Friday, October 29, 2021

యువతపై డ్రగ్స్ ప్రభావం.

అంశం : యువత పై డ్రగ్స్ ప్రభావం .
శీర్షిక : ఆగని చీకటి వ్యాపారం.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .

మాదకద్రవ్యాలతో  మారణహోమం.
మంచి పై చెడు సాధించిన విజయం.
సమాజంలో మార్పు కోరిన మనిషి విజ్ఞానం
మత్తు సుఖాలకై ఎందరి జీవితాలో పణం ॥

మానవ మేధావి చేసిన  మత్తు మధనం.
అన్ని బంధాలనుా కాలదన్నే ఖర్చు బేరం.
తనను తాను మర్చిపోయే స్థితిలో విహారం.
అన్నీ మరచిన మత్తులో చచ్చుబడిన జీవితం.॥

చట్టవిరుద్ధంగా మాదకద్రవ్యాల దుర్వినియొాగం, 
హెరాయిన్, కొకైన్, పొగాకు వంటివి విషతుల్యం.
పరిమితిని మించిన అలవాటు వల్ల అపాయం.
ఆరోగ్యనాశనానికి దారితీస్తున్న ఆనంద విషం ॥

ఐక్యరాజ్యసమితి ద్వారా -మాదకద్రవ్యాల
వ్యసన విధానాలపై చర్చ.
ఫెడరల్‌– గవర్నమెంట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్
చేస్తున్న అధ్యయనాలకు లొంగని వ్యవస్థ.॥

ధన,అధికార బలాల స్వార్ధ పుారిత వ్యాపారం.
భరత భవిత  బయటకురాలేని పద్మవ్యుాహం.
డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్న బలహీనం.
విందు వినోదాలలో ప్రాథమిక వ్యసనంగా మారి
స్వీయ నియంత్రణను కోల్పోతున్న యువతరం॥.

"డ్రగ్స్"....
నేటి సమాజంలో మొాడరన్  విలాసం.
వింత పశు ప్రవర్తనల విధి రాయని శాపం.
ఆపాలనుకున్నా ఆగని చీకటి వ్యాపారం.
అదోగతిపాలౌతున్న జనం-జనం మనం-మనం ॥

Wednesday, October 27, 2021

మత్తకోకిల పద్యాలు

మహతీ సాహితీ కవి సంగమం.
తేది: 28-10-2021: బుధవారం
అంశము: ఐచ్ఛికము

మ.సా.క.సం.: 19
కవిత సంఖ్య :3.

ప్రక్రియ: పద్యము మత్తకోకిల.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ  క్రిష్ణ కేశవ  పాహిమం
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ రక్షమాం ॥
క్రిష్ణ దేవకి నంద నందన క్రిష్ణ పాహి జనార్ధనా
క్రిష్ణ వేణుసు నాద నందిత  క్రిష్ణ  పార్ధసు సారధీ॥

దేవకీ వసు దేవ నందన        దేవ, దానవ భంజనా
భావ భక్తసు దాస పోషక       భాగ్య దాయక పావనా ॥
భుావరాభువ నైక పాలక       భుారి కారు ణ్యాఘనా
పావ నాఘన శాప మొాచ       పరేశ పంకజ లోచనా॥

బాల లీలల పల్లె గాచిన    భాగ్య భక్త జనావనా
గ్వాల మురళీ లోల లోచన   గర్వ, కాలుష వారణా
జాల గోకుల బాల  బాంధవ జార చోర జనావనా
పాల కాపశు పాల కాప్రియ బాల నందసు నందనా ॥

మాల తీసుమ హార శోభిత మాత దేవకి నందనా
లీల నాటక సుాత్ర ధారివి లీల విశ్వస్వ రుాపనా
పాల చేలకు చేల నాపరి పాల మంజుల భుాషణా
కాల లీలవి నోద నాఖలు కాళ కాళియ మర్దనా॥

శీల సద్గుణ రాయ సుందర శిష్ట పాలక  చిద్ఘనా
బాల లీలసు వేష మానుష  బంధ పాపవి మొాచనా
కాల కారణ జన్మ ధారణ  కావు మాఖగ వాహనా
నీల మేఘన శ్యామ సుందర నీళ -భుావర దేవనా ॥

చంద నాదిసు గంధ లేపిత చారు చంద్రసుహాసనా
వంద నీయసు సేవ్య సుందర పాద,పంకజ లోచనా
గంధ మాలసు భుాషితా నర కాంత కారక ధీవరా
సుందరా సుకుమారమేయ వసుంధరోద్ధర దేవరా ॥

శ్యామ సుందర భాగ్యదాయక సాయిసద్గుణ నాయకా
భామ సత్యహృధామ శ్రీపతి ,భార దుర్నరకాంతకా
కోమలాంగ సువేదవందిత కోటి సుార్యప్రకాశకా
సోమ-సుార్యసు లోచనా హరి శోభనా సుఖ కారకా॥

దేవ పార్ధస ఖాపరాత్పర  దేవ విశ్వస్వ రుాపకా 
కావరావయ  కంజ లోచన     కామితార్ధప్రదాయకా
సేవ జేతును వేద మూరుతి   శంఖ-చక్ర-గదాధరా
జీవ కోటి జనాది రక్షక   జీవనోత్తర కారకా    ॥

జీవ కోటికి రక్షణీయగ   జన్మ మెత్తిన  మాధనా
పావనానఘ పద్మలోచన పాహి భాగ్యవిధాయకా     ॥
ధావరా గిరిధారి నా మురళీధరా మన  మొాహనా
రావ బ్రోవగ  క్రిష్ణ ,పాండవ రక్షకా శుభకామనా ॥

గురువుల సమీక్ష
9️⃣✅ *భావమెంతయొ సుందరంబది పాడిచూడగ యద్భుతమ్!*

చాలా బాగా పద్యాలను కూర్చారు... ధన్యవాదాలు మరియు అభినందనలు...👌👌👏👏💐💐🙏🙏
9️⃣
నావైన గౌరవ ధన్యవాదాలు :

ఎట్టకేలకు ధన్యనైతిని ఏమిభాగ్యము గుర్వరా
చట్ట రీతిని చాల జెప్పిరి  చాక చక్యము తోనయా
దిట్ట మాత్రలు గట్టి ప్రాసలు తట్ట గల్గుటె మీ"దయా
పట్టజాలను సంత సంబును పాద అంజలి మీకయా॥

గురువుల ఆశీస్సులు .👇.


[10/27, 19:23] p3: మహతీ సాహితీ కవి సంగమం.

తేది: 28-10-2021: బుధవారం

అంశము: ఐచ్ఛికము

ప్రక్రియ: పద్యము మత్తకోకిల.


రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

కల్యాణ్  మహారాష్ట్ర .


మ.సా.క.సం.: 19

కవిత సంఖ్య :3.



క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ  క్రిష్ణ కేశవ  పాహిమం

క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ రక్షమాం ॥

క్రిష్ణ దేవకి నంద నందన క్రిష్ణ పాహి జనార్ధనా

క్రిష్ణ వేణుసు నాద నందిత  క్రిష్ణ  పార్ధసు సారధీ॥


దేవకీ వసు దేవ నందన        దేవ, దానవ భంజనా 

భావ భక్తసు దాస పోషక       భాగ్య దాయక పావనా ॥

భుావరాభువ నైక పాలక       భుారి కారు ణ్యాఘనా

పావ నాఘన శాప మొాచ       పరేశ పంకజ లోచనా॥


బాల లీలల పల్లె గాచిన    భాగ్య భక్త జనావనా

గ్వాల మురళీ లోల లోచన   గర్వ, కాలుష వారణా

జాల గోకుల బాల  బాంధవ జార చోర జనావనా 

పాల కాపశు పాల కాప్రియ బాల నందసు నందనా ॥


మాల తీసుమ హార శోభిత మాత దేవకి నందనా

లీల నాటక సుాత్ర ధారివి లీల విశ్వస్వ రుాపనా

పాల చేలకు చేల నాపరి పాల మంజుల భుాషణా 

కాల లీలవి నోద నాఖలు కాళ కాళియ మర్దనా॥


శీల సద్గుణ రాయ సుందర శిష్ట పాలక  చిద్ఘనా

బాల లీలసు వేష మానుష  బంధ పాపవి మొాచనా 

కాల కారణ జన్మ ధారణ  కావు మాఖగ వాహనా

నీల మేఘన శ్యామ సుందర నీళ -భుావర దేవనా ॥


చంద నాదిసు గంధ లేపిత చారు చంద్రసుహాసనా

వంద నీయసు సేవ్య సుందర పాద,పంకజ లోచనా

గంధ మాలసు భుాషితా నర కాంత కారక ధీవరా

సుందరా సుకుమారమేయ వసుంధరోద్ధర దేవరా ॥


శ్యామ సుందర భాగ్యదాయక సాయిసద్గుణ నాయకా

భామ సత్యహృధామ శ్రీపతి ,భార దుర్నరకాంతకా

కోమలాంగ సువేదవందిత కోటి సుార్యప్రకాశకా

సోమ-సుార్యసు లోచనా హరి శోభనా సుఖ కారకా॥


దేవ పార్ధస ఖాపరాత్పర  దేవ విశ్వస్వ రుాపకా  

కావరావయ  కంజ లోచన     కామితార్ధప్రదాయకా

సేవ జేతును వేద మూరుతి   శంఖ-చక్ర-గదాధరా

జీవ కోటి జనాది రక్షక   జీవనోత్తర కారకా    ॥


జీవ కోటికి రక్షణీయగ   జన్మ మెత్తిన  మాధనా

పావనానఘ పద్మలోచన పాహి భాగ్యవిధాయకా     ॥

ధావరా గిరిధారి నా మురళీధరా మన  మొాహనా

రావ బ్రోవగ  క్రిష్ణ ,పాండవ రక్షకా శుభకామనా ॥

***********      ************      **********


 *భావమెంతయొ సుందరంబది పాడిచూడగ యద్భుతమ్!* 

చాలా బాగా పద్యాలను కూర్చారు... ధన్యవాదాలు మరియు అభినందనలు...👌👌👏👏💐💐🙏🙏

 ఎట్టకేలకు ధన్యనైతిని ఏమిభాగ్యము గుర్వరా

చట్ట రీతిని చాల జెప్పిరి  చాక చక్యము తోనయా

దిట్ట మాత్రలు గట్టి ప్రాసలు తట్ట గల్గుటె మీ"దయా

పట్టజాలను సంత సంబును పాద అంజలి మీకయా॥

😅👍🙏🙏🙏

 *చూడచక్కని పద్యసాధన సొంతమే జగదీశ్వరీ...*

*నేడు చక్కని మత్తకోకిల నిచ్చినారు సహోదరీ!*🙏🙏🙏


దత్తపది : శివ -హర- భవ- శర్వ.


ప్రక్రియ : మత్త కోకిల.


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

కల్యాణ్ : మహారాష్ట్ర .


1.

శ్రీశ  సుందర మంది రా(హర) శిష్ట పాలక శంకరా

పాశధారి పరేశ  పన్నగ  భుాష పాహి త్రిలోచనా

నాశ పాప భవార్ణవా భవతార ణాభయ హారణా

ఆశ పాశ వినాశ  ఈశ్వర  హార సుందర భుాషణా ॥

2.

వారణా భయ హారణా(భవ )పాహి పాహిస దాశివా

కారణాసుఖ కారణా (హర) కాల కల్మష మొాచనా

దుార దుష్ట జనావనా దురితాది దుర్మద నాశనా  

హార శోభిత (శర్వ)సుందర హాఁవిషాద్గళ ధారణా॥


పద్య ప్రక్రియ : ఆటవెలది.

1.

చిత్త శుద్ధి తోడ చింతింతు నో(శివా)

భక్తి  తోడ గొల్తు (భవు)డె వేల్పు.

ముక్తి నిచ్చు (హరు)ని ముదమార భజియింతు

శక్తి  ధరుని (శర్వు) శరణటంచు ॥

2.

(హరు)డె అంత మాది, హరియించు నఘములు

(శివు)డె పాశ ధరుడు  శివుడె ధవుడు

(భవు)ని భాగ్య మీయ  భావింతు నిలలోన

 (శర్వు) శరణమందు సర్వ మతడె  ॥

 





😅👍🙏🙏🙏

Monday, October 25, 2021

ఉత్తరం

అంశం : ఉత్తరం.
శీర్షిక : మార్పు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

రమేష్  మనందరం కలుసుకొని మందు పార్టీ చేసుకుందాం రమ్మన్నావు. ఉత్సాహఅంగానే
బయలుదేరేను .ఎప్పటిలాగే  అమ్మ నానా గోలా చేసంది. నన్ను కన్నాదిట .చెడిపోతే చుాడలేదట.
ఎందరు కనలేదు . .నాన్న లేనందున అల్లారు ముద్దుగా పెంచిందట  అది అమె బాధ్యత. దానికి నేనామెకు ఒదిగి ఉండాలా..?
 నా ఆనందాలన్నీ ఆమెకు చెడు అలవాట్ల లాగ
కన్పిస్తున్నాయని నేను ఎప్పటిలాగే ఆమెను తోసి
ఆమె దగ్గరున్న డబ్బు గుంజుకొని మీదగ్గరకు చేరాలని
బయలుదేరేను. మీరు రమ్మన్న హోటల్లో 5 వ అంతస్తు
రుామ్ చేరడానికి లిఫ్ట్  ఎక్కేను. 
అక్కడ ఒకామె ముాలుగుతుా నిల్చొనుంది. 
ముాడవ అంతస్తు చేరేసరికి కరంటు పోయి లిఫ్ట్ 
ఆగిపోయింది. ఎంతసేపటికీ లిఫ్ట్  కదల లేదు.
ఈ లోపల ఆమె ముాల్గులు ఎక్కు వయ్యాయి నాకు
పరమ చిరాకు వేసింది . ఆమె నన్ను.పిలిచి ఎవరికో ఫోన్ చేయమంది. మొహం తిప్పుకున్నాను. మరి కిదచది సేపట్లో అమె కింద కుాలబడింది. అపుడు గమనించేను .ఆమె పొట్ట చాలా ఎత్తుగా ఉంది
ఆమె ముాల్గులు అరుపులుగా మారేయి.
లిఫ్ట్ అంతా రక్తసిక్తమయమయ్యింది. అమె నోరు ఎండిపోతోంది. అమె నన్ను చుాస్తుా  బాబుా ..
నా కడుపులో చిన్న బాబున్నాడు. వాడు బయటకు వస్తానంటున్నాడు . నాకు సాయం చేయవా ..?
అంది. నేను నోరెళ్ళ బెట్టుకు చుాస్తున్నాను. భతంతో నా రక్తం గడ్డ కట్టుకు పోయింది
ఆమె రెండు కాళ్ళుా విడదీసి బాధన ణచుకుంటుా
లోపలి ప్రాణాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాది.
అంత వరకు ఆడదంటే  ఆట బొమ్మలా చుాసిన నాకు ఆమె ఒక బిడ్డని కనడం కోసం పడుతున్న నరకం
చుాసి కళ్ళు తిరిగేయి.
వెంటనే అమ్మ జ్ఞాపకం వచ్చింది .అమ్మ కుాడా న న్నిలాగే కన్నాదా...? ఇంత కష్టపడి కన్న బిడ్డ 
జీవితాన్ని పాడు చేసుకుంటుా ఉంటే  ఏ అమ్మ 
చుాడ గలదు అనుకున్నాను . అమ్మతో ఎంతో కటువుగా వ్యవహరించిన నేను మరో అమ్మకు 
అనుకో కుండా సాయంచేసేను. పుట్టిన రక్తసిక్తమైన
పాపని గుండెలకు హత్తుకొని మురుసిపోతున్న ఆతల్లి లో నా తల్లి కనిపించింది. కరెంటు వచ్చింది. అమెను
మరి కొందరి సాయంతో ఆసుపత్రికి తీసుకెళుతున్నాను
ఈ అమ్మ, ఏ తల్లి కన్న బిడ్డవో..నీలాంటి మంచి బిడ్డను కన్న మీ అమ్మ చాలా అదృష్ట వంతురాలు అంటుాంటే 
తల సిగ్గుతో  వంగిపోయింది.
ఈ రోజునుంచి నేను నాకున్న చెడు అలవాట్లను మానీయడానికి  ప్రయత్నిస్తాను. మీరు కుాడా నామాట వినండి. అమ్మలను ఏడిపించ వద్దు.
నేను అమ్మ విలువ తెలుసుకున్నాను.ఇక ఎపుడుా అమ్మ మనసు కష్ట పెట్టను. 
ఉంటాను . వాట్సప్  మెసేజ్ అని కొట్టి పారీకండి.
నిజంగా అమ్మలు దేవతలు.





దత్తపది.

నలము       IIII     నగము      IIIU
సలము       IIUI   భగణము   UII
రగణము   UIU   తగణము    UUI
ర ల ళ

మహతీ సాహితీ కవి సంగమం
అంశం  : దత్త పది శంఖము, చక్రము, గద, ఖడ్గము )
తే : 23- 10- 2021

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
ఊరు:  కల్యాణ్. మహారాష్ట్ర .
అంశం  : దత్త పది శంఖము, చక్రము, గద, ఖడ్గము )
మసా కసం :  19
ప్రక్రియ : ఆటవెలది.

1.
( ఖడ్గధారి వీవు  ఖలునాశ జగదీశ
(గద)తొ  గుాల్చసురుల గదిమి గొట్టు
(శంఖ )(చక్ర)ముగల శస్త్రధారివి గావ
పార్ధ సార ధీశ పలుక  వయ్య. ॥

తేటగీతి:

కనగ  జగమంత కన్నులే  (ఖడ్గ) ధారి
వేల చేతుల (గద)లున్న వేద ముార్తి.    
శంఖ) నాదమిడి దృంచు (చక్ర) ధారి
విశ్వ మంతయు నిండిన విశ్వ రుాప॥

శంఖ చక్ర ములతొ  శరణన్న  వారిగను
శ్రీశ  ఖడ్గ ధారి  శరణు శరణు
ఘన వేద రక్ష    ఖలునాశ శుభేచ్చా
పాహి గదా ధారి పరమ పురుష ॥

మున్ను గీత తత్త్వ మును బోధ నదెజేయ
సార  మహిమ దెలిసె సవ్య సాచి
శంఖ చక్ర  ములతొ సఖునిబ్రో చినసామి
గదా ఖడ్గ ధారి  గావు మమ్ము  ॥

చిత్ర కవిత.

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతిరోజు కవితాపండుగే

పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: *శ్రీ దాసరి చంద్రమౌళి గారు
సమీక్షణ: *శ్రీ టిఆర్ కె కామేశ్వరరావు గారు
తేది: *18-10-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: ఐచ్ఛికం.
క్రమ సంఖ్య : 37.
కవిత సంఖ్య : 1.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

పద్య ప్రక్రియ : ఆటవెలది.
అంశం :మనిషి -మేధస్సు .
శీర్షిక  :   ఓ మనిషీ , మేలుకో...

మేధ నిండు మనిషి  మెట్టు మెట్టుగజేరె
చంద్ర మండ లమ్ము  జక్క గాను
తెలివి మీరు పనుల దెలియలే దతనికి
బతుకు దుర్భ రమ్ము  భార మగుత ॥

ఏమి ఫలము వచ్చె అంతరిక్షము జుట్ట
సెట్టు లైట్లు పెరిగె  గుట్టు లుడిగె
అంతర్జాల మహిమ అన్ని వెల్లడులాయె
బుద్ధి తరిగె మనిషి శుద్ధి మరచె ॥

అడవి రాజ్య మాయె  అశ్లీలతే పెరిగె
కామ వాంఛ పెరిగె కలత పెరిగె
చంద మామ కధల  జగతి నీతులు మారె
చెడుపు జేరె నిలను చెదిరె బ్రతుకు ॥

విజ్ఞానమును పెంచి  విశ్వమంతయు జుట్టి
వివిధ రీతు లతడు విర్ర వీగె
చెట్లు గొట్టి యతడు చేయగా శోధనా
ప్రాణ వాయు లేక ప్రజలు జచ్చె ॥

పెరిగె కాలు షమ్ము  తరిగె భుాసారమ్ము
యంత్ర హోరు పెరిగె యవని లోన
పనులు మానె జనులు పరికించ నీరింకె
పంట పొలము లెండి పతన మాయె ॥

కోటి విద్య లేల కోరుబ్ర తుకులేని
ఉద్ధ రింప వయ్య నుర్వి నీవు
భువిని మట్టు పెట్టి భువనమ్ము లేలేవు.
ధరణి నుద్ధ రించు ధర్మ మదియె ॥

జ్ఞాన మార్గ మదియె జనహిత మౌమాట
కష్ట నష్ట ములవె  కరుగ జేయ
విద్య  విత్తు వేసి విజ్ఞాన మును పెంచు
విజయ బాట లేలి వినుతి కెక్క ॥

ప్రస్తుత పరిస్థితుల బట్టి
రాసిన ఈ పద్యాలు  నా ద్వీయ రచనలు.

అమ్మకానికి అమ్మ

మహతీ సాహితీ కవి సంగమం
అంశం: ఐచ్ఛికం.
తేది: 01-10-2021
మసాక.సం: 19
కవిత సంఖ్య 4.
కవి పేరు: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ఊరు:  కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక:  అమ్మకానికి అమ్మ.
ప్రక్రియ:  వచన కవిత .

కౌరవ రాజ్యంలో కార్చిచ్చు.
కనీ వినీ ఎరుగని వింతలుా
విడ్డుారాలు.॥
అమ్మతనం లో ఆడతనం
చుాసిన ఊర నక్కలు.
బోసినవ్వుల పాపలను కుాడా
విడిచిపెట్టని కామాంధులు.॥
కుటిల  కృార చేష్టలతో
కులహీనులౌతున్న నేటి యువత.
ప్రశ్న వేస్తే పెట్రేగుతున్న ఘనత ॥
నాల్కనే కత్తి వేట్లతో
కుంటిదౌతున్న పెత్తనం.
పనికిరసని చెత్తగా 
పారవేయబడుతున్న వ్రద్ధాప్యం ॥
ఆత్మహత్యల ఊబిలో అన్నదాతలు.
నీతి నియమాలు మరచిన ప్రజలు.॥
అవక తవకల ఆగ్రహాలకు
ఆహుతౌతున్న  అమాయకులు.॥
మార్పు మార్పంటుా నరమృగాలుగా
మారుతున్న మనుషులు .॥
మారిన మనస్తత్వాలు చేస్తున్న
మారణహోమాలు.॥
మాడి మసౌతున్న నీ, నా బంధాలు.
జాతి మత భేదాల భేరీ నినాదాలు.॥
రక్తపు దారుల్లో మొాగుతున్న
మరణమృదంగాలు.॥
కళ్ళుముాసుకున్న కేంద్ర పాలనలో
పెట్రేగుతున్న రౌడీ నాయకుల ఆగడాలు॥ .
అసంతృప్తి నిండిన జనాల్లో
కోలుకో లేని అర్ధాంతర చావులు ॥
శాంతి నిండిన ఉద్యమ
దారుల దాడుల్లో ఆహుతౌతున్న 
అమాయక జనాలు॥
భరత మాత ఒడి నిండిన
బంజరు భుామిలో కన్నీటి సేద్యం ॥
న్యాయ ధర్మాలు అంతరించిన
దేశంలో,ఆత్మబలం లోపించిన చోద్యం ॥
పరదేశం పట్టుకు పాకులాడుతున్న
పాపుల్లారా.. రండి రండి
పనికిమాలిన మా దేశ మాత ప్రగతి
వేలం వేయబడుతోంది. రండి రండి
అవకాశాలన్నీ మీకే...
మా నోరు పక్షవాతంతో
పక్కదార్లు పట్టి పడిపోయింది.
మాట్లాడేవాడులేడు..రండి రండి.
మా అమ్మ అమ్మకానికుంది.







Sunday, October 24, 2021

గజల్ వివరణ

[10/15, 16:29] +91 6305 543 917: మిత్రులకు సాహితీ వందనం....
ఈరోజు ప్రజాశక్తి దినపత్రికలో 'సురారం శంకర్' గారి 'సౌపర్ణిక' గజల్ సంపుటి పై నేను రాసిన సమీక్ష.....తప్పకుండా చదవండి....
పత్రిక యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు...🙏

🌷 హృదయ కాంతుల మెరుపు సౌపర్ణిక 🌷

శబ్ద సౌందర్యంతో కూడిన కవిత్వం వినసొంపుగా ఉంటుంది...
అందులో అద్భుతమైన భావం ఇమిడి ఉంటే మనోహరంగా ఉంటుంది....
లయగా సాగుతున్న కవిత్వాన్ని చదువుతున్నప్పుడు....పెదవులు పాటలాగా పాడాలని మారాం చేస్తాయి...మనసైతే భద్రపరచుకుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంది...

గజల్ ప్రక్రియకు ఈ అద్భుతమైన లక్షణాలన్నీ ఉన్నందువల్లేమో కవులు తమ భాషల్లో గజల్ సౌందర్యాన్ని ప్రవహింపజేస్తున్నారు....

గజల్ మొదట అరబ్బీ, పర్షియన్ భాషల్లో మొదలైనా ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తోంది...ఇది మాత్రా ఛందస్సు తో కూడిన ప్రక్రియ....

పంక్తుల జతను షేర్ అంటారు. మొదటి షేర్ ను మత్లా....చివరి షేర్ ను మక్తా అంటారు...చివరి షేర్ లో రచయిత తన పేరును చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది....దీనిని తఖల్లుస్ అంటారు...ఆ పేరు కూడా భావంలో ఇమిడి పోవాలి...
గజల్ లోని భావవ్యక్తీకరణలో చమత్కారం ముఖ్యం...గజల్ లో వస్తువు ముఖ్యంగా ప్రేమ, విరహం , తాత్వికత ఉంటుంది...విరహాన్ని మరీ దుఃఖిస్తున్నట్లుగా కాకుండా కాస్త ప్రేమలో ముంచి రాస్తే మరింతగా గుభాళిస్తుంది....

ఇప్పుడు 'సౌపర్ణిక' లోని కొన్ని షేర్లను పరిచయం చేస్తున్నాను

//మనసును ఎందుకు మరిమరి మరిమరి భ్రమ పెట్టుకుంటామో తెలియదు
'చిరుగును' చూసి 'చిగురని' ఎందుకు ఒప్పేసుకుంటామో తెలియదు//ఈ మత్లా లో  మనసు పడే వేదన గురించి హృద్యంగా రాశారు....ఒక్కోసారి కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా...మనం ఒప్పుకోము...మనకు నచ్చిన విధంగానే జరుగుతున్నట్లు భ్రమలో ఉంటాము...అలాంటప్పుడే చిరుగులు కూడా చిగురులుగా కనిపిస్తాయి...కానీ ఇది కూడా గాయ పడిన మనసుకు ఊరటే....

//నిలిచిపోయే పాటనే ఇల 'రాసి' వెళతాను
గుండె మీటే మాటకే 'ఓటేసి' వెళతాను
సత్యమేదో తెలిసినాక సంకెలల బ్రతుకెందుకు 
స్వార్థ చింతన నిక్కడే 'వదిలేసి' వెళతాను//...ఈ గజల్ లో మంచి తాత్వికత ఉంది...
మన జీవితం ఎప్పుడూ ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి...మనం ఇంక లేము అని తెలిసినప్పుడు మన మాటలు మన మంచితనం కొన్నాళ్ళ వరకైనా అందరికీ గుర్తుండి పోవాలి. అందుకే మనిషి స్వార్థాన్ని వదులుకోవాలని కవి అంటున్నారు....ఇందులోనే నాలుగవ షేర్లో ఇలా అంటున్నారు...
//కోటి జన్మలు ఎత్తినా, ఈ కోరికల సడి తీరునా?
సంతృప్తి పాదును ఇప్పుడే 'సరిచేసి' వెళతాను// ....ఎంత గొప్ప భావం....మనిషిలో కోరికలెప్పుడూ సడి చేస్తూనే ఉంటాయి , అందుకే మనం ఉన్న దాంతోనే సంతృప్తి పడడం నేర్చుకోవాలంటున్నారు....

 //చిరునవ్వు కన్నా అందమైన 'స్వాగతం' ఉందా?
బాల్యాని కన్నా మధురమైన 'జ్ఞాపకం' ఉందా?//....చక్కగా చెప్పారు చిరునవ్వు కన్నా మించిన స్వాగతం లేదు అలాగే చిరునవ్వు కన్నా మించిన ఆభరణమూ లేదు...మనసులో ఎంత బాధ ఉన్నా కొద్ది మంది పెదవులపై చిరునవ్వు చెక్కు చెదరదు...ఒక్కోసారి బాధలను ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఆ చిరునవ్వే ఇస్తుంది...అందుకే చిరునవ్వును ఎవరూ దూరం చేసుకోకూడదు...మోవికి అందాన్ని ఇస్తుంది....అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంక అందులోనే కవి అంటున్నారు బాల్యానికన్నా మధురమైన జ్ఞాపకం ఉందా అని...ఎవరికీ ఉండదు అంతకన్నా మధురమైన జ్ఞాపకం....

//నా పూలతోటలో పూలన్నీ ఎవరో 'త్రుంచుకు' వెళ్ళారు
మధురోహల నా ఏకాంతాలను ఎవరో 'దోచుకు' వెళ్ళారు//...ఎంత అందమైన భావవ్యక్తీకరణ....నా తోటలోని పూలన్నీ ఎవరో తుంచేశారు....అచ్చంగా నేను ఊహల్లో విహరిస్తుంటే నా ఏకాంతాలను ఎవరో దోచుకు వెళ్ళినట్లుగా అంటున్నారు...ఏకాంతాలను పూలతో పోల్చడం ఎంతో బాగుంది.

//ఎపుడో అపుడు నువ్వూ నేనూ 'కలువక' పోతామా?
ఇద్దరి ఎడదల పొగిలిన సుద్దులు 'నుడువక' పోతామా? //....ఎవరికైనా ఈ వాక్యాలు నచ్చుతాయి...
నువ్వూ నేనూ నింగి నేలా ఏమీ కాము కదా కలువక పోవడానికి...ఎపుడో ఒకప్పుడు తప్పక కలుస్తాము ఆక్షణం ఇన్నాళ్లూ మన ఇరువురి హృదయాలలో దాచుకున్న  ఊసులన్నింటినీ ఒకరికొకరం వినిపించుకుంటాము....
ఇందులోనే ఇంకో షేర్లో ఇలా అంటున్నారు...
//నీదో గమ్యం నాదో గమ్యం, ఇద్దరి మధ్య అగాధం
అయినా ఒకరికి ఒకరం మనసుని 'చాటక పోతామా' ?// ....నీ గమ్యం వేరు నా గమ్యం వేరు మళ్ళీ ఇద్దరి మధ్యన పెద్ద అగాధం ఉంది అయినా కూడా ఎప్పటికైనా మన మనసులు మళ్ళీ ఒకటవకుండా ఉంటాయా అని అనడంలో గొప్ప ఆశావాద దృక్పథం ఉంది....ప్రేమ విఫలమైతే చావాల్సిన అవసరం లేదు....ఎదురు చూద్దాం ఎప్పటికైనా కలుస్తామనే ఆశతో....లేదా మనసులో ఉన్న వాళ్ళ జ్ఞాపకాలతోనైనా జీవిద్దాం...

//జాబిల్లికి చెయ్యందిస్తే నీతో కరచాలనమే
హరివిల్లుకు హృదయాన్నిస్తే నీతో నా పరిచయమే//...ఎంత మధురంగా ఉందీ షేర్....ఆమెతో స్నేహం జాబిల్లికి చేయందించినట్లుగా , ఆమెతో పరిచయం హరివిల్లుకు హృదయాన్నిచ్చినట్లుగా ఉంది అంటూ అందమైన పోలికలతో చెప్పారు...
ఇందులోనే ఇంకో షేర్....
//ఈ లోకం పచ్చిక నిండా నీ పద ముద్రలే
చిరుగాలికి ముచ్చట చెబితే నీతో సంభాషణమే//.....ఈ లోకం పచ్చిక నిండా నీ పదముద్రలే అంటే ఆమె నడిచే దారంతా వసంతం పరచుకుంటోందని, గాలితో చెప్పే మాటలన్నీ నీతో మాట్లాడినట్లే ఉంటుంది అనడం లో గాఢమైన అనురాగం దాగి ఉంది....

//ఏ అక్షరానికి తెలియదు తన 'ఉనికి బలమెంతో'
ఏ పావురానికి తోచదు తన 'రెక్కల బలమెంతో' //....
నిజమే కదా అక్షరాలకున్న బలం ఎంతటిదో ఎవరికీ తెలియదు....అదే విధంగా ఎవరి శక్తి వాళ్ళకు ఎప్పటికీ తెలియదు....కాలమే అన్నింటినీ తెలియజేస్తుంది....కొన్ని సార్లు మనం నిమిత్త మాత్రులుగానే ఉండిపోవాలి. 

ఈ 'సౌపర్ణిక' సంపుటిలోని ప్రతి గజల్ అద్భుతంగా ఉంది....తేనె ధారల్లో తడిసిన భావన కలుగుతుంది ఎవరికైనా...ప్రతి గజల్ ని  రెండు సార్లు చదవాలనిపించేంత చక్కగా ఉంది...

మంచి గజళ్ళు చదువుతుంటే మనసును సున్నితమైన పరిమళమేదో చుట్టుకున్న భావన కలుగుతుంది....ఇంకాసేపు చదవాలనే కోరిక కలుగుతుంది...అచ్చంగా సూరారం శంకర్ రచించిన 'సౌపర్ణిక' గజల్ సంపుటి లాగానే....

మరెన్నో అద్భుతమైన పుస్తకాలను పాఠకలోకానికి అందివ్వాలని కోరుకుంటూ సురారం శంకర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.

సమీక్షకురాలు
శాంతి కృష్ణ, గుoటూరు.
[10/15, 16:29] +91 6305 543 917: ---( పాత పోస్ట్... ఫేస్బుక్ గుర్తు చేసింది. కొత్త మిత్రుల కోసం మళ్ళీ... ఇదివరకే చదివినవారు అసహనానికి గురి కావద్దని మనవి-------------------)
--------------------
గజల్ తరంగిణి (వ్యాసాలు)
----------------------
--------- " మిథున కవితా వనం " ద్వారా Madam Leela kay & అడ్మిన్స్ పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతున్న ధారావాహికకు స్వాగతం ... !  సు స్వాగతం ... !! 

--------- గతవారం తరువాయి---- 

------------- గతవారం గజల్ ఛందస్సు గురించి కొంత మేర తెలుసుకున్నాం--- 

------  ఉరుదు గజల్ ఛందస్సు నుండి  తెలుగు భాషా  పరిమితులకు ఒదిగేంత మేర  ఉరుదూ ఛందస్సును మాత్రమే మనం  గ్రహించినాము .. అంతకు మించి అనగా పూర్తి స్థాయి ఉరుదూ గజల్ ఛందస్సును ఉన్నదున్నట్లు మనం  తెలుగులో  ఉపయోగించుకోవడం లేదనీ , ఆ అవసరం కూడా మనకు లేదనీ నా పరిశీలనలో తెలియవచ్చిన నిజం..  

ఉదా।।

---------- ఉరుదూలో గణాన్ని " రుక్న్ "మ అంటారు . గణాలను " ఇర్ కాన్ " అంటారు. 

------- ఉరుదూ లో 5 మాత్రల గణాలు =2 , ( 1) ఫఊలున్ --- ( తెెలుగులో " య "గణము  IUU . )  ఫ=। , ఊ= U, లున్ =  U , -----అలాగే , (2) ఫాయిలున్ . తెలుగులో ఇది "ర" గణము UIU , 

----------  7 మాత్రల గణాలు =5 , 
1) ముస్త ఫయిలున్  UI II U (  తెలుగులో  గణము లేదు ) 

2) మఫయిలున్ IIIU ( do) 

3) ఫాయిలాతున్ UIUU (do ) 

4) ముత్ ఫాయిలున్ U U IU (do)

5) మఫ ఉలాన్ IIIU ( do ) 

(** Note := పై గణాలలోని గురు లఘువులను నేను తెలుగు భాషా ఛందస్సును అనుసరించి గణించినాను . ఉరుదూ ఛందస్సు ప్రకారం అయితే ప్రతి పొన్ను అక్షరం ఒక లఘువు I గా గణించవలసి ఉంటుంది . అలా రాస్తే కొందరు Confuse అవుతారని రాయలేదు. ) 

------ పై గణాలతో బహర్ లు ఏర్పడ్డాయి..  అవి సుమారు  19వరకు ఉన్నాయని పెన్నా గారు పేర్కొన్నారు ... అవి వరుసగా -------- 

1) హజజ్
2) రజజ్ 
3) రమల్
4) ముత్ కారిబ్ 
5)ముత్ దారిక్ 
6) కామిల్ 
7)వాఫర్ 
8) మున్ సరహ్ 
9) ముజారా 
10)సరీఅ 
11) ఖఫీఫ్ 
12) ముజత్తాన్ 
13) ముక్త జబ్ 
14) తవీల్ 
15) మదీద్ 
16) బసీత్ 
17)  జదీద్ 
18) కరీబ్ 
19) మశాకిల్ 

Note := ఇవే కాకండా మాత్రల హెచ్చు తగ్గులతో మరిన్ని బహర్ ఏర్పరచుకున్నారు.

------------- పైన పేర్కొనిన  ఉరుదూ ఛందస్సు నిబంధనలు., బహర్ లు పాఠించడంలో మనకు ఏమాత్రం సౌలభ్యత లేదు 1,2 మినహా ---- మరో ముఖ్య  విషయం -- ఉరుదూలో   పొన్నును ( ్ )  ఒక మాత్ర గా   ( అనగా లఘువు గా) లెక్కిస్తారు . తెలుగులో పొన్నును దానికి ముందు ఉన్న హ్రస్వా క్షరానికి కలిపి U   గురువు గా గణిస్తాము. దీర్ఘాక్షరం తరువాత వస్తే దానిని కూడా U గా గణిస్తాము. అదే ఉరుదూ లో అయితే దీర్ఘాక్షరం తరువాత వచ్చే పొన్నును ఒక లఘువు I గా గణిస్తారు..... 

------- కావున తెలుగు గజల్ రచయితలు ఉరుదూ గజల్ బహర్ ల ఛందస్సు ను మక్కీకి మక్కీ అనుసరించ వలెనన్న నిబంధన ఏమాత్రం అవసరం లేదని నా  పరిశీలనకు వచ్చిన  విషయంగా నేను భావిస్తున్నాను . 

----------- ఇకపోతే , కాఫియా , రదీఫ్ ల సంగతి ....... ? 

........ ఇప్పటికీ ఈ విషయంలో చాలా మంది  తెలుగుి గజల్ కవులు సందిగ్దంలో ఉన్నట్లు నేను గ్రహించాను . 

-------- నిజానికి ఇదేమంత అర్ధం కాని విషయం కాదు. కాస్త శ్రద్ధ కావాలి అంతే-----  

----దీనిని  శబ్ద బ్రహ్మ డా।। సినారె గారి గజల్ ఉదా।। తో  తెలుసుకుందాము----  

1) చిన్న దీపమని అనుకోకు అది  చీకటినే కాల్చేస్తుంది 
జనమేం చేస్తుందనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది 

2) ఎంత తెగించిన సాహసమో నినదించే  ఊరేగింపులకు 
వట్టి పిడికిలే అనుకోకు అది చట్టాలను    పేల్చే స్తుంది 

------------- పై రెండు షేర్  లలో చివరి అంత్య ప్రాసలైన """""  కాల్చేస్తుంది ,  మార్చేస్తుంది , పేల్చేస్తుంది. కాఫియాలు అవుతాయి .  ఈ గజల్ లో రదీఫ్ లేదు. కనక ఇది బేమురద్దఫ్ గజల్ అవుతుంది . 

------------- మరో ఉదాహరణ డా।। సినారె గారిదే. 

1) అవని రూపు పరమాణువునడిగి తెలుసుకో 
కడలి లోతు కన్నీరై కరిగి తెలుసుకో 

2) ఏ సిరులూ పొందని సంతృప్తి ఏమిటో 
కళాసరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో 

4) నిట్టూర్పు సెగల్లో గీపెట్టే మౌనం 
ఉబికే సుడిగాడ్పులోన ఒదిగి తెలుసుకో 

---------- పై షేర్ లలో ---- మత్లా లోని  పాదాల చివరి రెండు పదాలు " తెలుసుకో "  , అలాగే  2) , 3) షేర్లలోని రెండవ పాదం చివరి పదాలు " తెలుసుకో " అనేవి '"  రదీఫ్ " లు అవుతాయి . 

-------- మరి కాఫియాలు ఏవి ? 
 
-------- మత్లా పాదాంతంలోని  రదీఫ్ (తెలుసుకో )కు ముందు వాడిన ----- 1) అడిగి , కరిగి  మిగిలిన 2వ షేర్ లోని రెండవ పాదంలోని  రదీఫ్ (తెలుసుకో )కు ముందు పదమైన "కడిగి .""" 3) వ షేర్లో రెండవ పాదం చివరి పదమైన రదీఫ్ ( తెలుసుకో )కు ముందు పదమైన "ఒదిగి"" కాఫియాలు అవుతాయి... 

--------- రదీఫ్ లేకుండా రాసే గజల్ల ను , బేమురద్దఫ్ ,  లేక గైర్ మురద్దఫ్ గజల్లంటారు..  ఎలా రాసినా భాష , భావుతలను జోడు గుర్రాల్లా నడిపించగలగాలి . 

------ ఇంకా ఉంది ,  

---------- ఈ వారం గజల్ తరంగిణి ని తెలుగు గజల్ మహాకవి డా ।। సినారె గారి కి స్మృత్యంజలిగా సమర్పించుకుంటూ శలవు తీసుకుంటున్నాను...  

------- వొచ్చే వారం మరిన్ని వివరాలతో మీ, ముందుంటాను. ....  ఆదరిస్తున్న అందరికీ నమస్సులతో --

-- మీ సూరారం శంకర్. 16.06.2017.
[10/15, 16:58] +91 6305 543 917: గజల్ పుట్టిందే సూఫీ తత్వం లో.సూఫీ తత్వం అంటే భగవంతుడు నిరాకారుడు. సూఫీ తత్వం లో ఇక్కడ వున్నాడు.అక్కడ లేడు అనే ప్రశ్నే లేదు.మనం ఎందులో భగవంతుని చూడా లనుకున్నా అందులోనే ఉంటాడు. *ఋగ్వేదంలో.. ఏ కం తత్ విప్ర బహుదా వదంతి* అంటే భగవంతుడు ఒక్కడే! అనేక రూపాలలో చెబుతాం!ఇది ఇస్లాం తత్వం కు పూర్తి వ్యతిరేకం.*లా ఇలా హి ఇల్ల లాహ్*..అల్లా ఒక్కరే! మనం చేసే ప్రతి పూజ అందుకునే వాడు ఆ అల్లా ఒక్కడే. ఇస్లాం తత్వంలో అల్లా ఒక్కడే దేవుడు...సూఫీ తత్వం లో *అల్లా* అనే ప్రశ్నే లేదు. రమాదేవి లో వున్నాడు.మీలో వున్నాడు.మీరు ఎవరిలో చూస్తే వారిలోనే భగవంతుడు ఉంటాడు . అదే కదా మన.భారతీయ సిద్ధాంతం కూడా!
[10/15, 16:59] +91 6305 543 917: మీరు ఎవరో గానీ తెలుసుకోవాలనే తత్వం ఉన్నందుకు అభినందనలు! విజయ దశమి శుభాకాంక్షలు!🌷💐🙏🏿💐🌷👌

SN సాహిత్యం కొరకు దీపావళి కథ

SN సాహిత్య విభాగం...కొరకు

అంశం..దీపావళి.
రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
శీర్షిక : నరకాసుర వధ కథ.

వరాహావతారుడై వరలు మహా విష్ణువుకు-
భుాదేవికిని సుతుడు ముార్ఖ నరకాసురుడు ॥
అసుర లక్షణములుగల అహంకారుడీతడు
చక్కన్ని పాలకుడు జనకరాజు శిష్యుడు॥
కడు భక్త చిత్తుడు  కామాఖ్య భక్తుడు.
బాణసుర చెలిమి తో బహు ధుార్తుడైనాడు॥
దేహబలము పొందిన దేవ్యోపాసకుడితడు
రాక్షసాది  గుణములచే రాజిల్లు బలుడు ॥
దేవతలెల్లరను పట్టీ బాధించెను ధుార్తుడు
వరగర్వ బలముచే హింసించెను నరకుడు॥ 
ఇంద్రపదవి నాశించి ఇంద్రుని ఓడొంచెను
స్వర్గమునే దోచెను  స్వర్గ ధామ మేలెను ॥
దేవతలే మొరలిడగా క్రిష్ణుడవతరించెను
సత్య భామ సహితుడై సమరము సాగించెను॥
పోరున శ్రీకృష్ణుడు అలసి సొలసి తుాలెను
సాహసియౌ సత్యభామ సమరము సాగించెను ॥
భుాదేవీ శాపమే భువికి శుభమదాయెను
మృత్యు శాపగ్రస్తుడైన నరకసురుడు కుాలెను ॥
నరకచతుర్దశినాటి నరకాసుని వధ కధ
సత్యభామ కృష్ణుల అవతారపు ఘనత.
సురులు దీపవళులు పేర్చి శుభ గీతులు పాడిరి
దీపాల పండగదే భువిని జనులు చేసిరి ॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.


Saturday, October 23, 2021

దీపావళి

ప్రతీ రోజుా కవితా పండగే కొరకు-
అంశం..దీపావళి.
రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక .
నరకాసుర వధ.
ప్రక్రియ: ఇష్టపది .
---------------------
1. వరహావతారునకు  వరలు శిశువీతడు
భుాదేవి సుతుడితడు ముార్ఖ నరకాసురుడు ॥
2.
జనకరాజ శిష్యుడు  చక్కన్ని పాలకుడు
అసుర లక్షణముగల  అహంకార గుణుడు
3
కామాఖ్యను కొలిచెడు  కడు భక్తిపరుడితడు
బాణాసుర చెలిమిచే  బహు ధుార్త గుణుడితడు
4
దేవీ ఉపాసనల దేహ బలుడాయెను
రాక్షస గుణములతో రాజిల్లుచునుండెను
5
దేవతల నెల్లరను  తెగ బాధల బెట్టెను
వర గర్వ బలముతో  వదలక  హింసించెను
6
ఇందృని పై దాడిడి  ఇంద్ర పదవి దోచెను
స్వర్గ మాక్రమించెను స్వర్గ ధామ మేలెను
7
దేవతలే మొరలిడ  దేముడభయమిచ్చెను
కృష్ణ సత్య భామలు   కృుారు నణచ పోయెను
8
పోరు సల్పె కృష్ణుడు   పోరున ముార్ఛిల్లెను
సత్య భామ సాహసియై సమరము సాగించెను
9
భుాదేవి చేతిలో  మృత్యుశాప ఫలముగ
నరకాసురు అంతము నరులకు శుభమాయెను
10
నరక చతుర్దశి అది  నరకాసురు కధ ఇది
సంతసమున జనులదె    సరి పండగ జేసిరి
11
దీప వళుల పేర్చిరి  దీపాలలరించిరి
దీపావళి పండగదే  దేవతలా వరమిది
12.
సంతసమున జనులదె సందడులను జేయగ
కొలిచి లక్ష్మి దేవిని  కోర్కె లడిగి మురిసిరి ॥
స్వర్గ మేల ఇంద్రుడు  జనులు సంతసించిరి
శ్రీలక్ష్మి  వరముతో సిరులు పొంది మురిసిరి ॥
-------------------------------------

Friday, October 15, 2021

మహతీ సాహితీ కవి సంగమంలో కొన్ని కవితలు.

[8/5, 15:41] p3: మహతీ సాహితీ కవిసంగమం
అంశం: సహితమే సాహిత్యం

ప్రక్రియ: ఇష్టపదులు
తేది: 5.8.21

శీర్షిక: సాహిత్యంతో చెలిమి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

మసాకసం: 37
ఈ మాసం కవిత సంఖ్య: 3

1.
సాహిత్య లోకాన సార మౌ గ్రంధాలు
ఎరిగించినవి ఎన్నొ  ఎరుగనీ విషయాలు

పద్యాలు గద్యాలు  పలుకు పాఠాలెన్నొ
 మేధస్సు నిండినవి  మేలైన  నీతులుా
 
 అలరే పురాణాలుా అవి పెద్ద గ్రంధాలు
చదువ సంస్కృతులను  చాటు ఇతిహాసాలు

సాంప్రదాయపు విధులు సరినేర్వవలెనన్న 
చదువు సాహిత్యమే  జగము నెరిగెదవన్న ॥॥

2.
వేల కీర్తులనేలె వేమన్న  పద్యాలు
సుఖపు బాటను జుాపు  శుభాషితమ్ములవిగ ॥

ఛందస్సు నిండినవి చదువ పద్యములెపుడు
కందాల అందాల కడు రమ్యమౌ  యతులు॥

ప్రాస నియమాలతో  ప్రాణమే పోసేరు
కవులు  ధీటులు వారు కనుగొన్న నియమాలు ॥

సద్ధర్మ బాటలుా సంస్కృతుల తేటలుా 
చిట్టి పొట్టీ కధలు చిన్నారులకు నిధులు ॥॥

3
అట్టి సాహిత్యమును  అనవరతము చదువగ
ఉర్రుాతలుాగె మది ఉత్సాహమదె నిండ.

ఆటవెలదుల ప్రాస తేట గీతుల  మాట
కంద, సీసపు బాట  కవుల సాహితి  వేట

అందమౌ సాహిత్య  మందరిని అలరించు
సద్గ్రంధముల చదువు సఖుల మరువ ॥ 

సాహిత్యమే చెలిమి సాహిత్యమే బలిమి
సరి ఈశ్వరీ మాట సత్య మిది ఓ మనుజ ॥॥
[8/6, 17:45] p3: .6/08/2021
అంశం : ఐచ్చికం.

 శీర్షిక  : ఝండా కు వందనం..

మ.సా.క.సం.: 37.

ఆంగ్లేయుల పరిపాలనలో 
భారత ప్రజల అవమానాలు
బానిసత్వపుబాటలో  
ఎదుగు బొదుగు లేని జీవితాలు॥

బ్రిటిష్ వారి ఆధిపత్యానికి
తల వంచిన భారతీయులు.
భారత స్వాతంత్ర్య పోరాటానికై
ఉద్యమ బాటలో దేశ భక్తులు ॥

కోల్పోయినారెందరో ప్రాణాలు 
కొల్లగొట్టబడిన స్త్రీల మానాలు.
పట్టుబడిన వారికి సంకెళ్ళు 
ఎదురు తిరిగినవారి 
తిరిగిరాని  ప్రాణాలు.॥

పట్టుబట్టిన గాంధీజీ నడచిన
బాటలో, ఉప్పు సత్యాగ్రహాలు.
దాండీమార్చ్ తో చేసిన
శాంతియుత పోరాటాలు ॥

"పింగళి వెంకయ్య" చేసిన  
స్వాతంత్ర్య ముక్తి "ఝండా సృష్టి".
"బంకిం చంద్ర చటర్జీ "రాసిన  
దేశభక్తి నిండిన"జన గణ మణ" 
గీతి,  నిండిన ఉద్యమ స్ఫుార్తి.॥

కులమత వివక్షతల నిరసనలు
ముాడురంగుల జండాలో
 సత్యం,ధర్మం శాంతి నిండిన
సమానత్వపు జీవిత సారాలు॥

వెరసి,లభించిన దేశ స్వాతంత్ర్యం
 గాంధీ, నెహ్రూల పోరాటాల ఫలితంం
బానిసత్వ ముక్తి పొందన దినం 
ఆగష్ట్ 15ను, మరువలేదు జనం.॥

నేటికీ జనం జరుపుకుంటున్న 
భారత స్వాతంత్ర్య దినోత్సవం .
ఎగురుతున్న ఝండాకు చేద్ధాం
వందనం,కలసి మనమందరం ॥


రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.


హామీ:
ఈ నా కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.

  
*************************
[10/7, 06:39] p3: ప్రక్రియ :  మత్త కోకిల.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
కవిత సంఖ్య 2
మ సా.క.సం..37


శీర్షిక  : ముద్దు కృష్ణ .

భక్తి  తోడను  గొల్వ  మేలగు  భాగ్య మిత్తువు నీవెగా
శక్తి యుక్తులు దెల్పి పేర్మిని సార మిత్తువు నీవెగా
రక్తి కట్టిన రమ్య గోకుల రమ్య లీలవు నీవెగా 
ముక్తి నిచ్చెడు బాల మొాహన ముద్దు కృష్ణుడ వీవెగా॥

శీర్షిక  : బంగారు బతుకమ్మ 

శ్రీల నిచ్చెడు  వేల్పు తల్లివి   శ్రీని కేతని  మానినీ
వేల పుాలను జుట్ట వేడుక   వెల్గు సుందర హాసినీ
జేల జేతుము మేలు జాతర జేరి బోనము నీకిడీ
కోరు బంగరు బాట చుాపెడు గౌరి  శ్రీగజ గామినీ ॥

రంగు పుాలిడి స్తోత్ర పుాజిడి రాణి రక్షణ కోరితీ
మత్త కోకిల మంద గామిని మంత్ర ముార్తివి నీవనీ
వేప ఆకుల నిమ్మ  మాలల వేసి వేడెద మొాఘనీ
వేల్పు వైమము గావ రాగదె  వెల్గ మాపురి పావనీ ॥

పంక జాక్షివి  లెమ్మ బంగరు వల్లి శ్రీబతు కమ్మణీ
పార్వతీ ప్రియ శర్వు రాణివి పారమేశ్వరి పావనీ 
బోన మెత్తిన వారి బ్రోచెడు  పోగు రాసివి తీరథీ
అమ్మ తొమ్మిది రుాపు లెత్తిన  అంబ అందుకొ హారతీ ॥
[10/7, 20:56] p3: అంశము: *బుద్దుని బాటలో...*
తేది: 7.10.2021
మ సా క సం: *37*
శీర్షిక : ఆధ్యాత్మిక గురువు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

కపిలవస్తు వాసుడు కడు దయాసముద్రుడు
సిద్దార్ధ గౌతముడు సిరి గుణములకు రేడు.
బౌద్ధ మత  స్థాపకుడు,  "బుద్ధ" నామధేయుడు
ఆధ్యాత్మిక గురువుగ అందించెను సుాక్తులు. ॥

నాల్గు దశల జీవము నరకాంతకమయమని
సన్యాసి  జీవితమె సార్ధకమని దలచెను.
బోధివృక్ష  నీడను  పొందె శాంతి సౌఖ్యము
పరివ్రాజక జీవిత-ఫల చింతనె ఫలించె ॥

సిద్దార్ధ నామమే సార్ధకమీ ఇలను
అలరకలమ గురువుగ అందెను బోధనలను.
యొాగ శాస్త్ర జ్ఞానము  యొాగులకడ నేర్చెను.
ప్రావీణ్యత పొందెను  ప్రాజ్జ్నుడై నిలిచెనుా ॥

జ్ఞాన బోధ చేయుట  జ్ఞాని ధర్మ మనెనుా
భిక్షాటన చేయచుా   బుద్ధునిగా మారెను .
అష్టాంగ మార్గాల  అతని సత్ బోధనలు
ఆతని జీవ గాధలు  ఆదర్శపు బాటలు ॥

అంటు రోగం కన్న .అధైర్యం  ప్రమాదం ,
అందరుా సమానం అదియే మన ధర్మం .
అతిగా అశించకు  అతిగా దుఃఖించకు.
శోకాన్ని తప్పించు శోధించు జీవితం, ।

ఆచరించని మాట  అది నిష్ప్రయొాజనం.
మనసన్నది ఉంటే  మార్గ మదే  కనపడును.
మంచి మాట బాటలు  మానవత్వ నీడలు
అవి సుాక్తుల బాటలు అవె ఈశ్వరి మాటలు ॥


పై ఇష్టపదులు నా స్వంత రచనలు.
[10/8, 20:26] p3: అంశం:  ఐచ్ఛికం 
తేది: 01-10-2021
మసాక.సం: 37

కవి పేరు: రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఊరు: కల్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక:  నవ దుర్గా స్తుతి.
ప్రక్రియ: ఇష్టపది.
ఈ వారం కవిత సంఖ్య:  4.

ముగురమ్మల ముాలము ముల్లోక పాలనము
శిష్టులకిడునభయము దుష్టజనుల దమనము
ఆదిపరాశక్తియె  అవతారములెత్తిన
నవదుర్గారుాపులు నవరాత్రులు శుభములు ॥

అఖిల లోక నాయిక అంబ శైల పుత్రిక
వాహనమ్ము వృషభము  వారిజ ముఖ మలము
నీలవేణి శుాలపాణి  నిత్య పారాయణి
నవరాత్రిలో తల్లి నమ్మిన తొలి దైవము ॥


ధవళ వస్త్ర ధారిణి తరుణి బ్రహ్మచారిణి
కర కమండల ధరి, సు కాంత జ్ఞాన రుాపిణి
జపమాలా ధారిణి జగదీశ్వరి జననీ.
తపఃచార్ని  దయగుణి తవ చరణం శరణం

చంద్రఘంట  రుాపిణి చంద్రిక ముఖ తోషిణీ.
శక్తి ధైర్య రుాపిణీ  శాంకరి  భయ హారిణి
ధుామ్రలోచను దమనీ దుఃఖ,  పాఫ ,నాశినీ
నవ దుర్గా రుాపిణి  నాద వేద రుాపిణి ॥

విశ్వ శక్తి రుాపిణి  విజయ విశ్వ మొాదిని
అష్ట భుజా రుాపిణి  అష్ట అస్త్ర  ధారిణి.
కుాష్మాంద స్వరుాపిణి గుాడగుణ స్వభావిని
ఆది శక్తి  రుాపిణి  అంబ సింహ వాహినీ॥

ఐశ్వర్య ప్రదాయిని అంబ మొాక్ష కారిణి.
ఇహ పర సుఖ దాయిని ఇచ్ఛా పుార్తి కరణి
స్కందమాత పావని స్కందుని ప్రియ జనని
తారకసుర భంజని ధరణోద్ధర కారిణి ॥

 శక్తి భద్ర కాళికె  శాంకరి సుర మొాదితె
 మహిషాసుర మర్దని మాత సింహ వాహిని
 యొాగ తంత్రాత్మికే  ఆజ్ఞా చక్రార్చితే
 కాత్యాయని భగవతి  కాళీ జయ దుర్గే ॥
 
భగమాలిని భైరవి  పరమేశ్వరి పార్వతి.
సర్వాంతర్యామిని సర్వ హృదయ వాసీని
మణి ద్వీప నివాసిని మాత వేద రుాపిణి.
దుర్గా త్రై యంబికెే  దుర్లభే శివాత్మికే ॥

అష్టమావతారిణి  ఆదిపరాశక్తీ
అభయముద్రాకరీ అమంగళ వారిణీ
ఘన త్రిశుాల ధారిణి వన దుర్గా రుాపిణి
శుభ మంగళ గౌరీ  సుఖ మంగళ కారిణి ॥

శుాల,డమరు ధారిణి  ముాల మంత్ర  కారిణి
శ్వేతాంబరి శ్రీకరి మాత విష్ణు సోదరి
మహిషాసుర మర్దనీ మహిష వాహనీ ఘని 
శక్తి దుర్గ రుాపిణి  శరణు శంభు కామిని ॥

సిద్ధిధాత్రి  శ్రీకరి  బుద్ధి ప్రద శాంకరి.
ఇహ పర సుఖ కారిణీ  ఇందు వదని ఈశ్వరి.
శంఖ చక్ర ధారిణి   సార పద్మ లోచని
బ్రహ్మ జ్ఞాన ఫలకరి బ్రాహ్మీ మాహేశ్వరి.॥

సర్వ సిద్ధి వరదే   శర్వు రాణి శుభదే
అభయప్రద హస్తే అంబే శివ శక్తే.
నవ దుర్గా రుాపే నారాయణీ సతే
నవ రుాపిణి మాత్రే  నామ విజయ కీర్తే ॥

***********************
[10/9, 18:17] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే*

పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు*
సమీక్షణ: *శ్రీ కొనింటి రమేష్ గారు*
తేది: *09-10-2021: శనివారము*
దత్తపది:  *గిరిజ- శైలజ-  హేమజ- అగజ* 


దత్తపది:  *గిరిజ- శైలజ-  హేమజ- అగజ* 
పద్య ప్రక్రియ :  మత్త కోకిల.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
జిల్లా  : కల్యాణ్ : మహారాష్ట్ర 

అంబ ఈశ్వరి ఆది శక్తివి అందు కోనుతి  శాంకరీ
శుంభ దైత్యుని భంజనీ ప్రియ శంభు మొాదిని పార్వతీ
శంభు రాణివి ,సార పుాజలు సాధ్వి జేతు సుమంగళీ
గుంభ నమ్ములు నీదు మాయలు గుమ్మ  శ్రీ"గిరిజా"త్మనే॥ ॥ 

 బిందు రుాపిణి "శైలజా"ఘని బంధ మొాచని పావనీ
 ఇందు లోచని ఇందిరా సఖి  ఈశ్వరాఖిల మొాహినీ
 గంధ లేపని  పాపనాశి సుగంధ హార సుభుాషణీ ॥
 మంద గామిని దుర్గ హారిణి మంత్రమాతృకె మానినీ॥
 
 భామ సుందర భుాషితాంగిని  "హేమజా"మర నాయికా॥
 కామరుాపిణి కాంత కౌళిని కాల రుాపిణి  కాళికా
శ్యామ సుందరి సార సుస్వర స్వాదు మంజుల గాయికా 
కోమ "లాగజ" గామి నీసతి పార్వతీ పర దేవతా ॥ 

కోమలాంగి దశావతారిణి  కోటి సుార్య ప్రకాశినీ
భామ దుర్గతి నాశినీ నమొ పార్వతీ పరమేశ్వరీ ॥
 కామకార్య విలోలినీ శివ కామినీ వర దాయినీ
ధామ శ్రీపుర వాశినీ భవతారిణీ సింహ వాహినీ॥

ఈ పద్యములు న స్వీయ రచనలు.
[10/11, 20:16] p3: చిత్ర కవిత.
శీర్షిక : ఆడతనం ఆడపిలకు శాపం.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021


కలి ఏలుతున్న రాజ్యంలో 
కామాంధుల కుాటమి.
కన్ను మిన్ను కానరాని 
కర్కసుల కామ జ్వాలలలో
క్షణం క్షణం రాలిపోతున్నతున్న
ఎదగని చిరు ప్రాయం.
కర్కశ కామ జ్వాలల్లో
కాలిబుాడిదౌతున్న అడతనం.
ఆడతనం ఆడపుట్టుకకొక శాపం॥
ఎవర్ని నమ్మాలో ఎక్కడ ఎదగాలో
తెలోని పసి బాలల అమాయకత్వం 
బంధువులే రాబందులైన వైనం.
ఇంటింటా అబలల కన్నీటి కథనాలు.
కామ పిశాచానికి బలౌతున్న 
పసి పిల్లలు,అమ్మలు,అక్కలు,చెల్లెళ్ళు.
ఆడవారికి అడతనమే ఒక శాపం ॥
అవకాశమిస్తే అన్నిరంగాల లో 
అందలాలనందుకోగల అత్మ విస్వాసం .
బయటి ప్రపంచంలో 
బావురుమంటున్న మానవత్వం ।
ఆడదాని మనుగడకు 
ఆడతనమే అడ్డౌతున్న శాపం.॥
మేధస్సు నిండిన మనుషుల్లో
మానవత్వం కరువైన  బుద్ధిలోపం.
ప్రపంచం మంతా వావి వరుసలు లేని
పాచి నిండిన నరకకుాపం..
అడపిల్లకు అడతనమే ఒక శాపం ॥
ఇంటి ఆడపిల్ల అక్కరకు రాని చుట్టం.
ఆరక్షణావకాశాలు అందుబాటుకు
తేవలేని అసమర్దతలు నిండిన
పనికిమాలిన  చట్టం.
లింగ బేధాల లైంగిక దాడుల లో 
స్త్రీ లకు ఇంటి రక్షణే కరువైన 
కన్నీటి నిస్సహాయం.
ఆడతనం ఆడదానికి ఒక శాపం.॥
[10/12, 19:13] p3: 12/10/2021

అంశం : వేదవ్యాసుడు.
కవిత సంఖ్య 2.


రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

వేదాలను నాల్గుగా విభజించిన జ్ఞానతడు
క్రష్ణద్వైపాయనునిగ పేరున్న ఘనుడు
భారత, భాగవతాదుల రచియించిన గురుడు.
అష్టాదశ పురాణాలు అందించిన వ్యాసుడు ॥

బాదరాయణునిగా   ప్రసిద్ధి చెందిన వ్యాసుడుక
ఆషాఢ శుద్ధ పౌర్ణమి , వ్యాసుని జన్మదినం 
మహాభారతతాది కావ్య గ్రంధకర్త.
జయకావ్య గ్రంధకర్త , అదే మహాభారత కథ॥

భగవద్గీత  విష్ణుసహస్రనామాది
దివ్య రచనలు  రచియించిన వేద నిధి.
బ్రహ్మ సుాత్రాలలో వేద వేదాంగాలను
నిక్షిప్తంచేసిన వ్యాస కర్త.॥

పతంజలీ యొాగ శాస్త్రలకు అధార కర్త.
విశిష్ట అక్షర భిక్షను మనకిచ్చిన వ్యాస ముార్తి
ఈనాటి నమన ఆధ్యాత్మిక గ్రంధాల సారం
శ్తీ విష్ణ్వావతారుడైన వ్యాసగురుని ప్రసాదం ॥

పరాశర మహర్షి , సత్యవతీల పుత్రుడు
భరత వంశాభివృద్ధి కారకుడు.
శ్రీ విష్ణు  అవతారియైన జ్ఞాన సద్గురువు.
సప్త చిరంజీవుల లో ఒకడైన వ్యాసుడు॥
 
ప్రపంచ వాజ్మయంలో ప్రసిద్ధిచెందిన 
విద్వాంసుడు తానొక్కడే ఐన వ్యాసుడు-
వేద వాజ్మయాన్ని విభజనలు చేసి
క్రమపద్ధతిలో మనకందించిన సార గురుడు.॥

తత్త్వ జ్ఞానాన్ని సార్వజనికం చేసి
అష్టాదశ పురాణ కధలను అందరికీ 
అందుబాటులోకి తెచ్చిన ఉత్తమ మార్గదర్శి ॥

చిత్త శాంతిని కలిగించే భాగవత పురాణం
పంచమ వేదమైన మహాభారత గ్రంధాలను
రచించిన ఇతిహాస కారకుడు వేదవ్యాసుడు
పరిపుార్ణ తత్త్వ జ్ఞాన గుణ నిధి.॥

ఆత్మ-అనాత్మల   విషయాలను
సరళ శైలి లో బోధించిన తత్త్వోపదేశకుడు.
శివుని గుార్చి చేసిన తపోవరముచే 
సుకమహర్షి వంటి పుత్రుని పొందిన ఘనుడు॥

వ్యాస నామ మొాక వ్యవస్థ, ఒక పీఠము.
ఇరువదిఏడవ వ్యాసునిగా ప్రసిద్ధిచెందిన 
పరాశర పుత్రుని జన్మదినమునే మనము
వ్యాసపుార్ణమగా, గురుపుార్ణమగా.
స్మరించుకుంటున్న దివ్యమైన దినము॥

వ్యాస పీఠము వాజ్మయ పఠనీయ 
దేవతా పీఠము. అచటినుండి 
గణపతి కలమునుండి జాలువారిన
ఆర్షవాజ్మయ  అక్షర జలధారలలో
అధ్యయన స్నానాదులుగావించి 
ఆచరణల ద్వారా పునీతులమవుదాం ॥
        జై శ్రీ వ్యాస గురవే నమః

ఈ కవిత నా స్వీయ రచన.
[10/13, 14:35] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *13-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*

ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

కవితాసంఖ్య 3.

1.
భాగ్యరాసివి కోమలీకర పాశ శుాల ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ ఫలప్రద యొాగినీ హితకారిణీ
శక్త్య నంతరుణార్ణ వర్ణిణి శాంకరీ సుఖ కారిణీ
ఆద్య వింధ్యనివాసినీజగ ధాధినేత్రి శుభాననీ ॥
2.
వ్యాఘ్రవాహిని ధుామ్రలోచనవ్యాజకరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పాలయె శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ  ఉమాభవ తారిణీ
శుభ్ర వస్త్రమయిా మనోన్మయి సుందరేశుని  భామినీ ॥
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తిసు మేరు శృంగ నివాసినీ హరుమొాహినీ
మాతమంగళ కారిణీ మహిమాన్వితే మణి భుాషణీ॥
4.
గంధమాలిన మేయశక్తిసు కోటి సుార్యప్రకాశినీ
బంధమొాచనఘొార నాసినపారశక్తి స్వరుాపిణీ
ఇందులోచని మందహాసిని ఈప్సితాది ప్రదాయినీ
బిందుమాలిని భాగ్యకారిణి భీతహారిణి  భామినీ ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దేవి దైత్యవి భంజనీ
భవ్య సుందరి కాళికేసుర పుాజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాధరీ
మఠ్యతాళసు గీత మొాదిని మాతహంససువాహినీ ॥
6.
నిత్య నీరద చక్ర స్వామిని  నిర్మలాశ్రిత పాలినీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ 
కార్యకారణి నిర్విశేషిణి కామకర్షిణి కోమలీ    
ఉర్వితత్త్వ స్వరుాపిణీ ఘన కౌళినీ కుల యొాగినీ॥
[10/13, 16:20] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *13-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*

ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

కవితాసంఖ్య 3.

1.
భాగ్యరాసివి కోమలీకర పాశ శుాల ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ మంత్రసుయొాగినీ హితకారిణీ
శక్త్య నంతరుణార్ణ వర్ణిణి శాంకరీ సుఖ కారిణీ
నిత్య నీరద శ్యామలేశుభ నీళ నిశ్ఛల దేహినీ ॥
2.
వ్యాఘ్రవాహిని ధుామ్రలోచనవ్యాజకరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పార్వతి శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ  ఉమాభవ తారిణీ
శుభ్ర వస్త్రమయిా మనోన్మయి సుందరేశుని భామినీ ॥
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తి సుధామినీ ఘన సామినీ హరు మొాహినీ
మాతమంగళ కారిణీ మహిమాన్వితే మణి భుాషణీ॥
4.
గంధమాలిన మేయశక్తిసుగాత్రి సుార్యప్రకాశినీ
బంధమొాచనఘొార నాసినపారశక్తి స్వరుాపిణీ
ఇందులోచని మందహాసిని ఇందిరావర దాయినీ
బిందుమాలిని భాగ్యకారిణి భీతహారిసు శస్త్రిణీ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దీన దైన్యసు పోషిణీ
భవ్య సుందరి తారకాసుర భంజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాధరీ
మఠ్యతాళసు గీత మొాదిని మాతహంససువాహినీ ॥
6.
నిత్య నీరద చక్ర స్వామిని  నిర్మలాశ్రిత పాలినీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ 
కార్యకారణి నిర్విశేషిణి కామకర్షిణి కామినీ    
ఉర్వితత్త్వ స్వరుాపిణీ ఘన ఊర్ద్వలోకనివాసినీ ॥
[10/13, 20:18] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *13-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*

ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

కవితాసంఖ్య 3.

1.
భాగ్యరాసివి కోమలీజయ బాల శుార్య ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ మంత్రసుయొాగినీ హితకారిణీ
ఋగ్య జుర్విధ సామ గానస్వ రుాపి సుందర గాయకీ
అర్ఘ్య పాద్యసు పుాజితే పర మార్ధ మొాక్షకరీ శుభే ॥
 2.
వ్యాఘ్రవాహిని ధుామ్రలోచన వ్యాజకరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పార్వతి  శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ  ఉమాభవ తారిణీ
అగ్ర గామిని ఆది భిక్షుని అర్ధ భాగిని అమ్మణీ ॥
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తి సుధామినీఘన శాలినీ హరు కామినీ 
మొాది నీఘన సార సుందర మొాఘ మంజుల భాషిణీ
4.
గంధమాలిన మేయశక్తిసు గాత్రి సుార్యప్రకాశినీ
బంధమొాచనఘొార నాసిన పారశక్తి స్వరుాపిణీ మందహాసిని ఇందులోచని మాతహంససువాహినీ ॥
వంద నీసుర బిందుమాలిని  వారి జాక్షిసు శస్త్రిణీ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దీన దైన్యసు పోషిణీ
భవ్య సుందరి తారకాసుర భంజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాత్మనే
కావ్య రుాపిణి గాన మొాదిని కామ కోటి విలాసినీ॥
6.
నిత్య నీరద చక్ర స్వామిని  నిర్మలాశ్రిత పోషిణీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ 
అత్య నంతసు తీర్థ వైభవ అగ్ని తేజ ప్రకాశినీ
ప్రత్య భిన్న పరాయణీ వర ప్రకృతీపర మేశ్వరీ ॥
[10/15, 10:55] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ వి.టి.ఆర్ మోహనరావు గారు*
సమీక్షణ: *శ్రీమతి.దొంతరాజు విజయలక్ష్మి గారు*
తేది: *15-10-2021: శుక్రవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: : ఇష్టపది.
శీర్షిక  నవ దుర్గారుాపిణి.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .


 నవ రుాపాల వెలసె  నవ రాత్రి దుర్గమ్మ
 నమ్మిన వారి గాచు  నామాల కొలువమ్మ
 తెలుగింటి గౌరవం తెలంగణ గౌరమ్మ
 భోగాల  నిచ్చేటి   బోనాలబతుకమ్మ ॥
 
ఆశ్వీయుజ మాసపు అమావాస్య  మొదలుగ
నవరాత్రులు వెలసిన నవ దుర్గ మాయమ్మ .
రోజుకొక్క రుాపము రోజొకలంకారము
అమ్మ అవని గాచెడు అంబ ఈశ్వరీయము ॥

1.బాలత్రిపురసుందరి.
బాలత్రిపురసుందరి భవ్యమైన రుాపము
భావ భక్తి  నిండిన  భగవతీ స్వరుాపము
శక్తి మంత్ర  మహిమలు ముక్తి నిడెడు పుాజలు 
ప్రధమ పుాజలందెడు ప్రసన్న మౌ కీర్తులు ॥

2..శ్రీ గాయత్రి దేవి :
ముాల శక్తి మంత్రము  మచ్చటైన రుాపము
నీల ధవళ వర్ణము  నిత్య దర్శనీయము
గాయత్రీ  తేజము ఘన ద్వితీయ రుాపము 
త్రిసంధ్యా సమయము త్రిఫల మంత్ర పఠనము

సహస్ర నామ మంత్ర సార పుార్ణ తేజము
 ఓజ తేజ సారము మొాక్ష మిడెడు మంత్రము
పంచముఖీ తేజము పంచ భుాత మయముా
ఆయురారోగ్యాది  అద్భుత ఫల సారము ॥

3.  శ్రీ మహాలక్ష్మి దేవి :
మంగళమౌ రుాపము  మాంగళ్య  కారకము
మహాలక్ష్మి  తేజము  మహిమాన్విత  రుాపము.
మాన్యాష్ట సిద్ధి కరి మాత తృతియ రుాపము  
అష్ట రుాపి అమ్మణి  కష్ట నష్ట వారిణి ॥

 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి.
 
 అవని అన్నపుార్ణా  అన్నదాయపర్ణా
ఆదిశక్తి  శివ సతి  అన్న దాన కారిణి
జీవనాధారిణీ జీవకోటి పోషిణీ
క్షుద్బాధా నాశినీ క్షు దర్వీధరి మానినీ ॥ 

నవరాత్ర్యవతారిణి  నాశాత్కలి హారిణీ
ధాన్య కారిణీ ఘని ధరణి క్షామ నాశినీ
శరణాగత వత్సలే   శంకరార్తిశమనీ
కాశీ పుర వాసినీ కామదహను భామినీ.

5. శ్రీ లలితాంబా రుాపిణి.

శ్రీ లలితా శివసతి  శ్రీకరి గణ పాలిని
అంబ త్రిపుర సుందరి అరుణోజ్వల భాసిని
కామిత ఫలదాయిని  కలిమల ఖలు హారిణీ
ఉపాసినీ, సువాసినీ  ఉమా అభయ కారిణీ॥

ముని గణ సంసేవిని ముల్లోక  పాలినీ
ఖడ్గ మాల ధారిణీ  కనక దివ్య భుాషణి
ఇక్షు కోదండ ధరి ఈప్సిత వర దాయినీ
శ్రీ చక్ర వాసినీ  స్థిత బిందురుాపిణి ॥

6. శ్రీ మహా సరస్వతీ స్వరుాపిణి.
7. 
శ్రీ మహా సరస్వతి శ్రిత జ్ఞాన ప్రదాయిని
అక్షరస్వరుాపిణి  అక్ష మాల ధారిణి.
హంస వాహినీ ఘని హంసిని జన జీవని
వాణి వీణా ధరీ వాజ్మయి విశ్వంభరి .॥ 

7. శ్రీ  మహా  దుర్గా రుాపిణి.

  శ్రీ సింహ వాహినీ    శ్రీ దుర్గ భవానీ  
  దుర్గమాది వారిణీ దుర్గ దుఃఖ హారిణి.
  దుర్గమాసురదమని దుర్గముాగ్ర రుాపిణి
  సుఖ సౌఖ్య ప్రదాయినీ సుందరి శివ మొాదిని॥

8. శ్రీ మహిషాసుర మర్ధిని.

శక్తి రుాపి శాంకరి  ముక్తి దాయినీశ్వరి
 మార హరుని రాణీ  మంగళీ మనోహరి
 మాత శుాల పాణీ  మహిషాసుర మర్దని    
 శీఘ్ర ఫల ప్రదాయినీ వ్యాఘ్ర వాహినీ ఘని॥

9 శ్రీరాజరాజేశ్వరి దేవి అవతారము

అపరాజిత ముార్తీ అంబా జగదీశ్వరి
రాజ రాజేశ్వరీ  రమణి చిత్స్వరుాపిణి
శ్యామలే  కోమలే  శ్యామల శువ గౌరీ 
 కుంకుమార్చిత పదే కులయొాగిని కౌళిని ॥

పాహి పాహి పార్వతి పరే పవిత్ర జనని
ప్రసిద్ధ కార్య కరణి ప్రసీద పాహి పావని
వంద్య వేద రుాపిణి వర శుభ కాత్యాయని
మంత్ర మాన్యే ధనీ  మహిత విజయ కారణీ ॥

ఆధ్యాత్మికత

శీర్షిక : భక్తి తత్త్వం .( ఆధ్యాత్మికత ).

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

ప్రపంచ అతీంద్రీయ శక్తులకు మానవులకు
మధ్యనున్న అవినాభావ సంబంధం భక్తి.
అదే భక్తికి అనుసంధానమై యున్న బంధం ఆధ్యాత్మికం॥.

మనిషి తనను తాను తెలుసుకునేందుకు -మనో
వాక్కాయ, కర్మలచే తనను తానుశుద్ధి   పరచుకొనేందుకు చేయబడిన సాధనాపుారిత తంత్ర-
 యంత్ర, మంత్ర శక్తి సారమే ఆధ్యాత్మికత అనే ప్రక్రియ.॥
 
 దశావతారాల రుాపాలు దశ దిక్కుల శక్తిలో నిండిన
 సాంప్రదాయ, ఆచార -వ్యవవహారాలకు నిదర్శనాలు 
 మహిలో మనుగడ సాగించేందుకు మానవుడు
 ఈ శక్తి సాంప్రదాయాలకు అనుగుణంగా తనను
 తాను మార్చికునేందుకు చేసే ఉపాసనా యత్నమే
 ఈ నవ విధ భక్తి మార్గాలు, ఉపవాసాది తపఃచర్యలు॥.
 
 మనలో ఉన్న నవవిధ వికారాలను , నవ విధ
 భక్తి మార్గాలద్వారా నియంత్రించి , వాటిని సక్రమ 
 పద్ధతిలో వినియొాగించుకొని, స్థిత ప్రజ్ఞతను పొందే
 భావ ప్రయత్నమే భక్తి మార్గము.॥
 
  మనిషి మనుగడలో సృష్టి వైపరీత్యాను తట్టుకునే శక్తిని ఆత్మస్తైర్యాన్ని పెంపిందించుకొనే యుక్తి మార్గాన్ని
 నిర్దేశించే కర్మ యొాగమే ఆధ్యాత్మికతలో 
 నిండియున్న భావ భక్తి  సారము.॥
 
 బుద్ధి బలం, దేహ దారుడ్యం ,శాంత చిత్త 
 ప్రవృత్తులను అలవర్చుకొనేందుకు చేసే తపస్సే
 ఆధ్యాత్మిక భక్తి భావనా చర్యలైన, పుాజలు,
 అచార వ్యవహారాలు , సంస్కృతి  సాంప్రదాయాలు 
 మొదలైనవి.॥
 
 పురాణాది కావ్య గ్రంధ పఠనాలు మానవుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతి కిరణాలతో  
 మార్గ నిర్దేశాన్నిచ్చే  మహానిధి నిక్షేపాలు. 
 
" ఈ ఆధ్యాత్మిక మార్గాలలో నడచి నిష్ణాతుడైన
మానవుడు అతి శక్తిమంతుడై, కామ,క్రోధాది, మద మాత్సర్యాలకతీతుడై..తానే ప్రకృతి,తానే పురుషుడు - అనే శక్తిగా మారి అన్నిటా తానైన దేవతాస్వరుాపమై ప్రకాశిస్తాడు" అనడంలో ఏ విధమైన సందేహముా లేదు అనేది ఆధ్యాత్మికతకు సంబంధించినదైన నా భావన.

నవదుర్గా రుాపం

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ వి.టి.ఆర్ మోహనరావు గారు*
సమీక్షణ: *శ్రీమతి.దొంతరాజు విజయలక్ష్మి గారు*
తేది: *15-10-2021: శుక్రవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: : ఇష్టపది.
శీర్షిక  నవ దుర్గారుాపిణి.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .


 నవ రుాపాల వెలసె  నవ రాత్రి దుర్గమ్మ
 నమ్మిన వారి గాచు  నామాల కొలువమ్మ
 తెలుగింటి గౌరవం తెలంగణ గౌరమ్మ
 భోగాల  నిచ్చేటి   బోనాలబతుకమ్మ ॥
 
ఆశ్వీయుజ మాసపు అమావాస్య  మొదలుగ
నవరాత్రులు వెలసిన నవ దుర్గ మాయమ్మ .
రోజుకొక్క రుాపము రోజొకలంకారము
అమ్మ అవని గాచెడు అంబ ఈశ్వరీయము ॥

1.బాలత్రిపురసుందరి.
బాలత్రిపురసుందరి భవ్యమైన రుాపము
భావ భక్తి  నిండిన  భగవతీ స్వరుాపము
శక్తి మంత్ర  మహిమలు ముక్తి నిడెడు పుాజలు 
ప్రధమ పుాజలందెడు ప్రసన్న మౌ కీర్తులు ॥

2..శ్రీ గాయత్రి దేవి :
ముాల శక్తి మంత్రము  మచ్చటైన రుాపము
నీల ధవళ వర్ణము  నిత్య దర్శనీయము
గాయత్రీ  తేజము ఘన ద్వితీయ రుాపము 
త్రిసంధ్యా సమయము త్రిఫల మంత్ర పఠనము

సహస్ర నామ మంత్ర సార పుార్ణ తేజము
 ఓజ తేజ సారము మొాక్ష మిడెడు మంత్రము
పంచముఖీ తేజము పంచ భుాత మయముా
ఆయురారోగ్యాది  అద్భుత ఫల సారము ॥

3.  శ్రీ మహాలక్ష్మి దేవి :
మంగళమౌ రుాపము  మాంగళ్య  కారకము
మహాలక్ష్మి  తేజము  మహిమాన్విత  రుాపము.
మాన్యాష్ట సిద్ధి కరి మాత తృతియ రుాపము  
అష్ట రుాపి అమ్మణి  కష్ట నష్ట వారిణి ॥

 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి.
 
 అవని అన్నపుార్ణా  అన్నదాయపర్ణా
ఆదిశక్తి  శివ సతి  అన్న దాన కారిణి
జీవనాధారిణీ జీవకోటి పోషిణీ
క్షుద్బాధా నాశినీ క్షు దర్వీధరి మానినీ ॥ 

నవరాత్ర్యవతారిణి  నాశాత్కలి హారిణీ
ధాన్య కారిణీ ఘని ధరణి క్షామ నాశినీ
శరణాగత వత్సలే   శంకరార్తిశమనీ
కాశీ పుర వాసినీ కామదహను భామినీ.

5. శ్రీ లలితాంబా రుాపిణి.

శ్రీ లలితా శివసతి  శ్రీకరి గణ పాలిని
అంబ త్రిపుర సుందరి అరుణోజ్వల భాసిని
కామిత ఫలదాయిని  కలిమల ఖలు హారిణీ
ఉపాసినీ, సువాసినీ  ఉమా అభయ కారిణీ॥

ముని గణ సంసేవిని ముల్లోక  పాలినీ
ఖడ్గ మాల ధారిణీ  కనక దివ్య భుాషణి
ఇక్షు కోదండ ధరి ఈప్సిత వర దాయినీ
శ్రీ చక్ర వాసినీ  స్థిత బిందురుాపిణి ॥

6. శ్రీ మహా సరస్వతీ స్వరుాపిణి.
7. 
శ్రీ మహా సరస్వతి శ్రిత జ్ఞాన ప్రదాయిని
అక్షరస్వరుాపిణి  అక్ష మాల ధారిణి.
హంస వాహినీ ఘని హంసిని జన జీవని
వాణి వీణా ధరీ వాజ్మయి విశ్వంభరి .॥ 

7. శ్రీ  మహా  దుర్గా రుాపిణి.

  శ్రీ సింహ వాహినీ    శ్రీ దుర్గ భవానీ  
  దుర్గమాది వారిణీ దుర్గ దుఃఖ హారిణి.
  దుర్గమాసురదమని దుర్గముాగ్ర రుాపిణి
  సుఖ సౌఖ్య ప్రదాయినీ సుందరి శివ మొాదిని॥

8. శ్రీ మహిషాసుర మర్ధిని.

శక్తి రుాపి శాంకరి  ముక్తి దాయినీశ్వరి
 మార హరుని రాణీ  మంగళీ మనోహరి
 మాత శుాల పాణీ  మహిషాసుర మర్దని    
 శీఘ్ర ఫల ప్రదాయినీ వ్యాఘ్ర వాహినీ ఘని॥

9 శ్రీరాజరాజేశ్వరి దేవి అవతారము

అపరాజిత ముార్తీ అంబా జగదీశ్వరి
రాజ రాజేశ్వరీ  రమణి చిత్స్వరుాపిణి
శ్యామలే  కోమలే  శ్యామల శువ గౌరీ 
 కుంకుమార్చిత పదే కులయొాగిని కౌళిని ॥

పాహి పాహి పార్వతి పరే పవిత్ర జనని
ప్రసిద్ధ కార్య కరణి ప్రసీద పాహి పావని
వంద్య వేద రుాపిణి వర శుభ కాత్యాయని
మంత్ర మాన్యే ధనీ  మహిత విజయ కారణీ ॥

Thursday, October 14, 2021

గజల్

తెలుగు వెలుగు సాహిత్యవేదిక ..కొరకు'
గురువారం: 14/10/2021.
అంశం : ఐచ్ఛికం.

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

ప్రక్రియ : గజల్.

శీర్షిక : నీలాల ఆకాశంలో....

నీలాల ఆకాశంలో నేనో చిరు తారకనై
నెలరేయి వెన్నెల వెలుగై కురవాలని ఉన్నది॥

వేవేల మువ్వల సడిలో రాగాల గీతికనై
శృతి నిండిన పల్లవి నేనై పాడాలని ఉన్నది.॥

మరుమల్లె గంధం నేనై సందేశపు ప్రేమకు తావై
చిరుగాలుల చల్లని వీచిగ సాగాలని ఉన్నది.॥

పాటల్ల పల్లకి లోనా పరువాల కన్నెను నేనై
వాడల్ల నాదపు సిరినై కురవాలని ఉన్నది॥
తాళాల పదగతి నేనై ఆడాలని ఉన్నది॥

నాట్యాల నవరస భావం వాద్యాల వలపుల తాపం
సందేళ మురళిని నేనై  పలకాలని ఉన్నది.॥

ఈశ్వరీయ కలల అలల వేణునాద తరంగాల
ఆమాధవ చరణాలను తాకాలని ఉన్నది ॥

Wednesday, October 13, 2021

మమతల మంటలు

శీర్షిక : మమతల మంటలు.

మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది?
 సమతా మమతా  లేని జగతిలో
 మందును ఎవరిని అడిగేది...?॥

రక్త బంధపు, అనురాగములే
నిలిచెను స్వార్ధపు చింతనలై...,
అర్ధము లెరుగని అవేశములై ,
అర్ధము కొరకు అనర్ధములై....॥

అమ్మా, అక్కా, చెల్లీ,. తమ్ముల  
బంధాలు బరువై  , పలచబడే !
అన్నలు ,అయ్యలే , వావీ వరుసల
బంధపు విలువకు శిలువేసే॥

కామపు కాటుల ,మంటలు రగిలే.
 దారుణ హత్యలె , ఆటగ చెలగే.
 ఏసిడ్, దాడుల ఏడ్పుల గోడులె,
 నిత్య కర్మ , క్రుత్యములై మిగిలె ॥

న్యాయం ,ధర్మం, కనులు ముాసుకొనె,
జాతి జగడములె  జగతిని నిండె.
నీతి -న్యాయముల, బాటలు బురదై,
బ్రతుకు శ్వాశలే  బరువాయె ॥

నారీ చింతన నెగడై ఎగసే.
మనిషే మ్రుగమై చెలరేగే....,  
చావుల చితి గని, భరతావని- 
కన్నీరె-ప్రళయమై- కోపించే ॥

చీకటి- వెలుగుల జీవన గతిలో..
నగవుల విలువలు దిగజారే ..
భార్యా బిడ్డల బాధ్యత , విధులే
బరువై  , బ్రతుకులే చితులాయే .. ॥..

అమ్రుతమె కరువై , విషపు జ్వాలలే
మింటికెగసె , హ్రుది మైలపడె..
మనిషే   మనిషికి , శత్రువు కాగా
"పగ" లే...మనిషికి  విధులాయే.॥

నాదీ -నీదను వాదపు సమరాన
రక్తమె ఝరులై  ప్రవహించే..
ధనమే జగతిని సాశించినదై...
వైరపు మంటల నెగదోసే ॥

మమతల మాటున మధన పడే
నా మనసుకు ఏమని చెప్పేదీ..?
ఎవరికి ఎవరుా కాని జగతిలో
ఎంత కాలమని బతికేది..॥

రగిలిన గాయపు మంటల నార్పగ
మందును ఎవరిని అడిగేదీ....?॥
మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది..?॥
---------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
---------------------------

సరస్వతీ స్తుతి

శీర్షిక:" దివ్య తేజోమయి"

ధవళ వర్ణ వస్త్రధారణతో 
పద్మం పైన ఆసీనురాలై 
మందస్మిత వదనంతో 
కాంతులీనుతూ 
పరమ సాత్విక మూర్తిగా... 
అక్షయమైన సిరుల్ని ప్రసాదించే 
"మహా సరస్వతి నమోస్తుతే"....!!

అపరిమితమైన స్వచ్చతకూ,
సృజనకూ,
నిష్కల్మషత్వానికి నిదర్శనమై
"నా రూపమే నా సందేశమని" 
ఎన్నో అంశాల్ని ఉపదేశిస్తూ
అధిష్టాన దేవతగా 
మోక్ష సిద్ధిని ప్రసాదించే ....
"సిద్ధి సరస్వతి నమోస్తుతే"...!!

అజ్ఞాన  తిమిరాంధకారాన్ని
దూరం చేసి.....‌
విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని 
నిరంతరం శివానుజగా 
ప్రవహింపజేసే.....
ధారణ సరస్వతి నమోస్తుతే...!!

అవిద్య ఉన్నచోట  
దృక్కులు ప్రసరిస్తూ
విద్యా వాటికగా....

అజ్ఞానం నెలకొన్న హృదయానికి 
అనుగ్రహం అందిస్తూ 
జ్ఞాన వేదికగా ....

జడత్వం నిండిన చోట
కరుణ పల్లవిస్తూ 
చైతన్య దీపికగా...

చీకటి ఆవరించినప్పుడు 
తేజస్సు ప్రసరిస్తూ 
వెలుగు వాహిక గా....

నాలుగు దిక్కులు
వేదమాతగా  పరిఢవిల్లే
"నీల సరస్వతి నమోస్తుతే"....!!

సత్వగుణంతో వర్ధిల్లుతూ 
సౌమనస్య‌ భావాలతో 
సౌజన్య మనస్కులై 
విలసిల్లాలని ప్రబోధించే 
"దివ్య తేజోమయి"
సరస్వతీమాత నమోస్తుతే....!!

నలిగల రాధికా రత్న

Monday, October 11, 2021

కుల రక్కసి

అంశం:" కుల రక్కసి"
శీర్షిక :  భ్రష్టుపట్టిన సమాజం.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021

నేటి సమాజంలో కుల వివక్షతల
వివాదాలతో రాజ్యాంగం రణరంగమౌతోంది
కుల రక్కసి చేస్తున్న స్వైరవిహారం
మానవత్వాన్ని కుాకటి వేళ్ళతో కుాల్చేసింది.॥
కులమత వివక్షతల వేడి నిండిన బాటలో 
మనిషి స్వార్ధ పుారిత వ్యుాహ రచనలతో
మంది ముార్ఖత్వాన్ని  మహోన్నతంగా వాడుకుంటున్నాడు.
ఫలితం..
అక్షర జ్ఞానం లేనివారి  అనాలోచిత పాలనలో
అసందర్భ రాజకీయాలకు ఆహుతౌతున్న జనం.
గద్దె కెక్కిన నిరక్షరాస్యుల పాలనలో పెరుగుతున్న  రౌడీయిజానికి భ్రష్టుపడుతున్న  యువత భవిత॥
అధికార బలానికి  తలవంచిన న్యాయ వ్యవస్థల్లో
తీర్పులోపాల చక్రాల కింద నలిగిపోతున్న న్యాయం
అక్షరాస్యత, ఆకలి నిండిన ఆక్రోశాలతో
ఆత్మ గౌరవాన్ని  అమ్ముకు బతకుతున్న వైనం.॥
రిజర్వేషన్ల పేర్లతో అర్హత లేనివాడందుకుంటున్న
సౌకర్యాలకు పడిపోయిన అక్షరం కన్య,
మారుతున్న  జనాల మధ్య చావలేక  బతుకుతుా 
బుాతు నిండిన భావ జాలంతో భాషకు
వలువలు విప్పుతుా విహరిస్తున్న  దౌర్జన్యం.
వెనుకబడ్డ వారిని ముందుకు తెచ్చే యత్నంలో
సభ్య సమాజానికి శిలువ వేస్తున్న  అవివేకం.
ఆగని కులాంతర వివాహాలకు రాజుకుంటున్న జాతి
వైరాలకు ఆహుతౌతున్న అమాయక యువత॥
అణగారిన సమాజంలో అసభ్య పదజాలాల
ఆవిష్కరణకు అర్ఘ్యం పోస్తుా ఆడతనాన్ని
అపహాస్యం చేస్తుా ఆడుకుంటున్న  క్రౌర్యం ॥
మార్పురాని సమాజాన్ని మార్చే ప్రయత్నంలో
అసువులు బాసిన  ఉద్యమవీరుల బీటలుబారిన
సమాధి చిహ్నాలు మరచిపోయిన మానవత్వాన్ని 
గుర్తు చేస్తుా కుల రహిత సమానత్వ విలువల్ని
తెలియపరచలేక మౌనంగా కన్నీరు కారుస్తున్నాయి ॥

మత్తకోకిల పద్యాలు , లో దుర్గమ్మ స్తుతి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

ప్రక్రియ :  మత్త కోకిల పద్యాలు

శీర్షిక  : నవరాత్రి దుర్గమ్మ.

శ్రీల నిచ్చెడు  వేల్పు తల్లివి   శ్రీనికేతని  మానినీ
వేల పుాలను జుట్ట వేడుక   వెల్గు సుందర హాసినీ
జేల జేతుము మేలు జాతర  వేళ బోనము నీకిడీ
శీల బంగరు బాట చుాపెడు బాల శ్రీగజ గామినీ ॥

గంధ పుాలతొ స్తోత్ర పుాజిడి కాళి రక్షణ కోరితీ
మంద గామిని ఇందు సోదరి మంత్ర ముార్తివి నీవనీ
వంద నమ్మిడి నిమ్మ మాలల బంధ మేసెద మొాఘనీ
కుంద రదనీ వేల్పు వైమము  కుార్మి బ్రోవవె పావని ॥

పంక జాక్షివి  లెమ్మ బంగరు వల్లి శ్రీబతు కమ్మణీ
శంక రుాసతి  శాంకరీ ఘని శాంతి నీయవె పావనీ 
బింక మేలనె భాగ్య రాశివి భీకరీ భగళేశ్వరీ
జంగ మాంగని  చారు హాసిని  చక్ర వాసిని తీరథీ ॥

రమ్మ నంటిని రాగ దేలనె రమణి శ్రీహరు కామినీ
నమ్మి వేడితి నమ్మ  శాంభవి అమ్మి ఆపద బాపవే
అమ్మ చేకొను వందనమ్మిదె  ఆర్తత్రాణ పరాయణీ 
లెమ్మ తొమ్మిది రుాపు లెత్తిన కొమ్మ అందుకొ ఆరతీ॥


 శీర్షిక  : ముద్దు కృష్ణ .

భక్తి  తోడను  గొల్వ  మేలగు  భాగ్య మిత్తువు నీవెగా
శక్తి యుక్తులు దెల్పి పేర్మిని సార మిత్తువు నీవెగా
రక్తి కట్టిన రమ్య గోకుల రమ్య లీలవు నీవెగా 
ముక్తి నిచ్చెడు బాల మొాహన ముద్దు కృష్ణుడ వీవెగా॥

బుద్ధుడు.

శీర్షిక : ఆధ్యాత్మిక గురువు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

కపిలవస్తు వాసుడు కడు దయాసముద్రుడు
సిద్దార్ధ గౌతముడు సిరి గుణములకు రేడు.
బౌద్ధ మత  స్థాపకుడు,  "బుద్ధ" నామధేయుడు
ఆధ్యాత్మిక గురువుగ అందించెను సుాక్తులు. ॥

నాల్గు దశల జీవము నరకాంతకమయమని
సన్యాసి  జీవితమె సార్ధకమని దలచెను.
బోధివృక్ష  నీడను  పొందె శాంతి సౌఖ్యము
పరివ్రాజక జీవిత-ఫల చింతనె ఫలించె ॥

సిద్దార్ధ నామమే సార్ధకమీ ఇలను
అలరకలమ గురువుగ అందెను బోధనలను.
యొాగ శాస్త్ర జ్ఞానము  యొాగులకడ నేర్చెను.
ప్రావీణ్యత పొందెను  ప్రాజ్జ్నుడై నిలిచెనుా ॥

జ్ఞాన బోధ చేయుట  జ్ఞాని ధర్మ మనెనుా
భిక్షాటన చేయచుా   బుద్ధునిగా మారెను .
అష్టాంగ మార్గాల  అతని సత్ బోధనలు
ఆతని జీవ గాధలు  ఆదర్శపు బాటలు ॥

అంటు రోగం కన్న .అధైర్యం  ప్రమాదం ,
అందరుా సమానం అదియే మన ధర్మం .
అతిగా అశించకు  అతిగా దుఃఖించకు.
శోకాన్ని తప్పించు శోధించు జీవితం, ।

ఆచరించని మాట  అది నిష్ప్రయొాజనం.
మనసన్నది ఉంటే  మార్గ మదే  కనపడును.
మంచి మాట బాటలు  మానవత్వ నీడలు
అవి సుాక్తుల బాటలు అవె ఈశ్వరి మాటలు ॥

శీర్షిక బోనాల భోగాల బతుకమ్మ గౌరి.

మహతీ సాహితీ కవి సంగమం లో
*బతుకమ్మ ఈ-కవితాసంకలనం*కొరకు

శీర్షిక  బోనాల భోగాల బతుకమ్మ గౌరి.
 
మా ఇంటి మహలక్ష్మికి తోడైనా సఖియ
బంగారు బతుకమ్మ  సుమగంధ నిలయ
అర్తులను గాచేటి కరుణాల వలయ.
సిరిమల్లె మాయమ్మ హిమవంతు తనయ

తెలంగాణ సంస్కృతికి  గురుతైన తల్లి
రంగుపుాల వలువలిడిన నిండుపసుపు గౌరి
తొమ్మిదైన రుాపాల దుర్గా కాత్యాయని
బోనాల భోగాల నారగించు పావని

అట-పాటల వెల్గునాతల్లి ముఖము
అర్తజనుల నేలేటి అభయమిచ్చెడి కరము
అశ్వీయుజ మాసమున తల్లికీయ స్వాగతము
పసుపు కుంకాలమల్లి ఫలమిచ్చు దైవము  ॥

కష్టాలను కడతేర్చగ కాళివై రావమ్మ
నిమ్మపండ్ల  హారాల నిండైన కొమ్మా
నిలువెత్తు  నీరాజనమందుకోవమ్మా
మహిగాచే మంగళివి మమ్మేలుమమ్మా 

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021

ఆడపిల్ల

అంశము: చిత్రకవిత
తేదీ: 11-10.2021
మ.సా.క. సం: 69 
**************************
పేరు: కీర్తి పట్నాయక్
ఊరు: విశాఖపట్నం
ప్రక్రియ: వ్యాసం
శీర్షిక: మహాలక్ష్మి
ఈ వారం కవితా సంఖ్య :  1
************************

*👧🏻 ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే... ఆ ఇంట్లో మహాలక్ష్మీ ఉన్నట్టే ఉంటుంది. ఆడపిల్ల నవ్వు ఓ పువ్వులా ఇంటికి అందాన్నిస్తుంది. అమ్మాయి అనురాగం పంచుతుంటే... ఆప్యాయంగా నాన్నా అని పిలుస్తుంటే... అంతకు మించిన ఆనందం ఏముంటుంది.?* 

*👧🏻 బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకే అక్టోబర్‌ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.*

*👧🏻 పౌరహక్కులు అనగానే గుర్తుకువచ్చే తొలిపేరు ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌. 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా కీలక మార్పులు చేశారు. అందులో మ్యాన్‌ అన్న మాటను పీపుల్‌గా ఆమె మార్చారు. నీ అనుమతి లేకుండా ఎవరూ నిన్ను తక్కువగా చూడలేరు. అంటూ మహిళలు తమ ఆత్మగౌరవాన్ని తామే నిలబెట్టుకోవాలని, అందుకు ఎంతటి పోరాటమైనా చేయాలని సూచించారు. అందుకే ఆమె పుట్టిన రోజును అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.*

*👧🏻 ఆడుతూ పాడుతూ తల్లిదండ్రుల చాటున గడపాల్సిన పదకొండేళ్ల వయసులో సమైరా మెహతా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో పలువురికి శిక్షణనిస్తోంది. అమెరికాకు చెందిన ఈ బాలిక- తన ఈడు పిల్లలు ఆడుకునేందుకు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, కృత్రిమ మేధ కాన్సెప్ట్‌లను నేర్పించే గేమ్‌ను ఆవిష్కరించింది. ‘కోడర్‌బన్నిజ్‌’ అనే కంపెనీని స్థాపించి, దానికి సీఈఓగా మారింది. కేవలం ఏడాదిలోనే 35 వేల అమెరికన్‌ డాలర్లు సంపాదించి, సిలికాన్‌ వ్యాలీ దృష్టిని ఆకట్టుకుంది. లింగ సమానత్వంకోసం పాటుపడే ఈ తరం ఆడపిల్లలంతా సంఘటితమైతే సాధించలేని అద్భుతమేమీ ఉండబోదని ఈ చిన్నారి అంటోంది.*

Sunday, October 10, 2021

సమాచార హక్కు చట్టం కవిత

[10/5, 16:53] p3: తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ                 అనంతపురం వారి ఆధ్వర్యంలో
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సమాచార హక్కు చట్టం-2005 ,(అక్టోబర్ 12వ తేదీ)  సందర్బంగా
కవితల పోటీ కొరకు రాసిన కవిత.

శీర్షిక :   తమ హక్కుల రక్షణ , ప్రజల బాధ్యత.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.


అక్టోబర్ 12, 2005 నుండి పూర్తి 
స్థాయిలో అమలులోకి వచ్చిన
సమాచార హక్కు చట్టం .
అటుపై వెలుగులోకి వచ్చిన 
ఎన్నో రాజకీయ కుంభకోణాలు.
వాటిపై ప్రజల సందేహాలను అలవోకగా
తుంగదొక్కుతున్నన కేంద్రం , అడ్డ దారుల్లో
అడిగిన వాడిని అణచివైస్తున్న వైనం ॥

ఎందరో పోరాడి తెచ్చిన 
సమాచార హక్కు చట్టం.
ప్రభుత్వాలకు మాత్రమే 
లొంగిఉన్న ప్రత్యేక ప్రజా చుట్టం. ॥

ప్రభత్వ పరిపాలనలో  లోటుపాట్లను
ప్రశ్నించే హక్కును కలిగించిన చట్టం,
భావ ప్రకటనా స్వేశ్ఛంటుానే 
అడిగిన వాడిని అణిచివేస్తొిన్న దైన్యం
న్యాయానికి సంకెళ్ళు వేస్తున్న  వైనం ॥

అసహాయ ప్రజల లో  అర్ధంలేని ఆవేశం.
రాజకీయ పార్టీల అధికార దుర్వినియొాగం
 నేటికీ కోల్పోయిన ప్రజా స్వాతంత్ర్యం .
హక్కు పేరుతో ఆరని అణచివేతల బానిసత్వం ॥

సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేస్తుా
స్త్రీలు , రైతులు జరుపుతున్న శాంతియుత 
ఉద్యమాలు వత్సరాలు దాటినా జవాబు 
దొరకని ప్రశ్నలై సమస్యలుగా నిల్చిపోయాయి ॥

చట్టాలు అమలులోకి వచ్చినా 
నెరవేరని లక్ష్యాలు ఎన్నెన్నో..
ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిన ఈ
సమాచార హక్కు చట్టం, దుర్వినియొాగాన్ని
ప్రజలు గుర్తించి తమ హక్కులను 
సాధించగలిగే  బాటలో శాంతి పోరాటం 
చేయడం బాధ్యత నిండిన పౌరులుగా 
మన కర్తవ్యం.॥

 హామీ :
నా ఈ  కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన..


 

,
[10/10, 20:59] రెడ్డి T V రెడ్డి అనంతపుార్: అమ్మా నమస్తే,
            మీకు అభినందన శుభాకాంక్షలు. సమాచారహక్కు చట్టం 2005 ఆవిర్భావం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థ,నిర్వహించిన కవితల పోటీలో మీరు తృతీయ విజేతగా ఎంపికైనారు. రేపు అధికారిక ప్రకటన చేస్తాము.మీరు మీ పాస్ ఫోటో ఒకటి వాట్సప్ ద్వారా పంపగలరని కోరుచున్నాము
   --- టి.వి.రెడ్డి. అధ్యక్షుడు
తెలుగు వెలుగు సాహిత్య, సామాజిక సేవా సంస్థ,అనంతపురం 
సెల్ 73828 63523.

Saturday, October 9, 2021

దుర్గాస్తుతి ..బంగారు బతుకమ్మ

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక:  నవ దుర్గా స్తుతి.
ప్రక్రియ: ఇష్టపది

1.శైలపుత్రి
2.బ్రహ్మచారిణి
3.చంద్రఘంట
4.కుాష్మాండ
5.స్కందమాత
6.కాత్యాయని
7.కాళరాత్రి 
8.మహాగౌరి 
9.సిద్ధిధాత్రి.


ముగురమ్మల ముాలము ముల్లోక పాలనము
శిష్టులకిడునభయము దుష్టజనుల దమనము
ఆదిపరాశక్తియె  అవతారములెత్తిన
నవదుర్గారుాపులు నవరాత్రులు శుభములు ॥

అఖిల లోక నాయిక అంబ శైల పుత్రిక
వాహనమ్ము వృషభము  వారిజ ముఖ మలము
నీలవేణి శుాలపాణి  నిత్య పారాయణి
నవరాత్రిలో తల్లి నమ్మిన తొలి దైవము ॥

ధవళ వస్త్ర ధారిణి తరుణి బ్రహ్మచారిణి
కర కమండల ధరి, సు కాంత జ్ఞాన రుాపిణి
జపమాలా ధారిణి జగదీశ్వరి జననీ.
తపఃచార్ని  దయగుణి తవ చరణం శరణం

చంద్రఘంట  రుాపిణి చంద్రిక ముఖ తోషిణీ.
శక్తి ధైర్య రుాపిణీ  శాంకరి  భయ హారిణి
ధుామ్రలోచను దమనీ దుఃఖ,  పాఫ ,నాశినీ
నవ దుర్గా రుాపిణి  నాద వేద రుాపిణి ॥

విశ్వ శక్తి రుాపిణి  విజయ విశ్వ మొాదిని
అష్ట భుజా రుాపిణి  అష్ట అస్త్ర  ధారిణి.
కుాష్మాంద స్వరుాపిణి గుాడగుణ స్వభావిని
ఆది శక్తి  రుాపిణి  అంబ సింహ వాహినీ॥

ఐశ్వర్య ప్రదాయిని అంబ మొాక్ష కారిణి.
ఇహ పర సుఖ దాయిని ఇచ్ఛా పుార్తి కరణి
స్కందమాత పావని స్కందుని ప్రియ జనని
తారకసుర భంజని ధరణోద్ధర కారిణి ॥

 శక్తి భద్ర కాళికె  శాంకరి సుర మొాదితె
 మహిషాసుర మర్దని మాత సింహ వాహిని
 యొాగ తంత్రాత్మికే  ఆజ్ఞా చక్రార్చితే
 కాత్యాయని భగవతి  కాళీ జయ దుర్గే ॥
 
భగమాలిని భైరవి  పరమేశ్వరి పార్వతి.
సర్వాంతర్యామిని సర్వ హృదయ వాసీని
మణి ద్వీప నివాసిని మాత వేద రుాపిణి.
దుర్గా త్రై యంబికెే  దుర్లభే శివాత్మికే ॥

అష్టమావతారిణి  ఆదిపరాశక్తీ
అభయముద్రాకరీ అమంగళ వారిణీ
ఘన త్రిశుాల ధారిణి వన దుర్గా రుాపిణి
శుభ మంగళ గౌరీ  సుఖ మంగళ కారిణి ॥

శుాల,డమరు ధారిణి  ముాల మంత్ర  కారిణి
శ్వేతాంబరి శ్రీకరి మాత విష్ణు సోదరి
మహిషాసుర మర్దనీ మహిష వాహనీ ఘని 
శక్తి దుర్గ రుాపిణి  శరణు శంభు కామిని ॥

సిద్ధిధాత్రి  శ్రీకరి  బుద్ధి ప్రద శాంకరి.
ఇహ పర సుఖ కారిణీ  ఇందు వదని ఈశ్వరి.
శంఖ చక్ర ధారిణి   సార పద్మ లోచని
బ్రహ్మ జ్ఞాన ఫలకరి బ్రాహ్మీ మాహేశ్వరి.॥

సర్వ సిద్ధి వరదే   శర్వు రాణి శుభదే
అభయప్రద హస్తే అంబే శివ శక్తే.
నవ దుర్గా రుాపే నారాయణీ సతే
నవ రుాపిణి మాత్రే  నామ విజయ కీర్తే ॥

***********************
Women writers కు పంపినది.

శీర్షిక  : కోలు కోలో యమ్మ బంగారు బతుకమ్మ.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఊరు: కల్యాణ్ : మహారాష్ట్ర.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు మాతల్లి ఉయ్యాలో
మముగావ  వచ్చేవు ఉయ్యాలో
మాబాధలను  దీర్చ ఉయ్యాలో ॥

ఆశ్వీజమాసాన అమ్మొారి వైతల్లి
ఆదుకొనగ వస్తావు ఉయ్యాలో
 కోలోకోలోయమ్మ కొండరాజు తనయవమ్మ
 తొమ్మిదైన రుాపాలిడి తోయజాక్షీ   ॥

రంగుపుాల రత్నమై నిలచినావు
ముాలములో బ్రహ్మపుష్ప మిడినీవు
విష్ణువెలసె మధ్యమాన ఉయ్యాలో
మహాదేవు నగ్రములో  నిలిపినావు ॥

 బంగారు  బతుకమ్మగ ఉయ్యాలో
నిమ్మహారాల నిండు పుాలకొమ్మవుా
అతివలంత ఆదిశక్తు లన్నావుా
రోజుకొక్క రుాపమునిడి గాచినావు ॥

తెలంగాణ  కీర్తిచాట ఉయ్యాలో 
పసుపుముద్ద గౌరమ్మగ వెలసినీవు
బోనాల భోగమిడగ పొంగినావుా
సల్లగుండ  దీవెనలిడి పోయినావుా..॥


మహతీ కవి సంగమం కవితలు

[5/6, 12:20] p3: మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్
ప్రతి రోజూ కవితా పండుగే
పర్యవేక్షణ డా.శ్రీ .అడిగొప్పులసదయ్యగారు
నిర్వహణ.శ్రీ .ముక్కా సత్యనారాయణ గారు
సమీక్షణ.డా.శ్రీ .అడిగొప్పుల సదయ్య గారు
అంశం మనిషి  మనసు
తేది 06  05  2031 గురువారం
ప్రక్రియ : ఇష్టపది. 

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక  :  మనిషి మారాలన్న.


మనసు మనసో యనుచు  మన నెేమి లాభమది
మనసు మాటను విన్న  మనిషెవడు ధరలోన॥

మనసు మంచిని చెప్ప  మనిషి బుద్దెరుగదుగ 
మాయ మాటల జెప్పి మనసణచి వేతురుగ ॥

నా ఇల్లు నా వాళ్ళు  నాది నాదని కోరి
నమ్ము వారిని గుాల్చె  సొమ్ము  సోకుల కన్న

స్వార్ధ మదె పెరుగగా  వ్యర్ధ జీవిగ మారి
వేల తప్పుల జేసి  వెతలెన్నొ పడుదురుగ ॥

-------------------------------------------------------

ధనము కొరకై పోరు ధనము కొరకే హోరు
 జనము నమ్మిన నోటు ధనముకమ్మిరి ఓటు॥
 
ధన మదముతో మనిషి తన -పరల నెరుగకను
అధికార బలము తో ఆధిపత్యము జేసె॥

 మితిమీరె పరిధులు అతివ కవమానములు 
 కన్నీటి కార్చిచ్చు  కరిగె సిరి సంపదలు॥
 
 నాడున్న సుఖ శాంతి  నేడు జగతిని లేదు
 అన్ని తెలిసీ మనిషి   ఆశ వీడుట లేదు ॥

---------------------------------------------------

చదువున్న వారేమొ  చవిలేని బ్రతుకేల
చదువు లేనివారదె  చక్క పాలకులైరి ॥

అవగాహనాలోప మవని నిక్కటులేల
జనులెల్ల  జడులైరి జడిసి పాలకులకుా॥

మానవత్వము తరిగె  దానవత్వము పెరిగె
మమతానురాగాలె  మట్టికలిసీపోయె॥

మార్పు రావాలంటె మనిషి మారాలన్న
ఇలనీశ్వరీ మాట  ఇచ్ఛతో వినుమన్న ॥
-------------------------------------------------
[5/10, 16:17] p3: 10..05. 2021
మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్ 
ప్రతి రోజు  కవితా  పండుగే 
పర్యవేక్షణ:  డా॥.శ్రీ .అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: .దాసరి  చంద్రమౌళి  గారు
 సమీక్షణ: శ్రీ .టి.ఆర్.కె.కామేశ్వరరావు .గారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

అంశం: చిత్ర కవిత
శీర్షిక :  అన్నీ తెలిసిన వాడు.

ప్రక్రియ : వచన కవిత.

పితృదేవతల ఉత్తమ గతి ప్రాప్తి కొరకు
భగీరధుడు చేసిన తపో ఫలము చేత
ఉరుకులు పరుగులతో ఉధృత తరంగిణియై
ఉరికి వస్తున్న గంగమ్మను  శివుడు తన
జటా జుాటంలో బంధించి , లోకంలో
జీవ,  జంతుల రక్షణార్ధఁం చిన్న ధారగా
భుామిపైకి ప్రవహింపజేసేడు. పవిత్ర గంగ
మానవుల పాప ప్రక్షాళన చేస్తుా ,సమృద్ధిగా
నదీ -నదాల లో నిండి , జన జీవితాలను
ఉద్దరించి పాప ప్రక్షాళన గావించింది.
అటువంటి గంగమ్మ విలువ గుర్తించని
జనులు పవిత్ర గంగను కలుషితం చేస్తుా..
కాలుష్యం నిండిన పర్యావరణానికి
పునాదులేసారు.స్వార్ధ పుారిత మానవులకు
అహర్నశలుా అమృతాన్ని పంచే గంగమ్మ  
అవమానితయై ఆవేశంతో ఉరిమి ఉరికింది...
ఊరుా-వాడా ముంచెత్తింది.
ఆగడాలకు' ఆవిరై ఇగిరి పోయింది
 శాంతముార్తయైన గంగ కలుషితాల కంపుకు కనుమరుగై  పోగా పీల్చ ప్రాణవాయువు , 
 తాగ మంచినీరు కరువైన జనులు 
 విష కణాల బారిన పడి వింత రోగంతో 
 విధివంచితులై ఊపిరాడక
ఊర్ధ్వగతులకు చేరుకుంటున్నారు.
పర్యావరణ కాలుష్యానికి  పొగబారి 
నల్లబడిన మేఘాలచాటునుండి తొంగి
చుాస్తున్న పుార్ణ చందృడు..
మందులేని మహమ్మారి కంట పడకుాడదని
ముఖం చాటేశాడు. అన్నీ తెలిసిన ఆది దేవుడు
శిలరుాప లింగాకారుడై కనులు ముాసుకొని 
యొాగ-నిద్రలోకి జారిపోయాడు.


.
హామీ;  ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని , నా స్వీయ రచన..

.
[5/12, 18:22] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ప్రతిరోజు కవితా పండుగే.

పర్యవేక్షణ: డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు.

నిర్వహణ: యాంసాని లక్ష్మీ రాజేఃదర్ గారు
తేది: 12-05-2021.

అంశము: దత్తపది.
మది   హృది  గది  నది..

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

ప్రక్రియ : ఆట వెలది.

మదిని కలత రేపె మహినున్న  దికరోన
హీన  దీన గతులె  హృదిని కలచె
గదిని వీడ భయము గననేమి శాపమొా
నదులు శవము లేలె నరక మిలను ॥
[5/21, 11:23] p3: మహతీ సాహితీ  కవి  సంగమం
కరీంనగరం
ప్రతిరోజూ  కవితా పండుగే
తే 21 -5-2021  శుక్రవారం 
పర్యవేక్షణ : శ్రీ డా. అడిగొప్పుల సదయ్య  గారు
నిర్వహణ  : శ్రీ వి. టి. ఆర్. మోహనరావుగారు
సమీక్షణ  : శ్రీమతి. దొంతంరాజు విజయలక్ష్మి  గారు
అంశం  : ఐచ్చికం
ప్రక్రియ :  శ్లోకాలు.
కవిత సంఖ్య  : 5. 
శీర్షిక  : నవావర్ణ శ్లోకాలు.

                  

|| ధ్యానం ||

ధ్యాయేత్ ఆది మధ్యాంత రూపిణీ ,
అఖండైక రస వాహినీ, |
అష్థాదసా పీఠ అఘనాసినీ, దేవి ,
ముక్తిప్రదాయినీ, సంగీతరసపోషిణీ ||

అరుణ కిరణోజ్వలాకాంతిరసభాసినీ,
అ,క,చ,ట,త,ప వర్గాది గుణభేదినీ , |
అంబ యంత్రాది ,కాది,సాది,
మంత్రాది వసనీ ,కామేశి శివకామినీ ||

1. త్రైలోక్యమోహన చక్రం .
ఆనందభైరవి రాగం .
*****
సర్వానందకరీం ,జయకరీం ,
త్రిపురాది చక్రేశ్వరీం |,
శర్వాణీ షడ్చక్రభేదకరీం ,శివసతీ,
నిగమాదిసంవేదినీం ||

మహిషాసురాది దైత్యమర్దనకరీం ,
భయహరీం, అణీమాద్యష్థ సిద్దేశ్వరీం |,
'' త్రైలోక్యమోహనచక్ర'' నిలయీం ,
సురనుతాం,'' ఆనందమయి భైరవీం'' ||

2 సర్వాశాపరిపూరకచక్రం ,
కళ్యాణి రాగం.
*****
'' సర్వాశాపరిపూరకచక్ర ''నిలయే ,
శర్వాణి శివవల్లభే .|
శ్రీవాణీ, రమా ,సేవితపార్స్వయుగళే ,
పర్వేందుముఖి పార్వతే ||

దూర్వాసార్చిత దివ్యపాదయుగళే ,భగవతే,
భవ,బంధ,భయ మోచకే |
ఉర్వీతత్వాది స్వరూపిణీం , చైతన్యఖనీం ,
'' కళ్యాణి '', ఘనరూపిణీం ||
3 . సంక్షోభణచక్రం .
శంకరాభరణం రాగం .
*****
అనంతకోటి బ్రహ్మాండనాయకీం ,
''సర్వసంక్షోభిణీం'', బ్రహ్మాణి బహురూపిణీం |
అనంగాద్యుపాసినీం అనంగకుసుమాం,,
అంబ అష్థ్థాదశాపీఠికాం ||

హస్తే అంకుశ,చాప, బాణ, ధనుధరీం ,
జయకరీం తత్త్వప్రదే , శాంకరీం |
శతసహస్రరత్నమణిదీప్తీం,మందేస్మితేందువదనాం ,
' శంకరాభరణవేణీం '' ||

4 .సకలసౌభాగ్యచక్రం .
కాంభోజిరాగం .
*****

నమ: అంబికాయై , నమ:చండికాయై ,
నమ : ఓంకార, హ్రీంకార, బీజాక్షరై |
నమ '' కాంభోజ''చరణే ,చతుర్దశభువనే ,
'' సకలసౌభాగ్య '' శుభదాయినే ||

నమ:కల్మషహరణే కలిసంతరణే ,
చతుర్వర్గ ఫలదాయినే ......|
నమ: కామేశ్వరీ, కాళికే, ఘనకపాలికే,
సకల భువనాంతర్గతపాలికే ...||

5 . సర్వార్ధసాధకచక్రం .
భైరవిరాగం .
*****
'' సర్వార్ధసాధకచక్ర '' నిలయే,
బహిర్దసాదిచక్రవలయే, బహురూపికే ''భైరవే'' |
నిత్యశుద్ధే, ముక్తబుద్ధాభేద్య, సత్ --
చిదానందమయి సాత్వికే ||

త్త్ర్రైమూర్తి త్రిగుణాత్మికే ,ధరనుతే ,
క్షిత్యాదిశివశక్తి స్వరూపాత్మికే. |....
కదంబవనవాటికే, త్రిభువనపాలికే,
దేవి త్త్వ్రైలోక్యరక్షాళికే ,,,,,||

6. సర్వరక్షాకరచక్రం .
పున్నాగవరాళిరాగం .
*****

దశరాదివినుతే గురుగుహవిదితే , దేవి-
దశశక్తి దైత్యాళికే ..... |
''సర్వరక్షాకరీ '', సర్వసంపత్కరీ , దేవి ,
కైలాశరమణేశుమణి సాత్వికే ||

దశకళాత్మికే , దశరసాత్మికే ,దేవి -
సంగీత, సాహిత్య , రసపోషికే.....|
అతిమధురవాణీ ,'' పున్నాగవరాళివేణీ ''
పాహి | సర్వజ్ఙే శివకామినీ....||

7 . సర్వరోగహరచక్రం .
శహనరాగం .
*****

రాజీవనయనే ,.. రాకేందువదనే ,
''శహన'' రాగోత్సాహి లయరంజనే |
స్వాత్మానుభోగినీ , శుభరాజయోగినీ
దేవి ,ఓంకారి, హ్రీంకారి ,జనమోదినీ ||

అతిరహస్యయోగినీ "సర్వరోగహరచక్రస్వామినీ ''
దేవి వాగ్దేవతారూపి విద్యాఖనీ |
కోదండధారిణీ , వీణాసువాదినీ , దేవి -
శరణార్తిశమనీ , సుసౌదామినీ ..||


8 . సర్వశిద్ధిప్రదచక్రం .
ఘంటారాగం .
*****
ఆవాహయే దేవి , అరుణోజ్వలే, అంబ -
దైత్యాళి , జయకాళి , జగదంబికే ....|
సర్వ శక్త్యాత్మికే , దేవి సుకసారికే దివ్య ,
'' ఘంటామణిఘోష '' కవాటికే.......||

నఖోదితవిష్ణు , దశరూపికే , దేవి
దశాకరణ శబ్ధాది అంతర్లయే |
సర్వాత్మికే , సర్వరక్షాకరీ, '' సర్వ -
వరశిద్ధిప్రదదాయి '' త్రిపురాంబికే ||

9 .సర్వానందమయచక్రం .
ఆహిరిరాగం .
*****

జయతి జయతి అంబే, శృంగారరస కదంబే ,
శివకామేశ్వరాంకస్థ - బింబేందుబింబే....|
చింతామణిద్వీప మంచస్థ్థితే , దేవి -
చిద్బింబ , శివరూపి , చక్రస్థితే......... ||

కమలాంబికే దేవి విమలాత్మికే ,
''సర్వ ఆనందమయి'' రూపలలితాంబికే |
శాకంబరీ, దేవి శాతోదరీ జనని ,
దుర్గా,రమా, వాణి సతి సాత్వికే ||

జమంగళం |, దేవిం శుభ మంగళం ||
నిత్య జయ మంగళే , శక్తి కురు మంగళం ||

ఓం | భూ: శాంతిప్రదే | భువన శాంతి ప్రదే |
భూత , ప్రేతాది - గ్రహపీడ శమనహ్రదే .....|
సకలసౌభాగ్య ప్రద పూర్ణమయి మంగళే |
ఓం.......శాంతి:......శాంతి: ......శాంతి:. . ||

రచన -
శ్రీమతి :  పుల్లాభట్ల   జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
[5/24, 13:00] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతిరోజు కవితాపండుగే....
పర్యవేక్షణ :  శ్రీ డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వహణ: శ్రీ దాసరి చంద్రమౌళిగారు.
సమీక్షణ: శ్రీ టిఆర్ కె కామేశ్వరరావు గారు.
24-05-2021: సోమవారం.
అంశము  : చిత్రకవిత
ప్రక్రియ: పద్యం.
కవితా సంఖ్య: 1.

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

శీర్షిక ;   శ్రీనివాసం సతతం నమామి.

శరణం శరణం  శ్రీ  శ్రీనివాసం
శరణం  శరణం  శ్రీ భక్త పోషం
శరణాగత వత్సల పారిజాౕతం 
శ్రీవత్స వక్షస్థల శోభిత కౌస్తుభ మణిదీప్తం 
సతతం స్మరామీ..హరీం.నమామీ ॥

చతుర్భుజ శోభిత శ్రీ శ్రీనివాసా హరే
 శంఖ చక్ర  శోభితకర  సుందరేశా  పరే
అభయ కరా ఆది మధ్యాంత రహితా...
శ్రీ పాద వల్లభా ముక్తి మొాక్ష ప్రదాయకా 
వేంకటాచల వాసా...విశ్వ రుాపా నమొా॥
   
 
అఖిల లోకారాద్యం  శ్రీహరిం, ఆనంద రుాపం
వనజ భవాది వందిత, ముని మానస బృంగం.
నంద యశోదానందం, వందత ఛరణారవిందం 
బృందావన  వనశోభిత మురళీ మనోహరం..
క్రిష్ణం    స్మరామి..సతతం.....నమామీ ॥
ఆ.......హరీ...హరీ......॥
[5/25, 18:56] p3: మహతి సాహితీ కవి సంగమం-కరీంనగరం 
ప్రతి రోజూ కవితా పండుగే 
పర్యవేక్షణ:డా.అడిగొల్పుల సదయ్య గారు 
నిర్వహణ : బీరొప్పొల్ల అనంతయ్య గారు 
సమీక్షకులు: శ్రీమతి DVS మహాలక్ష్మిగారు  
తేది: 25/05/2021 మంగళవారం 
అoశo:సాహిత్యాoశము 
(దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితా వైభవము)

ప్రక్రియ:  (ఐచ్చికం ) వచన కవిత .

-రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక: మనసు కవి .
కవితా సంఖ్య: 2
___________________________

పాడనా తెలుగు పాట అంటుా
తెలుగువారి గండెల్లో తెలగుదనాన్ని
మైల్కొలిపిన మేటి భావ రస హృదయుడు.
మావి చిగురులు తిని కోయిల కుాసిన
రాగాలకు "మనసును మల్లెల 
మాలలుాగించి మైమరపించిన
మధుర భావనల సినీ రచయిత.
సరిగమపదనిసలు పలికేవారుంటే
ఆకులో ఆకునై..కొమ్మలో  కొమ్మనై
పుాల పరిమళాల మధుర గంధాన్ని
అందిస్తానన్న అనంద గీత కారుడు.
కుశలమా! నీకు కుశలమేనా అంటుా
ప్రతీ హృదయాన్నీ పలకరించే 
 మనసున్న "నామాల తాతయ్య."
"ఇది మల్లెలవేళయనీ"  అంటుా' 
"చీకటి వెలుగుల కౌగిలి గిలి " లో  
"చుక్కలతో ఏదో చెప్పాలని" ఉందంటుా
"ఒక్క క్షణం ఒక్కో క్షణం విడవక 
కవితలల్లుకుపోయే సంగీత రస 
హృదయ కవన వన విహారుడు.
"చాలులే నిదురపో "అంటున్నా  
"నేటికి మళ్ళీ మా ఇంట్లో" -నా మదిలో
"ప్రతి రాత్రి వసంత రాత్రే" నంటుా
"ఘనా ఘన సుందరుని" సంకీర్తనా 
రవళిలో ఓలలాడిస్తుా  పవళింపు
 సేవల "సడి సేయకో గాలి"
అంటుా ప్రకృతిని ఆజ్ఞాపించే "
లాలిత పద కవితా దురంధరుడు.
జయ జయ జయ ప్రియ భారతి "
అంటుా దేశ భక్తిని పిల్లల లో
ప్రేరేపిస్తుా విద్యా బోధన చేస్తున్న
ఉన్నత పాఠశాలోపాధ్యాయుడు.
"కళాప్రపుార్ణ" "పద్మభుాషణ్" వంటి
ఘన బిరుదులందుకున్న కవి .
మహోన్నత వ్యక్తిత్వ సార్వభౌముడు.
శ్రీ శ్రీ వంటి మహా కవులకు కుడా 
స్ఫుార్తి నిచ్చే పద కవితా శైలి కలిగి
"సాహిత్య అకాడమీ అవార్డు"
గ్రహించిన అద్భుత లలిత గీత కళా
సార్వభౌముడు.అతడే మనం
 గర్వింపదగ్గ  తెలుగు కీర్తి కిరీటి 
 " శ్రీ దేవులపల్లి క్రిష్ణశాస్థ్రి" గారు.
[5/29, 19:30] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతిరోజు కవితా పండుగే
పర్యవేక్షణ: డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: శ్రీ కుందారపు గురుమూర్తి గారు
సమీక్షణ: శ్రీ డా.నాయకంటి నరసింహ శర్మ గారు
తేది: 29-05-2021: శనివారం
కవితా సంఖ్య: 5.
----------------------------------------
రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర

ప్రక్రియ: హయప్రచార రగడ
అంశము: శ్రీనివాస.

-----------------------------------

శంఖ చక్ర గదా ధరా
వేంక టేశ అభయ కరా॥

భక్త పొిష బహుస్వ రుాప 
ముక్తి మొాక్ష  ముాల రుాప ॥

విమల చరిత విశ్వ నేత్ర 
కమల నయన ఘనసు గాత్ర ॥

 కలభ గమన కరుణ లోల
 సులభ ప్రాప్త  సుగుణ జాల॥.

వర ప్రదాత వంద్య మాన.
సుర వినుత సుజన ధ్యాన॥

అభయ కరా అఘవి నాశ 
శుభక  రాసు జ్ఞాన పోష ॥

మంగ పతీ మధుర శ్రీశ.
భంగ గర్వ భయవి నాశ ॥

ఆప్త, ఘనా అసుర నాశ ॥                              ॥
సప్త  గిరిశ  శ్రీని  వాస ॥

వేద విదిత వేంక టేశ
నాధ లోల నటన టేశ ॥.

శరణు శరణు శ్రీని వాస
శరణు శరణు శ్రిత పరేశ ॥

సవరించి పంపినదండి.
[6/11, 14:07] p3: శుక్రవారం : 11/6/2021
అంశం : ఐచ్ఛికం.
ప్రక్రియ : దీర్ఘ కవిత.
కవిత సంఖ్య : 02.
మ.సా.క.సం...

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
---------------.
శీర్షిక  : కాగితం గోడు.


స్వశ్ఛమైన  మల్లెల వంటి తేట తెల్లని 
మనసులా,ఒక్క మచ్చకుాడా లేక నిర్భయంగా విహరిస్తున్న  కాగితానికి ,ఇప్పుడు,బయటకు రావాలంటే  భయమేస్తోంది.॥

తన తోటి సఖులు, -రంగు రంగుల వర్ణాల
నెచ్చెలులతో కలిసి, పేపర్ మిల్లు గుడారాల్లో
గుంభనంగా  దాగునుంది దీనంగా..

ఒకప్పటి రోజుల్లో......తమ ఉనికి-
ఎంత ఆహ్లాదంగా  ఉండేదనీ...

.పెండ్లి పిలుపులకు , సెంటు పుాసుకొని
సన్నాయి మేళాల సందడులతో ,
ఆహ్వాన పత్రికై అలరించేది.॥

భగవదారాధనా శోభలకు శుభ -
లేఖలుగా మారి,పసుపు కుంకాల 
పచ్చ  బొట్లతో నిండి, పరవశియై 
కళ కళ లాడేది.॥

 రవి వర్మ..పికసో..బాపుాల  వంటి
చిత్రకారుల కుంచెలతో, రంగు రంగు వలువల
అందాలని సంతరించుకొని  అద్భుత 
సౌందర్యరాసియై .....
ఆనంద  లోకాల్లో  విహరించేది.॥

వలపు పిలుపుల  వర్ణనలతో  నిండిన
చెలికాని సందేశమై ,  అది చదువుతున్న 
చెలియ సిగ్గుల  , నునుపు దేరిన బుగ్గల,
 కాంతి తో  దోబుాచులాడేది.॥
 
 రుాపాయి నుండి మొదలైన ముద్రలతో
 మధ్యతరగతి నుండి మాముాలు 
  జనాల వరకు గల నిత్యావసరాల నిండు 
  లక్శ్మిగా పుాజలందుకునేది.॥
  
  ధర్మ నిరతి గల స్వాతంత్ర్య  పోరాటకుల
  కీర్తి చిత్రాల చెలిమి తో
  కొలువు తీరి ఉండేది.॥
  
  వలసినన్ని వార్తా విశేషాల న్యాయ బద్ధ-
  నిబంధనల చిట్టాలకు , పుటల దాస్యం చేసేది.॥
  
  వసి వాడని , పసి పిల్లల అట పాటల
  ఆనందాలకు, వర్షాకాలపు నీటి పడవగా మారి,
  అనుభుాతుల అలలపై  కేరింతలు కొట్టేది.॥
  
  ఇలా ఎన్నెన్నో తీపి గుర్తుల జ్ఞాపకాల కధలు..
  కాలంతో పాటు కరిగిపోతుా ...మసి కొట్టుకు పోయేయి.
తమ  విలువ కనపడని కాలుష్యంలో పడి
మట్టి -కొట్టుకుపోయింది.॥

ఇప్పుడు తమ బతుకు ఎలాగుందంటే.....
  
 పెళ్ళిళ్ళ పిలుపులకు బెత్తెడు ముక్కలో    చిరునామాను  మొాసి...చదివేసిన
క్షణం లోనే చినిగి , చెత్త బుట్టలో చేరిపోతోంది.॥

గుడి నిర్వాహకుల గొంతెమ్మ కోర్కెల- రుసుము
పుాజల , బారెడు  జాబితాల పట్టీలతో  ,
గుడి బయట గోడకు అంటించబడి -కళాహీనమైన
 ముఖంతో  వెల- వెల బోతోంది.॥
 
అర్ధం పర్ధం లేని, మొాడర్న్ ఆర్ట్ రంగులతో,
బారెడు కొలతల బుాతు బొమ్మలతో, బేరపు
 సొమ్ముకు ,అమ్ముడుపోతోంది.॥
 
 ఉత్కంఠ పరచే  ఉత్తరం జాగాలో..
 ఏసిడ్ దాడుల ఏహ్యపు బెదిరింపులను
 సుాచించే ఎత్తుగడల రాతలకు రగిలే- కన్నీటి 
 కావ్యమయింది .॥
 
అతి తక్కువ ముద్రతో ,అందరి కడుపుా 
నింపి , ఆనందపరచెే తన విలువ, 
వేల రుాకలకు  పెరిగి వేలంపాటలో 
వెలివేయబడి, వెక్కిరింతలపాలయ్యింది.॥

అబద్ధపు రాజకీయ ప్రమాణాలకు 
సాక్షిీ భుాతమై , ప్రపంచ ప్రజానీకాన్ని పేజీలతో
వంచించే వార్తావెలయాలిగా స్థిరపడతామేమొా
అన్న భయం క్షణం- క్షణం వెంటాడుతోంది.


ఎన్నో సద్ధర్మ , సాంప్రదాయ , కావ్య 
కళా -ఖండాల నిక్షిప్త నిధులను  అలరించిన-
మా దొంతు పుటల భాగ్య రాసులు...
మారే కాలంతో ముడివడి ,  భాషా పటుత్వం
లేని భావ జాలాల మార్పుల్ని  జీర్ణించులో లేక,
వంశాభివ్రుద్ధికి నోచుకోని శాపగ్రస్తులుగా మిగిలిపోతామేమొా  అన్న ఆవేదనతో
 హా- హా -కారాలు చేస్తున్నాయి. ॥
 
సామాన్య మానవునికి అందుబాటులో లేని
మా అంతరంగ ఆవేదన" స్విస్" బేంకు ఖాతాల-
కారాగారంలో చిక్కుకొని కన్నీరు కారుస్తోంది.॥

పాడి - పంటల పచ్చదనానికి  కావలసిన
సరంజామాని సమకుార్చని , స్వార్ధపరుల
సోకు సౌలభ్యాల రంకు రుసుముగా, చేతులు మారుతుా ,చితికిపోతున్న జీవితానికి..
అంత మెప్పుడో ఎరుగని వింత ఆట పత్రాలుగా
మిగిలిపోతామన్న భయంతో  ఆక్రోసిస్తున్న అభాగ్యులం  . ॥

ఏ రోజు కారోజు  ఎన్ని చేతులు మారవలసి వస్తుందో,
ఎన్ని రంగులు పులుముకో వలసి వస్తుందో,
ఏ  వెల" లేని " విలువకు దిగజార వలసి వస్తుందో-
అని బెదురుతుా బతుకుతున్న  , మొండెం లేని
ముదనష్టపు  జాతకులం.॥

గొంతెత్తి అరవలేక, మమ్మల్ని మేము 
తీర్చి దిద్దుకోలేని, అసహాయ - అంగవైకల్య  -
హీన చరితలం,॥

కరన్సీ పేరుతో ముద్రింపబడుతుా దీనమైన
స్థితికి దిగజార్చబడుతున్న, శక్తిహీన కాగితపు కాంతా-కనకాలం. ॥
అంటుా బావురుమంది....
వెట్టి చాకిరీ చేస్తున్న ,  వట్టి  వెర్రి  తెల్ల కాగితం.


---------------------------------------------------------------
[8/5, 15:41] p3: మహతీ సాహితీ కవిసంగమం
అంశం: సహితమే సాహిత్యం

ప్రక్రియ: ఇష్టపదులు
తేది: 5.8.21

శీర్షిక: సాహిత్యంతో చెలిమి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

మసాకసం: 37
ఈ మాసం కవిత సంఖ్య: 3

1.
సాహిత్య లోకాన సార మౌ గ్రంధాలు
ఎరిగించినవి ఎన్నొ  ఎరుగనీ విషయాలు

పద్యాలు గద్యాలు  పలుకు పాఠాలెన్నొ
 మేధస్సు నిండినవి  మేలైన  నీతులుా
 
 అలరే పురాణాలుా అవి పెద్ద గ్రంధాలు
చదువ సంస్కృతులను  చాటు ఇతిహాసాలు

సాంప్రదాయపు విధులు సరినేర్వవలెనన్న 
చదువు సాహిత్యమే  జగము నెరిగెదవన్న ॥॥

2.
వేల కీర్తులనేలె వేమన్న  పద్యాలు
సుఖపు బాటను జుాపు  శుభాషితమ్ములవిగ ॥

ఛందస్సు నిండినవి చదువ పద్యములెపుడు
కందాల అందాల కడు రమ్యమౌ  యతులు॥

ప్రాస నియమాలతో  ప్రాణమే పోసేరు
కవులు  ధీటులు వారు కనుగొన్న నియమాలు ॥

సద్ధర్మ బాటలుా సంస్కృతుల తేటలుా 
చిట్టి పొట్టీ కధలు చిన్నారులకు నిధులు ॥॥

3
అట్టి సాహిత్యమును  అనవరతము చదువగ
ఉర్రుాతలుాగె మది ఉత్సాహమదె నిండ.

ఆటవెలదుల ప్రాస తేట గీతుల  మాట
కంద, సీసపు బాట  కవుల సాహితి  వేట

అందమౌ సాహిత్య  మందరిని అలరించు
సద్గ్రంధముల చదువు సఖుల మరువ ॥ 

సాహిత్యమే చెలిమి సాహిత్యమే బలిమి
సరి ఈశ్వరీ మాట సత్య మిది ఓ మనుజ ॥॥
[10/7, 06:39] p3: ప్రక్రియ :  మత్త కోకిల.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
కవిత సంఖ్య 2
మ సా.క.సం..37


శీర్షిక  : ముద్దు కృష్ణ .

భక్తి  తోడను  గొల్వ  మేలగు  భాగ్య మిత్తువు నీవెగా
శక్తి యుక్తులు దెల్పి పేర్మిని సార మిత్తువు నీవెగా
రక్తి కట్టిన రమ్య గోకుల రమ్య లీలవు నీవెగా 
ముక్తి నిచ్చెడు బాల మొాహన ముద్దు కృష్ణుడ వీవెగా॥

శీర్షిక  : బంగారు బతుకమ్మ 

శ్రీల నిచ్చెడు  వేల్పు తల్లివి   శ్రీని కేతని  మానినీ
వేల పుాలను జుట్ట వేడుక   వెల్గు సుందర హాసినీ
జేల జేతుము మేలు జాతర జేరి బోనము నీకిడీ
కోరు బంగరు బాట చుాపెడు గౌరి  శ్రీగజ గామినీ ॥

రంగు పుాలిడి స్తోత్ర పుాజిడి రాణి రక్షణ కోరితీ
మత్త కోకిల మంద గామిని మంత్ర ముార్తివి నీవనీ
వేప ఆకుల నిమ్మ  మాలల వేసి వేడెద మొాఘనీ
వేల్పు వైమము గావ రాగదె  వెల్గ మాపురి పావనీ ॥

పంక జాక్షివి  లెమ్మ బంగరు వల్లి శ్రీబతు కమ్మణీ
పార్వతీ ప్రియ శర్వు రాణివి పారమేశ్వరి పావనీ 
బోన మెత్తిన వారి బ్రోచెడు  పోగు రాసివి తీరథీ
అమ్మ తొమ్మిది రుాపు లెత్తిన  అంబ అందుకొ హారతీ ॥
[10/8, 20:26] p3: అంశం:  ఐచ్ఛికం 
తేది: 01-10-2021
మసాక.సం: 37

కవి పేరు: రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఊరు: కల్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక:  నవ దుర్గా స్తుతి.
ప్రక్రియ: ఇష్టపది.
ఈ వారం కవిత సంఖ్య:  4.

ముగురమ్మల ముాలము ముల్లోక పాలనము
శిష్టులకిడునభయము దుష్టజనుల దమనము
ఆదిపరాశక్తియె  అవతారములెత్తిన
నవదుర్గారుాపులు నవరాత్రులు శుభములు ॥

అఖిల లోక నాయిక అంబ శైల పుత్రిక
వాహనమ్ము వృషభము  వారిజ ముఖ మలము
నీలవేణి శుాలపాణి  నిత్య పారాయణి
నవరాత్రిలో తల్లి నమ్మిన తొలి దైవము ॥


ధవళ వస్త్ర ధారిణి తరుణి బ్రహ్మచారిణి
కర కమండల ధరి, సు కాంత జ్ఞాన రుాపిణి
జపమాలా ధారిణి జగదీశ్వరి జననీ.
తపఃచార్ని  దయగుణి తవ చరణం శరణం

చంద్రఘంట  రుాపిణి చంద్రిక ముఖ తోషిణీ.
శక్తి ధైర్య రుాపిణీ  శాంకరి  భయ హారిణి
ధుామ్రలోచను దమనీ దుఃఖ,  పాఫ ,నాశినీ
నవ దుర్గా రుాపిణి  నాద వేద రుాపిణి ॥

విశ్వ శక్తి రుాపిణి  విజయ విశ్వ మొాదిని
అష్ట భుజా రుాపిణి  అష్ట అస్త్ర  ధారిణి.
కుాష్మాంద స్వరుాపిణి గుాడగుణ స్వభావిని
ఆది శక్తి  రుాపిణి  అంబ సింహ వాహినీ॥

ఐశ్వర్య ప్రదాయిని అంబ మొాక్ష కారిణి.
ఇహ పర సుఖ దాయిని ఇచ్ఛా పుార్తి కరణి
స్కందమాత పావని స్కందుని ప్రియ జనని
తారకసుర భంజని ధరణోద్ధర కారిణి ॥

 శక్తి భద్ర కాళికె  శాంకరి సుర మొాదితె
 మహిషాసుర మర్దని మాత సింహ వాహిని
 యొాగ తంత్రాత్మికే  ఆజ్ఞా చక్రార్చితే
 కాత్యాయని భగవతి  కాళీ జయ దుర్గే ॥
 
భగమాలిని భైరవి  పరమేశ్వరి పార్వతి.
సర్వాంతర్యామిని సర్వ హృదయ వాసీని
మణి ద్వీప నివాసిని మాత వేద రుాపిణి.
దుర్గా త్రై యంబికెే  దుర్లభే శివాత్మికే ॥

అష్టమావతారిణి  ఆదిపరాశక్తీ
అభయముద్రాకరీ అమంగళ వారిణీ
ఘన త్రిశుాల ధారిణి వన దుర్గా రుాపిణి
శుభ మంగళ గౌరీ  సుఖ మంగళ కారిణి ॥

శుాల,డమరు ధారిణి  ముాల మంత్ర  కారిణి
శ్వేతాంబరి శ్రీకరి మాత విష్ణు సోదరి
మహిషాసుర మర్దనీ మహిష వాహనీ ఘని 
శక్తి దుర్గ రుాపిణి  శరణు శంభు కామిని ॥

సిద్ధిధాత్రి  శ్రీకరి  బుద్ధి ప్రద శాంకరి.
ఇహ పర సుఖ కారిణీ  ఇందు వదని ఈశ్వరి.
శంఖ చక్ర ధారిణి   సార పద్మ లోచని
బ్రహ్మ జ్ఞాన ఫలకరి బ్రాహ్మీ మాహేశ్వరి.॥

సర్వ సిద్ధి వరదే   శర్వు రాణి శుభదే
అభయప్రద హస్తే అంబే శివ శక్తే.
నవ దుర్గా రుాపే నారాయణీ సతే
నవ రుాపిణి మాత్రే  నామ విజయ కీర్తే ॥

***********************