దీనిలో 4 వరుసలు ఉండాలి
2. ప్రతి వరుసలో 10 నుండి 16 అక్షరాలు రావాలి
3.న గుణింతాము తో 1,2,3 వరుసలు మొదలవ్వాలి
4. చివరి వరుసలో
నవ రత్నాలు మానవ హిత కారకాలు అనే మకుటం రావాలి
💐💐💐💐💐💐💐💐💐
https://chat.whatsapp.com/LJrfVmgB6iiEb0IohieOoC
💐💐💐💐💐💐💐💐💐

Saturday, June 5, 2021

తురగవల్గన రగడ నియమాలు

తురగవల్గన రగడ నియమాలు:
1.రెండు పాదాలు ఉంటాయి.
2.ద్విత్రిస్ర గతి (3+3-3+3--3+3+3+3) మాత్రలలో ఉంటాయి.
3.ప్రాస నియమం మరియు అంత్య ప్రాస నియమం ఉంటుంది.
4.యతిమైత్రి: 1.1 -5.1(మొదటి త్రిస్రములోని మొదటి అక్షరానికి ఐదవ త్రిస్రములోని మొదటి అక్షరానికి యతిమైత్రి)
5.ప్రాసయతి నియమం లేదు
6.లఘువు=ఒక మాత్ర,గురువు=రెండుమాత్రలుగా లెక్కించవలెను.

 *ఉదాహరణ* :
*మ* _హ_ తినందు కవులు రగడ- *మ* హిమలన్ని తెలుసుకొని *రి* /
 *వి* _హ_ గమల్లెనూహలందు- *వి* రతిలేక కలలు కని *రి* //

 *వివరణ* :
రగడను పరిశీలిద్దాం

మొదటి పాదము:
మహతి|  నందు| కవులు|  రగడ|-
 I  I  I        U I      I  I  I     I I  I
   3     +     3   +    3     +   3

మహిమ|  లెన్నొ|  తెలుసు|  కొనిరి|
 I   I  I      U  I      I  I    I     I   I  I
   3     +     3    +    3     +    3

దీనిని ద్వి త్రిస్ర గతి అంటారు.
దీనిలో 
ప్రాసాక్షరం--హ
యతిమైత్రి--- మ-మ
అంత్యప్రాసాక్షరం--రి
ప్రాసయతి నియమం లేదు.

రెండవ పాదము:
విహగ| మల్లె | నూహ| లందు|-
 I I  I     U I    U   I     U  I
   3   +   3   +   3   +   3
విరతి|  లేక | కలలు|  కనిరి|
I   I  I    UI    I  I  I     I  I I
   3   +   3   + 3    +   3
దీనిలో 
ప్రాసాక్షరము- హ
అంత్యప్రాసాక్షరము - రి
యతిమైత్రి- వి--వి



ఈ విధంగా రెండు పాదాలుంటే తురగవల్గన రగడ అంటారు.ఇది హయప్రచార రగడకు రెట్టింపు ఉంటుంది.

ప్రక్రియ: *తురగవల్గన రగడ*

లఘువు+ గురువు కాకుండా గురువు+లఘువు (సూర్య గణాలు న,హ మాత్రమె) తీసుకోండీ...🙏🏻🌺🙏🏻

రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తi
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.
క్రమ సంఖ్య : 3.

శీర్షిక :  మినీ సుందరాకాండ .

రామ బంటు లంక జనెను
రామ కార్య మిదని మనెను.
రమణి  సీత  నచట జుాచి
రగిలి లంక గాల్చి తనెను ॥

అభయ మిచ్చె సీత కతడు
అభము శుభము నెరుగ డతడు
అభద్రతను విడిన  సీత
హనుమ భక్తి మెచ్చెను కడు ॥

రామ గురుతు సీత కిచ్చె
రమణి చుాడమణిని దెచ్చె ॥
రావణాసురునదె గుాల్చి
రాము డంత కపిని మెచ్చె॥

రామ సీత కడకు కలిసె
రామ రాజ్య మిలను వెలసె
రామ సీత కల్యాణమదె
రమ్య ముగను జగతి నిలిచె ॥

రామ నవమి పుణ్య దినము
రాక్షస  సంహరణ ఘనము
రమణి  సీత సంత సించె
రాముని పుాజింప మనము ॥



Thursday, June 3, 2021

నవ్వు నవ్వించు

ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : చిరునవ్వు. 

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర


శీర్షిక : నవ్వే సింగారం.


లేవగానే చిరునవ్వుతో  పలకరించు.
మనసులో మాలిన్యం తొలగి
రోజంతా ప్రసన్నంగా గడుస్తుంది

నలుగురితో నవ్వుతుా మాట్లాడు
అందరుా  నీస్నేహాన్ని కోరుతారు.
ఆపదలో ఆదుకునేది స్నేహితులే.

నవ్వు ఆరోగ్యానికి  సోపానం.
హాయిగా  నవ్వేవాళ్ళ ఆయువెక్కువట
నవ్వు నవ్వించడమే జీవితానందం .

కష్టల్లో ఆయుధం చిరునవ్వు
ఆత్మవిశ్వాసానికి  ఆలంబన చిరునవ్వు.
ఉమ్మడి కుటుంబాలకు ఊపిరి.

అతివకు అందం చిరునవ్వు.
బంధాల నిలుపు చిరునవ్వు.
పలకరింపుల పరవశం చిరునవ్వు 

నవ్వు నవ్వించు. నవ్వే 
నవరసాలకు  అందం.
నవ్వుతుా బతుకు .అదే
 జీవితానందం ॥

ఆకుపచ్చి బహుమతి

మనుమసిద్ధి కవన వేదిక
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
పర్యావరణ దినోత్సవం సందర్భంగా
అంశం:- ఆకుపచ్చని సిరి

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021.

కవితా శీర్షిక: పచ్చ చీర బహుమానం.

పెరుగుతున్న కాలుష్యానికి
దుర్భరమౌతున్న జీవితాలు॥
అడ్డదిడ్డపు   అనారోగ్యాలకు
తోడు కరోనా రేపిన కలకలాలు.॥

ఆక్సిజన్  కొరతతో అర్ధాంతర చావులు ,
తరుగుతున్న ఆరోగ్యంతో మందులేని
మహమ్మారికి లొంగుతున్న జనాలు.॥

కాలుష్యపు కంపుకు రోగ గ్రస్థయై
అతిదీనావస్తలో  ఆచ్ఛాదన లేని
శరీరాన్ని కప్పుకొనేందుకు చేతులు
అడ్డుపెట్టుకొని  ముడుచుకుపోతున్న
తక్లి భారతికి  ,ఆకుపచ్చని  అంబరాన్ని
బహుమతిగా  ఇచ్చేందుకు,పచ్చని
మొక్కలను నాటుతుా, పర్యావరణ
రక్షణకు పుానుకొన్న  భారత భావి తరాలు॥
   పిల్లల లో వచ్చిన మార్పు గమనించిన
  అమ్మ ముఖంలో  చిరునవ్వు జల్లులు
  అఖిల జనావళిలో ఆనంద పరవళ్ళు ॥

దత్తపది

వాగ్దేవి కళాపీఠం కవన వేదిక
విజయవాడ.
01/06/21
దత్తపది :
అంశం : చదువు . సంధ్య. వధువు. మధువు

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

1.ప్రక్రియ : ఆటవెలది.

(చదువు) కున్న నేమి చవకబా రినబాట
(సంధ్య) సమయ మందు  సఖుల జేరి
(వధువు) ఏడ్చు చుండ వదలి మత్తును
కోరి
(మధువు) గ్రోలు నీవు మనిషి వేన ॥

2. ప్రక్రియ : ఆటవెలది.

(చదువు) కున్న వాడు చవటగా వర్తించి
(సంధ్య )దాటి నంత  సఖుల జేరి
(వధువు) నగల నమ్మి  వరుసబా ధలబెట్టు
(మధువు) మరుగ నేల మత్తు విడుమ ॥

(చదువు) కున్న నేమి చవట వౌచు
(సంద్య)  రేయి పవలు  సఖుల జేరి
(వధువు) నేడి పించి (మధువు)మత్తునదేలు
పుట్టు కేమి టికిని పుడమి నీదు ॥

*వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక*
తేది: *02-06-2021*
*దత్తపది.*

*కడప - బాసర - కొండపల్లి - యాదగిరి*
----------------------------------------
రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

ప్రక్రియ : తేటగీతి 

(కడప) లోనున్న వేంకన్న  కరుణ ముార్తి
వాణి  వెలసిన  (బాసర)  వరము మనకు
(కొండ   పల్లి) బొ   మ్మదికొల్చు  కొలువులమ్మ
(యాద గిరి) స్వామి నరసింహు డవని ఘనుడు ॥
----------------------------------------

Tuesday, June 1, 2021

తెలంగాణా భష కవిత

గా యాది తొట్లెల పండుకొని ఊగినట్టే అనిపిత్తది
                 -అల్లాడి శ్రీనివాస్

అక్కల పిల్లగాండ్లకు మా అవ్వ తానం బోపియ్యంగ సూత్తే
గా బుడ్డ పిల్లగాండ్లకు తానం బోసుడు కళనే అనుడే...
కాళ్లు సాపుకొని నడ్మిట్ల బోర్ల, ఎల్లెల్కల పండవెట్డి లాల పోసుడే...
సబ్బులు గిబ్బులు ఏం పూసుడు లేదు...
శెనిగె పండి, బియ్యప్పిండి, పెసరు పిండిల
తులిసాకులు, యాపాకులు, పసుపులను కలిపి
ఇంట్ల తయారు జేసిన సున్నిపిండినే
గప్పటి గమ్మతైన సబ్బు...
గా పిండితోటి తానంజేపిత్తే
పెయంత నిగనిగయితుండే...
సెవుల్ల ముక్కుల్ల ఉఫ్ మని ఊది
పొడి పాత సీర పేగుల సుట్టుకొనచ్చి
నుల్క మంచంలేసి
గూన పెంకల నిప్కల మీద
ఊదేసి
మంచం కింద పొగ వెట్టుడే...

కండ్లకు కాటుక, బుగ్గ మీద సుక్క
నొసలు మీద శారాణ బిల్లంత 
నల్ల బొట్టు...
గ్రైపువాటరు తాపిచ్చి తొట్లెలేసి ఊపుతే...
బిడ్డ మాంచి నిద్రలకు జారుతుండే..

పిల్ల పుట్టిందని తెలంగనే
మాలేస కుల్లలు కుట్టిచ్చుడే...
సేతులకు జిట్డి పూసలు కట్టుడే..‌.

మునుపు
ఇరువై ఒక్క దినం తొట్లెల ఏసిన్నాడే
బిడ్డకు కొత్త బట్డలు తొడుగుడు....
గా దినమే దగ్గరున్న చేదబాయి కాడికోయి 
బాలెంత తోటి బొక్కెనేపిచ్చి
నీళ్లు చేదిపిచ్చి
ఇంటి దాంక మోపిచ్చుడే...

తొట్లెలున్న బిడ్డ మీద 
ఒక్కొక్కల్లు అంగి
సెవుల పేరు రొండు సార్ల జెప్పి 
కూ అనుడే...
గట్ల అంగినంక గాల్ల ఈపు మీద 
వరుసైనోల్లు గపాగపా గుద్దుడే...
గానాడు అందరితోటి
బాలెంతకు సుతం పత్తెమిడిసిపెట్టిచ్చి
కల్లు గుడాలు కాయికూర పెట్టుడే...

గానాడి గీ పనివరుసంతా మంచిదే...ఎట్లంటే

సున్ని పిండి తోలుకు ఓ ఆయుర్వేదం మందు తీర్గనే...
ఊదు పొగ పిల్లగాని సుట్టుపక్కల పురుగూ బూసి లేకుంటనే...
పిల్లకు కుల్ల కట్టుడు సల్లగాలి సెవులల్ల సొర్రకుంటనే...
బాలెంతతోటి నీళ్లు చేదిపిచ్చుడు..ఇగ పనిపాటలల్ల
పడచ్చని సెప్పుడే...
కల్లు గుడాలు కాయికూర తినుడంటే
పాలిచ్చే తల్లులకు బలపు తిండి కావాలనే...‌