Wednesday, April 29, 2020
అమ్మా....నాన్నా....?
Saturday, April 25, 2020
దేముడా...నీ ఉనికెక్కడ..?నవ తెలుగు తేజం కు పంపినది.
Friday, April 24, 2020
Thursday, April 23, 2020
పుస్తక దినోత్సవం.
అదీ సంగతి.
Monday, April 20, 2020
writer..Sunitha
థామస్ ఏండర్సన్
Sunday, April 19, 2020
My album link.
కిరణ్కుమారిగారి గురించి..( పెయింటర్ ).
*ప్రపంచ కళా దినోత్సవ శుభాకాంక్షలు*....
*ఆమె చిత్రాలు మనతో మాట్లాడుతాయి*#
*నాకు* చిత్రకళ మీద అంత మక్కువ లేదు... దాని గురించి పెద్దగా తెలియదు.... అయినా ఆమె పెయింట్ చేసిన ' భవాని నగర్ ' చిత్రాలంటే ఎందుకో మక్కువ... నేను ' భవాని నగర్' లో పుట్టి పెరగడం కారణం కావచ్చు... ఆ చిత్రాలు చూసినప్పుడల్లా నేను చుట్టేసిన ' భవాని నగర్' అంతా గుర్తుకు వస్తుంది... జిగిబిగి కరెంటు తీగలు, పాత జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తాయి.... అందుకే ఆమె చిత్రాలు మనతో మాట్లాడుతాయనిపిస్తుంది. చిత్ర కళాకారులు ఎంతో మంది తిరుపతి లో ఉన్నా ఆమెకుండే ప్రత్యేకత వేరు.... ఆమె *కిరణ్ కుమారి గారు* .... పాతికేళ్లుగా నాకు తెలుసు సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన ఆమె కెరీర్ .... తరువాతి కాలంలో అనేక రంగాలలో తన ప్రతిభను చాటుకున్నారు.... తనకు ఎంతో మక్కువ అయిన చిత్రకళను ఘనంగా తీర్చిదిద్దుకున్నారు.... గత 20 ఏళ్లుగా తన కుంచెను ఆపకుండా పదునెక్కిస్తున్న కిరణ్ కుమారి గారి గురించి మనం తెలుసుకుందాం...
తిరుపతికి చెందిన కిరణ్ కుమారి గారు కమ్యూనికేషన్ మరియు జర్నలిజంలో పిజి చేశారు గత 20 సంవత్సరాలలో ఉదయం దినపత్రిక, జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్జీవోలు, చిత్తూరు వెలుగు ప్రాజెక్ట్ లో వివిధ సందర్భాల్లో పనిచేశారు. వెలుగు ప్రాజెక్ట్ లో పనిచేస్తుండగా స్వయం సహాయక సంఘాల్లోని 'చదువురాని పేద మహిళలు' 200 మందికి శిక్షణనిచ్చి విలేకర్లు గా తయారు చేశారు వీరితో 'నవోదయం' అనే పత్రికను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు...2001 లో ప్రారంభించబడిన 'నవోదయం' పత్రిక 'అప్రతిహతంగా' 20 ఏళ్లుగా నడుస్తోంది... ఆ పత్రిక నేటికీ నడుస్తుండటం విశేషం...
కిరణ్ కుమారి గారు... మీ గురించి ఏమైనా చెప్పండని అడిగితే.... ఎందుకు సార్....నా కంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు... చెప్పుకునే అంత గొప్ప దానిని కాదు... నా చిత్రాలు పోస్ట్ చేయండి అని 'నమ్రత'గా అంటారు... స్వతహాగానే కిరణ్ గారు 'మితభాషి', పొదుపుగా మాట్లాడుతుంటారు... ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఆమె మిత భాషే కానీ... ఆమె సృష్టించిన చిత్రాలు గంటల తరబడి మనుషులతో మాట్లాడుతుంటాయి అంటారు ... ఆమె చిత్రకళలో జీవం ఉట్టిపడుతుంది కొన్ని సందర్భాల్లో ఇది నిజమా?... పెయింటింగా? అన్న అనుమానం కలుగుతుంది.... అంతటి సమర్థత కిరణ్ గారి సొంతం... కళాకారిణిగా జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్జీవోలకు, కొన్ని ప్రభుత్వ సంస్థలకు, మహిళా యూనివర్సిటీ వారికి వందకు పైగా పోస్టర్లు తయారు చేసి ఇచ్చారు... మహిళలు, దళితులు, రైతాంగ సమస్యలపై ఈ పోస్టర్లు ఉన్నాయి....
సామాజిక సమస్యలపై వేసిన ఈ పోస్టర్స్ ను అనేక శిక్షణా కార్యక్రమాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు... ఆ లింకు మీ కోసం...
https://kiranin.blogspot.com
ప్రస్తుతం స్టిల్ పెయింటింగ్స్ మీద దృష్టి పెట్టిన కిరణ్ కుమారి గారు ... వేసిన చిత్రాలతో ....అమెరికా దేశంతో పాటు మన దేశంలోని ఢిల్లీ, బెంగుళూరు, కొచ్చిన్, చెన్నై, హైదరాబాదు , చండీఘర్ లాంటి నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి... తిరుపతి బాలమందిరంలో ప్రతి ఆదివారం పిల్లలకు కథలు చెబుతూ బొమ్మలు నేర్పించే మన కిరణ్ గారు... తిరుపతిలోని పాత భవనాలు, రోడ్లు, సందులు, కరెంటు వైర్లు పై చాలా బొమ్మలు వేశారు.... ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా మన కిరణ్ కుమారి గారికి... మనమంతా శుభాకాంక్షలు తెలియజేద్దాం... కిరణ్ కుమారి గారు వేసిన బొమ్మలు చూడాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయాలి....
http://bkiranarts.com
*కందారపు మురళి*
*ప్రధాన కార్యదర్శి*
*సిఐటియు*
*తిరుపతి*
Wednesday, April 15, 2020
Drawing pencils for pencil Drawing.
కవిత
పద్యం యతి పదాలు.
పద్యాల ఛందస్సు గురించి.
Tuesday, April 14, 2020
చెప్పండి చుాద్దాం.
చెప్పండి చుాద్దాం.
చెప్పండి చుాద్దాం.
Sunday, April 12, 2020
సినిమా పొడుపు కధలు..
కరోనా
చతుర్విధ కంద పద్యము.
Saturday, April 11, 2020
మత్తకోకిల పద్యం.రచన .జగదీశ్వరీముార్తి.
Wednesday, April 8, 2020
అంజయ్య గౌడౌ గారి పద్యాలు.
కవిత
పొడుపు కధలు
పొడుపు కధలు
పొడుపు కధలు
పొడుపు కధలు.
Monday, April 6, 2020
లాక్ ఔట్.
భయం భయం.
విజయం మనదే.
ఈ నాడు మనని నిర్బంధనాల పాలుచేసిన
"కరోనా" కణపు, విషపు దాడిని ఎదుర్కోవడనికి
శాంతి, సంయమనాలని పాటించడమే మన కర్తవ్యం.॥
లాకౌట్ నిబంధనల నియమాలను పాటిస్తుా ,
నిర్మానుష్య నగరం వీధుల్లో నిస్తేజమౌతున్న-
మహమ్మారి పతనానికి యుధ్ధ వలయాన్ని సిధ్ధం చేద్దాం.॥
ఎందరినో కాటేసి ,ఎన్నో జీవితాలను నిర్వీర్యం చేసిన-
"కరోనా "రక్కసిని పారదోలేందుకు ,నిరసనల నినాదాల,
చప్పట్ల శరాల తో తుాట్లు పొడుస్తుా , చీకటిలో వెలిగించే ,సాముాహిక చిరుదివ్వెల కిరణాగ్నిశిఖల్లో
దగ్ధం చేద్దాం.॥
సముద్రంలో, బడబాలనంలా విజ్రుంభిస్తున్న
ఆ చీకటి రక్కసి, నిర్ఘాంతపోయేలా అందరి మాటా
ఒక్కటై అడుగేద్దాం.॥
కోట్ల కొలది , వెల్లువలా పొంగుతున్న ప్రజా శక్తి,
మమేకమై , దేశం లోకి చొరపడ్డ "పరదేశపు పాప పంకిలాన్ని" ,దేశ బహిష్కరణ చేద్దాం.॥
ఎన్ని అవాంతరాలొచ్చినా, మనమంతా "ఒకే మాట-
ఒకే బాట" గా సాగాలి.॥
మన ఆత్మ విశ్వాసమే మన ఆయుధం.॥
మన సంఘటిత సహన శక్తే , మనకు సహకార వైద్యం.॥
మనం పాటించే గ్రుహ నిర్దంధమే ,
మనం మరొకరికి చేసే మహోపకారం.॥
సాంప్రదాయ పధ్ధతుల ఆచార-వ్యవహారాల-
ఆచరణా విధానమే, మన ఆరోగ్య జీవనానికి
అసలై ఔషధం.॥
భగవంతుని శ్రుష్టిలో, అతి తెలివైన జీవి మనిషి.॥
ఏ పరికరాల అవసరంలేని అవయవాస్త్రాలతో ,
ఆత్మస్థైర్యం నిండిన గుండె నిబ్బరంతో,
కష్ట- నష్టాలను అధిగమించే బుద్ధి-బలంతో..,
అంతరిక్షానికి నిచ్చెనలు వేయగల విలక్షణ-విజ్ఞానంతో
శ్రుష్టికి ప్రతి-శ్రుష్టి చేయగల, మేధా-సామర్ధ్యంతో,
ఎన్నో విజయ పతాకాలను ఎగరవేసిన
మహా మనీషి మనిషి.॥
ఎన్నో కఠినమైన అవరోధాల నొడ్డి,
" కరోనా" వంటి -ఎన్నో ఋగ్మతలను , అవలీలగా గట్టెక్కించగలిగే ."వైద్య విధాన పరిశోధనాశాస్త్రం" లో ప్రజ్ఞ "కలిగిన ప్రధాన శాస్త్రవేత్త మనిషి. ॥
ఎన్నో భీబత్సవాలను ఎదుర్కొంటుా, వాటికి
ఎదురొడ్డి ,పోరాడగలిగిన సామర్ధత గల, విశ్వ వీర యొాధుడు మనిషి.॥
జీవితానుభవాల తుఫానుకు వచ్చిన ఒరవడిలో,
విపత్కర పరిస్థితులలో ఎదురైన, కష్ట- నష్టాల చిక్కుముడులను ,.అదరక- బెదరక నేర్పుతో -విడదీసుకొని ముందడుగు వేసే ...సమర్ధత గల
సాహస ధీరుడు మనిషి.॥
అటువంటి మహత్తరమైన మనిషి జన్మ పొందిన మనం, ఈ నాటి "కరోనా "ధాటికి తట్టుకో లేమా...?
పెనుగాలి వీచినపుడు వంగి ఉన్న మహావ్రుక్షమే
ఉధ్రుతం తగ్గగానే తలెత్తుకు నిలబడగలుగుతుంది.॥
కష్టం వచ్చినపుడు మనిషి సంయమనాన్ని పాటించినపుడే కష్టాల్ని అధిగమించగలడు.॥
ఆ కష్టం కుటుంబ పరమైనదైనా , సామాజిక పరమైనదైనా , కరోనా వంటి విషపు కణాల
విలయ తాండవానిదైనా...॥
అందికే నిరాశ పడకుండా , మనోధైర్య - సాహసాలతో ,శాంతియుత పోరాటాన్ని -కొనసాగించండి॥
చివరకు
"విజయం మనదే".
------------------------
రచన, శ్రీమతి..
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021.
iswarimurthy@gmail.com.
-------------------------------------------
వింత "కరోనా".
జయం మనదే...(పాట)
జయం మనది"..పాట.
------------------------------
పల్లవి:
జయం మనది జయం మనది
కలతపడకు సోదరా ...
కట్టడి చే" కరోనా" ను ఖండిద్దాం సోదరా॥
అనుపల్లవి:
పరదేశపు పాప కణం ," కరోనా "పిశాచినీ
తరిమికొట్ట మనమంతా పాటిద్దాం సుభ్రతని॥
॥జయం మనది, జయం మనదీ....॥
చరణం 1.:
నియముల పాటించి, మనము పద్ధతెరిగి మసలుదాం....
మన సంస్క్రుతి- సాంప్రదాయ, విలువలనే పెంచుదాం-
చప్పట్ల సడుల "కరోనా" ను కలవర పెడదాం......
కోట్ల -జ్యోతులెలిగించీ సమైక్యతనె చాటుదాం.॥
॥జయం మనది॥
చరణం 2:
సామాజిక దుార నియమ నిబంధనలు పాటిద్దాం
""స్వశ్వశ్ఛమైన భరతావని" మనదేనని చాటుదాం.
మన "మొాదీ "గౌరవాన్ని కలసి-మెలసి నిలుపుదాం
ఐక్యమత్య బలముతో "కరోన" నంతమొందిద్దాం.॥
॥ జయం మనది॥
చరణం 3.:
"మందు లేని మహమ్మరిని " మట్టుపెట్టి చుాపుదాం-
మనిషి ,కానరాని మంత్ర మేసి రోడ్ల తిప్పుదాం.-
మన వారిని కుాల్చినట్టి "కరోనా"ను కాల్చుదాం.
కసిగ తర్పణాలు విడిచి శాంతి గీతి పాడుదాం.॥
॥ జయం మనది ॥.
-----------------------
రచన , శ్రీమతి ...
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
8097622021.
---------------------
శీర్షిక .
"లాకౌట్ "
ఒక-
నిర్విరామ "శస్త్రం".
-----------------------
కాల సర్పమై" కరోన " కాటేసెను క్షణ- క్షణం.
వేల జనుల ప్రాణాలె హరించి నట్టి దీ కణం.॥
కంటనీరు కట్టని జను లార్తి దీర్చ అందరం.
కలిసి జేయు యుద్ధములో, "లాకౌట్" ఒక అస్త్రము॥
"కరోన "రక్కసిని తరిమే నిర్విరామ శస్త్రము॥
బలిదానపు సాహసం సఫాయి కర్మ చారులదే
కోవిడ్ రక్కసి నణచే సేవా నిరతి వైద్యులదే
రక్షకభటు లాచరించు విధులు విశ్వ శాంతికి లే
కరోన వ్యాధి కెదురొడ్డి పోరాడు ,జయం మనదే॥
పరిధులనే దాటి నీవు పెంచకు మరణాలనుా,
కుండె కోత , కడుపు కోత నిండెడు శాపాలనుా,
కట్టుబాట్ల సంయమమును విడకు సంఘ హితునిగా
బాధ్యతగా వ్యవహరించు భరత దేశ పౌరునిగా॥
బలిదానపు సాహసం సఫాయి కర్మ చారులదే
"కోవిడ్ "రక్కసి నణచే సేవా నిరతి వైద్యులదే
రక్షకభటు లాచరించు విధులు విశ్వ శాంతికి లే
"కరోన "వ్యాధి కెదురొడ్డి పోరాడ జయం మనదేలే॥
---------------------------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర).
8097622021.
---------------------
కవిత కాని కధ
తొలివలపు ( కవిత).
Saturday, April 4, 2020
సహస్ర వాణి రేడియొా లింక్ ( మేక రవీంద్ర).
Wednesday, April 1, 2020
MAIL ID OF AKSHRAYAN.TO SEND POEMS on "Karona".
గెలుపెవరిది..?
శీర్షిక .
గెలుపెవరిది..?
---------------------------
విలయ తాండవం చేస్తుా
విజ్రృంభిస్తున్న ఒక పరదేశపు పాప పంకిలం ,
ప్రజల ఉసురు పోసుకుంటోంది.
దాని విసురుకు ప్రపంచమే గడ గడ లాడుతోంది.
ఒక నిశ్శబ్దం,వెలుగులో కుాడా, చీకటి రాజ్య మేలుతోంది.
యావత్ ప్రపంచం యుగాల నాటి అలవాట్లను ఆత్మరక్షణ కై ఆదరించి అనుక్షణం ఆచరిస్తోంది
ఐనా సరే....
సైనికులు లేని యుద్ధం ప్రకటించి,
కదం తొక్కుతోంది కాలుష్య మేలే
కర్కస కణం" కరోనా "॥
ముాగ జీవుల మ్రుత కణాల నుండి
పుట్టి, మానవ మారణ హోమం చేస్తున్న
"మహమ్మారి" ఈ "కరోనా".
గజి బిజి జీవితాల గందరగోళంలో
"కరోనా" కాటుకు ఖననమౌతున్న జనం.
"పొల్యుాషన్" పొడిదగ్గుల వేడి చల్లారక ముందే,
"సొల్యూషన్" లేని మాయ రోగంతో ---
ప్రాణం కోల్పోతున్నారు జనం .॥
మందు లేని మహమ్మారిని మట్టు పెట్టేందుకు
నానా తంటాలుా పడుతున్నారు
ప్రజా ప్రతినిధులు , ఆరోగ్య రక్షకులుా.
పర్యవసానం...
ప్రపంచ వ్యాప్తంగా "లాకౌట్ " లాస్యం చేసింది.
నష్టాలుా, కష్టాలు భరిస్తుా నగరాలు నీరసపడ్డాయి.
అస్ప్రుస్య "అరిష్టాన్ని "ఆపడానికై
ప్రజలందరుా కంకణం కట్టుకున్నారు.
"కరోనా కర్కసి " పై ముాకుమ్మడిగా
నగరాలు" నిర్మానుష్య "దాడి చేసేయి.
.ఇళ్ళ తలుపులు ముాత పడ్డాయి.
బళ్ళుా, బడులుా బందయ్యేయి.
వాహనాల రాకపోకలు రద్దయ్యాయి.
విదేసీ యానాలు వెల వెల పోయాయి.
మత కలహాలు ముసుగేసుకున్నాయి.
మార్కెట్ అమ్మకాలు ముాల పడ్డాయి.
ఎగుమతి- దిగుమతులు ఉస్సురంటున్నాయి.
మానభంగాలు మడి కట్టుకున్నాయి.॥
రెక్కాడితేగానీ డొక్కాడని వారి జీవితాల
కన్నీరు ,కార్చిచ్చై "కరోనా" పై శాపనార్ధాల
సుడి మంటల నెగదోస్తోంది.
ఆకలి చావులకు అన్నార్తులు ఆహుతౌతున్నారు .
నగర వీధుల్లో నైరాశ్యం రాజ్యమేలుతోంది.
నిర్మానుష్యం స్మశానవాటికను గుర్తు చేస్తోంది.
ఐనా సరే..."లాకౌట్" కు స్వస్థి చెప్పలేదు జనం.
ఈ సమస్య కొంత తగ్గించడాని కై
పరిష్కార మార్గాలని చుాపేందుకు...
ఒక "యుగం" తిరిగి పురుడు పోసుకుంది.
పాశ్చాత్య పోకడల జీవన గమనంలోకి ,
తిరిగి మన "సంస్కృతి" బీజం, వసంతపు
చిగురులు తొడుగుతుా చిరునవ్వుతో మొలకెత్తింది..
సుభ్రతల సుగంధాన్ని పైరుగాలుల తో కలిపి ,
వెంట తోడ్కొని అడుగిడిన పచ్చదనపు
పడతి , ప్రజల స్వశ్ఛమైన మనసుల్లో
చోటు చేసుకొని చిందులేసింది.,
మురిసిన ప్రజలు ముచ్చటతో ,
"సుచి- సుభ్రతల" వేదిక వేసి ,మన "సంస్కృతి- --సాంప్రదాయాల" పసిడి కొమ్మకు
తిరిగి "పద్ధతి"గా పట్టం కట్టేరు.
" స్వశ్ఛమైన" భరతావని బాట లో ,
నిలవలేని ఋగ్మతలు నిస్సారంగా వెనుతిరిగేయి.
మారుతున్న మనుషుల మనసుల పై
దాడి చేయలేని "మహమ్మారి -కరోనా " -
"మంతనాలు" కుంటు పడ్డాయి.
"కర్కసి కరోనా"ను తరిమి కొట్టేదాకా-
మన "లాకౌట్ యజ్ఞం" ఇలాగే కొనసాగిద్దాం.
మరికొన్ని రోజులు ఓపికగా ఎదురు చుాద్దాం..,
మన సాంప్రదాయాల హోమగుండంలో పడి
"కరోనా" కాలుష్యం కాలి బుాడిదౌతుందన్న
నమ్మకంతో , సుచి- సుభ్రతల నాట్లకు నీరు పోద్దాం.
లోపంలేని మన ప్రయత్నం.. ఫలిస్తుందా..?
చుాద్దాం. కాలమిచ్చే తీర్పు లో కడకు విజయం
మనదో..కాల సర్పం .కరోనాదో....?
ఈ ప్రశ్నకు జవాబు కాలమే చెప్పాలి మరి.
------------------------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021..
ఈ కవిత నా స్వీయ రచనేనని ,
దేనికీ అనువాదం కాదని ,
ఇందు ముాలముగా తెలియజేయడమైనది.
---------------------------------------------------------